1. నిజాం కాలంలో ఇద్దరు ముగ్గురు విద్యార్థులు కలిసి ఒక గదిని అద్దెకు తీసుకుని స్వయంపాకం చేసుకునేవారు. దీనిని ఏమని పిలిచేవారు?
ఎ) కానా బి) టికానా సి) టీనా డి) ఖయానా
2. ప్రభుత్వ నిర్భంధానికి వ్యతిరేకంగా పల్లెల్లో ప్రభుత్వ బడులను ఏమని పిలిచేవారు?
ఎ) ఖాన్గీ బడులు బి) జాన్గీ బడులు
సి) పల్లె బడి డి) గ్రామ బడి
3. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 1948 దాకా తెలంగాణలో హైదరాబాద్ నగరం తర్వాత ఎక్కడ ఇంటర్మీడియట్ కాలేజి ఉండేది?
ఎ) నిజామాబాద్ బి) కరీంనగర్
సి) వరంగల్ డి) నల్గొండ
4. ఏ పండుగ సందర్భంలో చదివే పద్యాలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఆ పద్యాలు చదివాక పిల్లలు అందరు కలిసి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి 'అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు' అని పాడేవారు.
ఎ) దీపావళి బి) సంక్రాంతి
సి) దసరా డి) మొహరం
5. మొట్టమొదలు బడికి వచ్చిన విద్యార్థి చేతిలో 'శ్రీ' అని రాసేవారు. తర్వాత వచ్చిన విద్యార్థికి ఏది చెప్పి అరచేతిపై బెత్తంతో ఒక దెబ్బ వేసేవారు. 1980 దశకం వరకు ఈ పద్ధతి తెలంగాణలో ఉండేది?
ఎ) చుక్కా బి) అమ్మ సి) అయ్య డి) బడి
6. ఉర్దూ సాహితీ వర్గాల్లో పొల్యూట్ కాని ఉర్దూను ఏమని పిలిచేవారు?
ఎ) బాగమతీ జబాన్ బి) తారమతి జబాన్
సి) జబనం డి) కబలమ
7. పోలీసు చర్య జరిగేదాక ఏ తరగతి సర్టిఫికేట్ ఉంటేనే తెలంగాణలో ఉద్యోగాలు దొరికేవి?
ఎ) 5వ తరగతి బి) 7వ తరగతి
సి) 10వ తరగతి డి) 6వ తరగతి
8. మొరం పరిచిన రోడ్లపై ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఏ నీరు చల్లేవారు?
ఎ) జటకా బి) టాంగా సి) భిత్తేలు డి) మత్తేలు
9. 'గడి' అనే పదం ఏ భాషకు చెందినది?
ఎ) తెలుగు బి) ఉర్దూ సి) హిందీ డి) మరాఠీÄ
10. పోలవరం ప్రాజెక్టుకు పాతపేరు ఏమని పెట్టారు?
ఎ) శ్రీరామ సాగర్ బి) సీతారామసాగర్
సి) రామపాదసాగర్ డి) శ్రీపాద సాగర్
11. 'వతన్' అనే పదం ఏ భాషకు చెందినది?
ఎ) ఉర్దూ బి) అరబిక్
సి) టర్క్ డి) మరాఠీ
12. తెలంగాణలోని గ్రామాల్లో కొన్ని గ్రామాల ప్రజలు గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పటికీ ఆ గ్రామానికి ఏ గ్రామంగా గుర్తింపు ఉండేది?
ఎ) చిరాగ్ బి) భేచిరాగ్
సి) నీరడి డి) పరాగ్
13. 'భేచిరాగ్' అనగా
ఎ) దీపం ఉన్న గ్రామం బి) దీపం లేని గ్రామం
సి) కరెంట్ లేని గ్రామం డి) పడావు పడ్డ గ్రామం
14. మొఘల్ రాజుల కాలంలో గ్రామాధికారిని వంశ పారపర్యంగా గుర్తిస్తూ వారిని ఏ పేరుతో పిలిచేవారు?
ఎ) మాలి పటేల్ బి) వతన్దార్
సి) శేఖు డి) సింధీలు
16. తెలంగాణలో ఇటీవల సంస్కరణలు చేపట్టేదాకా ప్రతి గ్రామానికి ఒక పట్టారి (గ్రామాధికారి) ద్రవ్య వ్యవహారాల కొరకు ఎవరు ఉండేవారు?
ఎ) పోలీస్ పటేల్ బి) సింధీలు
సి) నీరడి డి) మాల్ పటేల్
15. గ్రామ చెరువులలోని నీటి పారుదల వ్యవహారాలు చూడడానికి ఎవరు ఉండేవారు?
ఎ) శేఖు బి) సింధీలు
సి) నీరడి డి) పోలీస్ పటేల్
17. తెలంగాణలో ఇటీవల వరకు ధాన్యం కావాల్సిన వారు ధాన్యం ఉన్నవారి దగ్గరకు పోయి అప్పు తెచ్చుకునే వారు. దీనికి వడ్డీ నగదు రూపంలో కాకుండా రూపాయికి పావలా, రూపాయికి అర్ధరూపాయి చొప్పున ఆ సంవత్సరంలోపే తీర్చే పద్ధతి ఏ పేరుతో ఉండేది?
ఎ) మాగులు బి) రాగులు
సి) దాణులు డి) నాగులు
18. తెలంగాణలో గత కాలంలో ఇనాముల ద్వారా ప్రతి గ్రామంలో గ్రామ క్షేమం గురించి ఏ పేరుతో వ్యవస్థ ఉండేది?
ఎ) బలోతుదారు బి) తుదారు
సి) బారా డి) బారాబలోతుదారు
19. తెలంగాణలో ఇటీవల వరకు ప్రసూతి గృహానికి ఏ విధమైన అంటువ్యాధులు రాకుండా ఏ మండలు కట్టి, రాత్రిపూట వరిపొట్టు పిడక కలిపి పొగపెట్టే వారు?
ఎ) వేప బి) జామ సి) నారింజ డి) అరటి
20. 1960 దాకా కూడా తెలంగాణలో గ్రామాలలో ఏ కులానికి చెందిన మహిళలు ప్రసూతి విషయంలో అనుభవం గడించి శ్రద్ధ కనబరిచేవారు?
ఎ) కమ్మరకుల బి) క్షురకుల
సి) ఆసాదికుల డి) జమకుల
21. హిందూ ముస్లింల మధ్య తగాదాలు రాకుండా ఏడవ నిజాం ఏ సంవత్సరంలో ఊరూరా వాల్ పోస్టర్లు అతికిం చాడు. ఆవాల్పోస్టర్లో తన ముఖం చూపించకుండా తన కిరీటం మాత్రమే చూపించి హిందువులు, ముస్లింలు నా రెండు కండ్లు. ఏ కన్నుకు హాని కలుగ కూడదు అని ప్రచారం ప్రారంభించాడు?
ఎ) 1945 బి) 1946 సి) 1947 డి) 1948
22. 'బల్దా' అనగా
ఎ) గ్రామం బి) పట్టణం
సి) నగరం డి) పురపాలక
23. సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణల్లో చేసిన 'సర్వే సెటిల్మెంట్' ఉత్తర్వుల్లో ఎన్ని సంవత్సరాలకు రీ సర్వే చేయాలని నిర్దేశితమైంది
ఎ) 5 ఏండ్లు బి) 10 ఏండ్లు
సి) 20 ఏండ్లు డి) 30 ఏండ్లు
24. నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధిం చినంత వరకు ఎన్ని సుబాలు ఉండేవి?
ఎ) 2 బి) 3 సి) 5 డి) 7
25. కిందివాటిలో ఏ జైలు బ్రిటీష్ వారి అధీనంలో ఉండడం వల్ల అక్కడ నిర్మించిన జైల్లో ఉరిశిక్ష అమలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు?
ఎ) చెంచల్గూడ సెంట్రల్ జైలు
బి) మౌలాలి సెంట్రల్ జైలు
సి) వరంగల్ సెంట్రల్ జైలు
డి) ముషీరాబాద్ సెంట్రల్ జైలు
26. 'గస్తీ నిషాన్ 53' అనగా
ఎ) విద్యాధికులు, ప్రజలు ఎలాంటి రాజకీయాల ప్రసక్తి జోలికి పోకుండా సభలు, సమావేశాలను నిషేధించడం
బి) విద్యాధుకులు, ప్రజలు ఎలాంటి ఆంక్షలు లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం
సి) గస్తీ సంఖ్య 53లో ప్రవేశించడం నిషేధించారు
డి) గస్తీ సంఖ్య 53లో ప్రవేశించవచ్చు
27. బాగా వర్షాలు పడినపుడు చెరువు చుట్టూ గల పంటలు మునిగిపోతే, రెండో పంట వేసుకోవ డానికి ఏ పేరు పెట్టారు?
ఎ) ఘర్బాఖ్ బి) ఘర్ఖాబ్
సి) మత్ఖాబ్ డి) జరబాఖ్
28. జటకా, టాంగా బండ్లు, జోడు గుర్రాలను గల వాటిని ఏమనేవారు?
ఎ) జగ్గీలు బి) మగ్గీలు సి) బగ్గీలు డి) గుర్రీలు
29. హైదరాబాద్ నగరంలో నిజాం రాజు ఏ పేరుతో తనను దర్శించుకోవడానికి వచ్చిన వారి దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు?
ఎ) బారానాలు బి) నజరానాలు
సి) పైకంబులు డి) చారానాలు
30. నిర్మానుష్యమైన గ్రామాల్లో పునరావాసంగా ఉంటూ, తక్కువ కౌలు చెల్లించే వారిని ఏమనేవారు?
ఎ) ఇజారాదార్లు బి) పాన్మత్తా
సి) దివానే ఖాల్సా డి) సర్భస్తా
31. 'గోలకొండ' పత్రిక మొదటగా ఏ పత్రికగా ప్రారంభమైంది?
ఎ) అర్ధవార పత్రిక బి) దినపత్రిక
సి) వార పత్రిక డి) మాసపత్రిక
32. ఖాన్గీ పాఠశాలలంటే ప్రజలు పెట్టుకున్న పాఠశాలలు అని ఎవరు నిర్వచించారు?
ఎ) మాడపాటి హనుమంతరావు
బి) బూర్గుల రామకృష్ణారావు
సి) రాజా బహద్దూర్ వెంకట్రామిరెడ్డి
డి) రావి నారాయణరెడ్డి
33. తెలంగాణలో జరిగిన రైతాంగ పోరాటాన్ని అణచ డానికి మలేషియాలో అవలంభించిన పద్ధతులకు అలవాటు పడిన ఎవరిని ప్రత్యేక అధికారిగా నియమించారు?
ఎ) ఎల్ ఎంద్రూస్ బి) కెప్టెన్ సంజప్ప
సి) బ్రిగ్స్ డి) ఎం.కె.వెల్లోడి
34. స్థిరంగా కౌలు చెల్లించే వారిని ఏమని పిలిచేవారు?
ఎ) దివానే ఖల్సా బి) సర్భస్తా
సి) ఇజారాదార్లు డి) పాన్మత్తా
35. హరిజనులకు గ్రామాల్లో ఉండి సేవ చేసేందుకు ఏ రకమైన ఇనాంలను ఇచ్చేవారు?
ఎ) జాత్ బి) మస్రూది
సి) బల్వత డి) అల్తంగా
36. హైదరాబాద్ రాజ్యంలో ప్రతి భూభాగానికి ఒక సర్వే నెంబరు ఇచ్చి దాని సారవంతాన్ని లెక్కించి దాని ప్రకారం శిస్తు విధించేవారు. ఈ శిస్తు విధించేపుడు భూభాగంలో ఉన్న ఎందుకు పనికిరాని భూభాగాన్ని ఏమని పిలిచేవారు?
ఎ) ఘర్ఖాబ్ బి) గ్రామకంఠం
సి) సర్బస్థ పాన్మక్త డి) పూట్ ఖరాబ్
37. శిస్తు లేకుండా వంశ పారంపర్యంగా అనుభవించే హక్కు ఉండే దానిని ఏమంటారు?
ఎ) అల్తంగా జాగీరు బి) మున్షీఖానా
సి) మరద్మాష్ జాగీరు డి) మస్రూది
38. సాలార్జంగ్ సంస్కరణల తర్వాత కేంద్ర పాలనా వ్యవస్థకు ఏ పేరు పెట్టారు?
ఎ) జమాఖానా బి) మున్షీఖానా
సి) దఫ్తర్-ఇ-మాల్ డి) దఫ్తర్-దీవాన్
39. వానలు వెనుకపడ్డాక జరిగే వ్యవసాయ పనులను ఏమని పిలిచేవారు?
ఎ) ఆబి బి) ఖరీఫ్ సి) రబీ డి) జైధ్
40. దేశంలో పట్టాదారు పేరు ప్రస్తుతం కాస్ట్ చేస్తున్న వారి పేరు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది
ఎ) ఖేత్దార్ బి) సేత్వార్
సి) జమాబందీ డి) ఖానాబందీ
41. ఏయే పంటలు ఎంత భూముల్లో వేశారన్న విషయాన్ని మొదటిసారి నమోదు చేయాల్సి ఉంటే దానిని ఏమంటారు?
ఎ) ఏక్మహా బి) దోమాహి
సి) తీన్మాహి డి) చార్మాణి
42. పంటలు వేసి, సరిగా పండకపోతే శిస్తు మాఫీ కొరకు ఏ దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉండేది?
ఎ) తహబందీ బి) తలప్మాల్
సి) జమాబందీ డి) అష్ట్మాహి
43. చెరువులో నీళ్ళుండి రెండవ పంటకు సరిపోయే టట్టు ఉంటే దాన్ని ఆ గ్రామానికి చెందిన గిర్దావర్ (రెవెన్యూ ఇన్స్పెక్టర్), పట్వారీలు సమావేశమై చెరువు కింద ఎంత పంట వేయవచ్చు అని నిర్ణయించే పద్ధతిని ఏమనేవారు?
ఎ) కాలాబందీ బి) జరబందీ
సి) తహబందీ డి) జమాబందీ
44. సర్వే నెంబర్ యజమాని చనిపోతే వారసత్వపు తగాదాలు రాకుండా జమాబందీ సమయంలోనే ఏ రిజిస్టర్ ద్వారా అమలుచేసేవారు?
ఎ) డిప్యూటేషన్ బి) అటాస్టేషన్
సి) మ్యుటేషన్ డి) రప్యూటేషన్
45. సర్వే చేసేపుడు గ్రామంలో గల మొత్తం భూమిలో నాలుగోవంతు భూమిని ఏమని పిలిచేవారు?
ఎ) పంచరాయి బి) బంచరాయి
సి) గ్రామకంఠం డి) ఘర్ఖాబ్
సమాధానాలు
1.బి 2.ఎ 3.సి 4.సి 5.ఎ
6.ఎ 7.బి 8.సి 9.డి 10.సి
11.బి 12.బి 13.బి 14.బి 15.సి
16.డి 17.డి 18.డి 19.ఎ 20.బి
21.బి 22.సి 23.డి 24.బి 25.డి
26.ఎ 27.బి 28.సి 29.బి 30.ఎ
31.ఎ 32.ఎ 33.సి 34.డి 35.సి
36.డి 37.ఎ 38.బి 39.సి 40.బి
41.డి 42.బి 43.సి 44.సి 45.బి
Authorization