అంతర్జాతీయం
యురేనియం పరిమితిని దాటేశాం: ఇరాన్
2015 నాటి అణు ఒప్పందంలో నిర్దేశించిన దాని కన్నా ఎక్కువగా యురేనియంను తాము నిల్వచేశామని ఇరాన్ 2019 జూలై 1న ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావద్ జరీఫ్ మాట్లాడుతూ అణు ఒప్పందంలో పరిమితి విధించిన 300 కిలోల కన్నా ఎక్కువగానే యూరేనియంను నిల్వ చేసినట్టు వెల్లడించారు. ఈ ఒప్పందం నుంచి అమెరికా 2018 ఏడాదిలో బయటకు వెళ్లిపోయిన అనంతరం ఇరాన్పై ఆంక్షలు విధించింది.
కెనడా, నెదర్లాండ్స్లో కాగితరహిత పాస్పోర్టు
కాగితరహిత విమానయానంపై ప్రాజెక్టు చేపట్టాలని కెనడా, నెదర్లాండ్స్ దేశాలు నిర్ణయించాయి. ప్రస్తుతం పాస్ పోర్టుపై ఉన్న చిప్పై ఉంటున్న వివరాలను స్మార్ట్ఫోన్లో రహస్య సంకేత భాషలో స్టోర్ చేయాలని తీర్మానించాయి. 2019లో ఇరుదేశాలు అంతర్గతంగా పైలట్ ప్రాజెక్టుగా పరిశీ లించి, 2020 నుంచి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని నిర్ణయించాయి.
హాంకాంగ్లో ఆందోళనకారుల విధ్వంసం
నేరారోపణలు ఎదుర్కొంటున్న పౌరులను విచారణ నిమిత్తం చైనాకు అప్పగించాలన్న హాంకాంగ్ ప్రభుత్వ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ 2019 జూలై 1న వేలాది మంది నిరసనకారులు విధ్వంసం సష్టించారు. హాంకాంగ్ పార్లమెంటులోకి దూసుకెళ్లిన నిరసనకారులు చిత్రపటాలను చింపేశారు. గోడలపై రంగులు పూయడంతో పాటు పోలీసులతో ఘర్షణ పడ్డారు. దీంతో నిరసనకా రులపై పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. బ్రిటిష్ పాలన ముగిసి, హాంకాంగ్ను తిరిగి చైనాకు అప్ప గించి 22 ఏళ్లయిన రోజే (జూలై 1) ఈ విధ్వంసం చోటుచేసుకుంది.
స్టార్ఫిష్ ఆకారంలో విమానాశ్రయం
చైనా ప్రభుత్వం 1.20 లక్షల కోట్లతో నిర్మిస్తున్న స్టార్ఫిష్ ఆకారంలోని డాక్సింగ్ అంతర్జా తీయ విమానాశ్రయాన్ని కమ్యూ నిస్ట్ ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్ల వేడు కలు జరుపుకుంటున్న సందర్భంగా ప్రారంభించ నున్నారు. బీజింగ్లోని డాక్సింగ్లో 10 ఫుట్బాల్ మైదానా లకు సమానమైన స్థలంలో చైనా ప్రభుత్వం ఈ విమానా శ్రయ నిర్మాణాన్ని చేపట్టింది. 1949 అక్టోబరు 1న మావో జెడాంగ్ పీపుల్స్ రిపబ్లిక్ ను స్థాపించారు. దీన్ని పురస్కరిం చుకుని సెప్టెం బరు 30న ఈ కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు.
భారత్కు నాటోతో సమాన హౌదా
భారత్కు నాటోతో సమాన హోదా ఇచ్చేందుకు సంబంధిం చిన శాసనసభ నిబంధనకు అమెరికా సెనేట్ 2019 జూలై 2న ఆమోదం తెలిపింది. దీంతో అమెరికా నాటో మిత్రపక్ష దేశాలైన ఇజ్రాయిల్, దక్షిణ కొరియా దేశాల సరసన భారత్ నిలవనుంది. హిందూ మహా సముద్రంలో భారత్-అమెరికాల మధ్య రక్షణ సహకారం మరింత పెరగడంతో పాటు, మానవతా సహాయం, ఉగ్రవాద నిర్మూలన, సముద్ర ప్రాంతంలో భద్రత వంటివి పెంపొందించడానికి ఈ చట్టం దోహదపడుతుంది.
భారత్ నుంచి హజ్ కోటా పెంపు
భారత్ నుంచి ఏటా హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్యను 1.7 లక్షల నుంచి 2 లక్షలకు పెంచనున్నట్లు సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తెలిపారు. జపాన్లోని ఒసాకాలో జరిగిన జీ-20 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన సల్మాన్ ఈ మేరకు హామీ ఇచ్చారు. మక్కాకు ఒంటరిగా వెళ్లే మహిళలకు లాటరీ లేకుండానే వెళ్లేందుకు వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. పురుషుల్లేకుండానే ఒంటరిగా వెళ్లే మహిళలను 2018లో 1,300 మందిని అనుమతించారు.
దుబాయి విమానాశ్రయంలో రూపాయి చెల్లుబాటు
దుబాయి విమానాశ్రయంలోని మూడు టెర్మినళ్ళతో పాటు యూఏఈలోని అంతర్జాతీయ విమానశ్రయంలోనూ నేరుగా రూపాయిలను వినియోగించుకునే అవకాశం 2019 జూలై 1 నుంచి అందుబాటులోకి వచ్చింది. రూ.100 నుంచి రూ.2000 వరకూ విలువగల వస్తువులు, సేవలను మన రూపాయిలతో పొందవచ్చు. చిల్లర ఇవ్వాల్సి వస్తే దిర్హాముల్లో తిరిగి చెల్లిస్తారు. ఈ విమానాశ్రయాల్లో ఇప్పటి వరకూ 15 రకాల కరెన్సీని నేరుగా అనుమతిస్తున్నారు. ఇప్పుడు భారతీయ కరెన్సీ 16వది అవుతుంది.
భారత్ టారిఫ్ల పెంపుపై డబ్ల్యూటీవోకు అమెరికా
భారత్కు అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బాదం, వాల్నట్స్ తదితర 28 రకాల ఉత్పత్తులపై టారిఫ్లను పెంచడంపై అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) ను ఆశ్రయించింది. భారత్ విధించిన అదనపు సుంకాలు 1994 నాటి ట్రేడ్, టారిఫ్ల సాధారణ ఒప్పందం (గాట్) కింద అమెరికాకు అందుతున్న ప్రయోజ నాలను రద్దు చేయడం లేదా బలహీన పరచడంగా చేస్తున్నట్లు ఆరోపిం చింది. 2018లో భారత్, ఇతర దేశాల నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై సుంకాలను అమెరికా పెంచింది. దీంతో పాటు జీఎస్పీ కింద భారత్కు చెందిన కొన్ని ఉత్పత్తులకు ఇస్తున్న జీరో టారిఫ్ ప్రయోజనాన్ని కూడా 2019, మే నుంచి నిలిపేసింది. దీంతో భారత్ అమెరికా నుంచి దిగుమతి అవుతున్న 28 రకాల ఉత్పత్తులపై టారిఫ్లను జూలై నెల నుంచి పెంచింది.
జాతీయం
కేంద్ర బడ్జెట్: 2019-20
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2019 జులై 5న కేంద్ర బడ్జెట్ 2019-20ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. రూ. 27,86,349 కోట్ల ఆదాయం-వ్యయ అంచనాలతో బడ్జెట్ను రూపొం దించారు. ఇందులో ద్రవ్య లోటు రూ.7,03,760 కోట్లుగా ఉంది. ఇది స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతం. లోటును పూడ్చడానికి ఈ ఏడాది విదేశీ మార్కెట్ నుంచి రూ.4.48 లక్షల కోట్లు రుణాలు సేకరించనున్నారు. గత ఏడాది రూ.4.22 లక్షల కోట్ల రుణాలు తీసుకోగా, ప్రస్తుతం అంతకన్నా ఎక్కువే తీసుకో నున్నారు. అన్ని రకాల రుణాలు కలిపి గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.71 లక్షల కోట్ల మేర తీసుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో రూ.7.1లక్షల కోట్ల మేర తీసుకోవాలని ప్రతిపాదించారు. వడ్డీల చెల్లింపులకు ఈ బడ్జెట్లో రూ.6,60,471 కోట్లు కేటాయించారు.
ఆర్థిక సర్వే 2018-19
2018-19 సంవత్సర ఆర్థిక సర్వేను 2019 జూన్ 4న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ముఖ్య ఆర్థిక సలహాదారు కష్ణ మూర్తి సుబ్రమణి యన్ రూపొందించిన ఈ నివేదిక దేశ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించింది.దీంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి గానూ భారత జీడీపీ వద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని ఈ సర్వే అంచనా వేసింది.
ఆగస్టులో ప్రయోగాత్మక జనగణన
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2019 ఆగస్టు 12-సెప్టెంబర్ 30 మధ్య ప్రయోగాత్మక జనగణన చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశ జనగణన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈసారి మొబైల్ యాప్ ద్వారా జనాభా లెక్కలను సేకరించనున్నట్టు రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ వివేక్ జోషి 2019 జూలై 1న వెల్లడించారు.
మాజీ సైనిక కుటుంబాలకు పింఛను పథకం
మాజీ సైనిక కుటుంబాలకు ప్రత్యేక పింఛను పథకం అందిం చేందుకు వీలు కల్పిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ 2019 జూలై 4న ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం ప్రకారం విధి నిర్వహణలో గాయపడి రిటైరైన సైనికుడు పౌర ఉద్యోగం పొంది, రిటైరై మరణిస్తే అతని వారసులకు ప్రత్యేక కుటుంబ పింఛను కింద సైనిక/పౌర ఉద్యోగాలకు సంబంధించిన రెండు పింఛన్లు అందుకునే వీలుంటుంది. 2013 జనవరి 17వ తేదీకి పూర్వం పౌర విభాగాల్లో నియమితులైన మాజీ సైనికోద్యోగులు రిటైరై మరణించిన సందర్భాల్లో అతని కుటుంబసభ్యులు పౌర, సైనిక పింఛన్లలో ఏది ఎక్కువగా ఉంటే దానినే సాధారణ కుటుంబ పింఛనుగా డ్రా చేసుకునేందుకు వీలుండేది.
జలశక్తి అభియాన్ ప్రారంభం
జల వనరులను సంరక్షించి, వాన నీటిని ఒడిసి పట్టుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు జలశక్తి అభియాన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం 2019 జులై 1న భారీ కార్య క్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో నీటి కోసం ఇబ్బంది పడుతున్న 256 జిల్లాలు, 1592 బ్లాకుల్లో రెండు దశల్లో నిర్వహించే ప్రచార ఉద్య మాన్ని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రారంభిం చారు. కేంద్రం నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులకు పర్య వేక్షణ బాధ్యతలు అప్పగించారు. తొలి దశ కార్యక్రమాలు నిర్వహించే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. ఈ రాష్ట్రానికి చెందిన 24 జిల్లాలు, 187 బ్లాకులను దీనికోసం ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ (9 జిల్లాలు, 64 బ్లాకులు), తమిళ నాడు, కర్ణాటక, పుదుచ్చేరి రెండో దశలోకి వస్తాయి.
ఏపీలో వ్యవసాయ మిషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయరంగ సంక్షోభానికి పరిష్కార మార్గాలు కనుగొనేందుకు విధాన సలహా మండలిగా అగ్రిక ల్చరల్ (వ్యవసాయ) మిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి 2019 జూలై 1న ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉత్తమ సమన్వయానికి ఈ మిషన్ దోహదపడుతుంది.
విజయవాడలో తొలి ఆధార్ సేవా కేంద్రం
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీ ఏఐ) నిర్వహణ లో ఆధార్ సేవా కేంద్రాలు మొదటి సారిగా ఢిల్లీ, విజయ వాడలలో 2019 జూలై 2న ప్రారంభమయ్యాయి. 2019 చివరి నాటికి దేశ వ్యాప్తంగా మరో 53 నగరాల్లో 114 కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.
మేఘాలయకు రూ.100 కోట్ల జరిమానా
అక్రమ బొగ్గు తవ్వకాలను అరికట్టడంలో విఫలమైనందున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విధించిన రూ .100 కోట్ల జరిమానాను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)లో జమ చేయాలని మేఘాలయ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు 2019 జూలై 3న ఆదేశించింది. అక్రమంగా సేకరించిన మొత్తం బొగ్గును కోల్ ఇండియాకు అప్పగించాలని స్పష్టం చేసింది.
వ్యవసాయంపై ఉన్నతస్థాయి కమిటీ
భారతీయ వ్యవసాయ రూపాంతరీకరణ (ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్) కోసం నీతి ఆయోగ్ 9మంది సభ్యుల ఉన్నతస్థాయి కమిటీని 2019 జులై 1న ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. కేంద్రం రూపొందిం చిన వ్యవసాయ ఉత్పత్తులు, పశుసంపద మార్కెటింగ్ చట్టం- 2017, వ్యవసాయోత్పత్తులు, పశుసంపద- ఒప్పంద సేద్యం, సేవలు చట్టం-2018లను నిర్దిష్ట గడువు లోగా రాష్ట్రాలు అమలు చేయడంపై దష్టి సారించి, 2 నెలల్లో నివేదిక సమర్పిస్తుంది.
భూతాపంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం
భూతాపం, వాతావరణ మార్పుల వల్ల వచ్చే పదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతాయని ఐజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్వో) హెచ్చరించింది. తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల ఆరు బయట కార్మికులు పనిచేయలేని పరిస్థితులు ఏర్పడతాయని, ముఖ్యంగా వద్ధులకు ఇది తీవ్ర ఇబ్బందికరమని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2 శాతానికి పైగా పని గంటలు నష్టపోవటం జరుగుతుందని పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.
భారత్లో దివ్యాంగ పిల్లల విద్య తీరుతెన్నులపై యునెస్కో నివేదిక
స్టేట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా 2019 పేరిట భారతదేశంలో దివ్యాంగ పిల్లల విద్య తీరుతెన్నుల గురించి యునెస్కో ఒక నివేదిక విడుదల చేసింది. 19 ఏళ్లలోపు దివ్యాంగులైన పిల్లల చదువుకు సంబంధించిన అంశాలను దీనిలో పొందుపరిచారు. దీని ప్రకారం అయిదేళ్లలోపు దివ్యాంగ బాలల్లో మూడు వంతుల మంది పాఠశాలలకు వెళ్లడం లేదు. తరగతి పెరిగే కొద్దీ పాఠశాలకు వచ్చే వారి సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. బాలికల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
భారత్లో చిన్నారులపై పెరిగిన అత్యాచార ఘటనలు
భారత్లో చిన్నారులపై అత్యాచార ఘటనలు 1994-2016 మధ్య నాలుగు రెట్లు పెరిగినట్లు తాజా నివేదిక ఒకటి స్పష్టం చేసింది. జాతీయ నేర రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం 1994లో 3,986 అత్యాచారాలు నమోదవగా, 2016 నాటికి ఈ సంఖ్య 16,863కు చేరిందని ఈ నివేదిక పేర్కొంది (4.2 రెట్లు అధికం), పోషకాహార లోపం, పిల్లలపై నేరాలు, విద్య లాంటి అంశాలను ఈ నివేదికలో చర్చించారు.
తరిగిపోతున్న మంచు పర్వతాలు
హిమాచల్ప్రదేశ్లోని 6 మంచు పర్వతాలు ఏటా 18 నుంచి 33 మిల్లీమీటర్ల మేర తరిగిపోతు న్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడిం చింది. భూవిజ్ఞాన శాఖ మంత్రి హర్షవర్ధన్ రాజ్యసభలో 2019 జులై 2న ఈ విషయాన్ని పేర్కొన్నారు. లాహోల్-స్పీతిలోని చంద్ర బేసిన్లో ఉన్న ఆరు పర్వతాల పై జాతీయ ధ్రువ, సముద్ర పరిశోధన కేంద్రం (ఎన్ సీపీవోఆర్) 2018 నుంచి అధ్యయం సాగిస్తోంది. వాతావరణ పరిస్థితులు, నైసర్గ స్వరూపం ఆధారంగా ఏటా 18-35 మి.మీ. మేర అవి తరిగిపోతున్నాయి.
ట్రంప్ - కిమ్జోంగ్ ఉన్ 3వ సమావేశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాలోని పాన ముంజోమ్లో ఆ దేశ అధినేత కిమ్జోంగ్ ఉన్తో 2019 జూన్ 30న సమావేశమయ్యారు. దీంతో ఉత్తర కొరియాను సంద ర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గుర్తింపు పొందారు. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య నిస్సైనిక ప్రాంతంగా (డీఎంజడ్) పేర్కొనే సరిహద్దు ప్రాంతంలో ఈ భేటీ జరిగింది. 2018లో సింగపూర్లో తొలిసారి వీరు సమావేశమయ్యారు.
జిన్పింగ్తో టర్కీ అధ్యక్షుడు సమావేశం
చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్తో టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ 2019 జూలై 3న సమావేశమయ్యారు. చైనాలోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలలై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సహకా రాన్ని విస్తరించుకోవాలని, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కషి చేయాలని ఓ అంగీకారానికి వచ్చారు.
విదేశీ రుణ భారం 543 బిలియన్ డాలర్లు
భారత్ విదేశీ రుణ భారం 2019 మార్చి నాటికి 543 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ మేరకు 2019 జూన్ 28న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం 2018 మార్చి ముగింపుతో పోల్చి చూస్తే భారత్ విదేశీ రుణ భారం 2.63 శాతం (13.7 బిలియన్ డాలర్లు) పెరిగింది.
2018-19లో క్యాడ్ 2.1 శాతం
2018-19 ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్ లోటు 2.1 శాతంగా (స్థూల దేశీయోత్పత్తి విలువతో పోల్చి) నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019 జూన్ 28న తెలిపింది. విలువ రూపంలో ఈ పరిమాణం 57.2 బిలియన్ డాలర్లు. 2017-18లో క్యాడ్ జీడీపీ విలువలో 1.8 శాతంగా (48.7 బిలియన్ డాలర్లు) నమోదైంది. ఎఫ్డీఐ, ఎఫ్ఐఐ, ఈసీబీలు మినహా ఒక నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని క్యాడ్ అంటారు.
జీవితకాల గరిష్టస్థాయికి ఫారెక్స్ నిల్వలు
విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) జీవితకాల గరిష్టస్థాయికి చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019 జూన్ 28న తెలిపింది. 2019, జూన్ 21తో ముగిసిన వారంలో ఏకంగా 4.215 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 426.416 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు ఎగశాయని ఆర్బీఐ వెల్లడించింది.
ప్రాంతీయం
దివ్యాంగులకు 'కల్యాణలక్ష్మి' పెంపు
తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను మరోసారి పెంచింది. దివ్యాంగ వధువులకు అందించే సాయాన్ని 25 శాతం, 'కల్యాణలక్ష్మి' పేరిట పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లకు అందించే సాయం రూ.1,00,116 అందజేస్తున్నారు. ఇది దివ్యాంగులకు అయితే, పెళ్లి కూతురు తల్లి బ్యాంకు ఖాతాలో రూ.1,25, 145గా అందనుంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి బి.వెంకటేశం 2019 జూన్ 29న ఉత్తర్వులు జారీ చేశారు.
3 భాషల్లో మహబూబ్నగర్ వెబ్సైట్
దేశంలోనే మొదటిసారిగా ఒక జిల్లా వెబ్సైట్ను 3 భాషల్లో రూపొందిం చారు. మహబూబ్గర్ జిల్లా వెబ్సైట్ ఇప్పటి వరకు తెలుగు, ఆంగ్లంలోనే అందుబాటులో ఉండగా తాజాగా దాన్ని ఉర్దూలోనూ ప్రారంభించారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్ రెవెన్యూ సమావేశ మందిరంలో కలెక్టర్ రోనాల్డ్ రోస్ 2019 జులై 1న వెబ్సైట్ను ఆవిష్కరించారు. ముస్లింలకు జిల్లా అభివద్ధి సంక్షేమ పథకాల వివరాలు తెలియజేయడానికి వెబ్సైట్ను ఉర్దూలో రూపొందించినట్లు తెలిపారు.
ధాన్యం సేకరణలో తెలంగాణకు 2వ స్థానం
ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో నిలి చింది. 2018-19 సంవత్స రానికి రూ.13,675 కోట్ల విలు వైన 11.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి పౌరసరఫరాల శాఖ కొత్త రికార్డు సష్టించింది. కొనుగోళ్లలో పంజాబ్ అగ్రస్థానంలో ఉంది.
రాష్ట్ర 2 ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు
కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ (ఈఏసీ) తెలంగాణ లో 2 కీలక ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వడా నికి అంగీకరించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై నిర్మిస్తున్న పీవీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి పథకంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగ నదిపై నిర్మిస్తున్న చనాక-కొరాట బరాజ్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కమిటీ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు సిఫారసు చేసింది.
వార్తల్లో వ్యక్తులు
మిస్ ఆస్ట్రేలియాగా భారత సంతతి యువతి
మిస్ ఆస్ట్రేలియా-2019గా భారత సంతతికి చెందిన ప్రియా సెరావో నిలిచింది. ఆస్ట్రేలి యాలోని మెల్బోర్న్ లో 2019 జూన్ 28న జరిగిన అందాల పోటీల్లో 26 ఏళ్ల సెరావో మొత్తం 26 మంది యువతులను వెనక్కినెట్టి మిస్ ఆస్ట్రేలియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆమె ఈ ఏడాదిలో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహించనుంది. ఇక వెస్ట్రన్ ఆస్ట్రేలి యాకు చెందిన బెల్లా కాసింబా, విక్టోరియా మారిజానా రద్మానోవిక్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
డెనాలీ పర్వతాన్ని అధిరోహించిన అపర్ణకుమార్
భారత్-టిబెట్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ) దళం డీఐజీ అపర్ణకుమార్ ఉత్తర అమెరికాలోని డెనాలీ పర్వ తాన్ని విజయవంతంగా అధిరోహిం చారు. దీంతో తన 'మిషన్ డెనాలీ, ఏడు శిఖరా గ్రాలు' లక్ష్యాన్ని పూర్తి చేసినట్లయ్యింది. ఈ అరుదైన ఘనత అందుకున్న తొలి సివిల్ సర్వెంట్, ఐపీఎస్ అధికారి అపర్ణకుమార్. అపర్ణ ప్రస్తుతం డెహ్రాడూన్లో పని చేస్తున్నారు.
ఈసీబీ అధ్యక్షురాలిగా క్రిస్టిన్ లగార్డే
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) అధ్యక్షురాలిగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిన్ లగార్డే ఎంపికయ్యారు. 2019 నవంబరు 1 నుంచి ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. క్రిస్టిన్ 2011 జులై 5న ఐఎంఎఫ్ 11వ ఎండీగా నియమితుల య్యారు. ఇలాంటి కీలక స్థానంలో ఒక మహిళ ఎంపిక కావడం అదే తొలిసారి. ఇప్పుడు ఈసీబీ అధ్యక్షురాలిగా మారియో డ్రాగి స్థానంలో నియమితులయ్యారు. ఆయన 8 ఏళ్ల పదవీ కాలం 2019 అక్టోబరు 31న ముగియనుంది.
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా విశ్వనాథన్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్గా ఎన్ఎస్ విశ్వనాథన్ పునర్నియ మితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2019 జూలై 1న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఉన్న విశ్వనాథన్ పదవీ కాలం జూలై 3తో ముగియనుంది. దీంతో ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. ప్రస్తుతం విశ్వనాథన్తో పాటు బీపీ కానుంగో, ఎంకే జైన్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లుగా వ్యవహరిస్తున్నారు. విరాల్ ఆచార్య ఇటీవలే తన డిప్యూటీ గవర్నర్ పదవికి రాజీనామా చేశాడు.
ఎయిర్ వైస్మార్షల్గా జొన్నలగడ్డ రాజేంద్ర
బెంగళూరులోని భారతీయ వైమానిక దళం, ట్రైనింగ్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో ఎయిర్ వైస్మార్షల్గా జొన్నలగడ్డ రాజేంద్ర నియమితులయ్యారు. వి.పి.ఎస్.రాణా నుంచి 2019 జూలై 1న ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాజేంద్ర గతంలో తమిళనాడులోని అవడి ఎయిర్ఫోర్స్ స్టేషన్కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్గా వ్యవహరించారు.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఈఓగా కర్ణం శేఖర్
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కర్ణం శేఖర్ నియమితుల య్యారు. 2019 ఏప్రిల్లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, హోల్ టైమ్ డెరైక్టర్ హోదాలో బ్యాంకులో చేరిన శేఖర్ను సీఈఓగా నియమిం చినట్లు ఐఓబీ 2019 జూలై 1న ప్రకటించింది. ఆర్.సుబ్రమ ణికుమార్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
ఏపీఎన్ చైర్మన్గా ఎస్.రఘుపతి
వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్-ఏసియా పసిఫిక్ నెట్వర్క్ (ఏపీఎన్) చైర్మన్గా భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) డిప్యూటీ డెరైక్టర్గా పనిచేస్తున్న ఎస్.రఘుపతి రెండోసారి ఎంపికయ్యారు. దీంతో 2023, జూన్ 30 వరకు ఎపీఎన్ చైర్మన్గా ఆయన కొనసాగనున్నారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్కు ఇన్ఛార్జిగా కూడా రఘుపతి వ్యవహరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా హరిత భవనాలను ప్రోత్సహించే లక్ష్యంతో పని చేస్తున్న ఏపీఎన్లో 15 దేశాలకు పైగా సభ్యత్వం ఉంది.
బీహెచ్ఈఎల్ సీఎండీగా నలిన్ షింగల్
ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ సంస్థ బీహెచ్ఈఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్గా నలిన్ షింగల్ నియమితులయ్యారు. 2019 జూలై 1 నుంచి ఐదేళ్లు నలిన్ పదవీకాలం ఉండనుందని కంపెనీ ప్రకటించింది. ఉద్యోగ విరమణ, తదుపరి ఆదేశాలకు లోబడి పదవీకాలం ఉంటుందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో వివరించింది.
ఇస్టా ఉపాధ్యక్షుడిగా డాక్టర్ కేశవులు
అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమా ణాల సంస్థ (ఇస్టా) ఉపాధ్యక్షుడిగా తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డెరైక్టర్ డాక్టర్ కె.కేశవులు ఎన్నిక య్యారు. ఇస్టా కార్యనిర్వాహక కమిటీ ఎన్నిక 2019 జూలై 2న ఏకగ్రీవంగా జరిగింది. 1924లో ఏర్పాటైన ఇస్టాలో భారతదేశానికి ఉపాధ్యక్ష పదవి లభించడం ఇదే మొదటిసారి. ఇస్టా సంస్థ ఉపాధ్యక్షుడిగా 2019-22 వరకు కేశవులు కొనసాగుతారు. సంస్థ నిబంధనల ప్రకారం ఇస్టా ఉపాధ్యక్షుడే తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల అవసరాలకు అనుగుణంగా విత్తన చట్టాలను, పాలసీలను, మార్కెట్లో విత్తన నాణ్యత, నియంత్రణ, సరఫరా మొదలగు అంశాలన్నింటిలో తీసుకునే కీలక నిర్ణయాలలో ఇస్టా ప్రధానపాత్ర పోషిస్తోంది.
యునెస్కో ఓషనోగ్రఫిక్ కమిషన్ వైస్ చైర్మన్గా సతీష్
యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్ వైస్చైర్మన్ (గ్రూప్-4)గా ఇన్కాయిస్ (ది ఇండియన్ నేషనల్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) డెరైక్టర్ డా.సతీష్ షెహ్నాయి ఎంపికయ్యారు. దీంతో 2019-21 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ గ్రూప్-4 సమూహంలో ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, ఇరాన్, జపాన్, పాకిస్థాన్, ఫిలిప్పైన్స్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, థాయిలాండ్ తదితర దేశాలు ఉన్నాయి.
పారిశ్రామికవేత్త బీకే బిర్లా మృతి
ప్రముఖ పారిశ్రామిక వేత్త, బిర్లా గ్రూప్ వ్యవస్థాపకుడు బసంత్ కుమార్ బిర్లా(98) 2019 జులై 3న ముంబైలో మృతి చెందారు. భారత పారిశ్రామిక రంగానికి పునాదులు వేసిన దిగ్గజాల్లో ఒకరిగా పేర్కొనే బిర్లా తన 15వ సంవత్సరం నుంచీ వ్యాపార కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. సెంచురీ టెక్స్టైల్స్ అండ్ ఇండిస్టీస్కు, కేశోరామ్ ఇండిస్టీస్కు చైర్మన్గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.
అవార్డులు
జర్నలిస్ట్ మార్క్ టులీకి లైఫ్టైమ్ అవార్డు
బ్రిటీష్ సీనియర్ జర్నలిస్ట్ సర్ మార్క్ టులీకి యానువల్ యూకే-ఇండియా అవార్డ్స్లో లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. భారత్, బ్రిటన్ల మధ్య సంబంధాలు పెంపొందించి నందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. టులీ గతంలో బీబీసీ బ్యూరో చీఫ్గా ఢిల్లీలో ఉన్నారు. ఎలిజబెత్ 2 మహారాణితో నైట్ బిరుదును, భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ను కూడా ఆయన అందుకున్నారు. మరోవైపు సోషల్ ఇంపాక్ట్ విభాగంలో బ్రిటిష్ టెలికాం, భారత హాస్పిటాలిటీ విభాగంలో ఓయో కంపెనీలు అవార్డులను పొందాయి. భారత, బ్రిటీష్ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు కునాల్ నయ్యర్ గ్లోబల్ ఇండియన్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్గా నిలిచారు. అలాగే భారత సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహకారం అందించిన టెక్నాలజీ 'మాంచ్' బెస్ట్ స్టార్టప్గా నిలించింది.
సుహేమ్ షేక్కు ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు
మధ్యతరగతి, వెనుకబడిన వర్గాలకు చెందిన పలువురు క్రీడాకారులను జాతీయ స్థాయి సెయిలర్లుగా తీర్చిదిద్దిన కోచ్ సుహేమ్ షేక్కు 'ప్రైడ్ ఆఫ్ తెలంగాణ' అవార్డు లభించింది. 2019 జూన్ 29న హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ఈ అవార్డును ప్రదానం చేసింది. అంతర్జాతీయ స్థాయి సెయిలర్ అయిన షేక్ ఆధ్వర్యంలో పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారు.
పుల్లెల గోపీచంద్కు గౌరవ డాక్టరేట్
భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఐఐటీ కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. 2019 జూన్ 28న ఐఐటీ కాన్పూర్ 52వ స్నాతకోత్సవంలో గోపీచంద్కు ఇస్రో పూర్వ చైర్మన్, ఐఐటీ కాన్పూర్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ చైర్మన్ అయిన ప్రొఫెసర్ కె.రాధాకష్ణన్ రజత ఫలకం, ఐఐటీ డెరైక్టర్ ప్రొఫెసర్ అభరు కరన్దికర్ డాక్టరేట్ ధ్రువపత్రాన్ని ప్రదానం చేశారు.
దక్షిణ మధ్య రైల్వేకు 4 అవార్డులు
2018-19 సంవత్సరానికి గాను దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. ట్రాఫిక్ ట్రాన్స్ పోర్టేషన్, పర్సనల్ మేనేజ్మెంట్, సివిల్ ఇంజనీరింగ్, స్టోర్స్ విభాగాల్లో ఈ అవార్డులు దక్కాయి. దక్షిణ మధ్య రైల్వే జీఎంగా ప్రస్తుతం గజానన్ మాల్యా ఉన్నారు.
బ్రయాన్ లారాకు పాటిల్ వర్శిటీ డాక్టరేట్
వెస్టిండీస్కి చెందిన క్రికెట్ క్రీడాకా రుడు బ్రయాన్ లారాకు ముంబైలోని డీవై పాటిల్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. 2019 జూలై 4న జరిగిన ఈ కార్యక్రమంలో లారా డాక్టరే ట్ను అందుకున్నాడు. ఈ సందర్భంగా లారా మాట్లాడుతూ.. ఏ ఫార్మాట్లో చూసినా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లికి మిగతా బ్యాట్స్ మెన్కు మధ్య చాలా అంతరం ఉందని అన్నాడు. తన ఆల్ టైం ఫేవరెట్ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ అని చెప్పాడు.
సైన్స్ AND టెక్నాలజి
చైనా జేఎల్-3 ఖండాంతర క్షిపణి ప్రయోగం
అత్యంత అధునాతనమైన జలాంత ర్గామి నుంచి ప్రయో గించే జేఎల్-3 ఖండాంతర క్షిపణి(ఎస్ఎల్బీ ఎం)ని 2019 జూన్ 2న విజయ వంతంగా పరీక్షించినట్లు చైనా జాతీయ రక్షణ మంత్రిత్వశాఖ జూన్ 28న వెల్లడించింది. 14 వేల కి.మీ.ల దూరం ప్రయాణిం చగల ఈ క్షిపణి, ఒకేసారి పది స్వతంత్ర లక్షిత అణ్వాయుధాలను మోసుకుపోగలదు.
క్రీడలు
ఎన్సీఏ హెడ్గా రాహుల్ ద్రవిడ్
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్గా భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరిం చనున్నాడు. ఎన్సీఏ హెడ్గా జూలై 1న భాధ్యతలు స్వీకరించిన ద్రవిడ్ తన విధుల్లో భాగంగా యువ క్రికెటర్లకు మార్గనిర్దే శనం చేస్తాడు. జూనియర్ క్రికెట్ మ్యాచ్ను రూపొందిం చడంతో పాటు మహిళా క్రికెటర్లను తీర్చిదిద్దడం కూడా అతని విధుల్లో భాగంగా ఉంటాయి. ద్రవిడ్ ఇప్పటికే భారత 'ఎ', అండర్-19 టీమ్లకు కోచ్గా పని చేస్తున్నాడు.
క్రికెట్కు అంబటి రాయుడు వీడ్కోలు
భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. క్రికెట్లోని అన్ని ఫార్మా ట్లు, అన్ని స్థాయిలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు 2019 జూలై 3న బీసీసీఐకి లేఖ ద్వారా తెలియ జేశాడు. 2013 జులై 24న ఇండియా-జింబాబ్వే మధ్య జరిగిన వన్డేతో రాయుడు అరంగేట్రం చేశాడు. తన కెరియర్లో 55 వన్డేలు ఆడిన రాయుడు 1,694 పరుగులు చేశాడు. చివరిగా ఐపీఎల్ -2019లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున 1 మ్యాచులు ఆడిన రాయుడు 282 పరుగులు చేశాడు.
Authorization