1. కింది వాక్యాలలో సరైనదేది?
1.హేతువు, మానవత్వ సూత్రం ప్రభావితమైన సామాజిక, మత సంస్కర్తలు భారత సమాజాన్ని సంస్కరించాలని భావించారు.
2. వివిధ సామాజిక దురాచారాలను శాసనాల ద్వారా నిషేధించాలని ఈ సంస్కర్తలు ఉద్భోదించారు.
3. మహిళా విద్య, వితంతు వివాహాలకు సంబంధించి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విశేష కృషి చేశారు
ఎ) పైవన్నీ బి) 2, 3 మాత్రమే
సి) 1, 3 మాత్రమే డి) 2 మాత్రమే
2. భారతదేశంలో వార్తాపత్రికల సెన్సార్షిప్ను మొదటి సారి నిషేధించిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) లార్డ్ లిట్టన్ బి) లార్డ్ వెల్లస్లీ
సి) లార్డ్ హేస్టింగ్స్ డి) లార్డ్ రిప్పన్
3. కింది వాటిలో ఏ పుస్తకాలు / జర్నల్స్ వాటి రచయిత / రచయితలతో సరిగా జత చేయలేదు. సరైనదేదో తెలుపండి?
పుస్తకం / జర్నల్ రచయిత
1. గులామ్గిరి డి.కె. కార్వె
2. కుడి అరసు నారాయణ్ గురు
3. మూక్నాయక్ బి.ఆర్.అంబేద్కర్
4. బహిషృత్ భారత్ ఎం.కె.గాంధీ
ఎ) 1, 2 మాత్రమే బి) 2, 3 మాత్రమే
సి) 1, 2, 4 డి) పైవన్నీ
4. కేబినెట్ మిషన్కు సంబంధించి సరైనది ఏది?
1. ఫెడరల్ ప్రభుత్వాన్ని సిఫార్సు చేసింది
2. భారత న్యాయస్థానాల అధికారాలను విస్తృతం చేసింది
3. ఐసిఎస్లో మరింతమంది భారతీయులకు స్థానం కల్పించింది
ఎ) 1 మాత్రమే బి) 2, 3 మాత్రమే
సి) 1, 3 మాత్రమే డి) ఏదీకాదు
5. కింది వాటిలో భారత జాతీయ కాంగ్రెస్ కంటే ముందు ఏర్పాటైన సంస్థలు ఏవి?
1) బ్రిటీష్ ఇండియా అసోసియేషన్
2) ఈస్ట్ ఇండియా ఆర్గనైజేషన్
3) ఇండియన్ అసోసియేషన్
4) హిందూస్థాన్ సోషిలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ 5) మద్రాస్ నేటివ్ అసోసియేషన్
ఎ) 1, 2, 3, 5 బి) 2, 3, 4, 5
సి) 1, 3, 4, 5 డి) పైవన్నీ
6. భారతదేశానికి అధికారాల బదిలీ సమయంలో ఏ సంస్థానం తన సొంత ప్రణాళికతో ముందుకు వచ్చింది?
ఎ) బెంగాల్ బి) అవుద్
సి) మద్రాస్ డి) నార్త్వెస్ట్ ఫ్రాంటియర్ ఫ్రావిన్స్
7. ఇండో సార్సెనిక్ శిల్పకళా శాస్త్ర పద్ధతిలో విజయ నగర రాజులు ఒక భవనం నిర్మించారు. ఆ భవనం ఏది?
ఎ) విట్టలస్వామి ఆలయం బి) పద్మ మహల్
సి) మహా మండపం డి) హజారా రామాలయం
8. 'దేవదాన' రకపు భూదానాల ప్రత్యేకత ఏంటి?
ఎ) బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామాలు
బి) రాజుకు దానం చేసిన గ్రామాలు
సి) దేవతలకు దానం చేసిన గ్రామాలు
డి) సాధారణంగా నివసించని గ్రామాలు
9. కింది రాజవంశాలలో ఆలయ వాస్తుకళను ఆచరించని రాజవంశం ఏది?
ఎ) పరమార బి) యాదవ
సి) చాళుక్య డి) చండేలా
10. విజయనగర సామ్రాజ్య లక్షణాలకు సంబంధించిన కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
1) ఇది రాజరిక వ్యవస్థ
2) సామ్రాజ్యానికి భూమి శిస్తు ఒక ప్రధానమైన ఆదాయ వనరు
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) పై రెండూ డి) ఏదీకాదు
11. 1909 చట్టం ప్రకారం కింది వాటిలో సరైన వాక్యం కాని దానిని గుర్తించండి?
ఎ) బ్రిటీష్ ఇండియా బ్రిటీష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండాలి
బి) బాధ్యతాయుత ప్రభుత్వం వాస్తవరూపం దాల్చడం దశలవారీగా జరుగుతుంది
సి) ప్రొవిన్షియల్ సబ్జెక్టులను రిజర్వ్డ్, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్టులుగా వర్గీకరించారు
డి) భారత సెక్రటరీ ఆఫ్ స్టేట్ జీవితాన్ని పార్లమెంట్ చెల్లించడం జరగదు
12. 1942 క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి కింద పేర్కొన్న వాటిలో ఏది సరికాదు?
ఎ) ఇది ఒక అహింసాయుత ఉద్యమం
బి) ఈ ఉద్యమాన్ని మహాత్మాగాంధీ నడిపారు.
సి) అది అప్పటికప్పుడు ప్రారంభమైన ఉద్యమం
డి) ఈ ఉద్యమం కార్మిక తరగతిని ఆకర్షించలేదు
13. ఖేదా రైతుల తరుపున మహాత్మాగాంధీ సత్యా గ్రహాన్ని చేపట్టడానికి కారణం ఏంటి?
1) కరువు ఏర్పడినప్పటికీ పాలనా యంత్రాంగం భూమిశిస్తును రద్దు చేయలేదు
2) గుజరాత్లో శాశ్వత శిస్తును ప్రవేశపెట్టాలని పాలనా యంత్రాంగం నిర్ణయించింది.
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 1, 2 డి) ఏదీకాదు
14. గాంధీ - ఇర్విన్ ఒప్పందానికి దారి తీసింది ఏది?
ఎ) హింసకు పాల్పడ్డ వారితో సహా అందరు రాజకీయ ఖైదీల విడుదల
బి) ప్రభుత్వ దమనకాండకు స్వస్తి
సి) రెండవ రౌండ్ టేబుల్ సమావేశం
డి) మూడవ రౌండ్ టేబుల్ సమావేశం
15. 1946 ఆగస్టు 16న ప్రత్యక్ష చర్యాదినం దేనికి సంబంధించినది?
ఎ) ఏ విధంగా అయినా ప్రత్యేక ముస్లిం దేశం ఏర్పాటుకు డిమాండ్
బి) రాయల్ ఇండియన్ నేవీ సభ్యుల తిరుగుబాటు
సి) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నేతృత్వంలో ఖుదాయి కిద్మత్నగర్ చేపట్టిన అహింసాయుత సత్యాగ్రహం
డి) ఏదీకాదు
16. హరప్పాకు సంబంధించి కింది వాక్యాలను సరైనదేది?
1. హరప్పా రావి నది ఒడ్డున ఉంది.
2. హరప్పాకు ధాన్యాగారాల నగరమని పేరు
3. నగర నిర్మాణంలో భాగంగా కేంద్రం, చుట్టూ కోటగోడగా పిలువబడే సిటాడెల్ నిర్మాణం ఉంది.
ఎ) 1, 2 మాత్రమే బి) 1, 3 మాత్రమే
సి) 2, 3 మాత్రమే డి) పైవన్నీ
17. ఉపనిషత్తుల్లో ప్రబోధించిన తత్త్వం ఏది?
ఎ) అద్వైతం బి) వేదాంతం
సి) యోగ డి) సంఖ్య
18. రాతిని తొలిచి చేసిన కొన్ని బౌద్ధ గుహలను చైత్యాలయాలుగా మరికొన్నింటిని విహారాలుగా పిలుస్తారు. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?
ఎ) విహార అనునది పూజ చేసే స్థలం, చైత్య అనునది బౌద్ధ సన్యాసులు నివసించే ప్రాంతం
బి) చైత్య అనునది పూజ చేసే స్థలం కాగా, విహార అనునది బౌద్ధ సన్యాసుల నివాస ప్రాంతం
సి) చైత్య అనునది గుహ చివరిలో ఉండే స్థూపం, విహార అనునది దానికి సంబంధించిన హాలు
డి) ఈ రెండింటి మధ్య ఏ విధమైన తేడా లేదు.
19. భారత దేశంపై పర్షియన్లు దాడి చేయడం వల్ల ఈ కింది వాటిలో వేటిపై ప్రభావం పడలేదు?
ఎ) వాయవ్య ప్రాంతంలో లిపి బి) నాణేలు
సి) ఆస్థాన కార్యక్రమాలు డి) శిల్పకళ
20. ప్రాచీన భారతదేశ ఆర్థిక చరిత్రకు సంబంధించి 'వాపి' అనే పదానికి అర్థం?
ఎ) నేటి సాగునీటికి వినియోగించే వాటర్ వీల్
బి) సాగు నేలగా మార్చిన పనికిరాని నేల
సి) కాలువల ద్వారా సాగునీరు
డి) చెరువుల ద్వారా సాగునీరు
21. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహా సభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆలోచనను వ్యతిరేకించింది ఎవరు?
ఎ) న్యాపతి సుబ్బారావు బి) బి.ఎన్.శర్మ
సి) కృష్ణారావు డి) రామచంద్రరావు
22. యాత్రా చరిత్ర 'నీలగిరి యాత్ర'ను రచించింది ఎవరు?
ఎ) ఏనుగుల వీరాస్వామి
బి) కందుకూరి వీరేశలింగం
సి) రఘుపతి వేంకటరత్నం నాయుడు
డి) కాల శేషాచల కవి
23. బ్రహ్మ సమాజ ఉద్యమ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది?
ఎ) అది బెంగాల్ బ్రహ్మసమాజ శాఖగానే పరిమితమైంది
బి) అది పరిమితులకు లోబడి కొంత ప్రాంతం వరకే ప్రభావం చూపింది
సి) ఏకేశ్వరోపాసన, సామాజిక రుగ్మతలు తొలగించి అణగారిన వర్గాల స్థితిగతులలో ఉపశమనమునకు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకున్నది
డి) పైవేవీకాదు
24. సర్కారు జిల్లాలను, సీడెడ్ జిల్లాలను, తెలంగాణ జిల్లాలను కలిపి విశాలాంధ్రగా ఏర్పరచాలన్న ఆలోచన ఎవరిది?
ఎ) అయ్యదేవర కాళేశ్వరరావు
బి) ఎన్.సి.రాజలింగం
సి) స్వామి రామానంద తీర్థ డి) హయగ్రీవరావు
25. మధ్యయుగ ఆంధ్రప్రదేశ్లో వర్తకశ్రేణి ముఖ్య కేంద్రం ఏది?
ఎ) బెజవాడ బి) వినుకొండ
సి) పెనుగొండ డి) పెరూర్
26. భారత రాజ్యాంగానికి సమాఖ్య లక్షణాలు ఉన్నా యని కింది వాటిలోని ఏ అంశం నిర్దారిస్తుంది?
ఎ) రచించబడిన, దృఢమైన రాజ్యాంగం
బి) స్వతంత్ర న్యాయ వ్యవస్థ
సి) అవశేష అధికారాలను కేంద్రానికి దఖలు పరచడం
డి) కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ
27. భారత రాజ్యాంగంలోని అంశాలు, వాటిని ఏ దేశం నుంచి గ్రహించారు అనేవి రెండు జాబితాలుగా ఉన్నాయి. జాబితాల కింది ఇచ్చిన కోడ్ల సాయంతో సరైన జతలను గుర్తించండి?
జాబితా 1 జాబితా 2
1. ప్రాథమిక హక్కులు ఎ. యునైటెడ్ కింగ్డమ్
2. పార్లమెంటరీ ప్రభుత్వం బి. అమెరికా
3. అత్యయిక స్థితి (ఎమెర్జెన్సీ) నిబంధనలు
సి. ఐర్లాండ్
4. ఆదేశిక సూత్రాలు డి. జర్మనీ
ఇ. కెనడా
ఎ) 1-బి, 2-డి, 3-ఇ, 4-ఎ
బి) 1-ఇ, 2-ఎ, 3-సి, 4-డి
సి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
డి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
28. కింది వాటిలో ఏ అంశం బ్రిటీష్ పార్లమెంటరీ వ్యవస్థకు భిన్నంగా భారత పార్లమెంటరీ వ్యవస్థ నిలుస్తున్నది?
ఎ) వాస్తవిక, నామమాత్రపు కార్యనిర్వాహక వ్యవస్థ
బి) ఉమ్మడి బాధ్యతా వ్యవస్థ
సి) ద్విసభ విధానం
డి) న్యాయ సమీక్ష విధానం
29. కింది వాటిని జతపరచండి?
ఆలయం ప్రదేశం
1. కైలాసనాథ ఆలయం పి. ధియోఘర్
2. లడ్ఖన్ ఆలయం క్యూ. ఒడిశా
3. దశావతార ఆలయం ఆర్. ఎల్లోరా
4. లింగరాజు ఆలయం ఎస్. ఐహోలు
ఎ) 1-ఆర్, 2-ఎస్, 3-పి, 4-క్యూ
బి) 1-ఎస్, 2-ఆర్, 3-క్యూ, 4-పి
సి) 1-ఆర్, 2-ఎస్, 3-క్యూ, 4-పి
డి) 1-ఎస్, 2-క్యూ, 3-ఆర్, 4-పి
30. కింది వాటిని ఆరోహణ క్రమంలో రాయండి?
1. గగ్ర యుద్ధం 2. కన్వా యుద్ధం
3. చౌసా యుద్ధం 4. రెండవ పానిపట్ యుద్ధం
ఎ) 3, 2, 4, 1 బి) 2, 1, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 4, 3, 1, 2
31. వాణిజ్య అనుమతులు పొందడానికి జహంగీర్ ఆస్థానానికి వచ్చిన వారెవరు?
1. కెప్టెన్ విలియం హాకిన్స్ 2. ఎడ్వర్డ్స్
3. సర్ థామస్ రో
ఎ) 1, 2 మాత్రమే బి) 2, 3 మాత్రమే
సి) 1, 3 మాత్రమే డి) పైవన్నీ
32. 'పుష్టి మార్గాన్ని' ప్రబోధించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు?
ఎ) రామానంద బి) నింబార్క
సి) వల్లభాచార్య డి) చైత్యమహాప్రభు
33. వలస పాలన కాలంలో సైన్యం, ఆయుధాల తయారీలో ఆధునీకరణలను చేపట్టిన మొదటి భారత రాజ్యం ఏది?
ఎ) హైదరాబాద్ బి) మైసూర్
సి) అవద్ డి) బెంగాల్
సమాధానాలు
1.ఎ 2.బి 3.బి 4.ఎ 5.ఎ
6.ఎ 7.బి 8.సి 9.బి 10.సి
11.డి 12.బి 13.ఎ 14.సి 15.ఎ
16.డి 17.బి 18.బి 19.డి 20.సి
21.బి 22.డి 23.సి 24.ఎ 25.సి
26.డి 27.సి 28.డి 29.ఎ 30.బి
31.డి 32.సి 33.బి
Authorization