1. రాజ్యాన్ని నిర్వచించి, దాని ముఖ్య లక్షణాలను తెలపండి? (5 మార్కుల ప్రశ్నలు)
''మానవునికి సుఖప్రదమైన, గౌరవ ప్రదమైన జీవనాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగిన కుటుంబాలు, గ్రామాల సముదాయమే రాజ్యం''- అరిస్టాటీల్.
'' ఒక నిర్ణీత ప్రదేశంలో నివసిస్తు రాజకీయంగా వ్యవస్థీకత మైన ప్రజా సముదాయమే రాజ్యం'' - బ్లంట్ ష్లీ.
రాజ్యం ముఖ్య లక్షణాలు
1) జనాభా: రాజ్యం ఒక మానవ సంస్థ. మానవ రహిత ప్రదేశాన్ని రాజ్యం అనరు. అయితే రాజ్య జనాబా ఎంత ఉండాలి అనే అంశం మీద నిర్దీష్టమైన అభిప్రాయం లేదు.ప్లేటో 5040, రూసో 10,000, అరిస్టాటీల్ 10,000 నుండి 1,00,000 వరకు ఉంటే మంచిదని భావించారు.
ఆధునిక కాలంలో రాజ్య జనాభా చైనా 130 కోట్లు, ఇండియా 121 కోట్లు ఉంటే వాటికన్ సిటీ, నౌరు, తువాలు వంటీ దేశాలలో జనాభా కేవలం 100లల్ల ఉన్నారు. పాల కులు, పాలితులు ఉండటానికి తగినంత జనాభ ఉండాలి. రాజ్య వనరులకు రాజ్య విస్థీర్ణతకు మించి జనాభా ఉండకూడదు.
2) ప్రదేశం: ప్రదేశం లేదా భూభాగం అనేది రాజ్యం రెండవ లక్షణం. రాజ్య జనాభా నిర్ధిష్టంగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న భూభాగాన్ని ప్రదేశం అంటారు.సంచార జాతులకు ఒక స్థిరమైన ప్రదేశం ఉండదు.
ఒక రాజ్యానికి ఎంత ప్రదేశం ఉండాలి అనే అంశంలో ఏకాభి ప్రాయం లేదు. ఎక్కువ విస్తీర్ణం గల రాజ్యాలు కొన్ని ఉంటే తక్కువ విస్తీర్ణం గల రాజ్యాలు కొన్ని ఉన్నాయి. రాజ్యానికి భూభాగం ఎంత అన్నది ముఖ్యం కాదు, ఆ భూభాగం ఏటువంటిది అన్నది ప్రధానం. ఒక రాజ్యభూ భాగంలో సహజ వనరులు, నీరు, నదీజలాలు, సారవంత మైన నేలలు అనుకూల మైన శీతోష్ణస్థితి ఉంటే ఆ రాజ్యం భాగా అభివద్ధి చెందుతుంది.
3) ప్రభుత్వం: రాజ్యానికి సంబందిచిన పరిపాలన యంత్రాంగమే ప్రభుత్వం. ప్రభుత్వం రాజ్యానికి ప్రాణం వంటిది. ప్రభుత్వం రాజ్య ఆశయాలను నెరవేరుస్తుంది. రాజ్యం తనకున్న అత్యున్నత అధికారాన్ని ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తుంది. ప్రభుత్వంలో శాసన నిర్మాణ శాఖ, కార్య నిర్వా హక శాఖ, న్యాయ శాఖ అనే మూడు అంగాలు ఉంటాయి. ప్రభుత్వం శాంతిభధ్రతలను కాపాడుతుంది. రాజ్య సరిహద్దులను సంరక్షిస్తుంది, ప్రజలకు న్యాయాన్ని అందిస్తుంది. ప్రజాసంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తుంది.
4) సార్వభౌమాధికారం: రాజ్యం ముఖ్య లక్షణాలల్లో సార్వ భౌమాధికారం అత్యంత ముఖ్యమైనది.సార్వ భౌమాధికారం అనగా అత్యున్నతమైన, తిరుగులేని అధికారం.
ఇది రెండు రకాలు. అవి:-
i. అంతర్గత సార్వభౌమధి కారం.
ii. బాహ్య సార్వభౌమాధికారం.
దేశంలోని ప్రజలందరికి సంస్థలపైన వర్తించే అదికారమే అంతర్గత సార్వభౌమాధికారం. రాజ్యం ఇతర రాజ్యాల విషయంలో సర్వస్వాతంత్రంగా వ్యవహరించడాన్ని బాహ్యసార్వభౌమాధి కారం అంటారు.
5.అంతర్జాతీయ గుర్తింపు: అంతర్జాతీయ గుర్తింపు అనగా ఒక రాజ్య ఉనికిని, ప్రభుత్వాన్ని ప్రపంచంలోని ఇతర రాజ్యాలు గుర్తించడం. యు.యన్.ఓ లాంటి కొన్ని అంతర్జా తీయ సంస్థలు ఈ రకమైన గుర్తింపును ఇస్తున్నాయి.
2. రాజ్యం, సమాజం మధ్యగల వ్యత్యాసాలను పేర్కోనండి?
రాజ్యం:
రాజ్యం ఒక రాజకీయ సంస్థ.
రాజ్యం వ్యక్తుల బాహ్య ప్రవర్తనను నియంత్రిస్తుంది.
రాజ్యానికి దండనాధికారం కలదు.
రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంది.
రాజ్యంచేసే చట్టాలు రాజ్యానికి బలాన్ని చెకురుస్తాయి.
సమాజం:
సమాజం ఒక సాంఘీక సంస్థ.
సమాజం మానవుల బాహ్య, అంతర్గత ప్రవర్తనలను నియంత్రిస్తుంది.
సమాజానికి దండనాధికారం లేదు.
సమాజానికి నిర్బంధ అధికారం లేదు.
సమాజంలోని ఆచారాలు, సాంప్రధాయాలు సమాజానికి బలం చేకూరుస్తాయి.
3. రాజ్యం, ప్రభుత్వం మధ్యగల వ్యత్యాసాలను గుర్తించండి?
రాజ్యం :
రాజ్యానికి 4 లక్షణాలు ఉంటాయి.
అవి:- ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం.
రాజ్యం శాశ్వత సంస్థ.
రాజ్యం సహజ సంస్థ.
రాజ్యం ప్రభుత్వానికి యజమాని వంటిది.
రాజ్య సభ్యత్వం నిర్భందమైనది.
రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే హక్కు ప్రజలకు లేదు.
ప్రభుత్వం:
ప్రభుత్వమనేది రాజ్య లక్షణాలలో ఒకటి మాత్రమే. అది రాజ్యానికి ప్రధాన ఏజెంట్ గా ఉంటుంది
ప్రభుత్వం తాత్కాలిక సంస్థ
ప్రభుత్వం పరిమిత సంస్థ
ప్రభుత్వం రాజ్యానికి సేవకురాలిగా ఉంటుంది
ప్రభుత్వ సభ్యత్వం ఐచ్ఛికమైనది
అసమర్థమైన, నిజాయితీలేని ప్రభుత్వాన్ని ప్రజలు
తొలగించవచ్చు
3. జాతి-జాతీయత, జాతీయవాదం (10 మార్కుల ప్రశ్నలు)
1. జాతీయత అంటే ఏమిటో నిర్వచించి, జాతీయత మౌళిక అంశాలను వివరించండి?
1. ''మొత్తం జనాభాలో మెజారిటీ సభ్యులతో కూడిన సామాజిక, సాంస్క తిక సముదాయమే జాతీయత'' - బర్గెస్.
2. ఒకే తెగ, భాష, మతం, ఆచారాలు చరిత్ర వంటి ఉమ్మడి అంశాలు గల ప్రజానీకమే జాతీయత'' - గెటీల్.
జాతీయత మౌళికాంశాలు:
స్వచ్ఛమైన తెగ: జాతి అనేది ఒక బౌతిక ద గ్విషయం. స్వచ్ఛ మైన జాతి, జాతీయత అనే భావన ఏర్పడి బలప డేందుకు దోహదపడుతుంది. ఈ అంశం మానవుల కపాలం, పొడవు, శిరోజాలు వంటి కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఉమ్మడి భాష: ఒకే భాష మాట్లాడే ప్రజలు ఎంతో సులభ మైన రీతిలో ఒక జాతిగా రూపొందుతారు. ఉమ్మడి భాష ఉమ్మడి సాన్నిహిత్యాన్ని దోహద పడుతుంది.
ఉదా: స్విజ్జర్లాండ్లో భాషపరమైన వైరుధ్యాలు గల ఫ్రెంచి, జర్మన్, ఇటాలియన్ జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నప్పటికి వారందరి మధ్య ఉమ్మడి జాతీయత భావాలు కలవు.
ఉమ్మడి మతం: మతం అనేది ఒక జీవన విధానం. ఉమ్మడి మతం ప్రజనీకంలో దఢమైన భావాలను ఏర్పరిచి వారి ఆలోచనల ద్వారా జాతీయత భావ ఆవిర్భవానికి సహయ పడింది.
ఉదా: భారతదేశంలో హిందుమతం, క్రైస్తవ, ఇస్లాం వంటీ భిన్న మతాలకు సంబంధించిన ప్రజలు నివసించడం మనం గమనించవచ్చు.
భౌగోళిక ఐక్యత: భౌగోళిక ఐక్యత అనేది ప్రకతిలోనే ఇమిడి ఉంది. ఒక దేశపు సమక్యతకు చిహ్నం భౌగోళిక ఐక్యత. ఒకేర కమైన వాతవరణ పరిస్థితులలో ప్రజలందరు కలిసి కట్టుగా జీవించేందుకు భౌగోళిక ఐక్యత ఉపయోగ పడుతుంది.
ఉమ్మడి చరిత్ర: ఉమ్మడి చరిత్ర ప్రజానీకంలో ఎంతో ఉత్తేజాన్ని నింపి వారిని కలిపి ఉంచుతుంది. చారిత్రక సంఘటనలు ప్రజలలో జాతీయత భావాల వ్యాప్తికి దోహదపడతాయి.
ఉదా: బ్రిటిష్ పాలన నుండి భారతీయులు జాతీయతకు సంబంధించిన అనేక పాఠాలు నేర్చుకున్నారు.
ఉమ్మడి సంస్కతి: సంస్కతి అనగా జీవన విధానం. సంస్కతి అనేది కోన్ని ఉమ్మడి అంశాలైన దుస్తులు, ఆచారాలు, అహరపు అలవాట్లు, నైతిక విలువల ద్వారా వెల్లడించబడుతుంది.
ఉమ్మడి రాజకీయ ఆకాంక్షలు: ఒక భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రజల్లో సాధరణంగా ఒకే రకమైన రాజకీయ ఆకాంక్షలు, ఆర్థిక పరమైన ఆంశాలు వారిని ఒక జాతిగా రూపొందించడానికి ఉపయోగపడుతుంది. స్వాతంత్య్ర పోరాట కాలంలో భారతదేశ ప్రజల్లో జనించిన భావాలకు మూలం ఒకే రకమైన రాజకీయ ఆకాంక్షలు ఉండటమే.
1. జాతి, జాతీయతల మధ్య వ్యత్యాసాలు ఏవి? (5 మార్కుల ప్రశ్నలు)
జాతి
జాతి అనేది రాజకీయ భావన.
జాతీయత లేకుండ జాతి ఉండదు.
జాతి అనే భావన ఎల్లప్పుడు స్వాతంత్రతను కలిగి ఉంటుంది.
జాతి అనేది ఎల్లపుడు రాజకీయంగా సంఘటీతమైన రాజ్యాన్ని సూచిస్తుంది.
జాతిగా ఏర్పడిన ప్రజలు రాజశాసనాలకు విధేయులుగా ఉంటారు.
జాతీయత
జాతీయత అనేది మానసిక భావన.
జాతి లేకుండా జాతీయత ఉంటుంది.
జాతీయత అనే భావన స్వాతంత్రంను కల్గి ఉండదు.
జాతీయత అనేది ఎల్లపుడు అసంఘటితమైన భావన.
జాతీయత గల ప్రజలు జాతిగా రూపొందే వరకు రాజ్యంగ చట్టాలు ఉండవు. అయితే ప్రజలు కొన్ని ఉమ్మడి నియమా లను అనుసరిస్తారు.
2. జాతీయవాదం సుగుణాలను తెలపండి?
- జాతీయవాదం ప్రజల మధ్య నెలకోన్న పరస్పర వైరుధ్యాలు, వ్యక్తిగత విద్వేషాలు, అంతర్గత ఘర్షణలు నిలువరించగలుగు తుంది.
- ప్రజలు ప్రభుత్వం పట్ల విధేయత చూపించేలా జాతీయ వాదం దోహదపడుతుంది.
- అతి స్వల్పవ్యవధిలో జాతి అన్ని రంగాలలో ప్రగతిని సాధించేందుకు సహయపడుతుంది.
- సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి ఆర్థిక దోపిడిని ఖండిస్తుంది.
- రాజ్యంలో అభివద్ధి వేగం పుంజుకునేలా చూస్తుంది. - ప్రజాస్వామ్య పునాదులని ఏర్పాటుచేసి తద్వారా ప్రభుత్వ పాలనకు బలం చేకూరుతుంది.
- రాజకీయ స్థిరత్వాన్ని చేకూర్చి ప్రశాంతమైన సామాజిక వాతవరణాన్ని సష్టిస్తుంది.
- ప్రజలలో సాంస్కతిక వికాసానికి దోహదపడి, ప్రజల భాష, సంస్కతి, సాహిత్యం, వేషదారణలలో సాన్నిహిత్యాన్ని పెంచింది.
3. జాతి, జాతీయవాదం మధ్య సంబందాన్ని చర్చించండి?
ఆదునిక రాజకీయాలలో జాతీయవాదం అనేది ఎంతో శక్తివంతమైన భావన, అనేక మంది రచయితలు రాజకీయ నాయకులు ప్రజల జాతీయవాద భావాలను సైద్దాంతికం గానూ, ఆచరణాత్మక రాజకీయ ఉద్యమాల సమయంలో సమర్థించారు. అయితే జాతీయవాద ఉద్యమ ఆశయం అనేది సర్వత్ర ఒకే రకంగా ఉంటుంది. జాతి రాజ్యం అనే రెండు భావనల మధ్య వ్యత్యాసాన్ని పేర్కోనడం ఒక సాంప్రదయం. జాతి అనేది తెగ లేదా సాంస్క తిక సంస్థకు సంబందించిన భావాన. అయితే రాజ్యం అనేది అత్యున్న తమైన సార్వభౌమాధికారం గల రాజకీయ సార్వభౌమత్వ రాజ్యాలుగా చేలామణి కాలేదు.
ఉదా: మొట్టమొదట ఆమెరికా వలస ప్రాంతాల ప్రజలను రాజ్యంగా కాకుండా జాతిగానే గుర్తించడమైనది. ఎందు కంటే ఆ కాలంలో ఆమెరికన్ల స్వీయ అంతరంగిక బహ్యవ్యవ హరాలలో అవసరమైన రాజకీయ ఆధికారం (సార్వభౌమధి కారం) లేదు. వారు తమ ప్రత్యేక ఆస్థిత్వాన్ని కాపాడుకోనేం దుకు సార్వభౌమత్వ రాజ్యాంగం ఏర్పడేందుకు కషి చేసిన సందర్భంలో వారు రాజ్య ప్రాధాన్యతగల జాతీయవాదాన్ని కలిగి ఉన్నారని చెప్పవచ్చు. స్థూలంగా చెప్పాలంటే జాతీయ వాదం అనేది సాదారణంగా రెండు దగ్విషా యాలను వర్ణించేందుకు ఉద్దేశించింది. ఆ రెండింటిని కింది విధంగా పేర్కోనవచ్చు.
- ఒక జాతికి సంబందించిన సభ్యులు తమ జాతియ ఆస్థిత్వాన్ని వెల్లడించేదుకు అనుసరించే వైఖరి.
- స్వయం నిర్ణయాధికార లక్షాన్ని సాధించేందుకు ఒక జాతి సభ్యులు అనుసరించే చర్య.
- జాతీయత భావాలుగల ప్రజల ప్రగాఢమైన ఆకాంక్షయే జాతి రాజ్యం. జాతీయవాదాల ఆవిష్కరణకు దారితీ స్తుంది.
- జాతీయవాదం అనే ఆదర్శం ఐరోపాలో పద హరవ శతాబ్దంనాటి సాంస్కతిక విప్లవం కాలంలో ఆరంభ మైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో జాతీయ వాదం పేల్లుబి కేందుకు ఆమెరికా స్వాతంత్య్ర పోరాటం (1774) ఎంత గానో దోహదపడింది. ఆ తరువాత ఐరోపాలో జాతీయవాద ఆవిర్భావం అభివద్ధికి ఫ్రెంచ్ విప్లవం (1789) నాంది పలికింది. వియన్నా సమావేశం(1815) ఐరో పాలో జాతీయభావ వ్యాప్తిని ఎంతగానో బలపరిచింది.
4. జాతుల స్వయం నిర్ణయాధికారం గురించి రాయండి?
జాతీయవాదం ఈనాడు అంతర్జాతీయ దగ్విషయంగా మారింది. జాతల స్వయం నిర్ణయాధికార సిద్దాంతం ప్రతి ఒక్క జాతి స్వతంత్ర రాజకీయ సంస్థగా ఎదగాలని కోరుకుంటుంది. ఈ సిద్దాంతం ప్రతి జాతి స్వయం పాలిత లేదా సార్వభౌమ రాజ్యాంగా ఎదిగే హక్కును కలిగి ఉంటుందని ప్రశ్నిస్తుంది. గతంలో నెపోలియన్ బోనపార్టీ ప్రవచించిన సామ్రాజ్యవాద భావాలు ఐరోపా ఖండంలోని అనేక దేశాలలో జాతీయవాద స్పూర్తిని పెంచి పోషిం చాయని చేప్పవచ్చు. ఇతర సామాజిక సముదాయాలకంటే జాతుల సముదాయాలు విభిన్నమైనవి. జాతుల సముదాయాలు స్వయం పాలనగావించేందుకు భవిష్యత్తు అభివద్దిని నిర్ణయించుకునేందుకు ప్రయత్నిస్తాయి. మరోరకంగాచేప్పాలంటే అది స్వయం నిర్ణయాధికారపు హక్కును కోరుకుంటాయి. ఆ ప్రయత్నంలో భాగంగా అవి అంతర్జాతీయ గుర్తింపు ఆమోదాలను అభిలాషిస్తాయి. ప్రత్యేక రాజకీయ సంస్థ లేదా రాజ్యంగానో రూపొందాలని భావిస్తాయి. అనేక సందర్భాలలో అటువంటి అభ్యర్థనలు ప్రజల నుంచి వస్తుంటాయి ఒక నిర్ణీత ప్రదేశంలో ఎంతో కాలంగా నివసించే ప్రజాసముదాయం పైన పేర్కొన్న విధంగా వ్యవహరిస్తుంది. ఇటువంటి స్వయం నిర్ణయాధి కారపు అభ్యర్థనలు రాజ్య అవతరణను కోరుకోవడం ద్వారా తమ స్వీయ సంస్కతి పరిరక్షణకు కషిచేస్తాయి. ఐరోపా ఖండంలో 19వ శతాబ్దంలో పైన పేర్కొన్న అభ్యర్థనలు అనేక పర్యాయాలు ప్రతిపాదించబడ్డాయి.
5. భారతదేశం జాతి రాజ్యమా? చర్చించండి?
1. భారతీయులకు ఉమ్మడి చరిత్ర సంస్కతి ఉన్నాయి. అనేక సందర్భాలలో భారతీయులు జాతీయ సమైక్యతకు సంబంధించిన ప్రత్యేక లక్ష్యణాలను ప్రదర్శించారు. చైనా, పాకిస్థాన్, ఇండియాను ఆక్రమించిన సందర్భాలలో భారత ప్రభుత్వానికి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించింది.
2. భారతదేశ స్వాతంత్య్ర సాధనలో భారతీయులు అసమానమైన, అత్యున్నతమైన త్యాగాలను చూపారు. మహత్మగాంధీ నాయకత్వంలో విదేశీపాలనకు వ్యతిరేఖంగా ఎన్నో బాదలకు దోపిడిలకు ఓర్చి ఉద్యమాలు చేసారు. బ్రిటిష్ ప్రభుత్వం హయంలో ఎన్నో అసౌకర్యాలకు లోనైన భారతీయులు మానసిక ఐక్యతను సాదించేందుకు క షి చేశారు. అంతిమంగా వారి ప్రయత్నాలు ఫలించాయి.
3. భారతదేశంలో నెలకోన్న మిశ్రమ సంస్క తి, ఆచార సాంప్రదాయాలు ప్రజలలో జాతీయవాదుల పటిష్టతకు దోహదపడ్డాయి. అలాగే భారతీయత పట్ల నిబిడీక తమైన భక్తి శ్రద్దలు పెరిగి అంతిమంగా అవి రాజకీయ ఆదర్శాల సాధనకు దోహదపడినాయి.
.........to be continued
Authorization