పీజేటీఎస్ఏయూలో బీఎస్సీ హానర్స్ రాజేంద్రనగర్ (హైదరాబాద్)లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం 2019-20కి గాను బీఎస్సీ (హానర్స్)-కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. బాలికలు మాత్రమే అర్హులు. సీట్లు: 60. కోర్సు వ్యవధి: నాలుగేళ్లు. అర్హత: ఎంపీసీ/బైపీసీ/ఎంబైపీసీలో ఇంటర్మీడియట్ లేదా హౌమ్ సైన్స్లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. ఎంపిక: ఇంటర్మీడియట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు. వయసు: 2019, డిసెంబర్ 31 నాటికి 17-22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 25, పీహెచ్సీలకు 27 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.900బీ మిగిలిన వారికి రూ.1800. దరఖాస్తుకు చివరితేదీ: జులై 4, 2019. వెబ్సైట్: http://pjtsau.fdstech.solutions