అంతర్జాతీయం
యూఏఈలో మూడో అధికార భాషగా హిందీ
యునెటైడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)లో న్యాయ స్థానాల్లోని కార్మిక కేసుల్లో హిందీని మూడో అధికార భాషగా అమలు చేయనున్నారు. న్యాయవ్యవస్థలో విభిన్న భాషల అమలు కోసం 2018 నవంబర్లో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయశాఖ తెలిపింది. దీంతో న్యాయస్థానాల్లోని కార్మిక కేసులకు సంబంధించిన క్లెయిమ్ షీట్లు, ఫిర్యాదులు సమస్యల దరఖాస్తులను అరబిక్, ఆంగ్లంతో పాటుగా హిందీలో రాసే అవకాశం దక్కనుంది. యూఏఈ జనాభా సుమారు 50 లక్షలు కాగా.. వీరిలో భారత్ నుంచి ఉపాధి కోసం వచ్చిన వారు 30 శాతం మంది ఉన్నారు.
జాతీయం
కశ్మీర్ ఉగ్రదాడిలో 39 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో గల అవంతిపుర పట్టణంలో 2019 ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వారుపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 39 మంది సైనికులు మృతి చెందారు. 2001 తర్వాత జరిగిన కారు బాంబు దాడుల్లో అతి పెద్దది. పాకిస్థాన్ గడ్డపై బలం పెంచుకున్న జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి ఒడిగట్టింది. ఆ సంస్థకు చెందిన ముష్కరుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.
బహిరంగ ప్రదేశాల్ని మలినం చేస్తే శిక్ష.. చట్టానికి సిఫార్సు
బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన, ఉమ్మి వేయడం, చెత్త పారబోసే వారిని శిక్షించేలా కేంద్రం సమగ్ర నమూనా చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటరీ సంఘం సిఫార్సు చేసింది. దీని వల్ల స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమానికి చట్టబద్ధమైన మద్దతును అందించవచ్చని, పారిశుధ్యం రాష్ట్ర అంశమైనందు వల్ల రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకోవాలని, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకొనేలా పురపాలక సంఘాలకు చట్టపరమైన సాధికారత కల్పించాలని కేంద్ర గహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరినట్లు అధీన చట్టాలపై పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ఎంపీ దిలీప్ మన్సుఖ్లాల్ తెలిపారు.
అమేఠిలో ఏకే 203 ఉత్పత్తి
నిముషానికి 600 రౌండ్ల గుళ్లను కురిపించే ఏకే 47 మెషీన్గన్ను మించిన 'ఏకే 203' కలెష్నికోవ్లను భారత్ లోనే ఉత్పత్తి చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమేఠిలోని కొర్వా ఆయుధ కర్మాగారంలో వీటిని ఉత్పత్తి చేయనున్నారు.
ఈ-ఔషధి పోర్టల్ ఆవిష్కరణ
ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియోపతి ఔషధాలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా లైసెన్సుల జారీ తదితర ప్రక్రియల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందిం చేందుకు ఈ-ఔషధి పోర్టల్ను ఆవిష్కరించారు. 2019 ఫిబ్రవరి 13న న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద యశోనాయక్ మాట్లాడుతూ ఈ-ఔషధి పోర్టల్ ద్వారా సమాచార వినియోగం, నిర్వహణ కూడా మెరుగుపడుతుం దన్నారు.
రైల్వేల వారసత్వ మాసంగా ఫిబ్రవరి
2019, ఫిబ్రవరి మాసాన్ని భారతీయ రైల్వేల వారసత్వ మాసంగా రైల్వేశాఖ ప్రకటిం చింది. భారతీయ రైల్వేల 160 ఏళ్ల ఘన చరితకు గుర్తుగా ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా రైల్వేలకు గుర్తుగా నిలిచిన ప్రాచీన బొగ్గు (స్టీమ్) ఇంజిన్లను పలుచోట్ల నడపడానికి దక్షిణ, ఆగేయ, ఉత్తర, తూర్పు తదితర రైల్వే జోన్లు ఏర్పాట్లు చేశాయి. అలాగే ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినస్, బాంద్రా స్టేషన్బీ కోల్కతాలోని గార్డెన్ రీచ్బీ వడోదర, ఆజ్మేర్ స్టేషన్ల వద్ద ప్రత్యేక వారసత్వ యాత్రలను కూడా నిర్వహించనున్నారు.
గుజ్జర్ల రిజర్వేషన్ బిల్లుకు రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదం
గుజ్జర్లతో పాటుగా మరో నాలుగు కులాలకు ప్రభుత్వ ఉద్యోగ, విద్యా రంగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాజస్థాన్ అసెంబ్లీ 2019 ఫిబ్రవరి 13న ఆమోదం తెలిపింది. దీంతో గుజ్జర్లతో పాటుగా బంజారాలు, గడియా లోహార్లు, రైకాస్, గడారియా కులాలకు కూడా రిజర్వేషన్లు వర్తించనున్నాయి. తాజా బిల్లుతో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లు 21 శాతం నుంచి 26 శాతానికి పెరిగాయి.
కలకత్తా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ ప్రారంభం
పశ్చిమబెంగాల్లోని జల్పారుగురిలో నెలకొల్పిన కలకత్తా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ను ప్రధాని నరేంద్రమోడి 2019 ఫిబ్రవరి 8న ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... హైకోర్టు బెంచ్ వల్ల డార్జిలింగ్, కలింగ్ పొంగ్ల ప్రజలకు లబ్ది చేకూరుతుందని, వీరందరికీ 100 కి.మీ పరిధిలోనే హైకోర్టు సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
రీజనరేటివ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్రారంభం
తొలి రీజనరేటివ్ (బ్రేకులు వేసినప్పుడు విద్యుత్ను ఉత్పత్తి చేయడం) టెక్నాలజీ ఆధారిత 5,000 హార్స్ పవర్ డబ్ల్యూఏజీ-7 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ను బీహెచ్ఈఎల్ తన ఝాన్సి ప్లాంటులో 2019 ఫిబ్రవరి 8న ప్రారంభించింది. బ్రేకులు వేసినప్పుడు ఏర్పడే ఉష్ణశక్తి వధా కాకుండా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. భారతీయ రైల్వే అవసరాల కోసం దీన్ని రూపొందించినట్టు బీహెచ్ఈఎల్ తెలిపింది. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్ను తిరిగి రైల్వే విద్యుత్ లైన్లకు సరఫరా అయ్యే ఏర్పాటు ఉంటుంది.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో 'ఆర్ట్ ఆఫ్ లివింగ్'
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో 40 నదులను పునరుజ్జీవిం పజేసినందుకుగాను ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్-2019లో చోటు దక్కింది. కరవు ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల కారణంగా 5 వేలకు పైగా గ్రామాల్లోని 49.9 లక్షల ప్రజలకు నీటి వసతి కలిగింది. 2013 జనవరిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్వచ్ఛంద సంస్థ నాలుగు రాష్ట్రాల్లోని (కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా) నదీ పరివాహక ప్రాంతాల్లో 40కి పైగా నదులు, వాగులను, 9 నదీ పరివాహక ప్రాంతాల్లోని 26 సరస్సులను పునరుజ్జీ వింప చేసే కార్యక్రమం చేపట్టింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యకర్తలు సుమారు 5వేల మంది గ్రామస్తులతో చేయి కలిపి బావులను పునరుద్ధరించడం, పూడిక తీయడం, కాలుష్య కారకాలను ఏరివేయడం, నదీ తీరాలను పరిశుభ్రపర్చడం, తీరాల వెంబడి చెట్లను నాటడం, వాతావరణ స్థితిగతులను బట్టి పంట మార్పిడి విధానంలో రైతులకు చైతన్యం కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టారని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రస్తావించింది.
సైబర్ సెక్యూరిటీలో భారత్కు 46వ స్థానం
భారతదేశంలో సైబర్ సెక్యూరిటీలో అధ్వాన్న స్థితిలో నిలిచిందని సెబర్ సెక్యూరిటీ స్టడీ ప్రకటించింది. దేశంలోని 25 శాతం ఫోన్లు, 21శాతం కంప్యూటర్లు మాలావేర్ బారిన పడుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. సైబర్ రక్షణ -సంబంధిత అప్డేటెడ్ చట్టాలు, మాలావేర్ ఎటాక్, సైబర్-దాడులకు సంసిద్ధత లాంటి అంశాలపై యూకేకు చెందిన టెక్నాలజీ పరిశోధనా సంస్థ కంపారిటెక్ 60దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో ఇండియా 46వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అత్యంత సైబర్ సురక్షిత దేశంగా జపాన్ నిలిచింది. ఈ జాబితాలో ఫ్రాన్స్, కెనడా, డెన్మార్క్, అమెరికా తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో అల్జీరియా అట్టడుగున నిలిచింది.
బాల్య వివాహాల్లో పశ్చిమ బెంగాల్కు ప్రథమ స్థానం
దేశంలోనే బాల్య వివాహాల్లో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉంది. గతంలో రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎక్కువగా సాగిన బాల్యవివాహాలు విద్య, పెరిగిన ఆదాయాలతో తగ్గుముఖం పట్టాయి. పశ్చిమబెంగాల్తో పాటు హిమాచల్ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో 15 నుంచి 19 ఏళ్ల బాలికల వివాహాల శాతం 11.9 శాతానికి పెరిగిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. 2005-06లో బీహార్లో 47.8 శాతం బాల్యవివాహాలు జరిగాయి. జార్ఖండ్ రాష్ట్రంలో 44.7 శాతం, రాజస్ధాన్లో 40.4 శాతం మంది బాలికలకు వివాహాలు చేశారని నాటి సర్వేలో వెల్లడైంది. అప్పట్లో బెంగాల్ రాష్ట్రంలో 34 శాతం మంది బాల్య వివాహాలు చేశారు. గడచిన పదేళ్లలో బీహార్, రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో బాల్యవివాహాల సంఖ్య తగ్గింది. కాని పశ్చిమబెంగాల్లో బాల్యవివాహాల సంఖ్య పెరిగిందని సర్వేలో తేటతెల్లమైంది. ఎస్సీ, ఎస్టీల్లో ఎక్కువమంది బాలికలకు చిన్న వయసులోనే వివాహాలు జరిగాయని సర్వేలో తేలింది.
2019 పెట్రోటెక్ సదస్సు
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో అంతర్జాతీయ ఆయిల్ అండ్ గ్యాస్ సదస్సు- పెట్రోటెక్ 2019ను ప్రధాని నరేంద్ర మోడి 2019 ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు నిర్వహించారు. ఈ సదస్సులో భాగస్వామ్య దేశాల నుంచి 95 మందికి పైగా ఇంధన శాఖ మంత్రులు, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన 7,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
అమరావతిలో సంతోష నగరాలు-2019 అంతర్జాతీయ సదస్సు
సంతోష నగరాలు-2019 అంతర్జాతీయ సదస్సును 2019 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో అమరావతిలో నిర్వహిం చారు. సంతోష నగరాల సదస్సులో భాగంగా ఆర్కిటెక్చరల్ విద్యార్థులకు నిర్వహించిన అమరావతి ఆకతుల పోటీల్లో విజేతలకు ముగింపు సమావేశంలో సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ బహుమతులు అందజేశారు. బెంగళూరు దయానందసాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించిన 'నీ నా ఇళ్లు' ఆకతికి రూ.లక్ష బహుమతిని అందజేశారు. అహ్మదాబాద్ సీపెట్ విశ్వవిద్యాలయ విద్యార్థుల 'అనంతమయ' ఆకతికి ద్వితీయ బహుమతి, గ్వాలియర్ ఎం.ఐ.టి.ఎస్. విద్యార్థులకు తతీయ బహుమతిని అందజేశారు.
విశాఖలో ప్రపంచ సముద్ర సైన్స్ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పట్నం లో 2019 ఫిబ్రవరి 25 నుంచి ప్రపంచ సముద్ర శాస్త్ర సదస్సు (ఓషన్ సైన్స్ కాంగ్రెస్)ను నిర్వహిం చనున్నారు. మూడురోజుల పాటు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 1,500 మంది సముద్ర అధ్యయన/విజ్ఞాన శాస్త్రవేత్తలు, రక్షణరంగ నిపుణులు, జియో సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు, మెట్రా లజిస్టులతో పాటు రీసెర్చి స్కాలర్లు, విద్యార్థులు పాల్గొన నున్నారు. సముద్రంలో వాతావరణ మార్పులు, సముద్రం-సమాజం, మారిటైం లా, జియోపాలిటిక్స్, మారిటైం హిస్టరీ, ఆర్కియాలజీ, కోస్టల్ టూరిజం, షిప్పింగ్, ఫిషరీ, ఆక్వాకల్చర్ తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
ప్రాంతీయం
ఓయూలో 39వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్
చరిత్ర ఆధారంగానే మంచి భవిష్యత్తుకు ప్రణాళికలు వేయగలమని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు. 39వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ను 2019 ఫిబ్రవరి 8న హైదరాబాద్లోని ఉస్మా నియా యూనివర్సిటీలో ప్రారంభమైంది. ఈ సమావేశాలను 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఆంధ్రా వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సి.సోమసుధాకర్రావు నియమితులయ్యారు.
హైదరాబాద్లో వెకా ప్లాంట్ ప్రారంభం
యూపీవీసీ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎన్సీఎల్ వెకా హైదరాబాద్ శివారులో ప్లాంట్ను ప్రారంభించింది. మెదక్ జిల్లా ముచ్చెర్లలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ను తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ 2019 ఫిబ్రవరి 13న ప్రారంభించారు. 16.8 ఎకరాల్లో రూ.50 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పలిన ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 24 వేల టన్నుల ప్రొఫైల్స్ అని ఎన్సీఎల్ వెకా సీఈఓ అశ్విన్ దాట్ల తెలిపారు.
హెచ్సీయూ పర్యవేక్షణలో తెలంగాణ గిరిజన యూనివర్సిటీ
తెలంగాణ గిరిజన యూనివర్సిటీ.. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) పర్యవేక్షణలో కొనసాగ నుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఈ వర్సిటీని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. వచ్చే ఏడాది బడ్జెట్లోనూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గిరిజన వర్సిటీలకు రూ.8కోట్ల నిధులు కేటాయించింది. తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాకారంలోని ఏటూరు నాగారం యువజన శిక్షణ కేంద్రం (వైటీసీ) తాత్కాలిక భవనంలో తొలుత 6 కోర్సులతో 2019-20కి జులై నుంచి తరగతులు ప్రారంభించనుంది.
కనీస వేతనం రోజుకు రూ.380 : నిపుణుల కమిటీ సిఫార్సు
తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ కనీస వేతనం రూ.380 ఉండాలని కేంద్ర కార్మికశాఖ నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. వి.వి.గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ ఫెలో అనూప్చౌదరి అధ్యక్షతన 2017 జనవరి 17న ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ జాతీయ స్థాయిలో ప్రాంతాల వారీగా అమలు చేయాల్సిన కనీస వేతనాలపై 2019 ఫిబ్రవరి 14న కార్మికశాఖ కార్యదర్శికి నివేదిక సమర్పించింది. జాతీయ స్థాయిలో సగటు కనీస వేతనం రోజుకు రూ.375, నెలకు రూ.9,750 ఉండాలని సిఫార్సు చేసింది.
న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ చౌహాన్
తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్ నామినేట్ అయ్యారు. ఆయనను గవర్నరు నామినేట్ చేయడంతో 2019 ఫిబ్రవరి 14న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
వార్తల్లో వ్యక్తులు
ఎన్నికల సంఘం కమిషనర్గా సుశీల్చంద్ర
ఎన్నికల సంఘం కమిషనర్గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోరు (CBDT) చైర్మన్ సుశీల్చంద్రను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 14న ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ పదవీ విరమణతో 2018 డిసెంబరు 2 నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది.
CBDT చైర్మన్గా ప్రమోద్చంద్ర మోడి
కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) చైర్మన్గా సీనియర్ అధికారి ప్రమోద్చంద్ర మోడిని నియమించారు. ఆదాయపు పన్ను విభాగానికి సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునే బాధ్యత CBDTదే. 1982 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) ఆదాయపు పన్ను విభాగాధికారి అయిన మోడి, ప్రస్తుతం జదీణు సభ్యుడిగా ఉన్నారు. ఇప్పటివరకు CBDTచైర్మన్గా ఉన్న సుశీల్ చంద్రను ఎన్నికల కమిషనర్గా నియమించినందున, ఆయన స్థానంలో ప్రమోద్చంద్రను నియమించారు.
తూర్పు నావికాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఘోర్మడే
తూర్పు నావికాదళం(ఈఎన్సీ) చీఫ్ ఆఫ్ స్టాఫ్(సీవోఎస్)గా వైస్అడ్మిరల్ ఎస్ఎన్ ఘోర్మడే నియమితులయ్యారు. ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ నుంచి బదిలీ అయ్యారు. 1984లో భారత నౌకాదళంలో చేరిన ఘోర్మడే జాతీయ రక్షణ అకాడమీ (ఖడక్వాస్లా), అమెరికాలోని నేవల్ స్టాఫ్ కళాశాలల్లో విద్యాభ్యాసం సాగించారు. రక్షణ, వ్యూహాత్మక కోర్సుల్లో ఎంఫిల్ పూర్తి చేశారు. తన 35 ఏళ్ల సర్వీసులో భాగంగా ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర, నిరీక్షక్, అలెప్పి, గంగా వంటి నేవీ వెసల్స్లోని పలు విభాగాల్లో పనిచేశారు.
శాస్త్ర సాంకేతిక అకాడమీ చైర్మన్గా కరణం వెంకటేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు చైౖర్మన్లను నియమిస్తూ 2019 ఫిబ్రవరి 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక అకాడమీ చైర్మన్గా కరణం వెంకటేశ్, ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలికవసతుల అభివద్ధి సంస్థ చైర్మన్గా డాక్టర్ శివప్రసాద్, కళింగ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్గా దువ్వాడ కష్ణమూర్తినాయుడు, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్గా తాళ్లపాక అనురాధ, మహిళా, శిశు సంక్షేమ ప్రాంతీయ నిర్వాహకు రాలిగా జి.శ్రీదేవి చౌదరిని నియమిస్తూ ప్రభుత్వం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.
ఎయిరిండియా సీఎండీగా అశ్వని లోహని
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా అశ్వని లోహనిని నియమిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ 2019 ఫిబ్రవరి 13న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎయిర్ ఇండియా సీఎండీగా అశ్వని రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో ఆగష్టు 2015 నుంచి 2017 ఆగస్టు వరకు ఎయిర్ ఇండియా సీఎండీగా ఆయన వ్యవహరించారు.
దర్శక-నిర్మాత విజయబాపినీడు మృతి
ప్రముఖ దర్శక-నిర్మాత, రచయిత విజయబాపినీడు (83) 2019 ఫిబ్రవరి 12న హైదరాబాద్లో మృతి చెందారు. 1936, సెప్టెంబర్ 22న ఏలూరు సమీపంలోని చాటపర్రులో లీలావతి, సీతారామస్వామి దంపతు లకు విజయ బాపినీడు జన్మించారు. ఆయన అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. ఏలూరులోని సీఆర్ఆర్ కళాశాలలో బీఏ చదివిన ఆయన కొంతకాలం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేశారు. రచనా వ్యాసంగం పట్ల ఆసక్తితో గుత్తా బాపినీడు పేరుతో డిటెక్టివ్ నవలలు రాసేవారు. ఆ తర్వాత భార్య విజయ పేరు కలిసి వచ్చేలా విజయ బాపినీడు పేరుతో రచనలు చేశారు. 'బొమ్మరిల్లు, విజయ' అనే మాస పత్రికలను కూడా ప్రారంభించారు.
రవాణామంత్రి నితిన్ గడ్కరీకి ఎన్సీఏపీ అవార్డు
కేంద్ర రవాణామంత్రి నితిన్ గడ్కరీకి గ్లోబల్ ఎన్సీఏపీ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో 2019 ఫిబ్రవరి 12న జరిగిన కార్యక్రమంలో ఎన్సీఏపీ సంస్థ చైర్మన్ మ్యాక్స్ మోస్లే ఈ అవార్డును ప్రదానం చేశారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించి, రోడ్డు భద్రత ప్రమాణాలు పెంచడంలో చేసిన కషికి గానూ మంత్రికి ఈ అవార్డు దక్కింది. రోడ్డు భద్రతకు ఆటోమొబైల్ రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర రవాణా శాఖ ఈ సందర్భంగా తెలిపింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు పేర్కొంది.
సంజరు సుబ్రమణ్యంకు డాన్ డేవిడ్ అవార్డ్
ప్రముఖ చరిత్రకారుడు సంజరు సుబ్ర మణ్యంకు డాన్ డేవిడ్ అవార్డు లభిం చింది. ఈ అవార్డును 2019 ఫిబ్రవరి 11న ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ విశ్వ విద్యాలయం ప్రకటించింది. మాక్రో హిస్టరీ (పూర్వకాలంలో ప్రపం చంలోని వేర్వేరు దేశాలు, ప్రాంతాల్లోని సంస్క తుల మధ్య సారూప్యత, వైవిధ్యం, వారధిలపై అధ్యయనం చేయడం)లో చేసిన విశేష పరిశోధనకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. యూని వర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అధ్యా పకుడైన సంజరు క్రీస్తుశకం 1400-1800 సంవత్సరాల కాలంలో ఆసియన్లు, యూరోపియన్లు, స్థానిక, ఆధునిక అమెరికన్ల మధ్య సాంస్కతిక సంబంధాలపై అధ్యయనం చేశారు. 2019, మే నెలలో జరిగే అవార్డు ప్రదాన కార్యక్రమంలో షికాగో యూనివర్సిటీ చరిత్రకారుడు కెన్నెత్ పొమెరాంజ్తో కలసి సంయుక్తంగా సంజరు ఈ అవార్డును అందుకోనున్నారు.
డాక్టర్ రఘురాంకు ది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ థాయిలాండ్ పురస్కారం
ది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ థాయిలాండ్- ఎఫ్ఆర్సీఎస్ అత్యున్నత గౌరవ సభ్యత్వ పురస్కారానికి కిమ్స్-ఉషాలక్ష్మి పేరిట గల రొమ్ము క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రఘురాం ఎంపికయ్యారు. ఆ కళాశాల 44వ వార్షికోత్సవాన్ని పురస్కరించు కొని 2019 జులైలో పట్టాయ లో జరిగే కార్యక్రమంలో ఆయనను సత్కరిస్తారు. ఈ మేరకు 2019 ఫిబ్రవరి 14న థాయిలాండ్ నుంచి లేఖ అందింది.
విజయ డెయిరీకి జాతీయ అవార్డు
తెలంగాణ విజయ డెయిరీకి జాతీయ అవార్డు దక్కింది. ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్ లో కేంద్ర ఆహార భద్రత, రక్షణ శాఖ 20 కేటగిరీల్లో వివిధ సంస్థలకు ఈ పురస్కా రాలు ప్రదానం చేసింది. ఇందు లో సాంఘిక సంక్షేమ పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు స్వచ్ఛమైన పాలు అందిస్తున్నందుకు విజయ డెయిరీని అవార్డు లభించింది. ఢిల్లీలో 2019 ఫిబ్రవరి 8న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్విని చౌబే, సురేష్ ప్రభు చేతుల మీదగా అవార్డు అందించారు.
ఉత్తమ సహకార సంఘాలకు పురస్కారాలు
ఉత్తమ పనితీరుతో రైతులకు సేవలందిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్)కు జాతీయ సహకార అభివద్ధి సంస్థ ప్రకటించిన ఉత్తమ పురస్కారాలను రాష్ట్ర సహకారశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి 2019 ఫిబ్రవరి 8న అందజేశారు.
సైన్స్టెక్నాలజి
హెలీనా క్షిపణి పరీక్షలు విజయవంతం
యుద్ధ ట్యాంకులపై దాడిచేసే అత్యాధునిక క్షిపణి 'హెలీనా'ను హెలికాప్టర్ నుంచి విజయవం తంగా పరీక్షించారు. ఒడిశాలో బాలసోర్ జిల్లాలోని చాందీ పూర్ వద్ద 2019 ఫిబ్రవరి 8న భారత శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. యుద్ధ ట్యాంకులపై దాడి చేసేందుకు భారత్కు ఉన్న క్షిపణుల్లో ఒకటైన నాగ్ క్షిపణిని హెలికాప్టర్ నుంచీ ప్రయోగించగలిగేలా స్వల్ప మార్పులు చేసి, కొత్త క్షిపణికి హెలీనా అని పేరు పెట్టారు. యుద్ధ ట్యాంకులపై దాడి చేసే వాటిలో హెలీనా ప్రపంచంలోని అత్యంత అధునాతన క్షిపణుల్లో ఒకటి.
భారత్కు చేరిన చినూక్ హెలికాప్టర్లు
అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ నుంచి భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు మొదటి దఫా అందాల్సిన 4 చినూక్ సైనిక హెలికాప్టర్లు భారత్కు చేరాయి. గుజరాత్లోని ముంద్రా నౌకాశ్రయానికి 2019 ఫిబ్రవరి 10న చేరిన నాలుగు సీహెచ్47ఎఫ్(ఐ) రకం హెలికాప్టర్లను త్వరలోనే చండీగఢ్ ఐఏఎఫ్ స్థావరానికి తరలిస్తామని బోయింగ్ సంస్థ తెలిపింది. 2015లో కుదిరిన ఒప్పందం ప్రకారం 22 అపాచీ హెలికాప్టర్లు, 15 చినూక్ హెలికాప్టర్లను భారత్కు బోయింగ్ సమకూర్చాల్సి ఉంది. బలగాలను, సైనిక సామగ్రిని, ఇంధనాన్ని తరలించడంతో పాటు విపత్తు సమయాల్లో వినియోగించు కునేందుకు ఈ హెలికాప్టర్లు ఎంతో అనుకూలమైనవి.
అమెరికా నుంచి 72400 రైఫిల్స్ కొనుగోలు
అమెరికా రక్షణ రంగ సంస్థ సిగ్ సార్ నుంచి 72,400 అధునాతన రైఫిళ్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత రక్షణ శాఖ అధికారులు 2019 ఫిబ్రవరి 12న వెల్లడించారు. ఇందుకోసం రూ.700 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. అమెరికా, యూరప్ దేశాల సైనికులు వినియోగిస్తున్న ఆ రైఫిళ్లను ఫాస్ట్ట్రాక్ విధానంలో కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా సిగ్ సార్ నుంచి ఏడాది వ్యవధిలో 72,400 7.62 ఎంఎం రైఫిల్స్ భారత సైన్యానికి అందుతాయి. ప్రస్తుతం భారత సైనికులు 5.56×45 ఎంఎం ఇన్సాస్ రైఫిల్స్ను వాడుతున్నారు. ఈ ఆయుధాలను చైనా సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి అందించనున్నారు.
రామ్జెట్ క్షిపణి వ్యవస్థ పరీక్ష విజయవంతం
దేశీయ పరిజ్ఞానంతో అభివద్ధి చేసిన సాలిడ్ ఫ్యూయెల్ డక్టెడ్ రామ్జెట్ (ఎస్ఎఫ్డీఆర్) చోద కంతో నడిచే క్షిపణి వ్యవస్థను రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డీఆర్డీవో) 2019 ఫిబ్రవరి 8న విజయవం తంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న సమీ కత పరీక్షా వేదిక (ఐటీఆర్) నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ పరీక్ష విజయవంతమైందని, దీని వల్ల గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి క్షిపణుల అభివద్ధికి మార్గం సుగమమైందని రక్షణ శాఖ తెలిపింది.
శరీరాకతిని సరిదిద్దే కత్రిమ మేధ ఉపకరణం
శరీరాకతిని సరిదిద్దే కత్రిమ మేధ ఉపకరణాన్ని 10వ తరగతి విద్యార్థులు రూపొందించారు. ఈ ఉపకరణం 'టెక్స్ట్నెక్' వంటి సమస్యతో బాధపడే వారికి చక్కగా తోడ్పడుతుందని చెబుతున్నారు. స్మార్ట్ఫోన్ తదితర ఉపకరణాల్ని అతిగా చూడటం, వాటిలో అక్షరాలు టైపింగ్ చేయడం వంటి అలవాట్ల వల్ల కొంతకాలానికి ఒత్తిడి పెరిగి, మెడలో నొప్పి తలెత్తడాన్ని 'టెక్స్ట్నెక్'గా వ్యవహరిస్తారు. ఈ తరహా సమస్యతో బాధపడే వారిలో శరీరాకతిని సరిదిద్దే ఉపకరణాన్ని గురుగ్రామ్లోని శివనాడార్ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు తనిష్క సహారు, నవ్య సచ్దేవ, ఆర్యన్వర్మ, తేజస్విరస్తోగి అభివద్ధి చేశారు. ఇది తప్పుడు పద్ధతిలో కూర్చున్నప్పుడు అప్రమత్తం చేస్తూ సంకేతాలు పంపించడమే కాకుండా, ఎన్నిసార్లు అపసవ్యంగా కూర్చున్నారనేది తెలియజేస్తుంది. 30 నిమిషాల విరామం తర్వాత శరీరాకతి వివరాలకు సంబంధించిన నోటిఫికేషన్ స్మార్ట్ఫోన్ ద్వారా అందుతుం దని తనిష్క సహారు తెలిపారు. ఈ ఉపకరణానికి రూ.3500 వ్యయమవుతుందని వెల్లడించారు.
GPS లేకుండానే నడిచివెళ్లే యాంట్బోట్
ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ లేకుండానే ఒక చోటు నుంచి మరో చోటుకు నడిచివేళ్లే రోబోను తొలిసారిగా శాస్త్రవేత్తలు అభివద్ధి చేశారు. ఎడారి చీమలను స్ఫూర్తిగా తీసుకుని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్(సీఎన్ఆర్ఎస్) పరిశోధకులు దీన్ని రూపొందిం చారు. 2.3 కిలోల బరువు, 6 కాళ్లు కలిగిన ఈ రోబోకు 'యాంట్బోట్' అని నామకరణం చేశారు. వందల మీటర్ల దూరం ప్రయాణించినా ఎడారి చీమలు తమ పుట్టకు తిరిగి నేరుగా రాగలుగుతాయి. పరిసరాలతో సంబంధం లేకుండా సూర్యుడి ఆధారంగా కాంతి, అతినీలలోహిత రేడియేషన్ను గుర్తిస్తూ అవి తమ దారిని కనుక్కొంటాయి. యాంట్బోట్ విషయంలోనూ ఇదే పద్ధతిని పరిశోధకులు అనుసరించారు.
ఎయిర్బస్ ఏ380 తయారీ నిలిపివేత
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానంగా గుర్తింపు పొందిన ఎయిర్బస్ ఏ380 తయారీని 2021 నుంచి నిలిపివేస్తున్నట్టు ఫిబ్రవరి 14న ఎయిర్బస్ ప్రకటించింది. కస్టమర్లు లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రధాన కస్టమర్ అయిన ఎమిరేట్స్ ఇచ్చిన ఆర్డర్లను తగ్గించుకుంటున్నట్టు తెలిపింది. 500 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల డబుల్ డెక్కర్ ఎయిర్బస్ ఏ380ని 2008లో అందుబాటులోకి తెచ్చారు. ఎత్తయిన సీలింగ్, లాంజెస్, డ్యూటీ చెల్లింపుల్లేని షాప్లు, బార్లతో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
క్రీడాంశాలు
ప్రపంచకప్లో ఆసీస్ సహాయ కోచ్గా పాంటింగ్
మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రే లియా జట్టులో సభ్యుడైన రికీ పాంటింగ్ రాబోయే ప్రపంచకప్లో కంగారూ జట్టుకు సహాయ కోచ్గా నియమితు డయ్యాడు. ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్తో కలిసి అతను పని చేయనున్నాడు. ప్రస్తుత బ్యాటింగ్ కోచ్గా ఉన్న గ్రేమ్ హిక్ రాబోయే యాషెస్ గురించి తలమునకలుగా ఉన్న నేపథ్యంలో.. ప్రపంచకప్లో బ్యాటింగ్ విభాగంపై కూడా పాంటింగ్ దష్టి పెట్టనున్నాడు.
రష్యాపై నిషేధం ఎత్తివేత
డోపింగ్ కుంభకోణానికి సంబంధించి రష్యాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయనున్నట్లు అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ప్రకటించింది. రష్యా అథ్లెట్లు తమ అధికారుల సహకారంతో మూకుమ్మడిగా డోపింగ్కు పాల్పడుతున్నట్లు తేలడంతో 2016లో మొత్తంగా ఆ దేశం మీదే పారాలింపిక్ కమిటీ నిషేధం విధించింది. కొన్ని షరతుల్ని విధిస్తూ, మార్చి 15న నిషేధాన్ని ఎత్తి వేయనున్న కమిటీ ప్రకటించింది.
ఎఫ్ఐహెచ్ ఉత్తమ ఆటగాడిగా అర్తుర్ వాన్ డొరెన్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఉత్తమ ఆటగాడిగా ప్రపంచ చాంపియన్ బెల్జియంకు చెందిన డిఫెండర్ అర్తుర్ వాన్ డొరెన్ వరుసగా రెండో ఏడాది ఎంపికయ్యాడు. ఈ మేరకు 2018 సంవత్సర పురస్కారాలను ఫిబ్రవరి 14న ఎఫ్ఐహెచ్ ప్రకటించింది. మహిళల విభాగంలో నెదర్లాండ్స్ క్రీడాకారిణి ఎవా డి గొయిడె (29) ఉత్తమ క్రిడాకారిణిగా నిలిచింది. గోల్ కీపర్ విన్సెంట్ వనాచ్ ఉత్తమ గోల్ కీపర్గా, అర్తుర్ డి స్లూవర్ ఉత్తమ వర్ధమాన ఆటగాడిగా, బెల్జియం హెడ్ కోచ్ షేన్ మెక్ లాయిడ్ ఉత్తమ కోచ్గా నిలిచారు. 1998 నుంచి ప్రకటిస్తున్న ఎఫ్ఐహెచ్ అవార్డుల్లో ఇప్పటివరకు ఒక్క అవార్డు భారత్కు లభించలేదు.
టి20 సిరీస్ విజేత న్యూజిలాండ్
భారత్, న్యూజిలాండ్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను న్యూజిలాండ్ గెలుచు కుంది. న్యూజిలాండ్లోని హామిల్టన్లో 2019 ఫిబ్రవరి 10న జరిగిన మూడో మ్యాచ్లో న్యూజిలాండ్ 4 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. న్యూజిలాండ్ ఆటగాడు సీఫెర్ట్కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు దక్కింది. భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య జరిగిన మహిళల టి20 సిరీస్లో కూడా న్యూజిలాండ్ విజయం సాధించింది.
పీవీ సింధుతో లి నింగ్ సంస్థ ఒప్పందం
భారత టాప్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పూసర్ల వెంకట (పీవీ) సింధుతో చైనాకు చెందిన క్రీడా ఉపకరణాల సంస్థ 'లి నింగ్' నాలుగేళ్ల కాలానికి స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సింధుకు లి నింగ్ సంస్థ రూ.50 కోట్లు చెల్లించనుంది. ఇందులో రూ.40 కోట్లు స్పాన్సర్షిప్ మొత్తంగా... మరో రూ.10 కోట్లు బ్యాడ్మింటన్ క్రీడా సామగ్రి రూపంలో లి నింగ్ అందజేయనుంది. దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్లో అతిపెద్ద ఒప్పందంగా ఇది నిలిచింది.
రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ అంబాసిడర్గా షేన్ వార్న్
2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్లో పాల్గొనే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వార్న్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నాడు.
Authorization