1. తెలంగాణలో అనపోత సముద్రం, రాయ సముద్రం, నాగ సముద్రం అనే చెరువులను ఎవరి కాలంలో తవ్వించారు?
ఎ) రేచర్ల పద్మనాయకులు బి) కాకతీయులు
సి) రెడ్డిరాజులు డి) విజయనగర రాజులు
2. నీటి పారుదల సౌకర్యార్థ్యం 'సంతాన సాగరం' అనే పెద్ద తటాకం, జగనొబ్బగండ కాల్వలను ఎవరు నిర్మించారు?
ఎ) కాకతీయులు బి) విజయనగర రాజులు
సి) కుతుబ్షాహీలు డి) రెడ్డిరాజులు
3. 'సర్వమాన్యములు' అంటే ఏమిటి?
ఎ) రాచభూములు బి) పన్నులు లేని భూములు
సి) దేవాలయ భూములు డి) సామంతుల భూములు
4. 'మాచల్దేవి' ఏ తెలుగు సాహిత్య గ్రంథంలోని పాత్ర?
ఎ) భాగవతం బి) క్రీడాభిరామం
సి) రంగనాథ రామాయణం డి) హరివంశం
5. 'జైమినీ భారతం' గ్రంథకర్త ఎవరు?
ఎ) తిక్కన బి) ఎర్రాప్రెగడ
సి) శ్రీనాథుడు
డి) పిల్లలమర్రి పినవీరభద్రుడు
6. దేశీయ - విదేశీయ వర్తకుల సంరక్షణార్థం క్రీ.శ. 1358 లో మోటుపల్లి రేవు అభయ శాసనాన్ని సంస్కరించిన రెడ్డి రాజు ఎవరు?
ఎ) కుమారగిరి రెడ్డి బి) అనపోతారెడ్డి
సి) పెదకోమటి వేమారెడ్డి డి) కాటయ వేమారెడ్డి
7. కాకతీయ తోరణాన్ని తెలంగాణ రాష్ట్ర అధికారక చిహ్నం గా ఎంచుకున్నారు. ఓరుగల్లులోని స్వయం భూ దేవాలయానికి నాలుగు వైపులా రాతితో ఈ తోరణాలను ఏ కాకతీయ రాజు నిర్మించాడు?
ఎ) రెండో ప్రోలరాజు బి) ప్రతాపరుద్రుడు
సి) గణపతిదేవుడు డి) మహాదేవుడు
8. 'ఆంధ్రదేశాధీశ్వరుడు'గా ఖ్యాతిగాంచిన కాకతీయ రాజు ఎవరు?
ఎ) ప్రతాపరుద్రుడు బి) రుద్రమదేవి
సి) ప్రోలరాజు డి) గణపతి దేవుడు
9. 'రంగనాథ రామాయణం' ఎవరు రచించారు?
ఎ) పోతన బి) శ్రీనాథుడు
సి) పండితారాధ్యుడు డి) గోనబుద్ధారెడ్డి
10. 'అవక్రవిక్రయ యశస్య సంభావ్య భాహర్గలుడు' అనే బిరుదు ఎవరికి ఉంది?
ఎ) మసునూరి ప్రోలయనాయకుడు
బి) మసునూరి కాపయనాయకుడు
సి) మసునూరి పోచయనాయకుడు
డి) మసునూరి దేవయనాయకుడు
11. కింది వాటిలో భిన్నమైనది?
ఎ) క్షీరారామం బి) ద్రాక్షారామం
సి) కాళేశ్వరం డి) శ్రీశైలం
12. శత్రువుల రక్తాన్ని శరీరమంతా పూసుకునే పూజా విధాన మైన 'రణము కుడుపు' అనే భైరవ తాంత్రిక పద్ధతిని ఏ రాజవంశం ఆచరించింది?
ఎ) రేచర్ల పద్మనాయకులు బి) రెడ్డిరాజులు
సి) కాకతీయులు డి) విజయనగర రాజులు
13. 'గజసాహిణీ' అనే బిరుదు ఎవరికి కలదు?
ఎ) విద్యానాథుడు బి) రుద్రమదేవి
సి) జాయపసేనాని డి) గణపతిదేవుడు
14. 'ప్రతాపరుద్ర యశోభూషణం' రచయిత ఎవరు?
ఎ) శ్రీనాథుడు బి) విద్యానాథుడు
సి) పోతన డి) అచితేంద్రుడు
15. 'చమత్కార చంద్రిక' రచయిత ఎవరు?
ఎ) బొమ్మకంటి అప్పయామాత్యుడు
బి) శ్రీనాథుడు
సి) పోతన డి) విశ్వేశ్వరుడు
16. 'కాకతీయ రాజ్యస్థాపనాచార్య' అనే బిరుదు ఉన్న రేచర్ల నాయకుడు ఎవరు?
ఎ) రేచర్ల రుద్రుడు బి) రేచర్ల ప్రసాదిత్యుడు
సి) బేతాళరెడ్డి డి) సింగమనేడు
17. 'సర్వజ్ఞ' అనే బిరుదున్న రేచర్ల పద్మ నాయకుడెవరు?
ఎ) అనపోతనాయకుడు బి) మాదానాయకుడు
సి) కుమారసింగభూపాలుడు డి) దాచానాయకుడు
18. రెడ్డి - వెలమ రాజుల మధ్య అనుసంధానకర్తగా ఎవరు వ్యవహరించారు?
ఎ) పోతనామాత్యుడు బి) గౌరన
సి) కొరవి గోపరాజు డి) శ్రీనాథుడు
19. హన్మకొండలో పద్మాక్షి, సిద్ధేశ్వరాలయాలను నిర్మించిన కాకతీయ రాజెవరు?
ఎ) గణపతిదేవుడు బి) ప్రోలరాజు
సి) మహాదేవుడు డి) రుద్రమదేవి
20. తెలంగాణలో భారీ నీటి పారుదల సౌకర్యాల కల్పన చేపట్టిన తొలి రాజవంశం?
ఎ) కుతుబ్షాహీలు బి) విజయనగర రాజులు
సి) కాకతీయులు డి) రేచర్ల పద్మనాయకులు
21. పురిటి సుంకం, పొయ్యిలపై పన్ను విధించిన రెడ్డి రాజు ఎవరు?
ఎ) పెదకోమటి వేమారెడ్డి బి) సింగభూపాలుడు
సి) రాచవేమారెడ్డి డి) కుమారగిరిరెడ్డి
22. 'కైఫీయతులు' అంటే ఏమిటి?
ఎ) స్థానిక చరిత్రులు బి) రాజవంశ చరిత్రులు
సి) పొగడ్తలు డి) నాణేలు
23. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వ శీయం, మాళవికాగ్నిమిత్రం నాటకాలపై 'కుమారగిరి రాజీయం' పేరుతో సంస్కృతంలో వ్యాఖ్యానం రాసిన రెడ్డిరాజు ఎవరు?
ఎ) పెదకోమటి వేమారెడ్డి బి) కుమారగిరిరెడ్డి
సి) రాచవేమారెడ్డి డి) కాటయవేమారెడ్డి
24. శ్రీశైలంలో 'వీర శిరోమండపం' నిర్మించిన రెడ్డిరాజు ఎవరు?
ఎ) రాచవేమారెడ్డి బి) కుమారగిరి రెడ్డి
సి) అనవేమారెడ్డి డి) పెదకోమటి వేమారెడ్డి
25. అహోబిలం, శ్రీశైలం పాతాళ గంగకు సోపానాలు నిర్మించిన రెడ్డి రాజు?
ఎ) అనపోతారెడ్డి బి) పెదకోమటి వేమారెడ్డి
సి) ప్రోలయవేమారెడ్డి డి) రాచవేమారెడ్డి
26. ముసునూరి కాపయనాయకునికి 'అరుమనగంటి పురవరాధీశ్వరుడు' (ఆమనగల్లు) అనే బిరుదు ఉన్నట్టు ఏ శాసనంలో పేర్కొన్నారు?
ఎ) కలువచేరు శాసనం బి) పిల్లలమర్రి శాసనం
సి) ఆర్యావట శాసనం డి) గణపేశ్వర శాసనం
27. ముసురేరి కాపయనాయకుడు, రేచర్ల అనపోతా నాయకుడి మధ్య క్రీ.శ. 1367 - 68లో భీకర యుద్ధం ఎక్కడ జరిగింది?
ఎ) ఓరుగల్లు బి) భీమవరం
సి) నల్గొండ డి) పానగల్లు
28. రాచకొండ, దేవరకొండ రాజధానులుగా త్రిలింగ దేశాన్ని ఎవరు పాలించారు?
ఎ) కాకతీయులు బి) రేచర్ల పద్మనాయకులు
సి) రెడ్డి రాజులు డి) విజయ నగర రాజులు
29. రేచర్ల వంశ మూలపురుషుడెవరు?
ఎ) రేచర్ల ప్రసాదిత్యుడు బి) రేచర్ల రుద్రుడు
సి) బేతాళరెడ్డి డి) సర్వజ్ఞ సింగభూపాలుడు
30. రేచర్ల పద్మనాయకుల వంశచరిత్రను తెలిపే గ్రంథం ఏది?
ఎ) ప్రతాపరుద్ర చరిత్ర బి) పండితారధ్య చరిత్ర
సి) చమత్కార చంద్రిక డి) వెలుగోటి వారి వంశావళి
31. 'లకుమాదేవి' అనే నాట్యగత్తె ఏ రెడ్డిరాజు కొలువులో ఉండేది?
ఎ) పెదకోమటి వేమారెడ్డి బి) కుమారగిరిరెడ్డి
సి) కాటయ వేమారెడ్డి డి) రాచ వేమారెడ్డి
32. 'వేమభూపాల చరితం' అనే చారిత్రక గ్రంథ రచయిత ఎవరు?
ఎ) వామన భట్టబాణుడు బి) శ్రీనాథుడు
సి) పోతన డి) గౌరన
33. 'సింహాసన ద్వాత్రింశిక' రచయిత ఎవరు?
ఎ) అనంతామాత్యుడు బి) మల్లన
సి) కొరవి గోపరాజు డి) కొమ్మన
34. 'భోగినీ దండకం', 'వీరభద్రవిజయం' గ్రంథాల రచయిత ఎవరు?
ఎ) పోతనామాత్యుడు బి) శ్రీనాథుడు
సి) విశ్వేశ్వర కవి డి) ఎర్రాప్రెగడ
35. రెడ్డిరాజుల కాలంలో 'భూమిని' దేనితో కొలిచేవారు?
ఎ) దారం బి) కేసరపాటి గడ
సి) ఇనుప గొలుసు డి) కాళ్ళ అడుగులు
36. తెలంగాణలో 'నవబ్రహ్మ ఆలయాలు' ఎక్కడ ఉన్నాయి?
ఎ) పానగల్లు బి) వేములవాడ
సి) యాదగిరి గుట్ల డి) అలంపురం
37. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన దేవాలయాలు తెలం గాణలో ఎక్కడ ఉన్నాయి?
ఎ) వేములవాడ బి) ఓరుగల్లు
సి) అలంపురం డి) పిల్లలమర్రి
38. కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) నన్నెచోడుడు - కుమార సంభవం
బి) సోమనాథుడు - పండితారాధ్య చరిత్ర
సి) వేములవాడ భీమకవి - బసవపురాణం
డి) మల్లిఖార్జున పండితారాధ్యుడు - శివతత్త్వసారం
39. 1182లో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగా ముడికి సహాయంగా పల్నాడుకు సైన్యాన్ని పంపిన కాకతీయ చక్రవర్తి ఎవరు?
ఎ) రుద్రమదేవి బి) ప్రతాపరుద్రుడు
సి) రుద్రదేవుడు డి) గణపతిదేవుడు
40. 'ఆంధ్ర సురత్రాణ' అనేది ఎవరి సుప్రసిద్ధ బిరుదు?
ఎ) ప్రోలయనాయకుడు బి) అనవేమారెడ్డి
సి) కాపయనాయకుడు డి) గన్నయ
41. రాజుకు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ అవసరాల కోసం 'నాయంకర సైన్యం' అనే వ్యవస్థను రూపొందించిన రాజ్యం ఏది?
ఎ) విజయ నగర రాజులు బి) చాళుక్యులు
సి) శాతవాహనులు డి) కాకతీయులు
42. సంస్కృతంలో 'సంగీత చింతామణి' గ్రంథాన్ని రాసిన రెడ్డిరాజు ఎవరు?
ఎ) పెదకోమటి వేమారెడ్డి బి) రాచవేమారెడ్డి
సి) కాటయ వేమారెడ్డి డి) కుమారగిరి రెడ్డి
43. రేచర్ల వెలమలు ఎక్కువగా ఆదరించిన మతం ఏది?
ఎ) శైవం బి) వైష్ణవం
సి) బౌద్ధం డి) క్రైస్తవం
44. రెడ్డి రాజుల ప్రధాన మతం ఏది?
ఎ) శైవం బి) వైష్ణవం
సి) బౌద్ధం డి) క్రైస్తవం
45. పల్నాడు, వినుకొండ సీమల్లో 'రంభయైన ఏకులు వడుకున్'అని వర్ణించిన కవి?
ఎ) పోతనామాత్యుడు బి) పాల్కురికి సోమనాథుడు
సి) శ్రీనాథమహాకవి డి) డిండిమభట్టు
46. 'కర్పూర వసంతరాయుడు' అనే బిరుదు ఉన్న రెడ్డిరాజు ఎవరు?
ఎ) అనవేమారెడ్డి బి) కొమరగిరి (కుమారగిరి)రెడ్డి
సి) ప్రోలయవేమారెడ్డి డి) పెదకోమటి వేమారెడ్డి
47. సంస్కృతంలో 'సాహిత్య చింతామణి', 'సంగీత చింతామణి' రాసిన రెడ్డిరాజు?
ఎ) పెదకోమటి వేమారెడ్డి బి) రాచవేమారెడ్డి
సి) ప్రోలయ వేమారెడ్డి డి) కాటయ వేమారెడ్డి
48. రెడ్డిరాజుల కాలంలో విదేశాలతో నౌకా వ్యాపారాన్ని నిర్వహించినవారు?
ఎ) వామన భట్టబాణుడు బి) వెన్నెలకంటి సూరన
సి) అవచి తిప్పయశెట్టి డి) శ్రీనాథుడు
49. రెడ్డిరాజుల కులదేవత పేరేమిటి?
ఎ) విద్యాదేవి బి) మూలగూరమ్మ
సి) కాకతీ డి) దుర్గాదేవి
50. శ్రీనాథ మహాకవి ఏ రెడ్డిరాజుతో ఆస్థానంలో 'విద్యాధికారి'గా పనిచేశాడు?
ఎ) ప్రోలయవేమారెడ్డి బి) పెదకోమటి వేమారెడ్డి
సి) రాచవేమారెడ్డి డి) కాటయ వేమారెడ్డి
51. ఎర్రాప్రెగడ ఎవరి ఆస్థానంలో విద్యాధికారి?
ఎ) అల్లాడరెడ్డి బి) అనవేమారెడ్డి
సి) ప్రోలయవేమారెడ్డి డి) అనవోతారెడ్డి
సమాధానాలు
1.ఎ 2.డి 3.బి 4.బి 5.డి
6.బి 7.సి 8.డి 9.డి 10.ఎ
11.ఎ 12.ఎ 13.సి 14.బి 15.డి
16.బి 17.సి 18.డి 19.బి 20.సి
21.సి 22.ఎ 23.డి 24.సి 25.సి
26.డి 27.బి 28.బి 29.సి 30.డి
31.బి 32.ఎ 33.సి 34.ఎ 35.బి
36.డి 37.సి 38.సి 39.సి 40.సి
41.డి 42.ఎ 43.బి 44.ఎ 45.సి
46.బి 47.ఎ 48.సి 49.బి 50.బి
51.సి