అంతర్జాతీయం
రష్యా ప్రధాని పదవికి మెద్వదేవ్ రాజీనామా
రష్యా ప్రధానమంత్రి దిమిత్రి మెద్వదేవ్ 2020 జనవరి 15న తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకురాదలచిన మార్పులను సానుకూలపర్చేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మెద్వదేవ్ రాజీనామాను పుతిన్ ఆమోదించారు. అనంతరం, ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉప దళపతిగా మెద్వదేవ్ను, తదుపరి ప్రధానిగా మైఖేల్ మిషుస్తిన్ను నియమించారు. ఆ వెంటనే, ఈ నియామకాల్ని పార్లమెంట్ ఆమోదించింది.
పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మరణ శిక్ష రద్దు
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు మరణ శిక్ష విధిస్తూ ఇస్లామాబాద్ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును లాహౌర్ హైకోర్టు కొట్టివేసింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటును, ఆ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ ముషారఫ్ దాఖలు చేసిన పిటిషన్పై 2020 జనవరి 13న లాహౌర్ హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పులో ముషారఫ్పై దేశద్రోహం కేసు నమోదు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు.. అన్నీ చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది. 2013లో నాటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ముషారఫ్ కేసు నమోదు చేసింది. ఆరేళ్ల పాటు ప్రత్యేక కోర్టు విచారణ జరిపి 2019, డిసెంబర్లో ముషారఫ్కు మరణ శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. ఈ తీర్పును లాహౌర్ హైకోర్టులోని జస్టిస్ సయ్యద్ మజహర్ అలీ అక్బర్ నఖ్వీ, జస్టిస్ మొహ్మద్ అమీర్ భట్టీ, జస్టిస్ చౌధరి మసూద్ జహంగీర్ల త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది.
హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్లో భారత్కు 84వ స్థానం
హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ 2020 జనవరి 7న విడుదల చేసిన 'హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్(హెచ్పీఐ)-2020'లో భారత పాస్పోర్టుకు 84వ స్థానం లభించింది. భారత్ 58 స్కోరుతో మౌరిటానియా, తజకిస్థాన్ దేశాలతో 84వ ర్యాంకును పంచుకుంది. భారత పాస్పోర్ట్తో ముందస్తు వీసా లేకుండా 58 దేశాల్లో పర్యటించొచ్చని ఈ స్కోరు సూచిస్తుంది. హెచ్పీఐ-2020లో జపాన్ మొదటి స్థానంలో నిలిచింది. అఫ్గానిస్థాన్ పాస్పోర్టు చిట్టచివరి స్థానంలో ఉంది.
జాతీయం
రుతుపవనాల సూచన తేదీల మార్పు : ఐఎండీ
మారుతున్న వర్షపాతం విధానంతో రుతుపవనాల సూచనల తేదీలలో మార్పులుంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. 2020 ఏడాది నుంచి నైరుతి రుతుపవనాల సూచన తేదీలను ఉపసంహరించుకున్నట్లు ఎర్త్సైన్స్ మంత్రిత్వ శాఖ 2020 జనవరి 16న వెల్లడించింది. రుతుపవనాల సూచనల తేదీల మార్పు పంటలు సాగు చేసేందుకు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొంది. కేరళ మీదుగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికే వస్తాయని, అయితే మిగతా రాష్ట్రాలు, నగరాల్లో ఈ తేదీలో మార్పులుంటాయని తెలిపింది. ప్రస్తుతం ఐఎండీ అనుసరిస్తున్న విధానంలో.. నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్ ఏటా జూన్ 1న ప్రారంభమై సెప్టెంబర్ 30న ముగుస్తుంది. 1940లలో ఈ తేదీలను ఖరారుచేశారు. ప్రస్తుత తీరుతెన్నులకు అనుగుణంగా దీన్ని మార్చనున్నారు.
సాయం పొందాలంటే ఆధార్ తప్పనిసరి
ఉగ్రవాదులు, నక్సలైట్ల హింసలోను, మత ఘర్షణల్లో చనిపోయిన పౌరుల కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. ఈ మేరకు కేంద్ర హౌంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సరిహద్దుల్లో కాల్పులు, భారత భూభాగంలో మందుపాతరల పేలుడులో చనిపోయినవారి కుటుంబ సభ్యులకూ సదరు పథకం వర్తిస్తుంది. లబ్ధిదారులకు ఆధార్ సంఖ్య ఉండాలి లేదా బయోమెట్రిక్ సాయంతో ఆధార్ అధీకరణ ప్రక్రియను చేపట్టాలి. ఆధార్ పూర్తిగా అమలుకాని అసోం, మేఘాలయ మినహా దేశమంతటా ఈ నిబంధన వర్తిస్తుందని కేంద్రం వివరించింది. ఈ పథకం కింద తొలుత రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు సాయం అందిస్తాయి. ఆ తర్వాత కేంద్రం ఆ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి చెల్లిస్తుంది.
వాయుసేనకు 200 జెట్ విమానాలు
భారత వైమానిక దళంలోకి మరో 200 యుద్ధ విమా నాలను చేర్చనున్నట్లు రక్షణ శాఖ కార్య దర్శి అజరు కుమార్ 2020 జనవరి 12న వెల్లడించారు. హిందు స్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారు చేసే 83 ఎల్సీఏ తేజస్ మార్క్ 1ఏ విమానాల కాంట్రాక్టు తుది దశలో ఉందన్నారు. మొత్తంగా 200 విమానాలను తీసుకొనే ప్రక్రియ సాగుతోం దన్నారు. ఎల్సీఏ మార్క్ 1ఏ విమానాల డిజైన్ పూర్తయి నందున ఉత్పత్తిని ఏడాదికి 16కి పెంచుతుందన్నారు.
డ్రోన్ల రిజిస్ట్రేషన్పై విమానయాన శాఖ ఆదేశాలు
దేశంలో డ్రోన్లను కలిగి ఉన్న వ్యక్తులందరూ 2020 జనవరి 31లోగా స్వచ్ఛం దంగా రిజిస్టర్ చేసు కోవాలని కేంద్ర విమాన యాన శాఖ జనవరి 13న తెలిపింది. నిర్దేశిత గడువులోగా రిజిస్టర్ చేసుకోని డ్రోన్ల ఆపరేటర్లపై ఐపీసీ సెక్షన్, ఎయిర్క్రాఫ్ట్ చట్టాల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆన్లైన్ విధానంలో డ్రోన్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. డీజీసీఏ నిబం ధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చ రించింది. ఇరాన్ సైనిక దళ కమాండర్ ఖాసీం సులేమానీపై అమెరికా డ్రోన్ సాయంతో హత్య చేసిన నేపథ్యంలో డ్రోన్ ఆపరేటర్లకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
ఇళ్ల కొనుగోలుకు ప్రభుత్వ వెబ్సైట్
దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఇళ్ల విక్రయం కోసం కేంద్ర పట్టణాభివద్ధి, గహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ రియల్ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్(నరేడ్కో) 2020 జనవరి 14న https://www.housingforall.com/ వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. ఢిల్లీలో కేంద్ర పట్టణాభివద్ధి, గహనిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్ర ఈ వెబ్సైట్ను ప్రారంభించారు. రెరా కింద నమోదైన నమ్మకమైన, భద్రమైన, నాణ్యమైన ఇళ్లను మాత్రమే ఈ వెబ్సైట్ ద్వారా విక్రయించను న్నారు. ఈ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు 2020 ఫిబ్రవరి 13 వరకు గడువు ఉంటుంది. 2020 ఫిబ్రవరి 14 నుంచి వినియోగదారులకు పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. 2020 మార్చి 1 నుంచి విక్రయాలు మొదలవుతాయి.
ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ రద్దు
ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ట్రైబ్యునల్ను ఏర్పాటుచేస్తూ 1989 అక్టోబర్ 26న జారీచేసిన జీఎస్ఆర్ 928(ఇ) నోటిఫికేషన్ను రద్దుచేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ 2020 జనవరి 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీకి ముందు అమలుచేయాల్సిన అంశాలు మినహాయించి మిగిలిన అన్నింటికీ ఇది జనవరి 14 నుంచి వర్తిస్తుందని పేర్కొంది.
పర్యావరణ సున్నిత మండలంగా కోరింగ
కాకినాడకు 5 కిలోమీటర్ల దూరంలోని గోదావరి నదీతీరంలో 235.70 చ.కి.మీ. మేర విస్తరించిన కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని పర్యావరణ సున్నిత మండలంగా ప్రకటిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ 2020 జనవరి 17న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలను వరఓ-ఎవటఏ అఱష.ఱఅ అనే మెయిల్కు లిఖిత పూర్వకంగా పంపొచ్చు. కోరింగ, కోరింగ ఎక్స్ టెన్షన్, భైరవపాలెం రక్షిత అటవీప్రాంతాల మధ్య విస్తరిం చిన ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సరిహద్దు నుంచి 11.5 కిలోమీటర్ల వరకు ఉన్న 187.14 చ.కి.మీ. ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత మండలంగా ప్రకటించారు.
శాంతిబాటలో ఎన్డీఎఫ్బీ
అసోంలోని నిషేధిత తిరుగుబాటు సంస్థ 'నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(ఎన్డీఎఫ్బీ)' ఆయుధాలను విడిచి పెట్టింది. హింసాత్మక కార్యకలాపాలను విడ నాడి, ప్రభుత్వంతో శాంతి చర్చలకు ముందు కొచ్చింది. ఈ దిశగా కేంద్ర, అసోం ప్రభుత్వాధి కారులు, ఎన్డీఎఫ్బీ ప్రతి నిధులు 2020 జనవరి 17న త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశారు.
అహ్మదాబాద్-ముంబయి మధ్య 'తేజస్' రైలు ప్రారంభం
ఆధునిక సదుపాయాలు గల రెండో తేజస్ రైలును గుజరాత్ ముఖ్యమంత్రి విజరు రూపాణీ 2020 జనవరి 17న అహ్మదాబాద్ లో ప్రారంభించారు. అహ్మదాబాద్-ముంబయి (500కి.మీ) మధ్య నడిచే ఈ రైలును రైల్వే శాఖకు అనుబంధంగా ఉండే ఐఆర్సీటీసీ నడుపుతుంది. ప్రతిరోజు అహ్మదాబాద్లో ఉదయం 6.40కు ప్రారంభమై ముంబయికి మధ్యాహ్నం 1.10కి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ముంబయిలో మధ్యాహ్నం 3.40కి ప్రారంభమై అహ్మదాబాద్కు రాత్రి 9.55కి చేరుకుంటుంది. తొలి తేజస్ రైలును ఐఆర్సీటీసీ ఢిల్లీ-లక్నోల మధ్య నడుపుతుంది.
కోల్కతా పోర్టు ట్రస్టు పేరు మార్పు
కోల్కతా పోర్టు ట్రస్టు 2020 జనవరి 12 నాటికి 150 వసంతాలు పూర్తి చేసుకుÛంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. కోల్కతా పోర్టు ట్రస్ట్ పేరుని జన్సంఫ్ు వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టుగా మారుస్తున్నట్టు ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు.
బ్రూ తెగవారు.. ఇక త్రిపుర వాసులే
మిజోరం నుంచి 1997లో త్రిపురకు వలస వచ్చి, అప్పట్నుంచి అక్కడే నివసి స్తున్న 30 వేల మందికిపైగా బ్రూ తెగవారు ఇక త్రిపురలో శాశ్వత నివాసులు కానున్నారు. ఈ మేరకు రూపొందించిన ఒడంబడికపై 2020 జనవరి 16న ఢిల్లీలో హౌంమంత్రి అమిత్షా సమక్షంలో కేంద్రం, త్రిపుర, మిజోరం అధికారులు సంతకాలు చేశారు. మిజో తెగవారితో ఘర్షణ కారణంగా బ్రూ తెగవారు అప్పట్లో త్రిపురకు వలస వచ్చారు.
కోజికోడ్-ఐఐఎంలో ఇండియన్ థాట్ సదస్సు
కేరళలోని కోజికోడ్-ఐఐఎంలో 'గ్లోబలైజింగ్ ఇండియన్ థాట్' పేరుతో నిర్వహిస్తున్న అంత ర్జాతీయ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ 2020 జనవరి 16న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐఎం క్యాంపస్లో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు.
ప్రపంచ తలసరి ఆర్థిక వద్ధిరేటు 1.5%కే పరిమితం : ఐక్యరాజ్య సమితి
ప్రపంచ ఆర్థిక తలసరి వద్ధిరేటు 2020లో 1.5%కే పరి మితం అయ్యే అవకాశం ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2020 జనవరి 17న ఐక్యరాజ్యసమితి సమాచార కేంద్రం 'యూఎన్ వరల్డ్ ఎకనమిక్ సిచ్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2020'' పేరుతో నివేదిక విడుదల చేసింది. వాణిజ్య వివాదాలు దీర్ఘకాలం కొనసాగడం, విధాన నిర్ణయాల్లో అనిశ్చి తులు విస్తతమవడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నానాటికీ దిగజారుతోందని పేర్కొంది. ఇది సుస్థిర అభివద్ధి లక్ష్యాలకు ముప్పుగా పరిణమించినట్లు ఆందోళన వ్యక్తం చేసింది.
ఢిల్లీలో రైసానా డైలాగ్
భౌగోళిక, రాజకీయ అంశాలపై 2020 జనవరి 14 నుంచి 16 వరకు ఢిల్లీలో ప్రపంచస్థాయి 'రైసానా డైలాగ్' సదస్సు నిర్వహించారు. ప్రధాని మోదీ, డెన్మార్క్ ప్రధాని ఆండర్స్ రస్ముసెన్, న్యూజిలాండ్ ప్రధాని హెలెన్ క్లార్క్, పలుదేశాల మాజీ ప్రధానులు దీనికి హాజరై ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, అఫ్గాన్లో శాంతికి ప్రయత్నాలు, వాతావరణ మార్పులు వంటి వాటిపై తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ప్రాంతీయం
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమావేశ మయ్యారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో 2020 జనవరి 13న జరిగిన ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు. ఈ భేటీ వివరాలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల కార్యాలయాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. సమావేశంలో ప్రధానంగా గోదావరి జలాలను కష్ణా ఆయకట్టుకు తరలించే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు సాగాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూళ్లలో పేర్కొన్న సంస్థల ఆస్తుల విభజనను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించారు.
తెలంగాణ పోలీస్ శాఖకు సీఎస్ఐ పురస్కారం
తెలంగాణ పోలీస్ శాఖకు సీఎస్ఐ పురస్కారం లభించింది. మహిళల, బాలల భద్రత కోసం పోలీస్ శాఖ రూపొందించిన హాక్-ఐ యాప్ను ఓలా, ఉబర్ తదితర క్యాబ్ సర్వీసుల మొబైల్ యాప్లకు అనుసంధానిం చినందుకు తెలంగాణ పోలీస్ శాఖను కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్ఐ) ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రాజెక్టు విభాగం నామినేషన్ కింద 2019 ఈ-గవర్నెన్స్ ఎక్స్లెన్సీ అవార్డును ప్రకటించింది. భువనేశ్వర్లో 2020 జనవరి 17న జరిగిన ఆ సంస్థ వార్షిక పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా తెలంగాణ డీజీపీ కార్యాలయ ఐటీ విభాగం డీఎస్పీ వెంకట్రెడ్డికి ఒడిశా రాష్ట్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, క్రీడాశాఖల శాఖ మంత్రి తుషార్ కాంతి బెహ్రా పురస్కారాన్ని అందజేశారు. వివిధ సేవల కోసం పాఠశాల విద్యాశాఖ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఐఎస్ఎంఎస్) రూపొందించిన ప్రాజెక్టుకు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్ఐ) పురస్కారం లభించింది. సర్వ శిక్ష అభియాన్ ప్లానింగ్ అధికారి చంద్రశేఖర్, టీఎస్ ఆన్లైన్ ప్రతినిధులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
పెద్దపల్లి జిల్లా స్వచ్ఛత దర్పణ్ అవార్డు
పెద్దపల్లి జిల్లాకు 'స్వచ్ఛత దర్పణ్ అవార్డు' లభించింది. న్యూఢిల్లీలో 2020 జనవరి 12న జరిగిన కార్యక్రమంలో పాణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, బాలీవుడ్ నటుడు ఆమీర్ఖాన్, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత సాధించినందుకు గాను జిల్లాకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సమాచారం, విద్య, కమ్యూనికేషన్ (ఐఈసీ), సామాజిక మరుగుదొడ్లు' అనే అంశంపై పెద్దపల్లి కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
వార్తల్లో వ్యక్తులు
సీబీఐ జేడీగా మనోజ్ శశిధర్
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) జాయింట్ డైరెక్టర్గా 1994 గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్ నియమితులయ్యారు. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ 2020 జనవరి 17న ఉత్తర్వులు జారీచేసింది.
సీఆర్పీఎఫ్ డీజీగా ఎ.పి.మహేశ్వరి
సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డీజీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎ.పి.మహేశ్వరి నియమితులయ్యారు. మహేశ్వరి 1984 బ్యాచ్కు చెందిన ఉత్తరప్రదేశ్ కేడర్ చెందిన ఐపీఎస్ ఆఫీసర్. మహేశ్వరి 2021 ఫిబ్రవరి 28 వరకు ఈ పదవిలో ఉంటారు. 2019 డిసెంబర్ 31న భట్నాగర్ పదవీ విరమణ చేసినప్పటినుంచీ డీజీ పోస్టు ఖాళీగా ఉంది.
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా మైఖేల్ దేబబ్రతా పాత్రా
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొత్త డిప్యూటీ గవర్నర్గా మైఖేల్ దేబబ్రతా పాత్రా నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. 2019 జూన్లో విరాల్ ఆచార్య రాజీనామా చేసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉంది. పాత్రా ఆర్బీఐ నాలుగో డిప్యూటీ గవర్నర్గా ఉంటారు. గవర్నర్ శక్తికాంతదాస్ నేతత్వంలోని ఆర్బీఐలో గరిష్ఠంగా నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉండొచ్చు. ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లుగా ఎన్ఎస్ విశ్వనాధన్, బీపీ కనుంగో, ఎంకే జైన్లు పనిచేస్తున్నారు.
ఒమన్ సుల్తాన్ బిన్ సయీద్ మృతి
ఆధునిక అరబ్ ప్రపంచంలో అత్యధిక కాలం పాలించిన ఒమన్ రాజు ఖుబాస్ బిన్ సయీద్(79) 2020 జనవరి 10న మృతి చెందారు. 1970 నుంచి పాలించిన ఆయన కేన్సర్తో బాధపడినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈయనకు పెళ్లి కాలేదు. దీంతో ఆయన వారసుడు ఎవరనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఒమన్ రాజ్యాంగం ప్రకారం రాజు సింహాసనాన్ని వదలిన మూడు రోజుల్లోగా కొత్త రాజు దాన్ని అధిష్టించాలి. బిన్ సయీద్కు వారసులు లేకపోవడంతో రాజ కుటుంబంలో సభ్యుడైన 'ముస్లిం, యుక్త వయస్సు వచ్చిన వారు, హేతుబద్ధవాది, ఒమన్ ముస్లిం తల్లిదండ్రులకు జన్మించిన' వ్యక్తిని తదుపరి రాజుగా ఎన్నుకోవాల్సి ఉంది.
అవార్డులు
చిరుకథల పుస్తకం 'చెక్బుక్'కు సరస్వతీ సమ్మాన్ పురస్కారం
సింధీ భాషా పుస్తకం 'చెక్బుక్' 2019 సం||నికి గాను సరస్వతీ సమ్మాన్ పురస్కారానికి ఎంపికైంది. ప్రముఖ రచయిత వాసుదేవ్ మోహి 2012లో ఈ చిరు కథల పుస్తకాన్ని(చెక్బుక్) రచించారు. కె.కె. బిర్లా ఫౌండేషన్ 1991 నుంచి వివిధ భారతీయ భాషల్లో ఉత్తమ రచనలకు ఏటా ఈ అవార్డులను అందజేస్తోంది. ఈ అవార్డు కింద రచయితకు రూ.15 లక్షల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికను ప్రదానం చేస్తారు. సింధీభాషా సాహితీవేత్త అయిన వాసుదేవ్ మోహి పద్యాలు, కథలు, అనువాదాలు తదితరాలు కలిపి 25కు పైగా రచనలు చేశారు.
ప్రపంచ బాల మేధావిగా ఈశ్వర్శర్మ
ఆధ్యాత్మిక యోగాలో సాధించిన విజయాలకుగానూ పదేళ్ల స్కూల్ విద్యార్థి, బ్రిటిష్ ఇండియన్ ఈశ్వర్శర్మను ప్రపంచ బాల మేధావి-2020 అవార్డుతో బ్రిటన్ సత్కరించింది. 30 విభిన్న (బైకింగ్, కొరియోగ్రఫీ, ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్ తదితర) రంగాల్లో సత్తాచాటిన ప్రపంచంలోని 45 దేశాలకు చెందిన బాల మేధావులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. అందులో ఇంగ్లండ్లోని కెంట్ కేంద్రంగా పనిచేస్తున్న ఈశ్వర్ శర్మ యోగాలో అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.
జస్ప్రీత్ బుమ్రాకు పాలీ ఉమ్రిగర్ పురస్కారం
భారత సీనియర్ ఫాస్ట్బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్, దిలీప్ సర్దేశారు పురస్కారాలు లభించాయి. ముంబైలో 2020 జనవరి 12న జరిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వార్షిక అవార్డుల వేడుకలో బుమ్రా ఈ అవార్డులను అందుకున్నాడు. 2018-19 సీజన్లో కనబరిచిన విశేష ప్రతిభకుగాను బుమ్రాకు ఈ అవార్డులు లభించాయి.
మాధురీవిజరుకి క్రాస్వర్డ్ బుక్ అవార్డు
యువ రచయిత్రి మాధురీవిజరు (32)కి 'క్రాస్వర్డ్ బుక్ అవార్డు (జ్యూరీ కేటగిరీ)' లభించింది. కశ్మీర్ లోయలో పరిస్థితులను ఆవిష్కరించిన 'ది ఫార్ ఫీల్డ్' నవలకు గాను ఈ పురస్కారం లభించింది. బెంగళూరులో జన్మించిన మాధురి.. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. 'ది ఫార్ ఫీల్డ్' ఆమె రచించిన తొలి నవల. ఆ నవలకు భారత్లో అత్యంత ఖరీదైన సాహిత్య బహు మతిగా పేరున్న జేసీబీ ప్రైజ్ (సాహిత్యం)తో పాటు టాటా లిటరేచర్ లైఫ్ ఫస్ట్ బుక్ అవార్డును గెల్చుకున్నారు. సల్మాన్ రష్దీ, విక్రమ్ సేఠ్, కిరణ్ దేశారు వంటి ప్రఖ్యాత భారతీయ రచయితలు గతంలో క్రాస్వర్డ్ బుక్ అవార్డును గెల్చుకున్నారు.
సైన్స్ and టెక్నాలజీ
జీశాట్-30 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో) రూపొం దించిన జీశాట్-30 ఉపగ్రహం విజయవంతం గా నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం 2020 జనవరి 17న ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ 5 వీఏ-251 వాహకనౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. జీశాట్-30 2020లో ఇస్రో ప్రయోగించిన తొలి ఉపగ్రహం. ఈ ఏడాది మొత్తం 25 ఉపగ్రహాలను నింగిలోకి పంపాలని ఇస్రో లక్ష్యంగా నిర్ణయించుకుంది.
అతి పెద్ద టెలికం కంపెనీగా రిలయన్స్ జియో
సబ్స్క్రైబర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతి పెద్ద టెలికం కంపెనీగా రిలయన్స్ జియో అవతరించింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రారు గణాంకాల ప్రకారం.. 2019, నవంబర్ చివరినాటికి జియో చందాదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరింది. 33.62 కోట్ల చందా దారులతో ఆ తరువాత స్థానంలో వొడాఫోన్ ఐడియా, 32.73 కోట్ల యూజర్లతో ఎయిర్టెల్ మూడో స్థానంలో ఉంది. మొత్తం టెలికం యూజర్ల సంఖ్య అక్టోబర్లో 120.48 కోట్లు ఉండగా.. నవంబర్ చివరినాటికి 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు పరిమితమైంది.
క్షయ నిర్ధారణలో భారత సాంకేతికతకు డబ్ల్యూహెచ్వో ఆమోదం
క్షయను గుర్తించేందుకు భారత శాస్త్రవేత్తలు రూపొందించిన సాంకేతిక తను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదించింది. ఔషధా లను తట్టుకొని నిలబడే మొండి క్షయను కూడా ఇది పట్టేస్తుంది. రోగ నిర్ధారణలో దీని కచ్చితత్వం చాలా మెరుగ్గా ఉన్న నేపథ్యంలో ఈ ఘనత లభించింది. ఈ పరీక్ష పేరు 'ట్రూన్యాట్ టీబీ టెస్ట్'. 90 నిమిషాల్లోనే ఇది క్షయ ఆనవాళ్లను పట్టేస్తుంది. రిఫామిపైసిన్ ఔషధాన్ని తట్టుకొని నిలబడే మొండి క్షయనూ గుర్తిస్తుంది. ప్రామాణిక రోగనిర్ధారణ విధానాలకు సంబంధించిన ఒక పత్రంలో దీన్ని డబ్ల్యూహెచ్వో చేర్చింది.
మలేరియా కారక సూక్ష్మజీవిపై కొత్త పద్ధతి ఆవిష్కరణ
మలేరియా కారక పరాన్నజీవిని మరింత సులువుగా అర్థం చేసుకునేందుకు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. మలేరియా వ్యాధి నియంత్రణకు ఈ పరాన్నజీవి పనితీరును అర్థం చేసుకోవడం ముఖ్యం కాగా.. మన ఎర్ర రక్తకణాల్లోకి చేరి డీఎన్ఏను వాడుకునే దీని జన్యువులను తెలుసుకోవాలంటే 4 పొరలను దాటాల్సి ఉంటుంది. ఈ పొరలన్నింటినీ తొలగించి లోపలి పరాన్నజీవి పనితీరును అర్థం చేసుకునేందుకు ప్రస్తుతం ఎలక్ట్రోపోరేషన్ అనే ఖరీదైన పద్ధతిని వాడుతున్నారు. డాక్టర్ పూరన్సింగ్ సిజ్వాలీ నేతత్వంలోని శాస్త్రవేత్తల బందం ఈ సమస్య పరిష్కారానికి మలేరియా కారక ప్లాస్మోడియం ఫాల్సీపరంపై పరిశోధనలు చేపట్టింది. లైజ్-రీ సీల్ అని పిలుస్తున్న ఈ పద్ధతి ద్వారా ప్లాస్మోడియం ఫాల్సిపరం కణాల్లోకి బయటి నుంచి జన్యువులను జొప్పించడం సులువవుతుంది. ఈ పరాన్న జీవి.. డీఎన్ఏలతో కూడిన ఎర్ర రక్తకణాల్లోకి చేరిపోయి అక్కడ ఉన్న డీఎన్ఏలోకి తనదైన జన్యువులు చొప్పిస్తుంది.
క్రీడలు
ఖతర్ ఓపెన్ టోర్ని విజేతగా బోపన్న జంట
ఖతర్ ఓపెన్ ఏటీపీ-250 టోర్నమెంట్లో రోహన్ బోపన్న(భారత్)-వెస్లీ కూలాఫ్(నెదర్లాండ్స్) జంట విజేతగా నిలిచింది. ఖతర్ రాజధాని దోహాలో 2020 జనవరి 10న జరిగిన డబుల్స్ ఫైనల్లో బోపన్న-కూలాఫ్ జంట 3-6, 6-2, 10-6తో 'సూపర్ టైబ్రేక్'లో ల్యూక్ బామ్బ్రిడ్జ్ (ఇంగ్లండ్)-శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో) జోడీని ఓడించింది. టైటిల్ నెగ్గిన బోపన్న జంటకు 76,870 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 54 లక్షల 50 వేలు)తోపాటు 250 ఏటీపీ ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్గా 39 ఏళ్ల బోపన్నకు కెరీర్లో ఇది 19వ డబుల్స్ టైటిల్.
ఏఎస్బీ క్లాసిక్ ఓపెన్ చాంపియన్గా సెరెనా
ఏఎస్బీ క్లాసిక్ ఓపెన్ టోర్నీలో సింగిల్స్ చాంపియన్గా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ నిలిచింది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ లో 2020 జనవరి 12న ముగిసిన ఈ టోర్ని ఫైనల్లో సెరెనా 6-3, 6-4తో జెస్సికా పెగులా (అమెరికా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన 38 ఏళ్ల సెరెనాకు 43 వేల డాలర్లు ప్రైజ్మనీ (రూ. 30 లక్షల 52 వేలు) లభించింది. ఈ మొత్తాన్ని ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల సహాయార్ధం ఏర్పాటు చేసిన బుష్ఫైర్ రిలీఫ్ ఫండ్కు సెరెనా విరాళంగా ఇచ్చేసింది.
తక్కువ ఇన్నింగ్స్ల్లో 7000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్మన్గా రోహిత్శర్మ
భారత క్రికెటర్ రోహిత్శర్మ ఓపెనర్గా అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 7000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్ మన్గా (137 ఇన్నింగ్స్) ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా (147 ఇన్నింగ్స్) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో సచిన్ (160), దిల్షాన్ (165) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
హ్యాండ్బాల్ లీగ్ పాలకమండలి చైర్మన్గా జగన్మోహన్
ఇండియన్ ప్రిమియర్ హ్యాండ్బాల్ లీగ్ పాలక మండలి ఛైర్మన్గా తెలంగాణకు చెందిన జగన్మోహన్రావు నియమి తులయ్యారు. భారత హ్యాండ్బాల్ సమాఖ్య అసోసియేట్ ఉపాధ్యక్షులుగా ఉన్న జగన్కు 2020 మార్చి 5న జైపుర్లో ఆరంభమయ్యే ప్రిమియర్ హ్యాండ్బాల్ లీగ్ను నిర్వహించే బాధ్యతను అప్పగించారు. ఈ లీగ్లో తెలంగాణ, దిల్లీ, చెన్నై, ముంబయి, బెంగళూరు, లక్నో జట్లు పోటీపడనున్నాయి.
ఉత్తమ ఆటగాడిగా బెన్స్టోక్స్
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వార్షిక అవార్డుల-2019ను 2020 జనవరి 15న ప్రకటించింది. ఈ అవార్డుల్లో ఉత్తమ ఆటగాడిగా గార్ఫీల్డ్ గారీ సోబర్స్ పురస్కారానికి ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఎంపికయ్యాడు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో 98 బంతుల్లో 84 పరుగులు చేసిన స్టోక్స్ తమ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. 2019 ఏడాది అత్యుత్తమ వన్డే ఆటగాడిగా భారత ఓపెనర్ రోహిత్ శర్మ నిలిచాడు. అత్యుత్తమ టెస్టు ఆటగాడి అవార్డు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్, ఉత్తమ అంపైర్గా రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ఎంపికయ్యాడు.
మాజీ క్రికెటర్ నడ్కర్ణి మృతి
క్రికెట్ మాజీ ఆల్రౌండర్ రమేశ్ చంద్ర గంగారం బాపూ నడ్కర్ణి(86) 2020 జనవరి 17న మృతి చెందాడు. ఆయన భారత్ తరఫున 41 టెస్ట్ మ్యాచులు ఆడారు. ఆ తరవాత జాతీయ ఎంపిక సంఘ సభ్యుడిగా కూడా సేవలు అందించారు. ముంబయి క్రికెట్ అసోసియేషన్కు సంయుక్త కార్యదర్శిగా కూడా వ్యవహరించారు.
Authorization