1. జాతీయ ప్రణాళిక కమిటీని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఎప్పుడు మరణించారు?
ఎ) 1938 బి) 1939 సి) 1940 డి) 1941
2. కింది వాటిని జతపరచండి?
వ్యక్తి
1. జేమ్స్ అగస్టస్ హిక్కీ 2. లార్డ్ ఎలిన బరో
3. లార్డ్ డల్హౌసీ 4. సర్ హ్యూగ్ రోజ్
ప్రాధాన్యత
ఎ. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ స్థాపన
బి. ఝాన్సీలక్ష్మీ బాయిని చంపారు
సి. సింధ్ను ఆంగ్ల రాజ్యంలో విలీనం చేశారు
డి. బెంగాల్ గెజిట్ పత్రికను ప్రారంభించారు
ఎ) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
బి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
సి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
డి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3. దళిత జాతుల సంఘాన్ని 1906లో బొంబాయిలో స్థాపించింది?
ఎ) బి.ఆర్.అంబేద్కర్ బి) విఠల్ రాంజీ షిండే
సి) అయ్యంకాళీ డి) జ్యోతిబాపూలే
4. 'కిక్స్ అండ్ కిస్సెస్' అనే పాలనా విధానాన్ని అను సరించింది ఎవరు?
ఎ) లార్డ్ కర్జన్ బి) లార్డ్ ఇర్విన్
సి) లార్డ్విల్లింగ్టన్ డి) లార్డ్ కానింగ్
5. భగత్సింగ్కు సంబంధించి సరికాని అంశం ఏది?
ఎ) నవజీవన్ భారత్సభను ప్రారంభించారు
బి) 1928లో శాండర్స్ను కాల్చి చంపారు
సి) క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు
డి) 'ఇంక్విలాబ్ జిందాబాద్' అనే నినాదం ఇచ్చారు
6. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాను 1861లో నియమించిన వైశ్రాయి ఎవరు?
ఎ) లార్డ్ కానింగ్ బి) లార్డ్ లిట్టన్
సి) లార్డ్ మేయో డి) లార్డ్ రిప్పన్
7. స్వతంత్ర శిక్కు రాజ్యాన్ని ఏమంటారు?
ఎ) మిజిలీ బి) బిజక్
సి) దోహా డి) హతా
8. లార్డ్ కర్జన్ పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్గా సర్ జాన్ మార్షల్ను ఎప్పుడు నియమించారు?
ఎ) 1902 బి) 1900 సి) 1899 డి) 1898
9. కింది వాటిని జతపరచండి?
తేది
1. ఆగస్టు 16, 1932
2. సెప్టెంబర్ 12, 1931
3. మార్చి 12, 1930
4. డిసెంబర్ 29, 1929
ప్రాధాన్యత
ఎ. దండియాత్ర ప్రారంభం
బి. గాంధీజీ రెండో రౌండ్టేబుల్ సమావేశం నిమిత్తం లండన్ చేరారు
సి. పూర్ణ స్వరాజ్ తీర్మానం
డి. కమ్యూనల్ అవార్డ్ ప్రకటన
ఎ) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
బి) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
సి) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
డి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
10. కింది వాటిలో స్వదేశీ ఉద్యమం కాలంలో స్థాపిం చిందిఏది?
ఎ) ఆర్బీఐ బి) ఆంధ్రాబ్యాంక్
సి) టిఐఎస్సీఓ డి) శాంతినికేతన్ విద్యాసంస్థ
11. నేతాజీ బోస్ 1943 అక్టోబర్ 21న ఏర్పరిచిన భారత ప్రభుత్వం (ఐఎన్ఏ)గురించి సరైన జత ఏది?
ఎ) ఆర్థిక మంత్రి - ఎ.సి.ఛటర్జీ
బి) ప్రచార సారథి - ఎస్.ఎ.అయ్యర్
సి) జాతీయ భాష - హిందీ డి) పైవన్నీ
12. ఈస్టిండియా కంపెనీ తమ ఉద్యోగులకు ఇచ్చే వ్యాపార లైసెన్సులను ఏమంటారు?
ఎ) పేష్కస్ బి) మోతుర్పా
సి) ఫర్మానా డి)దస్తక్
13. నీలిమందు రైతుల విప్లవం బెంగాల్లో ఎప్పుడు జరిగింది?
ఎ) 1875 బి) 1859 సి) 1861 డి) 1864
14. కింది వాటిని జతపరచండి?
జాబితా 1
1. ఇందులేఖ నవల 2. గోరా నవల
3. ఆనంద్మఠ్ నవల 4. ప్రాయశ్చిత నవల
జాబితా 2
ఎ. రవీంద్రనాథ్ ఠాగూర్
బి. ఫకీర్ మోహన్ సేనాపతి
సి. ఓ.చందుమీనన్
డి.బంకించంద్ర ఛటర్జీ
ఎ) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
బి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
15. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) పబ్నా రైతు ఉద్యమం - కేశవ్ చంద్రరారు
బి) నీలిమందురైతుల ఉద్యమం - బిశ్వనాథ్ సర్థార్
సి) పెదనందిపాడు పన్నుల నిలిపివేత ఉద్యమం - పర్వతనేని వీరయ్య చౌదరి డి) పైవన్నీ
16. కింది వాటిని జతపరచండి?
ప్రముఖ మహిళ
1. కాదంబినీ గంగూలీ
2. పండిత రమాబాయి సరస్వతి
3. మేడం బికాజీ కామా 4. అరుణా అసఫ్ అలీ
ప్రాధాన్యత
ఎ. ముక్తి సదన్ను స్థాపించారు
బి. బొంబాయిలోని క్రాంతి మైదాన్లో త్రివర్ణ పతాకం ఎగురవేశారు
సి. భారత విప్లవ భావానికి మాత అని పిలిచారు
డి. ఐఎన్సీ సమావేశాలకు హాజరైన తొలి మహిళా గ్రాడ్యుయేట్
ఎ) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
బి) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
17. 'సాధుజన పరిపాలనాయోగం'ను స్థాపించింది ఎవరు?
ఎ) అతియోదాస్
బి) అరిగె రామస్వామి
సి) ఇ.వి.రామస్వామి నాయకర్
డి) అయ్యంకాళి
18. భారత్కు స్వాతంత్య్రాన్ని ఇస్తున్నట్టు ప్రకటించిన ఆనాటి బ్రిటన్ ప్రధాని?
ఎ) విన్స్టర్ చర్చిల్ బి) క్లెమెంట్ ఆట్లీ
సి) పాలిమర్ స్టోన్ డి) బకింగ్హామ్
19. 'దీనబంధు సార్వజనిక్ సభ' స్థాపకులెవరు?
ఎ) సి.ఎఫ్. ఆండ్రూస్ బి) దేవేంద్రనాథ్ ఠాగూర్
సి) జ్యోతిరావు పూలే డి) మహదేవ గోవిందరనడే
20. భారతదేశంలో మొట్టమొదటి పోర్చుగీసు గవర్నర్ ఎవరు?
ఎ) ఆల్బూకర్క్ బి) క్రిస్టఫరో ఫిగారీడో
సి) ఫ్రాన్సిస్ - డి - ఆల్మిడా డి) డొమింగో ఫేస్
21. బ్రిటీష్ ప్రభుత్వం భారత్లో క్షామ నివారణ నిధిని ఎప్పుడు ఏర్పాటు చేసింది?
ఎ) 1872 బి) 1878 సి) 1882 డి) 1899
22. 1945లో బ్రిటీష్ ప్రభుత్వం భారత్లో ఏర్పాటు చేసిన క్షామ నివారణ సంఘం ఏది?
ఎ) సర్ జాన్ ఉడ్ హెడ్ సంఘం
బి) రిచర్డ్ స్ట్రాచీ సంఘం
సి) సర్ జేమ్స్ లయల్ సంఘం
డి) సర్ ఆంథోని మాక్డోనాల్డ్ సంఘం
23. కింది వాటిని జతపరచండి?
జాబితా 1
1. ఇల్బర్ట్ బిల్
2. ప్రాచీన శిథిల నిర్మాణాల పరిరక్షణ చట్టం
3. ప్రాంతీయ భాషా పత్రికలపై ఆంక్షలు
4. కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని మార్పు
జాబితా 2
ఎ. కర్జన్ బి. లిట్టన్
సి. రిప్పన్ డి. హార్డింజ్ - 2
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
డి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
24. క్రీ.శ. 1919లో మోతీలాల్ నెహ్రూ స్థాపించిన పత్రిక ఏది?
ఎ) జన్మభూమి బి) ఇండిపెండెంట్
సి) ఆల్ హిలాల్ డి) మార్గదర్శి
25. మహారాజా రంజిత్ సింగ్ కాలంలో శిక్కు రాజ్య రాజధాని?
ఎ) పెషావర్ బి) లాహోర్
సి) చంఢఘీర్ డి) ఢిల్లీ
26. 1870లో 'కార్మిక క్లబ్'ను ఎవరు స్థాపించారు?
ఎ) శశిపాదబెనర్జీ బి) చిదంబరం పిళ్ళై
సి) బి.పి.వాడియా డి) వి.వి.గిరి
27. అంటరాన్నితనాన్ని నిర్మూలించడానికి ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయాలని ఐ.ఎన్.సి. సమావేశం లో తీర్మానించారు?
ఎ) 1921 అహ్మదాబాద్ బి) 1920 బెల్గాం
సి) 1925 కాన్పూర్ డి) 1929 లాహోర్
28. కింది వాటిని జతపరచండి?
పత్రిక
1. నేషనల్ హెరాల్డ్ 2. ది లీడర్
3. వందేమాతరం 4. ఆల్ హిలాల్
స్థాపకుడు
ఎ. మదన్ మోహన్ మాలవ్యా
బి. మౌలానా అబుల్ కలాం ఆజాద్
సి. జవహర్లాల్నెహ్రూ
డి. అరవింద్ఘోష్
ఎ) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
29. గాంధీ ఇర్విన్ ఒడంబడికలో లేని అంశం ఏది?
ఎ) కొన్ని గ్రామాలు గ్రామస్తుల వినియోగం కోసం ఉప్పు తయారు చేసుకోవచ్చు
బి) బ్రిటీష్ వస్తువులపై వివక్ష చూపరాదు
సి) భగత్సింగ్ మరణశిక్షను రద్దు చేయాలి
డి) రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి
30. కింది వాటిని జతపరచండి?
ఆంగ్లేయుడు
1. థామస్ హిప్లాన్ 2. విలియం స్లీమన్
3. హాల్ హెడ్ 4. ఛార్లెస్ ఉడ్
ప్రత్యేకత
ఎ. థగ్గులను అణిచివేశారు
బి. పిండారీలనుఅణిచివేశారు
సి. భారత రాజ్య వ్యవహారాల తొలి కార్యదర్శి
డి. హిందూ ధర్మ శాస్త్రాన్ని ఆంగ్లీకరించారు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
సి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
డి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
31. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) 1757 జూన్ 23 - ప్లాసీ యుద్ధం
బి) 1764, అక్టోబర్ 22 - బాక్సర్ యుద్ధం
సి) 1829 డిసెంబర్ 4 - భారత్లో సతి దురాచారం నిషేధం డి) పైవన్నీ
32. 'మనం భారతదేశానికి స్వాతంత్య్రాన్ని అయినా అందిద్దాం. లేదా ప్రయత్నంలో ప్రాణాలైనా అర్పిద్దాం'అని గాంధీజీ 1942లో ఎక్కడ పలికారు?
ఎ) బొంబాయి బి) వార్థా
సి) బార్డోలీ డి) చంపారన్
33. భారత్లో తొలి టెలిగ్రాఫ్ లైన్ను (1854) ఎక్కడ నుంచి ఎక్కడికి వేశారు?
ఎ) కలకత్తా నుంచి ఆగ్రా
బి) కలకత్తా నుంచి మద్రాస్
సి) మద్రాస్ నుంచి ఆగ్రా
డి) బొంబాయి నుంచి మద్రాస్
34. శాశ్వత భూమిశిస్తు విధానాన్ని రూపొందించుటలో కీలకపాత్ర పోషించిన నాటి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అధ్యక్షుడు ఎవరు?
ఎ) సర్ థామస్ మన్రో బి) కాంప్బెల్
సి) సర్ జాన్ షోర్ డి) సర్ హెన్రీ కాటన్
35. కింది వాటిని జతపరచండి?
గ్రంథం
1. ఇండియా విన్స్ ఫ్రీడమ్
2. ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్
3. స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్
4. ఇండియన్ ముసల్మాన్స్
రచయిత
ఎ.డబ్ల్యూ.డబ్ల్యూ.హంటర్
బి. నేతాజీ బోస్
సి. మౌలానా అబుల్ కలాం ఆజాద్
డి.లాయక్ అలీ
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
సి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
సమాధానాలు
1.ఎ 2.సి 3.బి 4.ఎ 5.సి
6.ఎ 7.ఎ 8.ఎ 9.బి 10.సి
11.డి 12.డి 13.బి 14.బి 15.డి
16.బి 17.డి 18.బి 19.సి 20.సి
21.బి 22.ఎ 23.సి 24.బి 25.బి
26.ఎ 27.ఎ 28.డి 29.సి 30.సి
31.డి 32.ఎ 33.ఎ 34.సి 35.సి