1. 2019 - 20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, ఎంఎస్ ఎంఈల లో ఉత్సాహం పెంచడానికి కార్పొరేట్ టాక్స్ రేట్ 25 శాతంను తగ్గించారు, ఎంత వరకు వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థలకు వర్తిస్తుంది?
ఎ) రూ.400 కోట్ల లోపు బి) రూ.500 కోట్ల లోపు
సి) రూ.600 కోట్ల లోపు డి) ఇవేవీకాదు
2. డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించేందుకు ఉన్న పద్ధతులు ఏవి?
ఎ) భీమ్ యూపీఐ
బి) యూపీఐ - క్యూఆర్ కోడ్
సి) ఆధార్పే, కొన్ని డిబెట్ కార్డులు, నెఫ్ట్, ఆర్టీజీఎస్
డి) పైవన్నీ
3. 2019 - 20 కేంద్ర బడ్జెట్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం ఎంతగా తెలిపారు?
ఎ) 1.05 బి) 2.0 సి) 3.0 డి) 4.0
4. 2019 - 20 కేంద్ర బడ్జెట్లో ద్రవ్యలోటు లక్ష్యం, జీడీపీలో ఎంత?
ఎ) 2.3 శాతం బి) 3.3 శాతం
సి) 1.3 శాతం డి) 0.5 శాతం
5. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా ఏ సబ్సిడీలకు ధనం ఖర్చు అవుతోంది?
ఎ) ఆహారం బి) ఎరువులు
సి) పెట్రోలియం డి) పైవన్నీ
6. మువత్తుపుజా వాలీ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ నీరు వాడేందుకు చేపట్టారు?
ఎ) ఇడుక్కిహైడల్ ప్రాజెక్టు టెయిర్ రేస్ వాటర్
బి) మెట్టూర్ డ్యాం
సి) శ్రీశైలం డ్యాం డి) పోలవరం
7. ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్?
ఎ) ఆర్టికల్ 371 : స్పెషల్ ప్రోవిజన్స్ : మహారాష్ట్ర, గుజరాత్
బి) ఆర్టికల్ 371 ఎ : స్పెషల్ ప్రోవిజన్స్ : నాగాలాండ్
సి) ఆర్టికల్ 370 : స్పెషల్ ప్రోవిజన్స్ : జమ్ముకశ్మీర్
డి) పైవన్నీ
8. అక్టోబర్ 26, 1947న ఆనాటి జమ్మూకాశ్మీర్ పాల కుడు మహారాజ హరిసింగ్, 'ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్' మీద సంతకం చేశారు. దీని ద్వారా ఏ అంశాలపై అధికారాన్ని భారత ప్రభుత్వానికి ఇస్తున్నట్టు ఆయన ఆమోదం తెలిపారు?
ఎ) డిఫెన్సు బి) ఫారిన్ అఫైర్స్
సి) కమ్యూనికేషన్స్ డి) పైవన్నీ
9. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ఒక రాజ్యాంగాన్ని రూపొం దించడానికి, 75 మంది సభ్యులున్న కాన్స్టిట్యూ యెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేస్తూ, ఆ రాష్ట్రపు డాక్టర్ సింగ్ ఎప్పుడు ఒక ప్రోక్లమేషన్ జారీ చేశారు?
ఎ) 1951 బి) 1956 సి) 1950 డి) 1961
10. త్వరలో ప్రారంభించే 'ఒక దేశం, ఒక రేషన్ కార్డు' పద్ధతి వల్ల ఎవరికి ఎక్కువగా లాభం ఉంటుంది? ఇతర వివరాలు ఏవి?
ఎ) పని కోసం వలసపోయే పేద కార్మికులు
బి) భారతదేశంలో 85 శాతం మంది ఎన్ఎఫ్ఎస్ఏ కిందకి వచ్చారు
సి) రేషన్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేస్తారు
డి) పైవన్నీ
11. సమంత కుమార్ గోయెల్ని ఇటీవల దేనిలో అత్యంత పదవిలో నియమించారు?
ఎ) ఆర్ఏడబ్ల్యూ(రా) బి) సీబీఐ
సి) ఏసీబీ డి) సీఆర్పీఎఫ్
12. కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో కొత్త అధిపతి ఎవరు?
ఎ) అరవింద్ కుమార్ బి) రాజీవ్జైన్
సి) ఎ.కె.ధాస్మాన్ డి) ఎవరూకాదు
13. 2019 - 20 కేంద్ర బడ్జెట్లో, భారత దేశ ఆర్థికాభివృద్ధిలో ఏవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ప్రముఖంగా ప్రస్తావించారు?
ఎ) ఎన్బీఎఫ్సీలు
బి) చిన్న సిమెంట్ కర్మాగారాలు
సి) భారజల కర్మాగారాలు డి) బీటీ విత్తన సంస్థలు
14. 2019 - 20 కేంద్ర బడ్జెట్లో తెలిపినట్లు, సీబీడీటీ డేటా ప్రకారం, భారతదేశంలో 42 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయి. అందులో ఎన్ని 'ఆధార్'తో లింక్ అయ్యాయి?
ఎ) సుమారు 23 కోట్లు బి) 10 కోట్లు
సి) 5 కోట్లు డి) 2 కోట్లు
15. 2024 - 25 నాటికి భారత దేశ ఆర్థిక వ్యవస్థ సైజు 5 ట్రిలియన్ డాలర్లలకు చేరడానికి, వేటిని 2019 - 20 కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించారు?
ఎ) గ్లోబల్ ఇన్వెస్టర్లను చేరుకోవడం (సావరిన్ బాండ్లను విడుదల చేయడం ద్వారా)
బి) ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, డిఫెన్స్ పరిశ్రమలు మొదలైన వాటి ద్వారా 'మేక్ ఇన్ ఇండియా'పైదృష్టి కేంద్రీకరించడం
సి) విద్యుచ్ఛక్తితో నడిచే కార్లు, ఎలక్ట్రానిక్స్ వంటి పరిశ్రమల ఏర్పాటుకు గ్లోబల్ పెట్టుబడి దార్లను ఆహ్వానించడం, బ్యాంకులలోఎన్పీఏ ల భారం తగ్గించడం కోసం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు రూ.70 వేల కోట్లు ఇవ్వడం
డి) పైవన్నీ
16. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ బిల్లు 2019 ప్రకారం ఒక యూనిట్ని సెజ్లో కొత్తగా ప్రారంభిచడానికి ఎవరు అర్హులు?
ఎ) ట్రస్ట్ లేదా కేంద్ర ప్రభుత్వం తెలిపిన, గుర్తింపు ఉన్న ఎవరైనా బి) కాందిశీకులు
సి) మైనర్లు డి) ఎవరు కాదు
17. ఆధునిక కర్ణాటక రాష్ట్ర నిర్మాత అని ఎవర్ని అంటారు?
ఎ) ఎస్.నిజలింగప్ప బి) కెంగల్ హనుమంతయ్య
సి) కె.మంజప్ప డి) బీ.డీ.శెట్టి
18. 'తారిం బేసిన్' ఎక్కడ ఉంది?
ఎ) తాక్లామకాన్ ఎడారి, కున్లున్ తీన్షాన్, షామీర్ పర్వతాల దగ్గర (చైనా దేశంలో)
బి) శ్రీలంక సి) మయన్మార్ డి) థాయిలాండ్
19. జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల ట్రస్ట్లో ఎవరెవరు ఉంటారు?
ఎ) భారత ప్రధాన మంత్రి
బి) కల్చరల్ మినిస్టర్
సి) లోక్సభలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు
డి) పైవారందరూ
20. గ్రీసుదేశ నూతన ప్రధాన మంత్రి ఎవరు?
ఎ) కిరియా కోస్ మిట్సో టాకిస్
బి) బెంజామిన్ నెటన్యాహూ
సి) థెరెసా మే డి) మైత్రిపాల సిరిసేన
21. 'ఉత్కర్ష్ - 2022' ఏమిటి?
ఎ) ఆర్బీఐ 3 సంవత్సరాల రోడ్ మ్యాప్. దీనిలో మీడియం టర్మ లక్ష్యాలను సాధించడానికి సూచనలు కలవు బి) ఇదొక యంత్రం
సి) 5 సంవత్సరాల ప్లాన్ డి) పైవేవీకాదు
22. జపాన్ దేశంలో ఉన్న అతి పెద్ద దీవి ఏది?
ఎ) కామ్లే దీవి బి) హోన్ షూ దీవి
సి) ఓకుషురా దీవి డి) యాషిగిరి దీవి
23. జీ-20 దేశాల సమావేశం 2019లో ఎక్కడ నిర్వహించారు?
ఎ) ఒసాకా, జపాన్ బి) కెనడా
సి) బ్రెజిల్ డి) చైనా
24. గాస్టన్ బ్రౌన్ఏ దేశ ప్రధాన మంత్రి?
ఎ) అంటిగ్యువా బి) గ్రీసు
సి) బ్రెజిల్ డి) అర్జెంటీనా
25. నీతి అయోగ్ 2017 - 18 కి తయారు చేసిన 'కం పోజిట్ హెల్త్ ఇండెక్స్'లో ఏ రాష్ట్రానికి అత్యధిక స్కోర్ లభించింది?
ఎ) మహారాష్ట్ర బి) కేరళ సి) బీహార్ డి) ఒడిశా
26. ఎంఎస్ఎంఈల కోసం యూకే సిన్హా కమిటీ ఎంత మొత్తంలో స్ట్రెస్డ్ ఎస్సెట్ ఫండ్ని ప్రతిపాదించింది ఎవరు?
ఎ) 5,000 బి) 2,000 సి) 1,000 డి) 500
27. 2021 - 22లో యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్-పెర్మనెంట్ సీట్ కోసం భారతదేశాన్ని 55 దేశాలున్న ఆసియా - పసిఫిక్ గ్రూప్ సపోర్ట్ చేసింది. గతంలో భారతదేశం ఎప్పుడు నాన్ - పెర్మనెంట్ మెంబర్ సీట్లో పనిచేసింది?
ఎ) 1950 - 51, 1967 - 68
బి) 1972 - 73, 1977 - 78, 1984 - 85
సి) 1991 - 92, 2011 - 12 డి) పైవన్నీ
28. జలశక్తి అభియాన్ వివరావేవి?
ఎ) జూలై 1, 2019 నుంచి సుమారు 255 జిల్లాల్లో నీటిని పొదుపు చేఐసే పనులు ప్రారంభిస్తారు
బి) నీటిని పరిరక్షించడం, వర్షపు నీటిని హార్వెస్ట్ చేయడం
సి) వాటర్ బాడీలను నవీనంగా చెయ్యడం
డి) పైవన్నీ
29. మొఘల్ చక్రవర్తి బాబర్ తరచు వెళ్ళిన ఫర్గానా లోయ నగరం 'ఓష్'. సెంట్రల్ ఆసియాకు వెళ్ళే కిర్గిస్తాన్ ద్వారా వెళ్ళొచ్చు. ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్?
ఎ) 'ఇర్కేస్తాన్ పాస్ : కాష్ ఘర్కి పశ్చిమాన ఉంది
బి) 'తోరుగార్ట్ పాస్ : కాష్ ఘర్కి ఈశాన్యాన ఉంది
సి) గతంలో ఖైబర్ పాస్ గుండా అనేక మంది భారత దేశానికి వచ్చారు డి) పైవన్నీ
30. రెడ్ హిల్స్, చెంబరం బాక్కం, చోళవరం, పూండి రిజర్వాయర్లు ఏ నగరానికి ప్రధానంగా మంచి నీటిని సరఫరా చేస్తాయి?
ఎ) బెంగళూరు బి) చెన్నై
సి) కోచిన్ డి) త్రివేండ్రం
31. డా.ఎ.సి.హాన్కిన్స్ పోలీస్ మ్యూజియం, డిస్కవరీ సెంటర్ ఎక్కడ ఉంది?
ఎ) కోల్కతా బి) హైదరాబాద్
సి) భువనేశ్వర్ డి) కటక్
సమాధానాలు
1.ఎ 2.డి 3.ఎ 4.బి 5.డి
6.ఎ 7.డి 8.డి 9.ఎ 10.డి
11.ఎ 12.ఎ 13.ఎ 14.ఎ 15.డి
16.ఎ 17.ఎ 18.ఎ 19.డి 20.ఎ
21.ఎ 22.బి 23.ఎ 24.ఎ 25.బి
26.ఎ 27.డి 28.డి 29.డి 30.బి 31.బి
Authorization