అంతర్జాతీయం
చైనాతో రష్యా సరిహద్దు మూసివేత
చైనాతో ఉన్న రష్యా సరిహద్దును తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు రష్యా జనవరి 30న ప్రకటించింది. చైనాలో విస్తరిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్తిన్ వెల్లడించారు. అలాగే చైనీయులకు ఎలక్టాన్రిక్ వీసాల జారీని కూడా నిలిపివేస్తామని పేర్కొన్నారు. తమ దేశ ప్రజలను రక్షించుకునేందుకు తాము అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. తమ దేశ పౌరులు చైనా పర్యటనలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని, చైనాలో వున్న రష్యా పౌరులు అక్కడి తమ దౌత్య కార్యాలయాన్ని సంప్రదించాలని రష్యా విదేశాంగ శాఖ సూచించింది.
గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో... జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి(గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ)ని ప్రకటించింది.దీంతో కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని సందేశాన్ని పంపింది. ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న వ్యవస్థల్లో ఈ వైరస్ తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్వో డెరైక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చిందని వెల్లడించారు.
బ్రిటన్లో ఫాస్ట్ ట్రాక్ వీసా పథకం
నిపుణులైన శాస్త్రవేత్తలను ఆకర్షించేందుకు బ్రిటన్ ప్రభుత్వం కొత్త వీసా పథకాన్ని ప్రారంభించింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, గణిత మేధావులకు 'అపరిమిత ఫాస్ట్ ట్రాక్ వీసా'ను అందిస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జనవరి 27న ప్రకటించారు. ఈ తాజా వలస నిబంధనలను జనవరి 30న ప్రకటిస్తామని, 2020 ఫిబ్రవరి 20 నుంచి అమలు చేస్తామని వెల్లడించారు. తాజా నిర్ణయం దిశగా భారత సంతతికి చెందిన నోబెల్ బహుమతి విజేత, బ్రిటన్ రాయల్ సొసైటీ అధ్యక్షుడు వెంకీ రామకష్ణన్ క షి చేశారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రిటన్ను శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
జాతీయం
ఇందిరా గాంధీ తర్వాత..నిర్మలా సీతారామన్కే ఈ ఘనత
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా రెండోసారి ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఇందిరా గాంధీ తర్వాత పూర్తిస్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెడుతోన్న రెండో మహిళా ఆర్ధిక మంత్రిగా నిర్మలా ఖ్యాతిగడించారు.
బంగారం డిమాండ్ 9 శాతం తగ్గింది : డబ్ల్యూజీసీ
ధరల తీవ్రతతో భారత్లో బంగారం డిమాండ్ 2019లో 9 శాతం పడిపోయిందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. దేశీయ ఆర్థిక మందగమనం కూడా పసిడి డిమాండ్ తగ్గడానికి దారితీసిందని పేర్కొంది. ఈ మేరకు జనవరి 30న ఒక నివేదికను విడుదల చేసింది. 2018లో దేశంలో బంగారం డిమాండ్ 760 టన్నులు. 2019లో 690 టన్నులుగా ఉంది. విలువ పరంగా మాత్రం భారత్ పసిడి డిమాండ్ రూ.2,11,860 కోట్ల నుంచి రూ.2,17,770 కోట్లకు పెరిగింది. దేశ పసిడి డిమాండ్లో 60 శాతంపైగా గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంది. చైనా తర్వాత పసిడి డిమాండ్లో రెండవ స్థానంలో ఉన్న భారత్లో 2020లో ఈ మెటల్ డిమాండ్ 700 నుంచి 800 టన్నుల మధ్య ఉండవచ్చన్నది అంచనా.
యాంఫీ ప్రచార కర్తలుగా సచిన్, ధోని
భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనిలు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) ప్రచార కర్తలుగా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు జనవరి 30న యాంఫీ ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం.. సచిన్, ధోనిలు 'మ్యూచువల్ ఫండ్స్ సహి హై' క్యాంపైన్కు ప్రచారం చేయనున్నారు. ఈ పరిశ్రమలోని ప్రొడక్ట్ల గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రచారం కొనసాగనుంది. ఈ విషయమై భారత్ రత్న అవార్డు గ్రహీత సచిన్ మాట్లా డుతూ.. 'క్రమశిక్షణ, దీర్ఘకాలిక వ్యూహం అనేవి విజయానికి మూలస్తంభాలుగా భావిస్తున్నాను. అది ఏ క్రీడైనా, వ్యక్తిగత పెట్టుబడి అయినా సరే' అని వ్యాఖ్యానించారు.
ప్రపంచంలో అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు
బెంగళూరు: ప్రపంచ వ్యాప్తం గా అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. ఈ మేరకు టామ్టామ్ ఓ నివేదిక ను వెల్లడించింది. 57 దేశాల్లోని 416 నగరాల్లో నెలకొన్న ట్రాఫిక్ పరిస్థితులపై టామ్టామ్ (టామ్2) అనే సంస్థ టామ్టామ్ టాప్రిక్ ఇండెక్స్ పేరిట ఓ నివేదికను వెలువరించింది. దీని ప్రకారం బెంగళూరు వాసులు ట్రాఫిక్లో సగటున 71 శాతం ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నట్లు తెలిపింది. బెంగళూరు వాసులు ఏడాదిలో సగటున 10 రోజుల 3 గంటల పాటు (243 గంటలు) ట్రాఫిక్లో గడుపుతున్నట్లు పేర్కొంది. టాప్-10 జాబితాలో ముంబై, పుణే, ఢిల్లీ నగరాలు వరుసగా 4, 5, 8 స్థానాల్లో నిలిచాయి. ట్రాఫిక్ రద్దీ ముంబైలో 65 శాతంగా, పుణేలో 59 శాతంగా, ఢిల్లీలో 56 శాతంగా ఉంది. టాప్-10లో మనీలా (ఫిలిప్పీన్స్), బొగోటా (కొలంబియా), మాస్కో (రష్యా), లిమా (పెరు), ఇస్తాంబుల్ (టర్కీ), జకార్తా (ఇండోనేసియా) ఉన్నాయి.
ఇక దక్షిణ మధ్య రైల్వేలోనూ... ప్రైవేటు రైళ్లు
పట్టాలపై ఇక ప్రైవేటు రైళ్లు కూత పెట్టనున్నాయి. ప్రస్తుతం లక్నో-ఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై మార్గాల్లో పరుగులు తీస్తున్న తేజస్ ప్రైవేటు రైళ్ల తరహాలోనే దక్షిణ మధ్య రైల్వేలోనూ పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో రైళ్లను నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ముంబై-పుణే-హైదరాబాద్ మార్గంలో హైస్పీడ్ రైల్ కారిడార్ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సికింద్రాబాద్-నాగ్పూర్, సికింద్రా బాద్ - విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటు కు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని మార్గాల్లో ప్రైవేటు ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. సుమారు 15 కొత్త రైళ్లు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. వీటిలో హైదరాబాద్ మీదుగా వెళ్లేవి కూడా ఉంటాయి. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. రైల్వే లైన్లు, సరుకు రవాణా, రైల్వేల భద్రత, రైళ్ల నిర్వహణ వంటి పరిమితమైన బాధ్యతలు మాత్రమే రైల్వేలకు పరిమితం కానున్నాయి.
ముందస్తు బెయిల్కి 'పరిమితి' ఉండదు
ఏ కేసులోనైనా నిందితులకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు కొనసాగుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సమయంలో నిర్దిష్ట కాల వ్యవధి వంటి షరతులేవీ ఉండవని స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో కోర్టులకు ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని వెల్లడించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా ఆధ్వర్యంలో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం జనవరి 29వ తేదీన ఈ మేరకు తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ పొందిన నిందితుడు/ నిందితురాలు కోర్టు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినా, సదరు వ్యక్తిపై అభియోగాలు నమోదైనప్పటికీ సాధారణ పరిస్థితుల్లో కేసు విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ కొనసాగుతుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
అబార్షన్ కాల పరిమితి పెంపు
అబార్షన్ చేయించుకోవడానికి ప్రస్తుతం ఉన్న 20 వారాల గరిష్ట కాలపరిమితి గడువును 24 వారాలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచార కేసుల్లో గర్భం దాల్చిన మహిళలు, రక్తసంబంధీకుల ద్వారా గర్భం దాల్చిన మహిళలు, దివ్యాంగులు, మైనర్లు వంటి ప్రత్యేక కేటగిరి మహిళలకే 24 వారాల గడువు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జనవరి 29న జరిగిన కేంద్ర కేబినెట్ దీనికి సంబంధించిన బిల్లుకి ఆమోద ముద్ర వేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగెన్సీ యాక్ట్, 1971కి సవరణలు చేస్తూ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగన్సీ (సవరణ) బిల్లు, 2020ని కేంద్రం రూపొందించింది. జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
మసీదులో మహిళలు ప్రార్థన చేయొచ్చు: ఏఐఎంపీఎల్బీ
న్యూఢిల్లీ: మసీదుల్లోకి వచ్చి ముస్లిం మహిళలు ప్రార్థనలు చేయడం ఇస్లాంలో ఆమోదనీయమేనని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) వెల్లడించింది. ముస్లిం పురుషుల మాదిరిగానే ముస్లిం మహిళలు కూడా నమాజ్ చేసేందుకు మసీదుకు రావొచ్చని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు జనవరి 29న అఫిడవిట్ సమర్పించింది. మసీదుల్లోకి మహిళలను అనుమతించేలా ఆదేశించాలని కోరుతూ యాస్మీన్ జుబేర్ అహ్మద్ పీర్జాదే దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఏఐఎంపీఎల్బీ ఈ అఫిడవిట్ అందించింది. ఈ అంశాన్ని కూడా శబరిమల సహా మతపరమైన ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏర్పాటైన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది. 'ఇస్లాం గ్రంథాలు, ఇతర సంప్రదాయాలు, విశ్వాసాల ప్రకారం మసీదుల్లోకి మహిళలు వచ్చి నమాజ్ ఆచరించడం ఆమోదనీయమే. మహిళలు మసీదుల్లోకి స్వేచ్ఛగా రావొచ్చు. అలా రావాలా? వద్దా? అని నిర్ణయించుకునే హక్కు ఆ మహిళలకు ఉంది.
భారత్కు అరుదైన ఆఫ్రికా చిరుతలు
అరుదైన ఆఫ్రికా చిరుతలను భారత్కు తీసుకొచ్చి.. అవి జీవిం చేందుకు అనువైన వాతావర ణాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. భారత్లో చిరుతలు అంతరించిపోతున్న నేపథ్యంలో నమీబియా నుంచి చిరుతలు తీసుకుని వచ్చేం దుకు, మనదేశంలోనే దానికి తగిన ఆవాసం కల్పించేందుకు అనుమతించాలంటూ జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ) సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతత్వం లోని ధర్మాసనం.. ఆఫ్రికా చిరుతలను తీసుకురావడంలో మార్గనిర్దేశం చేసేందుకు జనవరి 28న ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ చిరుతల ఆవాసానికి అనువైన ప్రదేశంపై కమిటీ సర్వే చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
సాంకేతికత వినియోగంలో... భారత్కు ఐరాస ప్రశంసలు
దేశంలోని వివిధ జన సమూహాల మధ్య ఉన్న తారతమ్యాలను తగ్గించడంలో సమర్థంగా వ్యవహరించిందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రశంసించింది. దీనికోసం డిజిటల్ వేదికను భారత్ సమర్థంగా వినియోగించుకుందని ఐరాస చేసిన అధ్యయనంలో తేలింది. అంతరాలను తగ్గించేందుకు మొబైల్ టెక్నాలజీతో ఆధార్ గుర్తింపు వ్యవస్థను అనుసంధానం చేసి వినియోగించు కున్న విధానం భవిష్యత్తులో వేరే దేశాల్లో అమలు చేస్తే బాగుంటుందని అధ్యయనంలో పేర్కొంది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం (డీఈఎస్ఈ) 'ది వరల్డ్ సోషల్ నివేదిక-2020' పేరిట నివేదికను విడుదల చేసింది. అన్ని రంగాల అభివద్ధి కోసం డిజిటల్ సాంకేతికతను భారత్ ఎలా వినియోగించుకుందో ఈ నివేదికలో పేర్కొంది.
బంగ్లాదేశ్ జైలు నుంచి ఏపీ మత్స్యకారుల విడుదల
పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి ఆ దేశ కోస్టుగార్డులకు చిక్కిన విజయనగరం జిల్లాకు చెందిన 8 మంది మత్స్యకారులకు విముక్తి లభించింది. పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన 8 మంది మత్స్యకారులు గతేడాది సెప్టెంబర్ 27న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లారు. సముద్రంలో బోటు మరమ్మతులకు గురికావడం, భారీ గాలుల కారణంగా అక్టోబర్ 2న భారత్ బోర్డర్ దాటి బంగ్లాదేశ్లోకి ప్రవేశించారు. అక్కడి కోస్టుగార్డులకు చిక్కి నాలుగు నెలలు జైలు జీవితం గడిపారు.
అంతర్జాతీయ సౌకర్యాలతో 'క్లీన్ వార్డ్' కేంద్రం
ఏ వైరస్ సోకినా ఒకేచోట వైద్య చికిత్స అందించే 'క్లీన్వార్డు' కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలతో దీన్ని ఏర్పాటు చేయనుంది. ముందుగా హైదరాబాద్లోని ఫీవర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయాలని అనుకున్నా, తర్వాత దాన్ని ఛాతీ ఆస్పత్రిలో ఐదెకరాల విశాలమైన స్థలంలో నెలకొల్పాలని నిర్ణయించింది. రూ.132 కోట్లు ఖర్చు పెట్టి వచ్చే ఏడాదికి దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో భూమి పూజ చేసి నిర్మాణం చేపట్టనుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది.
మాత వందన సప్త్లో ఏపీకి మొదటి ర్యాంకు
ప్రధానమంత్రి మాత వందన యోజన (పీఎంఎంవీవై) అమలులో భాగంగా 2019 డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 8 వరకు నిర్వహించిన 'మాత వందన సప్త్'లో ఆంధ్రప్రదేశ్కు మొదటి ర్యాంకు లభించింది. అలాగే పీఎంఎంవీవై ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2వ ర్యాంకును ఏపీ సాధించింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా జిల్లాల వారీ ప్రతిభలో కర్నూలుకు 2వ ర్యాంకు దక్కింది. కేంద్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ జనవరి 28న ప్రకటించిన 'పీఎంఎంవీవై' ర్యాంకుల్లో ఈ విషయం వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనులకు వెళుతూ సక్రమంగా వైద్య పరీక్షలకు రాని గర్భిణులను ఆస్పత్రులకు వచ్చేలా ప్రోత్సహించడంలో భాగంగా పీఎంఎంవీవైను ప్రవేశపెట్టారు.
ఇస్రో భువన్ పంచాయత్ వెబ్సైట్ ప్రారంభం
గ్రామపంచాయతీల అభి వద్ధి కోసం భారత అంత రిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన 'భువన్ పంచాయత్ జియో వి-3.0' ప్రారంభమైంది. బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో పీఎంవో సహాయ మంత్రి డాక్టర జితేంద్ర సింగ్, ఇస్రో అధ్యక్షుడు డా.కె.శివన్ జనవరి 28న ఈ వెబ్సైట్ను ఆవిష్కరించారు. భువన్ పంచాయత్ ద్వారా భూగర్భ జలాలు, విద్య, సామాజిక, వైద్య, భౌగోళిక అంశాలపై అందించే సమాచారం గ్రామపంచాయతీల అభివ ద్ధికి దోహదపడుతుందన్నారు.
ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో శాసనమండలిని రద్దు చేయాలని శాసనసభ తీర్మానించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన 'శాసనమండలి రద్దు' చట్టబద్ధ తీర్మానాన్ని శాసనసభ జనవరి 27న ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను సత్వరమే అమలు చేసేందుకు వీలుగా శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాజ్యాంగంలోని 169(1) అధికరణ కింద శాసన మండలిని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.
సీఏఏకు వ్యతిరేకంగా బెంగాల్ అసెంబ్లీ తీర్మానం
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ జనవరి 27న ఆమోదించింది. రాజ్యాంగానికి, మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్న పౌరసత్వ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ, రాజస్తాన్, పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే తీర్మానాలను ఆమోదించగా.. తాజాగా ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్ చేరింది.
బోడో సమస్య పరిష్కారానికి త్రైపాక్షిక ఒప్పందం
బోడోలాండ్ ప్రజలకు ప్రత్యేక రాజకీయ, ఆర్థిక హక్కులను కల్పించే 'త్రైపాక్షిక ఒప్పందం'పై కేంద్రప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, బోడో ఉద్యమ సంస్థలు జనవరి 27న సంతకాలు చేశాయి. కేంద్ర హౌంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సోం సీఎం శర్బానంద సోనోవాల్, బోడో సంఘాల నేతలు, ఉన్నతాధికారులు న్యూఢిల్లీలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రం, లేదా కేంద్ర పాలిత ప్రాంతం కోసం చాలాకాలం నుంచి బోడో ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాంటిది చేయకపోయినా, ఇతర అంశాలతో తాజా ఒప్పందం ఖరారైంది.
త్రైపాక్షిక ఒప్పందం-ప్రధానాంశాలు
ఆయుధాలు విడిచిపెట్టే ఎన్డీఎఫ్బీ ఉద్యమకర్తలకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం కల్పిస్తాయి. వచ్చే మూడేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 750 కోట్ల చొప్పున రూ.1,500 కోట్లతో ఒక ఆర్థిక పథకాన్ని అమలు చేస్తాయి.
బోడోల్యాండ్ను ఇకపై బోడోల్యాండ్ ప్రాదేశిక మండలి (బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్-బీటీసీ)గా పిలుస్తారు. రైలు పెట్టెల తయారీ కర్మాగారాన్ని, జాతీయ క్రీడల విశ్వవిద్యాలయాన్ని, బరామాలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతారు. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన వాటిలో అస్సాంలో ప్రధాన తీవ్రవాద సంస్థ నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్డీఎఫ్బీ), ప్రత్యేక బోడో రాష్ట్రం కోసం పోరాడుతున్న ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ (ఏబీఎస్యూ), యునెటైడ్ బోడో పీపుల్స్ ఆర్గనైజేషన్ సంస్థలు ఉన్నాయి. అయితే గత 27 ఏళ్ళలో ఇలా ఒప్పందంపై సంతకాలు చేయడం ఇది మూడోసారి.
ఎయిరిండియా విక్రయానికి కేంద్రం సిద్ధం
తీవ్ర నష్టాల్లోకి కూరుకు పోయిన ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాను పూర్తిగా విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సంస్థ లోని మొత్తం 100 శాతం వాటాను వ్యూహాత్మక విక్రయం ద్వారా అమ్మేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా ప్రాథమిక విధివిధానా లను జనవరి 27న విడుదల చేసింది. బిడ్డింగ్ పత్రంలోని వివరాల ప్రకారం... ఎయిరిండియాతో పాటు, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో 100 శాతం, సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి నిర్వహిస్తున్న గ్రౌండ్హ్యాండ్లింగ్ సేవల సంయుక్త సంస్థ ఏఐఎస్ఏటీఎస్లో ఉన్న 50 శాతం వాటాలను విక్రయిస్తారు. అలాగే యాజమాన్య హక్కులను బదలాయిస్తారు. ఎయిరిండియాకు ఇతర అనుబంధ సంస్థల్లో వాటాలను మాత్రం తాజాగా ప్రతిపాదించిన వాటా అమ్మకం నుంచి మినహాయించారు. వీటిని ప్రత్యేక సంస్థ ఎయిరిండియా అసెట్స్ హౌల్డింగ్ లిమిటెడ్(ఏఐఏహెచ్ఎల్)కు బదలాయిస్తారు.
భారత్, బ్రెజిల్ మధ్య 15 ఒప్పందాలు
ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి, వ్యూహాత్మక సంబంధాలను విస్తృతం చేయ డానికి భారత్, బ్రెజిల్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి. ఇందులో భాగంగా, రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యవసాయం, పౌర విమానయానం, ఇంధన, ఆరోగ్యం, పరిశోధన రంగాల్లో మరింతగా సహకరించుకునేందుకు, ఉగ్రవాదానికి వ్యతిరేకం గా కలిసికట్టుగా పనిచేసేందుకు అంగీకరించాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో జనవరి 25న జరిగిన కార్యక్రమంలో 15 ఒప్పందాలు చేసుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు జయిర్ బొల్సనారో సమక్షంలో రెండు దేశాల అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.
భారత 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారతదేశ 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని న్యూఢిల్లీలోని రాజ్పథ్లో ఘనంగా జరిగాయి. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే భారతీయ సంస్క తి సంప్రదాయాలు, మన సైనిక సత్తాని ప్రపంచానికి చాటి చెప్పే ఆయుధ ప్రదర్శనలు, వివిధ రాష్ట్రల నుంచి తీసుకువచ్చిన శకటాలతో పెరేడ్ నిర్వహించారు. భారత 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరా ప్రత్యేక అతిథిగా విచ్చేశారు.
ప్రాంతీయం
సమత హత్యోదంతంలో దోషులకు మరణ శిక్ష
తెలంగాణలో సంచలనం రేపిన సమత అత్యాచారం, హత్య కేసులో నిందితులు షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ మఖ్దూమ్లను దోషులుగా నిర్ధారించిన ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు.. వారికి ఉరి శిక్ష విధించింది. అలాగే ముగ్గురికి కలిపి రూ.26 వేల జరిమానా విధిస్తూ తుది తీర్పు వెలువరించింది. ఆదిలాబాద్లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసులో న్యాయమూర్తి విచారణ జరిపారు. డిసెంబర్ 11న ఈ ప్రత్యేక కోర్టు ఏర్పడింది. బాధితురాలు, నిందితుల తరఫున వాదప్రతివాదనలు విన్న ప్రత్యేక కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని జనవరి 30న తుది తీర్పు వెలువరించారు.
పీఎం అవార్డు ప్యానెల్కు సిరిసిల్ల కలెక్టర్ ఎంపిక
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ డి.కష్ణ భాస్కర్కు అరుదైన అవకాశం లభించింది. 2020లో ప్రధాన మంత్రి అవార్డుకు సంబంధించి సవరణలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటైన ప్యానెల్ కమిటీలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ డి.కష్ణ భాస్కర్కు చోటు దక్కింది. సుపరిపాలన అందించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 15 జిల్లాల కలెక్టర్లతో ప్యానెల్ కమిటీని నియమించింది. ఇందులో సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు చోటు దక్కింది. దక్షిణ భారతదేశం నుంచి నలుగురు కలెక్టర్లకు ఈ అవకాశం వచ్చింది. గ్రామీణాభివద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్యాభివద్ధికి సంబంధించి ప్రధాన మంత్రి అవార్డులో మార్పులు, చేర్పులకు సంబంధించిన సలహాలు, సూచనలను కలెక్టర్ కష్ణభాస్కర్ ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి కష్ణభాస్కర్ ఒక్కరికే ఈ అవకాశం రావడం విశేషం.
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానమందిరం ప్రారంభం
ప్రపంచంలోనే అతిపెద్దదైన ధ్యానమందిరం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా గ్రామంలో ప్రారంభమైంది. శ్రీరామ చంద్ర మిషన్ గురువు కమలేశ్ డీ పటేల్ (దాజీ) జనవరి 28న ఈ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ ధ్యాన కేంద్రాన్ని హార్ట్ఫుల్నెస్ సంస్థ గ్లోబల్ హెచ్ క్వార్డర్గా ప్రకటించారు. ఈ సందర్భంగా దాజీ మాట్లాడుతూ... సమాజంలో ప్రస్తుతం నెలకొన్న అశాంతి, విద్వేషపూరిత వాతావరణం నేపథ్యంలో మానవ జాతి మేలు కోసం దేశంలోని యోగా, ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ ఒకే ఛత్రం కిందకు రావాల్సిన అవసరముందని అభిప్రాయ పడ్డారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రంలో ఏక కాలంలో లక్ష మంది వరకు ధ్యానం చేసుకునేందుకు సౌకర్యాలున్నాయి.
వార్తల్లో వ్యక్తులు
అమెరికాలో భారత రాయబారిగా తరణ్జీత్
అమెరికాలో భారత రాయబారిగా తరణ్జిత్ సంధు నియమితుల య్యారు. 1988 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి (ఐఎఫ్ఎస్) అయిన సంధు గతంలో రెండు పర్యాయాలు అమెరికాలో భారత్ తరపున 2013-2017 మధ్య డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్గా పనిచేశారు. ఇప్పటివరకూ అమెరికా లో భారత రాయబారిగా ఉన్న హర్షవర్ధన్ ష్రింగ్లా విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా నియమితులవడంతో ఆ స్థానంలో సంధు బాధ్యతలు చేపడతారు. సంధు ప్రస్తుతం శ్రీలంకలో భారత హైకమిషనర్గా ఉన్నారు.
సింగరేణి సీఎండీకి భారతీయ మహంతం వికాస్ పురస్కారం
ఆసియాలో వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అత్యంత ప్రతిభావంతులకు ఇచ్చే భారతీయ మహంతం వికాస్ పురస్కారానికి సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఎంపికయ్యారు. థారులాండ్కు చెందిన అంతర్జాతీయ పత్రిక ఆసియా వన్, యూఆర్ఎస్ మీడియా ఇంటర్నేషనల్ గ్రూప్ 2019-20 సంవత్సరానికిగాను సింగరేణి సీఎండీ శ్రీధర్ను 'ద లీడర్' పేరుతో ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. బ్యాంకాక్లో ఫిబ్రవరి 7న జరగనున్న 13వ ఏసియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరం సదస్సులో ఈ పురస్కారాన్ని బహూకరించనున్నారు.
బాస్కెట్బాల్ దిగ్గజం బ్రయాంట్ దుర్మరణం
అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం కోబ్ బ్రయాంట్(41) ఇకలేరు. జనవరి 26న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తన కూతురు జియానా(13)తో సహా ఆయన దుర్మరణం పాలయ్యాడు. అమెరికా ప్రభుత్వాధికారుల వివరాల ప్రకారం.. పైలట్, బ్రయాంట్, జియానా సహా మొత్తం 9 మందితో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నుంచి బయలుదేరిన సికోర్స్కై ఎస్-76 హెలికాప్టర్ కాలిఫోర్నియా సమీపంలోని క్యాలాబసస్ కొండను ఢీ కొట్టింది. వెంటనే అది పేలడంతో ప్రయాణిస్తున్న వారంతా దుర్మరణం పాలయ్యారు.
అవార్డులు
పక్షి ప్రేమికుడు కార్తీక్కు అంతర్జాతీయ అవార్డు
తిరుపతికి చెందిన పక్షి ప్రేమికుడు కార్తీక్ సాయికి అంతర్జాతీయ అవార్డు లభించింది. మధ్య తూర్పు దేశమైన సిప్రస్కు చెందిన సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ సంస్థ ఆయనకు 'గాండ్ ప్రోగ్రెస్ అవార్డు ప్రకటించింది. హైదరాబాద్లో జనవరి 26న నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్నారు. క్తారీక్ శేషాచలం అడవుల్లో 169 రకాల పక్షుల ఫొటోలను తన కెమెరాలో బంధించారు.
మరణానంతరం 'పద్మవిభూషణ్'పురస్కారాలు
దివంగతులైన అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, జార్జి ఫెర్నాండెజ్, విశ్వేశతీర్థ స్వామీజీ, అరుణ్ జైట్లీలకు పద్మవిభూషణ్ పురస్కారాలు వరించాయి.
1. అరుణ్జైట్లీ : 2019 మేలో ఈయన మతి చెందారు. 2014-19 సంవత్సరాల మధ్య కేంద్ర కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సుప్రీంకోర్టు లాయర్ కూడా. జైట్లీ ఆర్థిక మంత్రిగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వంటి పలు విధానాలను ప్రవేశపెట్టారు. సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ను విలీనం చేశారు.
2. సుష్మా స్వరాజ్: బీజేపీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు లాయర్గా పనిచేసిన సుష్మా స్వరాజ్ గత ఏడాది చనిపోయారు. ప్రధాని మోదీ కేబినెట్లో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసి అందరి ప్రశంసలు పొందారు. ఇందిరాగాంధీ తర్వాత విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ సుష్మా.
3. జార్జి ఫెర్నాండెజ్: కార్మిక నాయకుడు, రాజకీయవేత్త, జర్నలిస్టు అయిన జార్జి మాథ్యూ ఫెర్నాండెజ్ లోక్సభలో అత్యధిక కాలం సభ్యునిగా కొనసాగిన వారిలో ఒకరు. 1967లో ముంబైలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమై నప్పటికీ బీహార్ నుంచే ఎక్కువ కాలం ప్రజాప్రతినిధిగా కొనసాగారు.
4. శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ: ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరు. దాదాపు 8 దశాబ్దాలపాటు ఆధ్యాత్మిక సేవ చేశారు.
పర్యావరణవేత్త సుఖ్దేవ్కు టైలర్ పురస్కారం
ప్రముఖ భారత పర్యావరణవేత్త, యూఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్(యూఎన్ఈపీ) రాయబారి పవన్ సుఖ్దేవ్ను ప్రతిష్ఠాత్మక 'టైలర్ పురస్కారం-2020' వరించింది. పర్యావరణ రంగంలో నోబెల్గా పరిగణించే ఈ పురస్కారాన్ని ప్రఖ్యాత పర్యావరణ బయాలజిస్ట్ గ్రెట్చెన్ డైలీతో కలసి సుఖ్దేవ్ సంయుక్తంగా అందకోనున్నారు. సుఖ్దేవ్ చేపట్టిన 'గ్రీన్ ఎకానమీ'ఉద్యమానికి గాను ఈ అవార్డు దక్కింది. పర్యావరణ క్షీణత, దాని ఆర్థిక పర్యవసనాలను కార్పొరేట్లు, రాజకీయ నిర్ణయాధికారుల ద ష్టికి తీసుకొచ్చేందుకు సుఖ్దేవ్ విశేష క ాషి చేశారు. 2020, మే 1న ఈ పురస్కారాన్ని సుఖ్దేవ్, గ్రెట్చెన్ స్వీకరించనున్నారు. ఈ అవార్డు కింద బంగారు పతకాలతో పాటు సుమారు రూ.కోటిన్నర నగదు బహుమతిని వీరు పంచుకుంటారు.
తెలంగాణ యువకుడికి యంగ్ సైంటిస్టు అవార్డు
పత్తిలో అధిక దిగుబడి సాధించేందుకు చేసిన పరిశోధనకు గాను తెలంగాణలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం దుబ్బతండాకు చెందిన బానోతు భిక్షపతికి 'యంగ్ సైంటిస్టు మెరిట్ అకడమిక్ అవార్డు' లభించింది. జాతీయ పత్తి పరిశోధన అభివద్ధి సంస్థ, హర్యానాకు చెందిన ఇస్సార్ సంస్థల ఆధ్వర్యంలో ఒడిషా రాజధాని భువనేశ్వర్లో 2020, జనవరి 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ సదస్సులో భిక్షపతికి ఈ అవార్డు అందజేశారు. ఎల్హెచ్డీపీ-1 అనే పత్తి రకం అధిక సేంద్రియ పద్ధతిలో ఎకరానికి 64 వేల మొక్కలు నాటి 20 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చేలా పరిశోధన చేసినందుకు భిక్షపతికి ఈ అవార్డు దక్కింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
సూర్యుడి ఉపరితల ఛాయచిత్రాలు విడుదల
అమెరికాలోని హవాయి ప్రాంతంలో ఏర్పాటైన సరికొత్త 'ద ఐనోయీ సోలార్ టెలిస్కోపు'తో తీసిన సూర్యుడి ఉపరితలం ఛాయాచిత్రాలను అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ జనవరి 30న విడుదల చేసింది. సూర్యుడికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అన్ని చిత్రాల్లోకెల్లా ఇవే అత్యంత స్పష్టమైనవి. సూర్యుడికి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు ఐనోయీ టెలిస్కోపు ఎంతో ఉపయోగపడుతుందని అంచనా. ఈ విషయమై సైన్స్ ఫౌండేషన్ డెరైక్టర్ ఫ్రాన్స్ కోర్డోవా మాట్లాడుతూ.. సూర్యుడి అయస్కాంత క్షేత్ర తీరుతెన్నులను ఐనోయీ టెలిస్కోపు వివరణాత్మకంగా తెలుసుకోగలదని, భవిష్యత్తులో సౌర తుపానులను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చునని తెలిపారు.
క్రీడలు
ఒడిశాలో ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు
2020, ఫిబ్రవరి 22 నుంచి మార్చి 1 వరకు జరగబోయే ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలకు ఒడిశా ఆతిథ్య మివ్వనుంది. గతేడాది ఒలింపిక్ క్వాలిఫయర్స్తో సహా పలు జాతీయస్థాయి హాకీ టోర్నీలకు ఆతిథ్యమిచ్చిన ఒడిశా రాజధాని భువనేశ్వర్ నగరంలో ఈ క్రీడలు జరుగనున్నట్లు ఆ రాష్ట్ర క్రీడా మంత్రి తుషార్కంటి బెహెరా జనవరి 27న తెలిపారు. 17 విభాగాల్లో జరగబోయే ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న 100 యూనివర్సిటీల నుంచి 4వేల మందికిపైగా క్రీడాకారులు పాల్గొననున్నారు.
రన్నరప్ సౌరవ్ ఘోషాల్
పిట్స్బర్గ్ ఓపెన్ టోర్నీలో భారత స్క్వాష్ క్రీడాకారుడు సౌరవ్ ఘోషల్ రన్నరప్గా నిలిచాడు. అమెరికాలోని పిట్స్బర్గ్లో జనవరి 26న జరిగిన ఫైనల్లో ఘోషాల్ 7-11, 4-11, 9-11తో టాప్ సీడ్ ఫేర్స్ డస్సోకీ (ఈజిప్ట్) చేతిలో ఓడి రన్నరప్గా నిలిచాడు.