1. భారత దేశంలో మొట్టమొదటి 'మీటర్గేజ్' మార్గం ఏ సంవత్సరంలో నిర్మించారు?
ఎ) 1872 బి) 1862
సి) 1874 డి) 1863
2. మొట్టమొదటి రైల్వే ఇంజిన్ను ఎక్కడ నిర్మించారు?
ఎ) అజ్మీర్ వర్క్ షాప్
బి) మద్రాస్ వర్క్ షాప్
సి) ఆర్కోట్ వర్క్ షాప్ డి)చిత్తరంజన్
3. భారతదేశానికి స్వాతంత్య్రం (1947) వచ్చినపుడు జనాభాలో ఎంత శాతం అక్షరాస్యులు కలరు?
ఎ) 14% బి) 17% సి) 12% డి) 9%
4. మద్రాస్లో మొట్టమొదటి 'విద్యుత్ ట్రామ్' ఎప్పుడు నడిచింది?
ఎ) 1901 బి) 1905
సి) 1909 డి)1911
5. బ్రిటీష్ ఇండియాలో ఇండియన్ స్టాండర్స్ టైం (ఐఎస్టీ) ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
ఎ) 1906 బి) 1917
సి) 1904 డి) 1909
6. మొట్టమొదటి పూర్తి ఎయిర్ కండిషన్డ్ రైలును ఏ స్టేషన్ల మధ్య నడిపారు?
ఎ) ఢిల్లీ-అమృత్సర్ బి) హౌరా-ఢిల్లీ
సి) ఆగ్రా-జబల్పూర్ డి) బాంబే - థానే
7. భారత్లో మొట్టమొదటి డీజిల్ లోకోమోటివ్ ప్రవేశించిన సంవత్సరం?
ఎ) 1901 బి) 1911
సి) 1906 డి)1915
8. భారత రైల్వే చరిత్రలో మొట్టమొదటి రైలు ప్రమాదం (పంజాబ్-హౌరా) ఎప్పుడు జరిగింది?
ఎ) 1920 బి) 1923
సి) 1927 డి) 1932
9. 1951లో మహిళల అక్షరాస్యతా శాతం ఎంత?
ఎ) 18.7% బి) 19.7% సి) 20.6% డి) 12.7%
10. జాతీయ తపాలా దినోత్సవం ను ఎప్పుడు నిర్వహిస్తారు?
ఎ) నవంబర్ 10 బి) సెప్టెంబర్ 10
సి) డిసెంబర్ 8 డి) అక్టోబర్ 10
11. భారతదేశంలో మొట్టమొదటి సారిగా ప్రయోగా త్మకంగా ప్రైవేట్ రంగంలో రేడియోస్టేషన్ ఎప్పుడు మొదలైంది?
ఎ) 1932 బి) 1947
సి) 1935 డి) 1937
12. ఎస్.ఎమ్.ఎస్(SMS)ను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన పోలీస్ శాఖ ఏది?
ఎ) ఢిల్లీపోలీస్
బి) హైదరాబాద్ పోలీస్
సి) కోల్కతా పోలీస్ డి) ముంబై పోలీస్
13. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రైలు సర్వీస్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
ఎ) 1856 బి) 1851
సి) 1872 డి) 1892
14. దేశంలో అత్యంత వేగవంతమైన రైలు ఏది?
ఎ) శతాబ్ధ ఎక్స్ప్రెస్ బి) గతిమాన్ ఎక్స్ప్రెస్
సి) దురంతో ఎక్స్ప్రెస్ డి) హుబ్లీ ఎక్స్ప్రెస్
15. హైదరాబాద్ రాజ్యంలో ఏ సంవత్సరంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి శాశ్వతంగా నీటి పారుదల శాఖను ఏర్పాటు చేశారు?
ఎ) 1888 బి) 1899
సి) 1897 డి) 1894
16. దేశంలో మొట్టమొదటి డబల్డెక్కర్ ఫ్లైఓవర్ ఎక్కడ ప్రారంభమైంది?
ఎ) మద్రాస్ బి) ముంబాయి
సి) కలకత్తా డి) ఢిల్లీ
17. భారత తపాలా వ్యవస్థ పబ్లిక్ సర్వీస్గా ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 1837 బి) 1832
సి) 1854 డి) 1858
18. సర్ కొల్లిన్ స్కాట్ మోట్రీస్ చైర్మన్గా భారత ప్రభుత్వం ఇండియన్ 'ఇరిగేషన్ కమిషన్'ను ఎప్పుడు నియమించెను?
ఎ) 1904 బి) 1916
సి) 1901 డి) 1911
19. భారతదేశంలో తపాలా వ్యవస్థని ప్రారంభించినది ఎవరు?
ఎ) రాబర్ట్ క్లైవ్ బి) డల్హౌసీ
సి) వారన్హేస్టింగ్ డి) కానింగ్
20. 'జుగంతర్' పత్రిక ఏ భాషలో వెలువడెను?
ఎ) హిందీ బి) ఇంగ్లీష్
సి) మరాఠీ డి) బెంగాలీ
21. 'ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్'గా ఏ సంవత్సరంను పిలుస్తారు?
ఎ) 1931 బి) 1921
సి) 1939 డి) 1911
22. సింధూ ప్రజల ప్రధాన ఓడరేవు ఏది?
ఎ) సుర్కటోడా బి) రంగాపూర్
సి) లోథాల్ డి) కోట్డి జి
23. సింధూ నాగరికత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా దేని ఆధారితం?
ఎ) వ్యవసాయ ఆధారితం
బి) వాణిజ్య ఆధారితం
సి) పర్యావరణ ఆధారితం
డి) పశుపోషణ ఆధారితం
24. అతి పురాతనమైన బ్రహ్మణాలు ఏవి?
ఎ) గోపధ, తండ్యమహ
బి) బృహదరణ్యక, చాందోశ్య
సి) ఆత్రేయ, కౌశితకి
డి) చాందోగ్య, శతపథ
25. మలివేద కాలంలో ఏయే రాజులు ఏయే బిరుదులు ధరించారో తెలియజేసిన గ్రంథం?
ఎ) గోపధ బ్రహ్మణం బి) శతపథ బ్రహ్మణం
సి) ఆత్రేయ బ్రహ్మణం డి) చాందోగ్య బ్రహ్మణం
26. రుగ్వేదంలోనే కాక ఆర్యపదంను ప్రస్తావించిన గ్రంథం ఏది?
ఎ) రామాయణం బి) జెండా అవెస్టా
సి) అష్యాధ్యాయ డి) పతంజలి
27. సిద్ధార్థుడు మొదట ఏ గురువులతో కలిసి ధ్యానం చేశాడు?
ఎ) అలారకలామ, అనంతపిండక
బి) ఉపాలి, అలారకలామ
సి) రుద్రక, ఉపాలి
డి) రుద్రక, అలారకలామ
28. 'ప్రత్యత్త సముద్పద' సిద్ధాంతం చెప్పింది ఎవరు?
ఎ) బుద్ధుడు బి) వర్ధమానుడు
సి) సిద్ధోదనుడు డి) పార్శ్వనాథుడు
29. బుద్ధుని చుట్టూ పుష్పాలు, లతలతో అలంకరణలు ఏ శిల్పకళలో ఉన్నాయి?
ఎ) మధుర బి) వేసర
సి) అమరావతి డి) గాంధార
30. ఈ కింది వాటిలో శుంగులు అభివృద్ధి చేసిన స్థూపం ఏది?
ఎ) కాందహార్ బి) సోపారా
సి) రుమ్మిండై డి) బార్హుత్
31. రెండవ జైన పరిషత్ను గుజరాత్లోని వల్లభిలో నిర్వహించిన రాజవంశం ఏది?
ఎ) మైత్రేయ వంశం బి) శిశునాగ వంశం
సి) మౌర్య వంశం డి) చాళుక్య వంశం
32. 'ఇహము, సత్యము, పరము, మిథ్య' అని భావించి ప్రవచించిన వారు ఎవరు?
ఎ) బౌద్ధులు బి) చార్వాకులు
సి) అజివకులు డి) జైనులు
33. కళింగ నుంచి మహా పద్మనందుడు జైన విగ్రహాలు తీసుకుని వెళ్ళినట్టు తెలిపే ఖారవేలుని శాసనం ఏది?
ఎ) నందంపూడి శాసనం
బి) జూనాఘడ్ శాసనం
సి) హథీగుంపా శాసనం డి) విప్పర్ల శాసనం
34. క్రీ.పూ. 6వ శతాబ్దం నుంచే మహాజన పదాల మధ్య తీవ్ర సంఘర్షణ ఏ ప్రాంత ఆధిపత్యం కోసం జరిగింది?
ఎ) నర్మద, తపతీ నదీ ప్రాంతాలపై
బి) గంగా, యమునా నదీ ప్రాంతాలపై
సి) జీలం, సింధు నదీ ప్రాంతాలపై
డి) గంగా, బ్రహ్మపుత్ర నదీ ప్రాంతాలపై
35. మస్క్, గుజ్జారా, నిట్టూరు శాసనాల ప్రత్యేకత ఏంటి?
ఎ) అశోకుడు అందరూ బౌద్ధ బిడ్డలేనని పేర్కొన్నాడు
బి) కారువాకి, తేవర గూర్చి పేర్కొనెను
సి) అశోకుని పేరు ఉండుట
డి) అశోకుడి లౌకికతత్త్వం గూర్చి తెల్పును
36. మహమాత్రలు నిర్వహించవలసిన పనులు, రాజుకు పంపవలసిన నివేదికలను గురించి తెలియజేసిన అంశాలను తెలిపే శాసనం ఏది?
ఎ) 3వ శిలాశాసనం బి) 5వ శిలాశాసనం
సి) 6వ శిలాశాసనం డి)7వ శిలాశాసనం
37. మౌర్య చరిత్ర రచనకు ఉపయోగపడే ఆధారాలు కట్టడాలు, వస్తు ఆధారాలు ఏవి?
ఎ) నార్తరన్ రెడ్ పాలిష్వేర్ కుండలు
బి) నార్తరన్ బ్లాక్ పాలిష్వేర్ కుండలు
సి) నార్తరన్ ఎల్లో పాలిష్వేర్ కుండలు
డి) నార్తరన్ వైట్ పాలిష్వేర్ కుండలు
38. మొదటి సంగమ పరిషత్తుకు అధ్యక్షత వహించింది ఎవరు?
ఎ) అగస్త్యుడు బి) నక్కిరార్
సి) వశిష్ట డి) తోల్కప్పియార్
39. చైనా దేశం నుంచి కాందహార్ మీదుగా మధ్య ఆసియాలోకి వెళ్ళే ప్రధాన మార్గానికి గల పేరు?
ఎ) వాణిజ్య మార్గం బి) పట్టణ మార్గం
సి) సిలికాన్ మార్గం డి) ఏదీకాదు
40. ప్రజాహిత, మతపర కార్యక్రమాల వల్ల సమకాలీన రాజులచే 'భిక్షురాజు' అని ప్రశంసించిబడిన కళింగరాజు ఎవరు?
ఎ) గోవిందవర్మ బి) ఇంద్ర వర్మ
సి) ఖారవేలుడు డి) మహమేఘ వర్మ
41. 'దుకులా' అనే వస్త్రాలు వేటితో తయారు చేసే వారు?
ఎ) జనుము బి) ఉన్ని
సి) పత్తి డి) పట్టు
42. హర్షయుగానంతరం ప్రసిద్ధి గాంచిన కవులు ఎవరు?
ఎ) మదన, రాజశేఖరుడు
బి) భవభూతి, భర్తృహరి
సి) బాణభట్టు, మయూరుడు
డి) భల్లాట, విజ్ఞానేశ్వరుడు
43. పద్మగుప్తుడు ఎవరి ఆస్థాన కవి?
ఎ) వకపతి రాజముంజ
బి) జయసింహ సిద్ధిరాజు
సి) పృధ్వీరాజ్ చౌహాన్ డి) మహిపాలుడు
44. 'పవన దూతము'ను రచించినది ఎవరు?
ఎ) ఉమాపతి బి) శ్రీధరదాస
సి) దోయి డి) హలాయుధ
45. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఢిల్లీ సుల్తానాత్లో కలిసిపోయిన రాజపుత్ర రాజ్యం ఏది?
ఎ) జోధ్పూర్ రాజ్యం బి) చంధేల రాజ్యం
సి) గహద్వాల రాజ్యం డి) పల్లవ రాజ్యం
46. మహేంద్ర వర్మన్ 'కుడిమయమలై' శాసనం ఈ కింది వాటిలో దేనిని గూర్చి తెలుపును?
ఎ) గణితం బి) వైద్యం
సి) పరిపాలన డి) సంగీతం
47. 'చౌరపంచాశిక', 'విక్రమాంక దేవ చరిత్ర' అను పుస్తకాలను రచించింది ఎవరు?
ఎ) చాంద్బర్థారు బి) బిల్హణుడు
సి) దండిన్ డి) పద్మగుప్తుడు
48. హిరణ్య కశిపుని వధిస్తున్న నరసింహ విగ్రహం ఏ గుహాలయంలో ఉంది?
ఎ) దశావతార గుహాలయం
బి) శ్రీ నరసింహ గుహాలయం
సి) అష్టాదశ గుహాలయం
డి) చ్వాదశ గుహాలయం
49. చోళుల పరిపాలనలో ప్రత్యేక అంశం ఏది?
ఎ) వికేంద్రీకరణ బి) స్వపరిపాలన
సి) స్థానిక స్వపరిపాలన డి) కేంద్రీకరణ
50. చోళ సచివాలయం పేరేమి?
ఎ) తిరువాక్యకల్పి బి) పేరు మండ్రం
సి) రాజాలయం డి) పట్టార్ పొట్టం
సమాధానాలు
1.ఎ 2.ఎ 3.సి 4.బి 5.ఎ
6.బి 7.డి 8.బి 9.బి 10.డి
11.సి 12.ఎ 13.ఎ 14.బి 15.సి
16.బి 17.ఎ 18.సి 19.ఎ 20.డి
21.బి 22.సి 23.ఎ 24.బి 25.ఎ
26.బి 27.డి 28.ఎ 29.సి 30.డి
31.ఎ 32.బి 33.సి 34.బి 35.సి
36.సి 37.బి 38.ఎ 39.బి 40.సి
41.ఎ 42.బి 43.ఎ 44.సి 45.బి
46.డి 47.బి 48.ఎ 49.సి 50.బి
షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580