జవహర్లాల్ నెహ్రూ స్కాలర్షిప్స్ ఫర్ డాక్టోరల్ స్టడీస్
దేశవ్యాప్తంగా పీహెచ్డీ విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేందుకు జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ (జేఎన్ఎంఎఫ్) ఏటా స్కాలర్షిప్లను అందిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రకటన విడుదలైంది.
సబ్జెక్టులు: ఇండియన్ హిస్టరీ అండ్ సివిలైజేషన్, సోషియాలజీ, కంపేరిటివ్ స్టడీస్ ఇన్ రెలిజియన్ అండ్ కల్చర్, ఎకనామిక్స్, జాగ్రఫీ, ఫిలాసఫీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్.
స్కాలర్షిప్ కాల పరిమితి: రెండేళ్ల వరకు.
ఆర్థిక సహాయం: ట్యూషన్ఫీజుతో కలిపి మెయింటెనెన్స్ అలవెన్సు: నెలకు రూ.18 వేలు, టూర్, పుస్తకాలు, స్టేషనరీ తదితరాలకు ఏడాదికి రూ.15 వేలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణతతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థలో పీహెచ్డీకి రిజిస్టర్/అడ్మిట్ అయి ఉండాలి. వయసు 35 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో.
దరఖాస్తుకు చివరితేదీ: మే 31, 2019.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Administrative Secretary, Jawaharlal Nehru Memorial Fund, Teen Murti House, New Delhi-110011.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.jnmf.in
Authorization