అంతర్జాతీయం
థారులాండ్ రాజు పట్టాభిషేకం
థారులాండ్ రాజుగా మహా వజిరలాంగ్ కోర్న్(66) 2019 మే 4న అధికారికంగా పట్టాభిషిక్తులయ్యారు. 2016లో ఆయన తండ్రి భూమిబోల్ అదుల్యదేజ్ కాలధర్మం చెందడంతో వజిరలాంగ్కోర్న్కు సదరు బాధ్యతలు సంక్రమించినప్పటికీ సంతాప కాలం పూర్తయ్యేదాకా పట్టాభిషేకాన్ని వాయిదా వేశారు. హిందూ, బౌద్ధ సంప్రదాయానుసారంగా పట్టాభిషేకం జరిగింది. ఆయనకు అలంకరించిన స్వర్ణ కిరీటంలో భారత్ నుంచి సేకరించిన అపురూపమైన వజ్రాన్ని పొదిగారు.
ఇరాన్లో అధ్యక్షుడి సోదరుడికి జైలుశిక్ష
అవినీతి అభియోగంపై ఇరాన్ ప్రభుత్వం.. అధ్యక్షుడు హసన్ రౌహానీ సోదరుడికి జైలు శిక్ష విధించినట్లు ఐఎస్ఎన్ఏ వార్తా సంస్థ వెల్లడించింది. 2016లో రౌహానీ సోదరుడు హస్సీన్ ఫెరిడౌన్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని అభియోగం నమోదయింది. 2015లో ప్రపంచ దేశాలతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకుంది. దీని కోసం ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో ఫెరిడౌన్ సభ్యుడు.
రాయిటర్స్ జర్నలిస్టులు విడుదల
ప్రభుత్వ రహస్యాల చట్టాల్ని ఉల్లం ఘించారనే ఆరోపణలతో మయన్మార్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన రాయిటర్స్ జర్నలిస్టులు వాలోన్, క్యావ్సోవూ 2019 మే 7న విడుదలయ్యారు. రాష్ట్రపతి క్షమాభిక్ష కింద వీరిద్దరినీ విడుదల చేస్తున్నట్లు మయన్మార్ ప్రభుత్వం తెలిపింది. రోహింగ్యాలపై జరుగు తున్న అరాచకంపై వార్తలు రాసినందుకు 2017లో వీరిని అరెస్ట్ చేశారు. ఈ విషయమై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు పెల్లు బికాయి. దీంతో 500 రోజుల అనంతరం వీరిని విడుదల చేశారు.
వారంలో ఒకరోజు నేపాల్ ప్రధాని వైద్య సేవలు
నేపాల్ ప్రధానమంత్రి లొటే షేరింగ్ వారంలో ఒక రోజు వైద్యసేవలకు కేటాయిస్తున్నారు. రాజకీయాల్లోకి రాక ముందు లొటే షేరింగ్ భూటాన్లో ప్రఖ్యాత వైద్యుడు. వత్తి పట్ల తన కున్న అంతులేని మక్కువతో ప్రధాని పదవిలో ఉన్నా వారంలో ఒక రోజు ఆయన వైద్యసేవలకే కేటాయిస్తున్నారు. బంగ్లాదేశ్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాల్లో శిక్షణ పొందిన ఆయన 2013లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ప్రధాని అయ్యారు. భూటాన్ రాజధాని థింపూలోని జిగ్మే డోర్జీ వాంగ్చుక్ జాతీయ రిఫరల్ ఆసుపత్రిలో ఇటీవల ప్రధాని షేరింగ్ 40 ఏళ్ల బుమ్తాప్కు శస్త్రచికిత్స చేశారు.
పపువా న్యూగినియాలో భారీ భూకంపం
పపువా న్యూగినియాలో 2019 మే 7న భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.2గా నమోదైంది. బులాలో పట్టణానికి 33 కిలోమీటర్లు, రాజధాని పోర్ట్ మోర్స్బైకి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం పేర్కొంది.
భారత్కు శాశ్వత సభ్యత్వం అవసరం : ఫ్రాన్స్
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్తో పాటు ఆఫ్రికా దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఉందని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. సమకాలీన పరిస్థితులను దష్టిలో ఉంచుకొని ఆయా దేశాలకు శాశ్వత హోదా ఇవ్వాలని వివరించింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ శాశ్వత ప్రతినిధి ఫ్రానోయిస్ డెలాట్రే ఐక్యరాజ్యసమితిలో వెల్లడించారు. భద్రతా మండలిని విస్తరించే క్రమంలో మరిన్ని కీలక దేశాలు శాశ్వత సభ్యులుగా ఉండాలనేది తమ వ్యూహాత్మక అంశమని, అప్పుడే సమతుల్యం ఏర్పడుతుందని డెలాట్రే పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతి వియత్నాం పర్యటన
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 2019 మే 9న వియత్నాంలో పర్యటిం చారు. రాజధాని హనోయిలో ప్రవాస భారతీయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ ప్రభుత్వాల జాబితాలో భారత్ ఉందని తెలిపారు. నాలుగు రోజుల పర్యటన కోసం ఆయన మే 9న వియత్నాం చేరుకు న్నారు. పర్యటనలో భాగంగా నేడు 16వ అంతర్జాతీయ బౌద్ధ వేడుకల్లో పాల్గొంటారు.
నైట్రోగ్లిజరిన్ టాబ్లెట్లకు ఎఫ్డీఏ ఆమోదం
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నాట్కో ఫార్మా.. అమెరికా మార్కె ట్లోకి 'నైట్రోగ్లిజరిన్ సబ్లింగ్వల్' అనే జనరిక్ ఔషధాన్ని విడుదల చేస్తోంది. గుండె జబ్బులతో బాధపడే వారిలో కనిపించే ఛాతి నొప్పుల ఉపశమనం కోసం ఈ టాబ్లెట్లను ఉపయోగిస్తారు. నాట్కో కంపెనీ మార్కెటింగ్ భాగస్వామ్య సంస్థ 'అల్వోజన్' ఇందుకోసం సమర్పించిన 'అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్' (అండా)కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ ఆమోదం తెలిపింది. 2018లో ఈ తరహా టాబ్లెట్లకు అమెరికాలో 7.73 కోట్ల డాలర్ల మార్కెట్ ఉంది.
సీజేఐ లైంగిక వేధింపుల ఆరోపణలపై నివేదిక
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోరుపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై 14 రోజుల పాటు విచారణ జరిపిన సుప్రీం కోర్టు అంతర్గత విచారణ కమిటీ 2015 మే 5న తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సీజేఐపై వచ్చిన ఆరోపణలను రుజువు చేసే ఆధారాలు లేవని కమిటీ తన నివేదికలో పేర్కొంది. సీజేఐ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఆరోపించింది. దీంతో జస్టిస్ బాబ్డే నేతత్వంలో ముగ్గురు సభ్యుల అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో ప్రస్తుతం జడ్జీలు జస్టిస్ ఇందూ మల్హోత్రా, ఇందిరా బెనర్జీలు సభ్యులుగా ఉన్నారు.
ప్రపంచంలోనే టాప్ 10 విమానాశ్రయాల్లో ఆర్జీఐఏ
ప్రపంచంలోనే అత్యుత్తమ విమా నాశ్రయాల జాబితాలో హైదరా బాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నే షనల్ ఎయిర్పోర్టు టాప్ 10లో చోటు దక్కించుకుంది. 2019 సంవత్సరానికిగానూ విమానాశ్రయాల ర్యాంకింగ్లను ఎయిర్ హెల్ప్ అనే సంస్థ విడుదల చేసింది. ఇందులో శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 8వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే అత్యుత్తమైన ఎయిర్పోర్టుగా ఖతార్లోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత జపాన్లోని టోక్యో అంతర్జాతీయ విమానా శ్రయం 2వ, గ్రీస్లోని ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 3వ స్థానంలో నిలిచాయి. అమెరికా, యూకే నుంచి ఏ విమా నాశ్రయాలు టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయాయి. 40 దేశాల్లోని 40వేల మంది ప్రయాణికులతో సర్వే జరిపి ఈ జాబితా రూపొందించింది.
కనీస ఆదాయ పథకాలతో ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది: ఆర్బీఐ
రాష్ట్రాలలో ప్రవేశపెట్టే కనీస ఆదాయ పథకాలు, రైతు రుణ మాఫీల వంటి ప్రజాకర్షక పథకాల వల్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించింది. కేంద్ర కార్యాలయంలో జరిగిన 15వ ఆర్థిక కమిషన్, ఆర్బీఐ సభ్యుల సమావేశంలో ఈ వ్యాఖ్యలను ఆర్బీఐ వెల్లడించింది. విద్యుత్ రంగంలో వచ్చిన ఉదరు బాండ్లు రాష్ట్రాల ఆర్థిక స్థితిని దిగజారేలా చేశాయని ఆర్బీఐ గుర్తుచేసింది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం, పలు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి వరుస సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నాయని గుర్తుచేసింది. రాష్ట్రాల పరిస్థితి దిగజారితే.. ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం పడుతుం దని వారు అభిప్రాయపడ్డారు.
మైక్రోసాఫ్ట్ ప్రపంచ పోటీలో రన్నరప్గా భారత్
భారత్కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆకాశ్, వాసు కౌశిక్, భరత్ సుందల్లు మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతిష్టాత్మ కంగా నిర్వహించిన 'ఇమేజిన్ కప్ వరల్డ్ ఛాంపియన్షిప్'లో రెండో స్థానంలో నిలిచారు. వీరు స్మార్ట్ ఆటోమేటెడ్ కాలుష్య నిరోధక, ఔషధ బట్వాడా మాస్క్ను తయారు చేశారు. ఆస్థమా, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలున్న రోగులకు ఉపయోగపడే 'సేలి' అనే సాధనాన్ని వీరు రూపొందించారు. ఇలాంటి సాధనాన్ని రూపొందించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. మొదటి బహుమతిని అమెరికాకు చెందిన 'టీమ్ ఈజీగ్లూకోజ్' గెల్చుకుంది.
జీపీఎఫ్పై 8 శాతం వడ్డీ
ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి(జీపీఎఫ్)పై వడ్డీరేట్లను ప్రకటిస్తూ ఆర్థిక శాఖ 2019 మే 9న ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 30 వరకు 8 శాతం వడ్డీరేటు వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
'అయోధ్య'పై త్రిసభ్య కమిటీ మధ్యంతర నివేదిక
వివాదాస్పద రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూవివాదం కేసులో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య మధ్యవర్తిత్వం కమిటీ తన మధ్యంతర నివేదికను సమర్పించింది. అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీకి మే 6న సమర్పించింది.
ఏపీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
ఆంధ్రప్రదేశ్కు చెందిన కీలక బిల్లులైన మారిటైమ్ బోర్డు బిల్లు 2018, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (ఏపీ సవరణ) బిల్లు 2018లకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి ఎం.విజయరాజుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రథమ కార్యదర్శి లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ జారీ చేసిన ప్రతులను ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ప్రకాశ్ మీడియాకు విడుదల చేశారు. ఇందులో రాష్ట్రీయ కషి వికాస్ యోజన పథకంలో భాగంగా వ్యవసాయ, అనుబంధ రంగాల పునరుద్ధరణకు కేంద్రం వాటా తొలి విడతగా రూ.69.84కోట్లు విడుదల చేసినట్లు ప్రవీణ్ప్రకాశ్ వెల్లడించారు. ఇందులో కేంద్రం నుంచి రూ.100.42 కోట్లు మంజూరు కాగా రాష్ట్రం 40శాతం భరించాల్సి ఉంటుంది.
ప్రాంతీయం
బల్దియాలో ఆసియాలోనే అతిపెద్ద ఎల్ఈడీ ప్రాజెక్టు
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఆసియా లోనే అతిపెద్ద ఎల్ఈడీ లైట్ల ప్రాజెక్టును నగరంలో విజయ వంతంగా అమలు చేసి సరికొత్త రికార్డు సాధించింది. విద్యుత్ వినియోగాన్ని సగానికి తగ్గించడం ద్వారా ఏటా రూ.110 కోట్లను ఆదా చేయబోతోంది. సాంప్రదాయ లైట్ల వల్ల ఏర్పడే భారాన్ని అధిగమించాలంటే ఎల్ఈడీ లైట్లను వినియోగించడంతో పాటు ఆటోమెటిక్ స్విచ్చింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని బల్దియా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్)కు ఈ బాధ్యత అప్పగించింది. రూ.271 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు బల్దియా ముందుగా ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. వడ్డీతో కలిపి వాయిదాల రూపంలో ఏడేళ్ల పాటు ప్రతినెలా కొంత చెల్లిస్తే సరిపోతుంది.
మెడికో హెల్త్కేర్ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానం
ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఆధ్వర్యంలో 2019 మే 4న హైదరాబాద్లో మెడికో హెల్త్కేర్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ పేరిట వైద్యరంగంలో ఉత్తమ సేవలందిస్తున్న పలువురు వైద్యులకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరై పురస్కారాలు అంద జేశారు. వైద్యరంగానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన 54 మంది వైద్యులకు పురస్కారాలు అందజేశారు.
వ్యవసాయశాఖకు 'సీఎస్ఐ' పురస్కారం
తెలంగాణ వ్యవసాయ శాఖకు 2017-18 సంవత్సరానికి గాను కంప్యూటర్ సైన్స్ సొసైటీస్ ఆఫ్ ఇండియా(సీఎస్ఐ) వారి 'సీఎస్ఐ-నిహిలెంట్ ఈ గవర్నెన్స్' పురస్కారం లభించింది. రైతులకు రాయితీపై ఆన్లైన్ విధానంలో విత్తనాలను విక్రయించే విధానాన్ని అమలు చేస్తున్నందుకు ఈ పురస్కారం లభించింది.
గ్రామీణ ప్రజావాణి పుస్తకావిష్కరణ
శాసన మండలిలో సుంకర సత్యనారాయణ చేసిన ప్రసంగాల సంకలనం 'గ్రామీణ ప్రజావాణి'ని ఢిల్లీలో 2019 మే 4న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గ్రామీణ ప్రజావాణి పుస్తకానికి సంపాదకత్వం వహించారు.
హైదరాబాద్లో డేటా భద్రతకు పటిష్ట కేంద్రం
సైబర్ నేరాలు, మోసాల నియంత్రణకు, డేటా చౌర్యాన్ని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ సైబర్ క్లస్టర్లు సంయుక్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నాయి. పస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హేగ్లో మాత్రమే ఇలాంటి కేంద్రం ఉంది. ఐటీ పరిజ్ఞానంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు, విద్యాసంస్థలకు కొత్తగా ప్రారంభమయ్యే కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో మాత్రమే సైబర్ క్లస్టర్లు మొదలయ్యాయి. రెండోదశలో ఉస్మానియా విశ్వ విద్యాలయం, పరిశోధక సంస్థలు, విద్యార్థులను భాగస్వాములను చేసుకోనున్నారు. రెండో దశపూర్తయ్యాక ఈ కేంద్రం పనిచేయడం మొదలవుతుంది.
వార్తల్లో వ్యక్తులు
జాతీయ ఎస్సీ కమిషన్ డెరైక్టర్గా సునీల్
షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ డెరైక్టర్గా డాక్టర్ జి.సునీల్ కుమార్బాబు 2019 మే 9న హైదరాబాద్లో పదవీ బాధ్యతలు చేపట్టారు. సునీల్కుమార్ బాబు ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయవర్సిటీలో అంతర్జా తీయ కార్యక్రమాల డెరైక్టర్గా, పాలిటెక్నిక్ల సమన్వయకర్తగా పని చేశారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ను భారత రాజ్యాంగంలోని 338వ అధికరణం పరిధిలో ఏర్పాటు చేశారు. ఇది రాజ్యాంగం పరిధిలో షెడ్యూల్డ్ కులాలకు నిర్దేశించిన రక్షణ చర్యలను పర్యవేక్షిస్తుంది. హైదరాబాద్లో ఉన్న కార్యాలయం పరిధిలో తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు వస్తాయి.
మిస్ సూపర్ గ్లోబ్ ఇండియాగా అక్షరరెడ్డి
మిస్ సూపర్ గ్లోబ్ ఇండియా-2019 అందాల పోటీల్లో తెలుగమ్మాయి అక్షరరెడ్డి విజేతగా నిలిచారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి 240 మందికిపైగా అందాలతారలు పోటీ పడగా, కేరళ రాష్ట్రం కోజికోడ్లో జరిగిన ఫైనల్స్లో అక్షర కిరీటాన్ని దక్కించు కున్నారు. దీంతో వచ్చే అక్టోబర్లో దుబారు లో జరుగనున్న మిస్ సూపర్గ్లోబ్ ఇంటర్నేషనల్ పోటీలకు మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్షరరెడ్డిది చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబం.
1969 ఉద్యమకారుడు 'మారంరాజు' కన్నుమూత
ప్రముఖ రచయిత, 1969 ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యమ కారుడు, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఆచార్య మారంరాజు సత్యనారాయణ (84) 2019 ఏప్రిల్ 4న మతి చెందారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జన్మించిన మారంరాజు అంచెలం చెలుగా ఎదిగి అనేక పదవులు నిర్వహించారు. రాజకీయశాస్త్రంలో నిష్ణాతులు. పాత రెవెన్యూ చట్టాలు, గ్రామీణ వ్యవస్థపై సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇదీ తెలంగాణ, గ్రామాయణం, ఎన్నికలు-రాజకీ యాలు, ఏపీ రాష్ట్ర రాజకీయాల చరిత్ర పుస్తకాలను రచించారు.
న్యాయవిద్య ఆద్యుడు మీనన్ కన్నుమూత
ప్రముఖ విద్యావేత్త, భారతీయ న్యాయ విద్య ఆద్యుడు, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ నీలకంఠ రామకష్ణ మాధవ మీనన్ (ఎన్.ఆర్.మాధవ మీనన్) (84) 2019 మే 7న తిరువనంతపురంలో మృతి చెందారు. 1935లో జన్మించిన మాధవ మీనన్ 21 ఏళ్లకు కేరళ హైకోర్టులో లాయర్గా పేరు నమోదు చేయించుకున్నారు. న్యాయ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి భారతదేశంలో ఆధునిక న్యాయ విద్యకు పితామహుడిగా పేరొం దారు. న్యాయ విద్య, న్యాయవత్తిపై డజనుకుపైగా పుస్తకాలు రాసిన నీలకంఠ రామకష్ణ మాధవ మీనన్ లా కమిషన్, క్రిమినల్ జస్టిస్ రిఫార్మ్ కమిటీ సభ్యుడిగా చేశారు.
అరుణోదయ రామారావు కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ అరుణోదయ సాంస్కతిక సమాఖ్య అధ్యక్షులు, సాంస్కతిక కళాకారుడు అరుణో దయ రామారావు (65) 2019 మే 5న హైదరాబాద్లో మృతి చెందారు. 1955 లో కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో రామారావు జన్మించారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో బీఏ వరకు చదువుకున్న రామారావు తండ్రితో కలసి పౌరాణిక నాటకాలు వేసేవారు. సీపీఐ (ఎంఎల్) నాయకుడు చండ్ర పుల్లారెడ్డి ప్రేరణతో విప్లవ ఉద్యమంలో చేరిన ఆయన విప్లవోద్యమంలో తన పాటలతో పజల్ని చైతన్య పరిచారు. ఖమ్మం జిల్లా పాపయ్య గూడెంకు చెందిన అరుణక్కను వివాహం చేసుకున్నారు. ప్రతి పాటకు సొంతట్యూన్ కట్టడంలో దిట్ట. ఉయ్యలో జంపాల, అన్నా అమరుడురా, అడవి ఏడ్చింది వంటి పాటలతో ప్రజల గుండెల్లో తనకంటు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహించారు.
ఐరాస ఎస్డీజీ ప్రచారకర్తగా దియామీర్జా
ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) ప్రచార కర్తలుగా బాలీవుడ్ నటి దియా మీర్జా సహా ఆరుగురు కొత్తగా ఎంపికయ్యారు. మిగతా ఐదుగురు ప్రచారకర్తలను నైజీరియా, చాద్, దక్షిణాఫ్రికా, ఇరాక్, బ్రెజిల్ల నుంచి ఎంపిక చేశారు. కొత్త ప్రచారకర్తలతో కలిసి మొత్తం 17 మంది ఉండే ఈ బందం - ఆకలి, పేదరికాన్ని రూపు మాపడం, అందరికీ ఆరోగ్య సంరక్షణ తదితర లక్ష్యాల సాధనకు కషి చేస్తుందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ పేర్కొన్నారు.
'మిస్టర్ ఇండియా'గా సయ్యద్ జీన్
గార్డెన్సిటీ బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల యువ మోడల్ సయ్యద్ జీన్ 'మిస్టర్ ఇండియా 2019'గా నిలిచాడు. ఈ టైటిల్తో మే 09న నగరానికి చేరుకున్న సయ్యద్కు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రూబరు గ్రూప్ సంస్థ ముంబైలో పురుషుల కోసం నిర్వహించిన 16వ ఎడిషన్ సౌందర్య పోటీలలో మొత్తం 38 మంది పాల్గొనగా సయ్యద్ జీన్తో పాటు ఐదుగురే ఫైనల్స్కి చేరుకున్నారు. చివరిగా జీన్ మిస్టర్ ఇండియా కిరీటంతోపాటు మిస్టర్ ఫొటోజెనిక్ టైటిల్ను కూడా సాధించాడు. బెంగళూరు ఆర్.టి.నగర్కు చెందిన సయ్యద్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నప్పటికీ మోడలింగ్ను కెరీర్గా ఎంచుకున్నాడు. మిస్టర్ సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్లో రన్నర్ప్గా నిలిచాడు.
సైన్స్ and టెక్నాలజీ
చంద్రుని దక్షిణ ధ్రువంపైకి రోవర్
చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా చంద్రుని దక్షిణ ధ్రువంపైకి ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్లను పంపనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. 2019, జూలై 9-16వ తేదీల మధ్యలో జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-2ను చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎవరూ కూడా చీకటిగా ఉండే చంద్రుని దక్షిణ ధ్రువంపై రోవర్ను దించలేదని, ఇస్రో పంపించే రోవర్ చంద్రుని ఈక్వేటర్కు సమీపంలోకి వివరించారు. 2019 ఏడాది తొలి అర్ధ భాగంలో సూర్యుడిపై ప్రయోగాల కోసం ఆదిత్య-ఎల్1 సూర్యుని కక్ష్యలోకి ప్రయోగిస్తామని శివన్ పేర్కొన్నారు.
ఐఎన్ఎస్ వెళా ప్రారంభం
భారత నౌకాదళం కోసం నిర్మించిన ఇండియన్ నావల్ షిప్ (ఐఎన్ఎస్) వెళాను ముంబైలో 2019 మే 6న ప్రారంభించారు. ముంబైలోని మజ్గావ్డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ దీనిని నిర్మించింది. ప్రాజెక్టు 75లో భాగంగా 6 స్కార్పీన్ రకం జలాంతర్గాములను మజ్గావ్డాక్ నిర్మించాలి. ఈ ఆరింటిలో మొదటిది అయిన ఐఎన్ఎస్ కల్వరిని ప్రధాని నరేంద్రమోడీ 2017, డిసెంబర్ 14న ప్రారంభించారు. తాజాగా ప్రారంభమైన ఐఎన్ఎస్ వెళా స్కార్పీన్ రకంలో నాలుగో జలాంతర్గామి.
స్వల్పశ్రేణి క్షిపణులను పరీక్షించిన ఉత్తరకొరియా
అమెరికాతో అణుచర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడినప్పటి నుంచి అసంతప్తితో రగిలిపోతున్న ఉత్తరకొరియా 2019 మే 9న రెండు స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ను సందర్శించడానికి ఉత్తర కొరియాకు అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీఫెన్ బీగన్ మే 8న చేరుకున్న నేపథ్యంలో ఈ క్షిపణి పరీక్షలు జరిపారు. ఉత్తర కొరియా 2017 నవంబరులో చివరిసారిగా క్షిపణులను పరీక్షించింది.
వినూత్న ప్రయోగానికి నాసా కసరత్తు
ప్రమాదకరమైన గ్రహశకలాల నుంచి భూమిని రక్షించే సామర్థ్యాన్ని సమకూర్చుకునే దిశగా నాసా ముందడుగు వేయ బోతోంది. 'ద డబుల్ ఆస్టెరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్' (డార్ట్) అనే వ్యోమనౌకను డిడిమోస్ అనే జంట గ్రహశకల వ్యవస్థతో ఢ కొట్టించబోతోంది. 2022లో దీన్ని నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఖగోళ శిలతో భూమికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది.
22న నింగిలోకి పీఎస్ఎల్వీ-సి 46
నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి మే 22న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్- సి 46 వాహక నౌకను నింగిలోకి పంప నున్నారు. పీఎస్ఎల్వీ వాహకనౌక రీశాట్-2 బీఆర్ 1 రాడార్ ఇమేజింగ్ ఉప్రగహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. ఈ ఉపగ్రహం బెంగళూరు నుంచి రావాల్సి ఉంది. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితు ల్లోనూ సమాచారాన్ని అందించగలదు. 2009 ఏప్రిల్ 20న మొదటగా రీశాట్ ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి పంపింది. అప్పట్లో వాతావరణ పరిస్థితులు, సరిహద్దుల్లో చొరబాటు దారు లను గుర్తించడంతో పాటు, రాత్రి వేళల్లో కూడా నిర్దిష్ట సమాచారం అందించేందుకు వీలుగా వాటి రూపకల్పన జరిగింది.
క్రీడాంశాలు
భారత ఫుట్బాల్ జట్టు కోచ్గా ఐగర్ స్టిమాక్
క్రొయేషియాకు చెందిన ఐగర్ స్టిమాక్ భారత ఫుట్బాల్ జట్టు హెడ్ కోచ్గా నియమితుడయ్యాడు. 2019 మే 9న సమావేశమైన అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘంగా చర్చించిన కమిటీ... స్టిమాక్కు నియమించేందుకు నిర్ణయం తీసుకుంది. 51 ఏళ్ల స్టిమాక్ సెంటర్బ్యాక్గా 53 అంతర్జాతీయ మ్యాచ్లాడాడు. 1996 యూరోకప్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 1998 ప్రపంచకప్లో మూడో స్థానంలో నిలిచిన క్రొయేషియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2012-13 మధ్య తమ దేశ జట్టుకు కోచ్గా వ్యవహరించాడు. స్టిమాక్ ఆధ్వర్యంలోనే క్రొయేషియా 2014 ప్రపంచ కప్నకు అర్హత సాధించింది. స్టిమాక్ మూడేళ్ల పాటు భారత కోచ్గా ఉండనున్నాడు. థారులాండ్లో 2019 జూన్ 5 నుంచి జరుగ నున్న కింగ్స్ కప్తో అతడి పదవీ కాలం ప్రారంభమవుతుంది.
రోజర్ ఫెదరర్ అరుదైన ఘనత
స్విస్ టెన్నీస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అరుదైన ఘనత సాధించాడు. అతను 1200వ ఏటీపీ మ్యాచ్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఓపెన్ శకంలో జిమ్మీ కానర్స్ (1274) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
రియాన్ పరాగ్ అరుదైన రికార్డు
రాజస్థాన్ రాయల్స్ యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ సరికొత్త రికార్డు సష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పరాగ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 17 సంవత్స రాల 175 రోజుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఇంతకు ముందు రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ సంజూ శాంసన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. పరాగ్ 50 (49బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు చేసి ఐపీఎల్లో తన హాఫ్ సెంచరీ బాదాడు.
ఐపీఎల్లో హాఫ్ సెంచరీలు చేసిన యువ ఆటగాళ్లు
ఆటగాడు వయసు సీజన్
రియాన్ పరాగ్ 17 సంవత్సరాల 175 రోజులు 2019
సంజూ శాంసన్ 18 సంవత్సరాల 169 రోజులు 2013
పథ్వీషా 18 సంవత్సరాల 169 రోజులు 2018
రిషభ్ పంత్ 18 సంవత్సరాల 212 రోజులు 2016
శుభ్మన్ గిల్ 18 సంవత్సరాల 237 రోజులు 2018
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పాకిస్తాన్కు అగ్రస్థానం
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన వార్షిక టీ20 ర్యాంకింగ్స్లో 286 రేటింగ్ పాయింట్లతో పాకిస్తాన్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ తర్వాత స్థానాలను వరుసగా దక్షిణాఫ్రికా(262), ఇంగ్లండ్ (261), ఆస్ట్రేలియా(261), భారత్(260) పొందాయి. తాజా ర్యాంకుల గణనలో 2015-16 సీజన్ ప్రదర్శనను తొలగించి, 2016-17, 2017-18 సీజన్ల ప్రదర్శనకు 50 శాతం వెయిటేజీ ఇచ్చారు. ఐసీసీ మే 2న ప్రకటించిన వార్షిక ర్యాంకుల్లో టెస్టుల్లో భారత్, వన్డేల్లో ఇంగ్లండ్ మొదటిస్థానాల్లో నిలిచాయి.
ఫెలిక్స్ టోర్నీలో భారత్కు 2 స్వర్ణాలు
ఫెలిక్స్ స్టామ్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్కు 2 స్వర్ణాలు, రజతం, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలు లభించాయి. పోలెండ్ రాజధాని వార్సాలో జరిగిన ఈ టోర్నిలో గౌరవ్ సోలంకి (52 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు) స్వర్ణాలు సాధించారు. తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ 56 కేజీల విభాగంలో రజతం గెలవగా మన్దీప్ జాంగ్రా (69 కేజీలు), అంకిత్ ఖటానా (64 కేజీలు), సంజీత్ (91 కేజీలు) కాంస్యాలు నెగ్గారు. ఫైనల్స్లో గౌరవ్ 5-0తో విలియమ్ కాలే (ఇంగ్లండ్)పై, మనీశ్ 4-1తో మొహమ్మద్ హమూత్ (మొరాకో)పై విజయం సాధించగా... హుసాముద్దీన్ 1-4తో ముఖమ్మద్ షెకోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు.
ఆసియా స్క్వాష్లో సౌరవ్కు టైటిల్
ఆసియా సీనియర్ స్క్వాష్ చాంపియన్షిప్లో భారత్కి చెందిన సౌరవ్ ఘోషాల్, జోష్నా చినప్ప టైటిళ్లు గెలి చారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్లో టాప్ సీడ్ సౌరవ్ 11-9, 11-2, 11-8తో లియో చున్ మింగ్ (హాంకాంగ్)పై గెలుపొందాడు. అలాగే మహిళల సింగిల్స్ ఫైనల్స్లో రెండో సీడ్ జోష్నా 11-5, 8-11, 11-6, 11-6తో టాప్ సీడ్ ఆనీ అయు (హాంకాంగ్)పై విజయం సాధించింది. దీంతో ఆసియా సీనియర్ స్క్వాష్ చాంపియన్షిప్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా సౌరవ్... మహిళల సింగిల్స్ టైటిల్ను నిలబెట్టుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా జోష్నా చినప్ప రికార్డు నెలకొల్పారు
బ్రెజిల్ బ్యాడ్మింటన్లో సాత్విక్ జోడీకి టైటిల్
బ్రెజిల్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్కి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ షెట్టి జోడీకి టైటిల్ లభించింది. బ్రెజిల్లోని క్యాంపినస్లో 2019 మే 6న జరిగిన పురుషుల డబుల్స్ తుది పోరులో టాప్ సీడ్ సాత్విక్-చిరాగ్ ద్వయం 21-14, 21-18తో నెదర్లాండ్స్కు చెందిన రెండో సీడ్ జెల్లీ మాస్-రాబిన్ టెబెలింగ్ జంటపై విజయం సాధించింది.
Authorization