అంతర్జాతీయం
ఎవరెస్ట్ పర్వతంపై ప్లాస్టిక్ నిషేధం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్పై ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ను నిషేధిస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధన 2020, జనవరి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. హిమాలయాల్లో స్వచ్ఛమైన సరస్సులు, ప్రకతి అందాలకు మధ్య కొలువైన ఎవరెస్ట్ను అధిరోహించడానికి ఏటా వేలాది ఔత్సాహికులు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వారు తీసుకెళ్లే ప్లాస్టిక్ కవర్లు, నీళ్ల సీసాలు ఇతర వస్తువులతో ఈ ప్రాంతం ప్లాస్టిక్ దిబ్బగా మారుతోంది. దీన్ని నివారించేందుకు నేపాల్ ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధ నిర్ణయాన్ని తీసుకుంది.
కరాచీ గగనతలం మూసివేత
పాకిస్తాన్లోని కరాచీ మీదుగా వెళ్లే 3 గగనతల దారులను మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఈ మేరకు 2019 ఆగస్టు 28న నోటీస్ టు ఎయిర్మెన్(నోటమ్) జారీ చేసింది. ఈ నిషేధం అన్ని అంతర్జాతీయ విమాన సంస్థలకు వర్తించనుందని పాక్ విమానయాన అధికారులు తెలిపారు. అయితే ఆగస్టు 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు మాత్రమే ఈ నిషేధం అమల్లో ఉంటుంది.
ఇండోనేషియా నూతన రాజధానిగా బోర్నియో ద్వీపం
ఇండోనేషియా నూతన రాజధానిగా బోర్నియో ద్వీపంలోని తూర్పు ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ద్వీపంలోని కాళీమంథన్ ప్రావిన్స్ తూర్పు భాగంలోని అటవీ ప్రాంతంలో 1,80,000 హెక్టార్లలో రాజధానిని అభివద్ధి చేయనున్నట్టు దేశాధ్యక్షుడు జొకో విడోడో 2019 ఆగస్టు 26న ప్రకటించారు.
పాక్ను నిషేధిత జాబితాలో చేర్చిన ఎఫ్ఏటీఎఫ్
ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులకు నిధుల అందజేత, మనీలాండరింగ్పై నిఘా పెట్టే 'ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ఆసియా పసిఫిక్ గ్రూప్' పాకిస్తాన్ను నిషేధిత జాబితాలో చేర్చింది. భారత్లో ఉగ్రదాడులకు కారణమైన సంస్థలకు నిధులు అందకుండా నిలువరించడంలో విఫలమైనందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఆ సంస్థ అధికారులు 2019 ఆగస్టు 23న ప్రకటించారు.
మోడీకి పురస్కారాన్నిచ్చినందుకు యూఏఈ పర్యటన రద్దు చేసుకున్న పాకిస్తాన్ సెనేట్ చైర్మన్
భారత ప్రధాని నరేంద్రమోడీకి యూఏఈ ఆగస్టు 24న అత్యున్నత పురస్కారాన్నిచ్చి సత్కరించినందుకు పాకిస్తాన్ సెనేట్ చైర్మన్ సాదిక్ సంజ్రానీ తన యూఏఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. యూఏఈ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సాదిక్ అక్కడ 28వ తేదీ వరకూ జరిగే పార్లమెంటేరియన్లు, ప్రభుత్వాధికారుల సదస్సుకు హాజరుకావలసి ఉంది.
ప్రపంచంలో అత్యంత సురక్షిత నగరం టోక్యో
ప్రపంచంలోని సురక్షితమైన నగరాలు-2019 జాబితాలో ఆసియా-పసిఫిక్ ప్రాంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాప్-10లో 6 ర్యాంకులను ఈ ప్రాంతంలోని నగరాలే చేజిక్కించుకున్నాయి. జపాన్ రాజధాని టోక్యో వరుసగా మూడోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. సింగపూర్, ఒసాకాలు సైతం తమ పూర్వపు ర్యాంకులను దక్కించు కున్నాయి. 2017లో 23వ స్థానంలో నిలిచిన అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ఈసారి 7వ ర్యాంకును సాధించు కుంది. ముంబై 45వ, ఢిల్లీ 52వ స్థానంలో నిలిచాయి.
జాతీయం
భారత్కు బాల్టిక్ దేశాల మద్దతు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు బాల్టిక్ దేశాలైన లాత్వియా, లిథువేనియా, ఎస్టోనియా దేశాలు పూర్తి మద్దతు ప్రకటించాయి. 5 రోజుల పాటు ఈ దేశాల్లో పర్యటించిన భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఈ దేశాల అధినేతలు ఈ మేరకు హామీ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరు విషయంలోనూ ఈ మూడు దేశాలు భారత్కు మద్దతిచ్చాయి.
అమల్లోకి కనీస వేతనాల చట్టం
జాతీయ స్థాయిలో 50 కోట్ల మందికి కనీస వేతనం అందేలా కేంద్రప్రభత్వం తీసుకొచ్చిన 'వేతనాల చట్టం- 2019' అమల్లోకి వచ్చింది. ఈ మేరకు 2019 ఆగస్టు 23న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ చట్టం ప్రకారం వర్తక సంఘాలు, ఉద్యోగులు, రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో వేతనాలు నిర్ణయమవుతాయి. కనీస వేతనాల చట్టం, వేతన చెల్లింపు చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, సమాన ప్రతిఫలం చట్టం స్థానంలో వేతనాల కోడ్-2019 అమల్లోకి వచ్చింది.
పాఠశాలల కోసం శగున్ వెబ్సైట్
పాఠశాల స్థాయి విద్యను మరింత బలోపేతం చేసేందుకు రూపొందించిన 'శగున్' అనే వెబ్సైట్ (http://seshagun.gov.in/)ను కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ 2019 ఆగస్టు 28న ఢిల్లీలో ప్రారం భించారు. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల పాఠశాలలను అను సంధానం చేశారు. విద్యకు సంబంధించిన సమాచారాన్ని ఈ పోర్టల్ ద్వారా ఆ పాఠశాలలకు అందిస్తారు.
ఆయుర్వేద ఆహారంపై కొత్త విభాగం: FSSAI
ఆయుర్వేదిక్ ఆహారం పేరిట కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసే దిశగా కషి చేస్తున్నట్లు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ FSSAI వెల్లడించింది. ఇందులో ఆయుర్వేద మంత్రిత్వ శాఖ కూడా భాగస్వామ్యం వహిస్తుందని పేర్కొంది.
విమానాల్లో యాపిల్ మ్యాక్బుక్ ప్రో ల్యాప్టాప్ల నిషేధం
యాపిల్ సంస్థ ఉత్పత్తి చేసిన 15-అంగుళాల మ్యాక్బుక్ ప్రో ల్యాప్టాప్లను ప్రయాణికు లెవరూ తమతో పాటు విమానాల్లోకి తీసుకు రావద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కోరింది. ఈ ల్యాప్టాప్ బ్యాటరీలు వేడెక్కుతున్నా యని, వీటి కారణంగా పేలుళ్లు సంభవించ వచ్చని యాపిల్ సంస్థ హెచ్చరించిన క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్లో పేర్కొంది.
రూపాయికే 'సువిధ' శానిటరీ నాప్కిన్
మహిళలకు 'సువిధ' పేరుతో జన్ ఔషధి కేంద్రాల ద్వారా రూ.2.50కి విక్రయిస్తున్న ఒక్కో శానిటరీ నాప్కిన్ను ఇక నుంచి కేవలం రూపాయికే అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో నాలుగు ప్యాడ్లు ఉన్న ప్యాకెట్ ధర 10 రూపాయలుగా ఉండేది. ఇకపై అది కేవలం రూ.4కే లభించ నుంది. కేంద్రం 2019 ఆగస్టు 27 నుంచి పర్యావరణహిత శానిటరీ న్యాప్కిన్లను విడుదల చేస్తోంది. సువిధా బ్రాండ్తో ఉన్న ఈ న్యాప్కిన్లు దేశవ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాలలో లభిస్తాయి.
రూ.1.76 లక్షలకోట్ల బదిలీకి RBI ఆమోదం
కేంద్ర ప్రభుత్వానికి రూ.1,76,051 కోట్ల నిధుల బదిలీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు 2019 ఆగస్టు 26న ఆమోదం తెలిపింది. బిమల్ జలాన్ నేతత్వంలోని ఆ కమిటీ సిఫారసుల మేరకే ఈ నిధుల బదిలీకి ఆమోదం తెలిపారు. RBI గత గవర్నర్ ఉర్జిత్ పటేల్కు, మోడీ ప్రభుత్వానికి మధ్య ఈ నిధుల విషయంలోనే తీవ్ర అభిప్రాయభేదాలు తలెత్తి.. చివరకు ఉర్జిత్ రాజీనామాకూ దారి తీసింది. ఆ తర్వాత ఉర్జిత్ స్థానంలో వచ్చిన శక్తికాంతదాస్ నేతత్వంలోని RBI బోర్డు అదనపు నిధుల విషయంలో సమీక్ష చేయడానికి కమిటీ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది.
మన్మోహన్సింగ్కు ఎస్పీజీ భద్రత ఉపసంహరణ
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీ భద్రతను ఉపసంహరించింది. ఎస్పీజీకి బదులు ఆయనకు సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిస్తూ హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీజీ భద్రత ప్రస్తుతం కేవలం నలుగురు అత్యున్నత రాజకీయ ప్రముఖులైన ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఆమె కుమారుడు రాహుల్గాంధీ, కుమార్తె ప్రియాంకగాంధీ వాద్రాలకు మాత్రమే పరిమితమైంది. మన్మోహన్సింగ్కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుందని హోం శాఖ వెల్లడించింది.
CBSE ఆప్షనల్ సబ్జెక్టుగా 'కత్రిమ మేధ'
మారుతున్న సాంకేతిక పరిస్థితులపై అవగాహన పెంచుకు నేందుకు వీలుగా ఈ విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి నుంచి కేంద్ర మాధ్యమిక విద్యా మండలి CBSE 'కత్రిమ మేధను' ఆప్షనల్ సబ్జెక్టుగా అమలు చేస్తోంది. యోగా, శిశు విద్య అనే వాటిని కూడా ఆప్షనల్స్గా ప్రవేశపెట్టాలని గత మార్చిలో బోర్డు నిర్ణయించింది. 9వ తరగతిలో 'కత్రిమ మేథ'ను తీసుకుంటే 10వ తరగతిలో కూడా దాన్నే ఎంచుకోవాలి. ఆరు సబ్జెక్టులలో ఒక ఆప్షనల్ సబ్జెక్టును తీసుకుంటుంటారు.
సుప్రీంకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు
సుప్రీంకోర్టు న్యాయ మూర్తుల సంఖ్యను 34కి పెంచిన నేపథ్యంలో సర్వో న్నత న్యాయస్థానం కొలీ జియం నలుగురు కొత్త న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. ఈ జాబితాలో గతంలో ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించి, ప్రస్తుతం హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పని చేస్తున్న జస్టిస్ వి.రామ సుబ్రహ్మణియన్తో పాటు, పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కష్ణ మురారి, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రభట్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హషికేష్రారు ఉన్నారు.
ప్రాంతీయం
నీటి వనరుల పునరుద్ధరణలో రాష్ట్రమే ప్రథమం
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం అద్భుతంగా ఉందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో జలవనరుల పునరుద్ధరణ గొప్పగా జరిగిందని, ఈ విషయంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని 2019 ఆగస్టు 23న విడుదల చేసిన 'సమగ్ర నీటి యాజమాన్య సూచిక' నివేదికలో వెల్లడించింది. 2019 సంవత్సరానికి చెందిన నివేదికను కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్కుమార్, సీఈఓ అమితాబ్కాంత్లు విడుదల చేశారు. ఇందులో మిషన్ కాకతీయను ప్రధానంగా ప్రస్తావించారు. దాని వల్ల చెరువుల కింద 51.5 శాతం మేర సాగు పెరిగినట్లు పేర్కొన్నారు.
'వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం'
'వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం' అనే పథకంలో భాగంగా రైతులకు ఇస్తున్న రాయితీలను పెంచా లని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇందుకయ్యే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ ఇచ్చిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
రాష్ట్ర హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయవాదులు తడకమళ్ల వినోద్ కుమార్, అన్నిరెడ్డి అభిషేక్రెడ్డి, కూనూరు లక్ష్మణ్లను న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొలీజియం సిఫార్సు చేసిన వీరి పేర్లను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదిస్తూ 2019 ఆగస్టు 23న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14కు పెరిగింది.
'స్మార్ట్ పోలీసింగ్'కు పురస్కారం
విపత్తు సమయాల్లో అత్యవసరంగా స్పందించే 'డయల్ 100'ని ఫిక్కీ స్పెషల్ జ్యూరీ ఎంపిక చేయడంతో.. తెలంగాణకు ఆ పురస్కారాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో సమర్థంగా అమలు చేస్తున్నందుకు ఈ అవార్డును డీజీపీ మహేందర్రెడ్డి తరఫున టెక్ సర్వీస్ అదనపు డీజీపీ రవిగుప్తా 2019 ఆగస్టు 23న ఢిల్లీలో కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రి జితేంద్రసింగ్ చేతుల మీదుగా అందుకున్నారు.
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ 'టీ-హాజరు' యాప్
రాష్ట్రంలోని పాఠశాలలు, గురుకులాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పక్కాగా నమోదు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'టీ-హాజరు' పేరిట ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, కేజీబీవీ, యూఆర్ఎస్, మోడల్ పాఠ శాలలు, సాధారణ గురుకులాలు, సంక్షేమ పాఠశాలలు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 'హాజరు మాసోత్సవం' సందర్భంగా యాప్ను 2019 ఆగస్టు 23న పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
సంగారెడ్డి జిల్లాకు నాయకత్వ సమన్వయ పురస్కారం
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఉద్దేశించిన పోషణ్ అభియాన్లో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లా, ప్రాజెక్టు, క్షేత్ర స్థాయి సిబ్బందికి 2018-19 సంవత్సరానికి సంబంధించి పురస్కారాలను ఢిల్లీలో కేంద్ర మహిళ, శిశుసంక్షేమశాఖ మంత్రి స్మతిఇరానీ ఆయా జిల్లాల అధికారులకు 2019 ఆగస్టు 23న అందజేశారు.
ములుగుకు ఎఫ్ఓఆర్ఐ క్యాంపస్
దూలపల్లిలో ఉన్న ఫారెస్ట్ కాలేజీ ఆఫ్ రీసెర్చ్ ఇనిస్టి ట్యూట్ (ఎఫ్ఓఆర్ఐ) క్యాంపస్ను గజ్వేల్ నియోజ కవర్గం పరిధిలోని ములుగు కు మార్చాలని 2019 ఆగస్టు 27న హైదరాబాద్లో జరిగిన గవర్నింగ్ బోర్డు మీటింగ్లో నిర్ణయించారు.
హైదరాబాద్లో ఆస్ట్ర రఫేల్ కమ్యూనికేషన్ సిస్టమ్
భారత సైన్యానికి అవసరమైన సాఫ్ట్వేర్ ఆధారిత రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలను తయారు చేయడానికి ఇజ్రాయెల్కు చెందిన రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్, స్థానిక డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్తో జత కలిసింది. దీనికోసం ప్రత్యేకంగా ఆస్ట్ర రఫేల్ కమ్యూనికేషన్ సిస్టమ్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సమీపంలోని రావిర్యాలలో ఉన్న హార్డ్వేర్ పార్క్లో ఏర్పాటైన ఈ యూనిట్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి 2019 ఆగస్టు 27న ప్రారంభించారు. విదేశీ పెట్టుబడుల నిబంధనలకు అనుగుణంగా 51:49 నిష్పత్తిలో ఈ సంస్థ ఏర్పాటైంది.
పెర్ఫార్మెన్స్ ఆడిట్లో తెలంగాణకు 2వ స్థానం
దేశవ్యాప్తంగా 35 బోర్డులు, కమిటీల్లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన 'పెర్ఫార్మెన్స్ ఆడిట్లో 82.12 పాయింట్లు సాధించి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి 2వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 82.83 పాయింట్ల తేడాతో ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల పీసీబీలు, కాలుష్య నియంత్రణ కమిటీల్లో.. పర్యావరణ నాణ్యత పర్యవేక్షణ, ఎన్ఫోర్స్మెంట్, రెగ్యులేటరీ ఫంక్షన్స్, డేటా మేనేజిమెంట్, పబ్లిక్ ఔట్రీచ్, నిర్ణయాలు తీసుకోవడంలో సలహాలు, సూచనలు, పరిశోధన, అభివద్ధి, శిక్షణ అంశాలపై నిపుణుల కమిటీ అధ్యయనం ఆధారంగా సీపీసీబీ ఈ ఆడిట్ను నిర్వహించింది.
వార్తల్లో వ్యక్తులు
తొలి మహిళా ఫ్లైట్ కమాండర్ షలీజా ధామీ
వింగ్ కమాండర్ షలీజా ధామీ భారత వాయుసేనలో ఫ్లయింగ్ యూనిట్ ఫ్లైట్ కమాండర్ హోదా సంపాదించారు. ఈ బాధ్యతలు స్వీకరించనున్న తొలి మహిళా కమాండర్గా ఆమె పేరుగాంచారు. హెలికాప్టర్లను నడపడంలో 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ధామీ తొలి మహిళా ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా, శాశ్వత ప్రాతిపదికన ఎయిర్ఫోర్స్ ఫ్లయింగ్ విభాగంలో చేరిన తొలి మహిళగా కూడా రికార్డుల్లో కెక్కారు.
తొలి మహిళా డీజీపీ కాంచన్ చౌదరి కన్నుమూత
దేశంలో తొలి మహిళా డీజీపీ కాంచన్ చౌదరి భట్టాచార్య (72) 2019 ఆగస్టు 26న ముంబైలో మతి చెందారు. కాంచన్ చౌదరి భట్టాచార్య నిజ జీవితం ఆధారంగా దూరదర్శన్లో 1980లో ప్రసారమైన పాపులర్ సీరియల్ 'ఉడాన్'కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కాంచన్కు భర్త, ఇద్దరు కుమార్తెలున్నారు. 1973 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన కాంచన్ దేశంలో తొలి మహిళా డీజీపీగా ఎంపికై చరిత్ర సష్టించారు. హిమాచల్ప్రదేశ్లో జన్మించిన కాంచన్ చౌదరి కిరణ్బేడీ తరువాత దేశంలో రెండో మహిళా ఐపీఎస్ అధికారి. 2004 నుంచి 2007 అక్టోబర్ 31 వరకు కాంచన్ చౌదరి ఉత్తరాఖండ్ డీజీపీగా పని చేశారు. సీఐఎస్ఎఫ్ అధిపతిగా కూడా పనిచేశారు.
PMLA ట్రిబ్యునల్ చైర్పర్సన్గా జస్టిస్ గౌర్
నగదు అక్రమ చలామణి చట్టం PMLA అప్పీలేట్ ట్రిబ్యు నల్ చైౖర్ పర్సన్గా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్గౌర్ నియమి తులయ్యారు. 2008లో ఢిల్లీ హైకోర్డు న్యాయమూర్తిగా నియమితుల య్యారు. తాజాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్లను గౌర్ తిరస్కరించారు.
అవార్డులు
ప్రపంచ నైపుణ్య పోటీల్లో భారత్కు 4 పతకాలు
45వ ప్రపంచ నైపుణ్య పోటీల్లో భారత్ 4 పతకాలు సాధిం చింది. రష్యాలోని కజన్లో నిర్వహించిన పోటీల్లో ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్య పతకాలు సాధించింది. పోటీల్లో జల సాంకేతికత విభాగంలో ఎస్.అశ్వత్థ నారాయణ (25) స్వర్ణం సాధించగా, ప్రణవ్ నూతలపాటి(17) వెబ్ సాంకేతికత విభాగంలో రజతం గెల్చుకున్నాడు. ఆభరణాల విభాగంలో సంజరు ప్రామాణిక్ (21), గ్రాఫిక్ డిజైనింగ్లో శ్వేత రతనపుర(22) కాంస్యాలు దక్కించుకున్నారు. 63 దేశాలు పోటీల్లో పాల్గొన్నాయి. భారత్ తరఫున 48 మంది పాల్గొన్నారు. 16 స్వర్ణాలతో పతకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో నిలిచింది. ఆతిథ్య రష్యా 14 బంగారు పతకాలను దక్కించుకుంది. 2007 నుంచి మనదేశం ప్రపంచ నైపుణ్య పోటీల్లో పాల్గొంటోంది.
ప్రొఫెసర్ భాగ్యలక్ష్మికి నేషనల్ ఎక్స్లెన్స్ అవార్డు
ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న గంజి భాగ్యలక్ష్మికి నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్స్లెన్స్ అవార్డు లభించింది. ఢిల్లీలో 2019 ఆగస్టు 22న నిర్వహించిన జాతీయ విద్యా, వాణిజ్య సదస్సులో కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు వారి మానసిన సామర్థ్యం పెంపొందేలా కషి చేస్తున్నారు.
కష్ణతేజకు కేరళ ప్రభుత్వ పురస్కారం
రెండేళ్ల కిందట కేరళను ముంచెత్తిన వరదల్లో అతలాకుతలమైన అలెప్పి ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాల పునరుద్ధరణకు విశేషంగా కషి చేసిన సబ్ కలెక్టర్ వి.ఆర్.కష్ణతేజకు కేరళ ప్రభుత్వ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన కష్ణతేజ కేరళలో ఐఏఎస్ అధికారిగా సేవలంది స్తున్నారు. 2018-19 సంవత్సరం లో దాతల నుంచి సేకరించిన నిధుల ద్వారా అంగన్వాడీ కేంద్రాల నిర్మా ణం, పునరుద్ధరణ, ఒంటరి మహిళ లకు ఉపాధి, సామాగ్రి కోల్పోయిన వారికి అవసరమైన వస్తువులు.. ఇలా అన్ని విధాల అండగా నిలిచారు. ఈ సేవలకు కేరళ ముఖ్యమంత్రి పినరరు విజయన్ చేతుల మీదుగా కష్ణతేజ ప్రశంసాపూర్వక జ్ఞాపిక, ధ్రువపత్రాన్ని అందుకున్నారు.
సైకాలజిస్ట్ లక్ష్మణ్కు ఇన్స్పిరేషనల్ లీడర్ అవార్డు
ప్రముఖ మానసిక శిక్షణ నిపుణుడు డా.పి.లక్ష్మణ్కు ఇన్స్పిరేషనల్ లీడర్ అవార్డు లభించింది. 2019 ఆగస్టు 24న ఢిల్లీలో జరిగిన ఎడ్యుకేషన్ ఐకాన్ సంస్థ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అర్జెంటీనా రాయబారి డెనియల్ చుబురు చేతుల మీదుగా లక్ష్మణ్ అవార్డు అందుకున్నారు. లక్ష్మణ్ సేవలకు గుర్తింపుగా సామాజిక సేవా విభాగంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఐకాన్ సంస్థ ఈ అవార్డును ప్రదానం చేసింది. నాగర్కర్నూల్ జిల్లా లింగాల్ మండలం ఎన్సీ తాండకు చెందిన లక్ష్మణ్ గత కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా వివిధ వర్గాల వారికి పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకాలజీ కౌన్సెలింగ్, మానసిక శిక్షణలో అవగాహన కల్పిస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఏడుసార్లు ఉత్తమ సామాజిక సేవా విభాగంలో అవార్డులు ప్రకటించింది.
ఆర్థికాంశాలు
2019లో భారత వద్ధి 6.2 శాతమే : మూడీస్
భారత జీడీపీ వద్ధి అంచనాలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ కోత విధించింది. 2019లో వద్ధి 6.2 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది. నియామకాలు బలహీనంగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తగ్గడం, కఠిన ఆర్థిక పరిస్థితులు వంటి కారణాలతో ఆర్థిక వ్యవస్థ మందకొడిగానే ఉండొచ్చని అభిప్రాయపడింది. అంతక్రితం 2019లో జీడీపీ వద్ధి 6.8 శాతంగా ఉండొచ్చని మూడీస్ పేర్కొంది. తాజాగా దీన్ని సవరించింది. ఇక 2020 అంచనాలను 0.6 శాతం తగ్గించి 6.7 శాతంగా చేసినట్లు వెల్లడించింది. 16 ఆసియా దేశాల వద్ధి అంచనాలను సంస్థ మార్చింది.
10 ప్రభుత్వరంగ బ్యాంకులను నాలుగింటిగా విలీనం
10 ప్రభుత్వరంగ బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019 ఆగస్టు 30న ప్రకటించారు. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు చేరనుంది. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దడంలో భాగంగా ఈ విలీనం చోటు చేసుకుంటోంది.
జీడీపీ అంచనాలకు ఇండియా రేటింగ్స్ కోత
భారత్ 2019-20 ఆర్థిక సంవత్సరం వద్ధి రేటు అంచనా లకు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ కోత విధించింది. ఈ మేరకు వద్ధి రేటును 7.3 శాతం నుంచి 6.7శాతానికి తగ్గిస్తున్నట్లు 2019 ఆగస్టు 28న వెల్లడించింది. వినియోగంలో మందగమనం, పారిశ్రామిక ఉత్పత్తి రేటు పడిపోవడం వంటి అంశాలు వద్ధి రేటు కోతకు కారణమని పేర్కొంది.
ప్రభుత్వం నుంచి నిధులు అవసరం లేదు:SBI
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20)లో ప్రభుత్వం నుంచి తమకు మూలధన నిధుల సాయం అవసరం లేదని, తగినన్ని నిధుల లభ్యత ఉందని ప్రభుత్వరంగ బ్యాంకుSBI 2019 ఆగస్టు 27న వెల్లడించింది. వ్యవస్థలో ద్రవ్యలభ్యతను పెంచేందుకు, రుణ వితరణ సామర్థ్యం ఇనుమడింప జేసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు తక్షణమే రూ.70,000 కోట్ల మూలధన నిధుల సాయాన్ని అందించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019 ఆగస్టు 23న ప్రకటించింది
సైన్స్ and టెక్నాలజీ
పాలీపిల్తో తగ్గనున్న గుండె జబ్బు ముప్పు
రక్తపోటు, కొలెస్ట్రాల్ను తగ్గించే ఔషధాలు, ఆస్పిరిన్లతో కూడిన ఓ చవకైన మాత్ర.. పాలీపిల్ను రోజూ తీసుకోవడం ద్వారా గుండె వైఫల్యం, పక్షవాతం ముప్పును మూడొంతులు తగ్గించవచ్చని పరిశోధనలో వెల్లడైంది. గుండె, రక్తనాళాల వ్యాధుల చరిత్ర లేని వారిలో పాలీపిల్ మంచి ప్రభావం చూపుతున్నట్లు క్లినికల్ ట్రయల్స్లో తేలింది. ప్రస్తుతం రక్తపోటు తగ్గించేందుకు ఒకట్రెండు రకాల మాత్రలు ఇస్తూ, కొవ్వు ఆమ్లాలను నిలువరించేందుకు స్టాటిన్ మాత్రలు ఇస్తున్నారు. వీటికి తోడు రక్తాన్ని పలుచగా ఉంచేందుకు ఆస్పిరిన్ను కూడా ఇస్తున్నారు.
తేలియాడే తొలి అణు రియాక్టర్
ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా తేలియాడే అణు రియాక్టర్ను రష్యా 2019 ఆగస్టు 23న ప్రారంభించింది. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలోని ముర్మాన్స్క్ రేవు నుంచి సైబీరియా ప్రాంతంలోని పెవెక్కు పయనమైంది. దాదాపు 6 వారాల పాటు ఈ ప్రయాణం సాగుతుంది. అకాడమిక్ లొమోనోసోవ్ అనే ఈ అణు రియాక్టర్ నిర్మాణంపై పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. రష్యాలోని చెర్నోబిల్లో జరిగిన అణు ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ తాజా రియాక్టర్ను 'ఐస్పై చెర్నోబిల్'గా, 'అణు టైటానిక్'గా వారు అభివర్ణిస్తున్నారు.
ఫ్రాన్స్లో చిన్న సూరీడు
సూర్యుడిని పోలిన చిన్న సూరీడుని సష్టించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. రూ.1,60,000 కోట్ల వ్యయంతో ఫ్రాన్స్లోని ఓ ప్రాంతంలో ఈ సూర్యుడిని తయారు చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్స్ (ITER) ప్రాజెక్టు లేదా ద పాథ్ అని పేరు పెట్టారు. సూర్యుడి నుంచి వెలువడే సంలీన శక్తిని వినియోగించుకోవడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. (ITER) మొత్తం బరువు 28 వేల టన్నులు. ప్రపంచంలోనే ఇప్పటి వరకూ సైన్స్ ప్రాజెక్టులపై చేసిన ఖర్చుల్లో ఇదే అతి ఖరీదైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కోసం ఉపయోగించే పరికరాలపై 'మేడిన్ ఇండియా' అని రాశారు. ఈ ప్రాజెక్టుపై భారత్ రూ.17,500 కోట్లు (ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 10 శాతం) ఖర్చు పెట్టనుంది. 100 మంది భారతీయ శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నారు.
క్రిమి, కీటక సమాచారంతో యాప్
క్రిమి, కీటకాల సంపూర్ణ సమాచారంతో కూడిన ఓ యాప్ను ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసింది. దీనికి 'ఇన్సెక్ట్ పెస్ట్స్' అని పేరుపెట్టింది. కేంద్ర అటవీశాఖ పరిధిలోని ఈ సంస్థ మధ్యప్రదేశ్లోని జబల్పూర్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ యాప్లోని సమాచారం రైతులు, వ్యవసాయ పరిశోధకులకు ఎంతో దోహపడుతుందని టీఎఫఆర్ఐ తెలిపింది. మొక్కలను ఆశించే క్రిమి, కీటకాల జీవిత చక్రం, నివారణోపాయాల సమస్త వివరాలు అందరికీ అందించాలనే సంకల్పంతోనే యాప్ను విడుదల చేసినట్లు పేర్కొంది.
ఐఎస్ఎస్ చేరిన హ్యూమనాయిడ్ రోబో
రోదసిలోకి రష్యా పంపిన తొలి హ్యూమనాయిడ్ రోబో 2019 ఆగస్టు 27న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి ప్రవేశించింది. ''జాప్యానికి మన్నించండి. ట్రాఫిక్లో చిక్కుకుపోయాను. ఇప్పుడు పనిలోకి దిగడానికి నేను సిద్ధం'' అంటూ ఈ రోబో తన ట్విటర్ ఖాతాలో సరదాగా వ్యాఖ్యానించింది. 'ఫెడోర్' అనే ఈ రోబో.. మనిషి పరిమాణంలో ఉంటుంది. ఐఎస్ఎస్లో సంక్లిష్టమైన పనుల నిర్వహణలో మానవులకు తోడ్పాటు అందిస్తుంది.
సరీసపంపై తొలిసారి 'జన్యు ఎడిటింగ్'
శాస్త్రవేత్తలు తొలిసారిగా సరీసపంపై విజయవంతంగా జన్యు ఎడిటింగ్ ప్రయోగాన్ని చేశారు. ఈ పద్ధతిలో జార్జియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు 2 అల్బినో(తెల్లని) జాతి బల్లులను సష్టించారు. వీటి పొడవు మనిషి చూపుడు వేలంత ఉంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. మనుషుల్లో అల్బనిజం కారణంగా వచ్చే కంటికి సంబం ధించిన సమస్యలను కూడా అర్థం చేసుకునే వీలుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ శక్తిమంతమైన జన్యు ఎడిటింగ్ పద్ధతిని క్రిస్పర్ (CRISPR)అని కూడా పిలుస్తారు.
అణు క్షిపణి 'ఘజ్నవి'ని పరీక్షించిన పాకిస్తాన్
జమ్మూకశ్మీర్కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తర్వాత పాకిస్తాన్ అణు బాలిస్టిక్ క్షిపణి 'ఘజ్నవి'ని విజయవంతంగా పరీక్షించింది. ఇప్పటికే కరాచీలోని మూడు గగనతల మార్గాలను మూసివేసింది. అదే పంథాలో అణు క్షిపణిని పరీక్షించింది. వార్హెడ్లను మోసుకెళ్లే ఈ క్షిపణి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని ఆర్మీ తెలిపింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే దీనిద్వారా భారత దేశంలోని కొంత భూభాగాన్ని సైతం లక్ష్యంగా చేసుకోవచ్చు.
క్రీడాంశాలు
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విజేత పీవీ సింధు
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సష్టించింది. స్విట్జర్లాండ్లోని బాసెల్లో 2019 ఆగస్టు 25న జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపి యన్షిప్ ఫైనల్స్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2017 ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై విజయం సాధించింది. దీంతో ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ చరిత్రలో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా పీవీ సింధు రికార్డు సృష్టించింది.
కోమలిక బారికి ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్
స్పెయిన్లోని మాడ్రిడ్లో 2019 ఆగస్టు 25న జరిగిన ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో జార్ఖండ్కు చెందిన భారత ప్లేయర్ కోమలిక బారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. కోమలిక బారి ఫైనల్లో సొనొడా వాకా(జపాన్)పై విజయం సాధించింది.
జలజ్ సక్సేనా సరికొత్త రికార్డు
భారత దేశవాళీ ఆటగాడు జలజ్ సక్సేనా సరికొత్త రికార్డు సష్టించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 6 వేలకు పైగా పరుగులు చేయడంతో పాటు 300కు పైగా వికెట్లు తీసిన ఈ ఆల్రౌండర్.. ఇప్పటి వరకు జాతీయ జట్టు తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా దేశవాళీలో ఆ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 113 ఫస్ట్క్లాస్ మ్యాచ్లాడిన ఈ రైటార్మ్ ఆఫ్ స్పిన్నర్ 6,044 పరుగులు చేశాడు. బంతితో కూడా రాణించి 305 వికెట్లు తీశాడు.
6 నెలల పాటు చీAణA గుర్తింపు రద్దు
భారత క్రీడాకారులకు డోపింగ్ పరీక్షలు నిర్వహించే జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ NADA గుర్తింపును 6 నెలల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ( NADA వెల్లడించింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫర్ ల్యాబొరేటరీస్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా NADA కు చెందిన ల్యాబ్లో సౌకర్యాలు లేనందునే రద్దు నిర్ణయం తీసుకున్నట్లు 2019 ఆగస్టు 23న తెలిపింది.
ఐసీసీ జనరల్ కౌన్సెల్గా జొనాథన్ హాల్
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) జనరల్ కౌన్సెల్, ప్రధాన కార్యదర్శిగా జొనాథన్ హాల్ నియమిస్తున్నట్లు 2019 ఆగస్టు 22న ఐసీసీ ప్రకటించింది. ఫుట్బాల్, రగ్బీ, టెన్నిస్, గోల్ఫ్ తదితర క్రీడావిభాగాల్లో హాల్కు 27 ఏళ్ల అనభవం ఉందని తెలిపింది. ఇంటర్నేషనల్ అండ్ యూకే స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్, యూఈఎఫ్ఏ, ది ఫుట్బాల్ అసోసియేషన్, రగ్బీ ఫుట్బాల్ యూనియన్ (ఆర్ఎఫ్యు) తదిరత క్రీడా సంస్థల్లో అతను పని చేసినట్లు పేర్కొంది.
ICCర్యాంకింగ్స్లో టాప్-10లో బుమ్రా
భారత స్టార్ పేసర్ బుమ్రా ICC ర్యాంకింగ్స్లో టాప్-10లో చోటు సంపాదించాడు. 2019 ఆగస్టు 27న ప్రకటించిన జాబితాలో బుమ్రా తొమ్మిది స్థానాలు మెరుగు పరుచుకుని 7వ స్థానంలో నిలిచాడు. టాప్-10లోకి రావడం అతనికిదే తొలిసారి. వేగంగా 50 వికెట్లు సాధించిన భారత పేసర్గానూ ఘనత సాధించాడు. బ్యాట్స్మెన్ జాబితాలో కోహ్లి ముందంజలో కొనసాగుతున్నాడు.
Authorization