అంతర్జాతీయం
బ్రిటన్ నూతన వీసా విధానం
ప్రపంచం నలుమూలల నుంచి అత్యంత ప్రతిభావంతులు, మెరుగైన నైపుణ్యాలున్న వ్యక్తులను ఆకర్షించేలా బ్రిటన్ సరికొత్త వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. తగిన నైపుణ్యాలు లేనివారెవరూ పని కోసం బ్రిటన్ గడ్డపై అడుగు పెట్టకుండా అది నిలువరించనుంది. నూతన వీసా విధానాన్ని బ్రిటన్ హౌం మంత్రి ప్రీతీ పటేల్ 2020 ఫిబ్రవరి 19న ఆవిష్కరించారు.
పాక్ను గ్రే లిస్ట్లోనే కొనసాగించాలి: ఎఫ్ఏటీఎఫ్
ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైన పాకిస్తాన్ను 'గ్రే లిస్ట్'లోనే కొనసాగించాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ఉపకమిటీ సిఫారసు చేసింది. దీనిపై ఫిబ్రవరి, 21వ తేదీన జరిగే ఎఫ్ఏటీఎఫ్ అత్యున్నత స్థాయి సమావేశం అంతిమ నిర్ణయం తీసుకోనుంది. ఎఫ్ఏటీఎఫ్లో 39 సభ్య దేశాలు ఉన్నాయి. గ్రే లిస్ట్ నుంచి తప్పించుకొని, వైట్ లిస్ట్కు చేరుకోవడానికి పాక్కు 12 దేశాల మద్దతు అవసరం.
అఫ్గానిస్తాన్ అధ్యక్షుడిగా అష్రాఫ్ ఘనీ ఎన్నిక
అఫ్గానిస్తాన్ అధ్యక్షుడిగా అష్రాఫ్ ఘనీ మరోసారి ఎన్నికయ్యారు. అఫ్గానిస్తాన్ అధ్యక్ష పదవికి 2019, సెప్టెంబర్ 28న జరిగిన ఎన్నికల ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం దాదాపు ఐదు నెలల తర్వాత 2020 ఫిబ్రవరి 18న వెలువరించింది. ఈ ఫలితాల్లో ఘనీకి 50.64 శాతం ఓట్లు లభించాయని ఎన్నికల సంఘం అధ్యక్షురాలు నూరిస్తానీ తెలిపారు. అఫ్గాన్ జనాభా 3.50 కోట్లు కాగా ఓటర్లు 96 లక్షలు. వీటిలో ఎన్నికల్లో పోలైంది 27 లక్షలు.
కొత్త పటాల్లో కశ్మీర్ను 'వివాద భూభాగం'గా చూపిన గూగుల్
ప్రపంచ దేశాల సరిహద్దులతో రూపొందించిన పటాల్లో కశ్మీర్ను వివాద భూభాగంగా గూగుల్ చూపించింది. భారత దేశం నుంచి ఎవరైనా 'గూగుల్ మ్యాప్స్' లోని ఈ పటాన్ని వీక్షిస్తే కశ్మీర్ పూర్తిగా భారతదేశ నియంత్రణలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇతర దేశాల నుంచి చూస్తే మాత్రం చుక్కలతో కూడిన రేఖగా ఉంటుంది. అది వివాదాస్పద భూభాగమని దాని అర్థం. పటాన్ని ఏ దేశం నుంచి చూస్తున్నారనేది ఆధారంగా చేసుకుని మ్యాపుల్ని చిత్రీకరిం చారు. ఈ ప్రకారం పాకిస్థాన్ నుంచి గూగుల్ మ్యాపును చూసిన వారికి కశ్మీర్ అనేది వివాద భూమిగా కనిపిస్తుందని ప్రముఖ పత్రిక 'వాషింగ్టన్ పోస్ట్' బయట పెట్టింది. ఒక ప్రాంతాన్ని వేర్వేరు దేశాలు తమవిగా చెప్పేటప్పుడు ఆ విషయం పటంలో ప్రతి ఫలించేలా చూడడం తమ విధానమని, గూగుల్ వెల్లడించింది.
పోర్చుగీసు అధ్యక్షుడు భారత పర్యటన
పెట్టుబడులు, రవాణా, ఓడరేవులు, కర్మాగారాలు, మేధో హక్కులు వంటి రంగాల్లో సహకారం అందించుకునేందుకు భారత్, పోర్చుగల్ మధ్య 7 ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధాని నరేంద్రమోదీతో పోర్చుగీసు అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌసా 2020 ఫిబ్రవరి 14న న్యూఢిల్లీలో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా 7 ఒప్పందాలు కుదిరాయి. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పోర్చుగీసు అధ్యక్షుడు డిసౌసా భారత్కు వచ్చారు.
'కశ్మీర్పై బ్రిటన్ ఎంపీల బృందం' చైర్పర్సన్ ఈ-వీసా రద్దు
బ్రిటన్ లేబర్ పార్టీ పార్లమెంటు సభ్యురాలు, 'ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ ఫర్ కశ్మీర్' చైర్పర్సన్ డెబీ అబ్రహాంకు ఢిల్లీ విమానాశ్రయంలో చుక్కెదురైంది. జమ్మూ-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దును వ్యతిరేకిస్తున్న ఆమె ఈ-వీసాను భారత ప్రభుత్వం రద్దు చేసింది. డెబీకి 2020 వరకూ గడువున్న ఈ-వీసాను 2019 అక్టోబరులో భారత్ మంజూరు చేసింది. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో- 'బ్రిటన్ ఆల్ పార్లమెంటరీ గ్రూప్ ఫర్ కశ్మీర్'కు ఆమె ఛైర్పర్సన్గా నియమితులయ్యారు. ఈ క్రమంలోనే ఆమె వీసాను భారత్ రద్దు చేసింది.
అమెరికన్ సీహాక్ హెలికాప్టర్ల కొనుగోలుకు ఆమోదం
అమెరికా నుంచి 24 మల్టీ-రోల్ ఎంహెచ్-60 సీహాక్ (రోమియో) హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి కేబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ (సిసిఎస్) 2020 ఫిబ్రవరి 19న ఆమోదం తెలిపింది. 2.4 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయనున్న ఈ హెలికాప్టర్లు ప్రస్తుతం భారత్ వినియోగిస్తున్న సీకింగ్ హెలికాప్టర్ల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి. ఈ హెలికప్టర్లతో భారత్ నావికా దళ సామర్థ్యం మరింత పెరుగనుంది.
జాతీయం
సైన్యం నూతన ప్రధాన కార్యాలయం 'థల్ సేనా భవన్'
భారత సైన్యం కోసం ఢిల్లీలో నిర్మించనున్న నూతన ప్రధాన కార్యాలయం 'థల్ సేనా భవన్'కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ 2020 ఫిబ్రవరి 21న శంకుస్థాపన చేశారు. ఏడంతస్తుల ఈ భవనాన్ని ఉదయించే సూర్యుడి డిజైన్తో నిర్మిస్తారు. త్రివిధ దళాధిపతి ఆధ్వర్యంలో పనిచేసే సైనిక వ్యవహారాల విభాగాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తారు.
ఐఆర్సీటీసీ మహాకాళ్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
ఐఆర్సీటీసీకి చెందిన మూడో ప్రైవేటు రైలు 'మహాకాళ్ ఎక్స్ప్రెస్'ను ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఫిబ్రవరి 16న వీడియో లింక్ ద్వారా ప్రారంభిం చారు. ఉత్తరప్రదేశ్లోని కాశీ, మధ్యప్రదేశ్లో ఉజ్జయిని, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్లడానికి ఈ మహాకాళ్ ఎక్స్ప్రెస్ను అందుబాటులోకి తెచ్చారు.
సైన్యంలో మహిళలకూ 'కమాండ్' బాధ్యతలు
సైనిక దళాల్లో లింగ వివక్షకు ముగింపు పలికే దిశగా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సైన్యంలో మహిళా అధికారులకు 'కమాండ్ హౌదా'లను ఇచ్చేందుకు మార్గం సుగమం చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ) మహిళా అధికారులందరికీ మూడు నెలల్లోగా 'శాశ్వత కమిషన్' (పర్మనెంట్ కమిషన్- పీసీ) మంజూరు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అతివల శారీరక పరమైన పరిమితుల కారణంగా కమాండ్ హౌదా ఇవ్వడంలేదన్న ప్రభుత్వ వాదనను తప్పుపట్టింది. ఇది లింగ వివక్ష అని, మూస ఆలోచన ధోరణి అని వ్యాఖ్యానించింది.
ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రిగా 2020 ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా మరో ఆరుగురితో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. మనీష్ శిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాశ్ గెహ్లౌత్, గోపాల్ రారు, రాజేంద్ర పాల్ గౌతం, ఇమ్రాన్ హుస్సేన్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
టైమ్స్ టాప్ 100లో భారత విద్యాసంస్థలు
ప్రపంచంలో అభివద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల్లోని అత్యున్నత 100 విశ్వవిద్యాలయాల జాబితాలో భారత్కు చెందిన 11 ఉన్నత విద్యాసంస్థలు చోటు దక్కించు కున్నాయి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీహెచ్ఈ) ఎమర్జింగ్ ఎకానమీస్ ర్యాంకింగ్స్- 2020లో ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఐఐఎస్సీ)కి 16వ ర్యాంక్ లభించింది. ఐఐటీ ఖరగ్పూర్కు 32, ఐఐటీ ఢిల్లీకి 38, ఐఐటీ మద్రాస్కు 63వ స్థానం లభించాయి. ఐఐటీ రోపార్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలకు కూడా తొలిసారిగా ఈ 100 ర్యాంకుల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అమతా విశ్వ విద్యాపీఠానికి కూడా చోటు దక్కింది.
బాలికా విద్యపై మహీంద్రా, నాందీ ఫౌండేషన్ సర్వే
దేశంలో బాలికల అక్షరాస్యతపై 'ది టీన్ ఏజ్ గర్ల్స్ (టీఏజీ)' ప్రాజెక్టులో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, నాందీ ఫౌండేషన్ సంస్థలు దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించాయి. 2019-20 సంవత్సరం లో దేశంలోని 600కుపైగా జిల్లాల్లో 74 వేల మంది టీనేజీ బాలికల్ని సర్వేలో భాగం చేశారు. 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల అమ్మాయిల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు 100 శాతం అక్షరాస్యత సాధించి ముందంజలో ఉన్నాయని ఈ సర్వే వెల్లడించింది. అక్షరాస్యత శాతం పెరిగితే.. మాతా శిశు మరణాలను 50 శాతం వరకూ తగ్గించ వచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
చెన్నై ఎస్ఆర్ఎంలో అంతర్జాతీయ సదస్సు
'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్'పై చెన్నైలోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 2020 ఫిబ్రవరి 17న అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు 5 రోజుల పాటు జరగనుంది. రిజిస్ట్రార్ డాక్టర్ సేతురామన్ సదస్సును ప్రారంభించారు.
'వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్-2020' పై అంతర్జాతీయ సదస్సు
'వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్-2020' అనే అంశంపై హైదరాబాద్లో జరిగిన 2వ అంతర్జాతీయ సదస్సు, ఎక్స్పోను 2020 ఫిబ్రవరి 17న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు.
అసోం ఒప్పందం అమలుపై ఉన్నతస్థాయి సంఘం సిఫార్సులు
అసోం అసెంబ్లీలో మూడింట రెండొంతుల స్థానాలు(67%) స్థానికులకే కేటాయించాలని ఉన్నతస్థాయి సంఘం సూచిం చింది. ప్రజల స్థానికతను గుర్తించేందుకు 1951వ సంవత్స రాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఎగువసభ అయిన శాసన మండలిని ఏర్పాటు చేయాలని, ఇతర రాష్ట్రాల వారు రాకుండా ఇన్నర్ లైన్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా 80 శాతం స్థానికులకే ఇవ్వాలని పేర్కొంది. అసోం ఒప్పందం అమలుపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విప్లవ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటయిన 13 మంది సభ్యుల నిపుణుల బృందం ఈ సూచనలు చేసింది.
ప్రాంతీయం
తెలంగాణ నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ
నీటిపారుదల శాఖను తెలంగాణ ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరిం చింది. భారీ, మధ్య, చిన్న తరహా నీటిపారుదల విభాగాలకు ముగింపు పలికింది. అన్ని విభాగాలకు కలిపి ఒక్కో జిల్లాకు ఒక్కో చీఫ్ ఇంజినీర్ను(సీఈ) నియమించింది. ఒక జిల్లా పరిధిలోని ప్రాజెక్టులను పాత జిల్లా వేదికగా ఒకే చోటికి చేర్చింది. ఈ మేరకు 2020 ఫిబ్రవరి 15న నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కరీంనగర్, హైదరాబాద్ పేర్లతో ఇద్దరు ఇంజినీర్ ఇన్ చీఫ్లను, పాత కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులు, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులకు కలిపి ఒక ఈఎన్సీని ఏర్పాటు చేశారు.
17వ బయో ఆసియా సదస్సు
17వ బయో ఆసియా అంత ర్జాతీయ సదస్సును 2020 ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు హైదరాబాద్లో నిర్వహిం చారు. ఆరోగ్య, ఔషధ, జీవ శాస్త్రాల రంగాల్లో స్టార్టప్ కం పెనీల అభివద్ధి కోసం స్విట్జర్లాండ్లోని బాసెల్ విశ్వవిద్యాల యంతో తెలంగాణ ప్రభుత్వ మహిళా పారిశ్రామికవేత్తల కేంద్రం (వి-హబ్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టు పరిశోధన సేవల సంస్థ అయిన సింజెన్ ఇంటర్నేషనల్ హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో తన మొదటి దశ పరిశోధన- అభివద్ధి కేంద్రాన్ని ప్రారంభించింది. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా శామీర్ పేట-మూడు చింతలపల్లి మండలంలోని జీనోం వ్యాలీలో బయోలాజికల్ ఇ-లిమిటెడ్ ఉత్పత్తి చేసిన టైఫాయిడ్ కంజుగేట్ టీకాను 2020 ఫిబ్రవరి 17న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. శరీర రోగ నిరోధక కణాలను చైతన్యవంతం చేయడం ద్వారా కేన్సర్కు చికిత్స అందించే ఇమ్యూనోథెరపీని అభివద్ధి చేసిన అమెరికన్ శాస్త్రవేత్త, పెన్సిల్వేనియా యూని వర్సిటీకి చెందిన డాక్టర్ కార్ల్ జూన్కు 2020 బయో ఆసియా జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. జీవశాస్త్ర రంగంలో విశేష కషి జరిపిన వారికి ఈ అవార్డు ఇస్తారు.
సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ కేబినెట్ తీర్మానం
పౌర సత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. కేరళ, పంజాబ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ అసెంబ్లీలోనూ ఇందుకు సంబంధించి తీర్మానం చేయాలని నిర్ణయించింది. ప్రగతిభవన్లో 2020 ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సుదీర్ఘంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
మరో 7 ప్రైవేట్ వర్సిటీలకు అనుమతి
తెలంగాణ రాష్ట్రంలో మరో 7 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం తాత్కాలిక అనుమతి(లెటర్ ఆఫ్ ఇంటెంట్-ఎల్ఒఐ) జారీ చేసింది. విద్యాశాఖ 2020 ఫిబ్రవరి 17న ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మల్లారెడ్డి మహిళా, టెక్ మహీంద్ర విశ్వవిద్యాలయాలకు ఎల్ఒఐలు జారీ చేశారు. చట్టంలోని నిబంధనలను పాటిస్తూ సిద్ధమైతే 6 నెలల తర్వాత వీటికి పూర్తిస్థాయి అనుమతి ఇస్తారు.
ప్రతి మంగళవారం ఆర్టీసీ సంక్షేమ మండళ్ల సమావేశం
అన్ని బస్ డిపోల్లో ప్రతి మంగళవారం సంక్షేమ మండళ్ల సమావేశం నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ప్రతి మంగళవారం డిపో స్థాయిలో, నెలకు ఒకసారి రీజియన్ స్థాయిలో, రెండు నెలలకు ఒకసారి జోనల్ స్థాయిలో, మూడు నెలలకు ఒకసారి కార్పొరేషన్ స్థాయిలో సంక్షేమ మండళ్ల సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
మామిడి హరికష్ణకు ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారం
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మది నోత్సవాన్ని పురస్కరిం చుకొని 2020 ఫిబ్రవరి 18న ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారాలను రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ ప్రదానం చేశారు. రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ సంచాలకుడు మామిడి హరికష్ణకు ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారం, ఒగ్గు కళాకారుడు చెట్టి కొమురయ్యకు విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. రూ.లక్షా నూట పదహారు చొప్పున నగదుతో పాటు జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ విస్తరణకు శంకుస్థాపన
తెలుగు రాష్ట్రాల్లో పలు అభివద్ధి పనులను కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రిమోట్ కంట్రోల్ లింక్ ద్వారా 2020 ఫిబ్రవరి 18న ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ విస్తరణ ప్రాజెక్టుకు, ఎర్రగుంట్ల-నంద్యాల సెక్షన్లో విద్యుదీకరణకు శంకుస్థాపన చేశారు. అలాగే గుంతకల్లు-కల్లూరు మధ్య పూర్తయిన రెండో లైన్ మార్గం, విద్యుదీకరణను జాతికి అంకితం చేశారు.
వార్తల్లో వ్యక్తులు
చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా సంజయ్ కొఠారీ
రాష్ట్రపతి కోవింద్ వద్ద కార్య దర్శిగా విధులు నిర్వహిస్తున్న సంజయ్ కొఠారీ నూతన చీఫ్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)గా నియమితులయ్యారు. సమా చార కమిషనర్గా ఉన్న బిమల్ జుల్కాను ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా ఎంపిక చేశారు. వీరిని ప్రధాని మోదీ అధ్యక్షతన ఉండే ఉన్నతస్థాయి కమిటీ ఎంపిక చేసింది. ఈ ఇరువురూ రిటైర్డు ఐఏఎస్ అధి కారులు. వీరితోపాటు సురేశ్ పటేల్ను విజిలెన్స్ కమిషనర్ గా, అనితా పండోవేని సమాచార కమిషనర్గా ఎంపిక చేశారు.
నాబార్డు ఛైర్మన్గా గోవిందరాజులు చింతల
నాబార్డు (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) చైర్మన్గా తెలుగు వారైన గోవింద రాజులు చింతల ఎంపికయ్యారు. నాబార్డు ఛైర్మన్ పదవి ఖాళీగా ఉండటంతో, బ్యాంక్స్ బోర్డు బ్యూరో(బీబీబీ) ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు ఎంపిక ప్రక్రియ నిర్వహించింది. 18 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది. వీరిలో అర్హతలు, అనుభవం ఆధారంగా గోవింద రాజులును ఛైర్మన్ పదవికి ఎంపిక చేసింది. గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరుకి చెందిన గోవింద రాజులు గుంటూరులో పాఠశాల విద్య నభ్యసించారు.
ఎన్ఎస్ఈ బోర్డు డైరెక్టర్గా కె.నరసింహమూర్తి
హైదరాబాద్కు చెందిన అకౌంటింగ్, బ్యాంకింగ్, ఆర్థిక వ్యవహారాల నిపుణులు కె. నరసింహమూర్తి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) బోర్డు డైరెక్టర్గా నియమితులయ్యారు. మూడేళ్ల కాలానికి ఆయన ఈ పదవిలో ఉంటారు.
ఐఓసీ తెలుగు రాష్ట్రాల ఈడీగా శ్రావణ్ ఎస్ రావు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్ శ్రావణ్ ఎస్ రావు బాధ్యతలు స్వీకరించారు. శ్రావణ్ ఎస్ రావు రెండు రాష్ట్రాలకు ఇండియన్ ఆయిల్ వ్యవహారాల అధిపతిగా వ్యవహరిస్తారు. ఆ పోస్టులో ఇప్పటి వరకు పని చేసిన రాహుల్ భరద్వాజ్ ముంబయిలోని మార్కెటింగ్ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు.
ఫెడరల్ కోర్టు న్యాయమూర్తిగా శ్రీశ్రీనివాసన్
అమెరికాలో కీలకమైన ఫెడరల్ సర్క్యూట్ కోర్టుకు ప్రముఖ భారతీయ అమెరికన్ న్యాయ మూర్తి శ్రీశ్రీనివాసన్ (52) నేతత్వం వహించనున్నారు. భారత్ నుంచే కాకుండా దక్షిణా సియా మూలాలతో ఈ స్థానాన్ని చేరుకున్న తొలి వ్యక్తి శ్రీశ్రీనివాసన్. అమెరికా అధ్యక్షు డిగా బరాక్ ఒబామా ఉన్నప్పుడు ఆయన పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానం కోసం రెండుసార్లు పరిగణనలోకి తీసు కున్నారు. ఛండీగఢ్లో జన్మించిన శ్రీశ్రీనివాసన్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎంబీఏ చేశారు. తర్వాత న్యాయవాద వత్తిలో ప్రవేశిం చారు. అమెరికా సుప్రీంకోర్టులో పలు కేసులు వాదించారు.
అవార్డులు
ఇన్ఫోసిస్ 'ఆరోహణ్ పురస్కారాలు'
వెనుకబడిన వర్గాల శ్రేయస్సు కోసం వివిధ ప్రాజెక్టులను రూపొందించిన 13 మందికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అవార్డులను ప్రకటించింది. కోల్కతాకు చెందిన ప్రతిమాదాస్ మహాపాత్రకు 'ఆరోహణ్ సోషల్ ఇన్నోవేషన్' పురస్కారం లభించింది. రక్తం తీయకుండానే మనిషి శరీరంలో హెమోగ్లోబిన్ స్థాయిని గుర్తించే పద్ధతిని ఆమె రూపొందించారు. డాక్టర్ బినిత, డాక్టర్ రాశి బెహరీ కలసి గన్యా జ్వరాన్ని ప్రారం భదశలోనే గుర్తించి చికిత్సలను అందించే ఉపకరణాలను ఆవిష్కరించారు. వివిధ ఆవిష్కరణలు చేసిన కేరళకు చెందిన రషీద్ విమల్, గోవింద్ పురస్కారాలకు ఎంపికయ్యారు. మానవ బిలాలను శుభ్రం చేసే రోబోలను నిఖిల్ తయారు చేశారు. చెన్నైకి చెందిన రామలింగం వెన్నునొప్పి రోగుల కోసం స్టాండింగ్ వీల్ ఛైర్ను రూపొందించారు. వీరందరికీ తలా రూ.20 లక్షల పురస్కారం, బంగారు పతకాలను బెంగళూరులో 2020 ఫిబ్రవరి 19న అందించి సత్కరించారు.
ఆహార పరిష్కారాలకు స్వీడన్ పురస్కారాలు
ప్రపంచ జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి పరిష్కారాలు సూచించేవారికి ఒక్కొక్కటి 10 లక్షల డాలర్ల(సుమారు రూ.7 కోట్లు) వంతున ప్రతి సంవత్సరం 2 పురస్కారాలు అందజేయనున్నట్లు స్వీడన్ ప్రకటించింది. ప్రపంచ ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బతీసేలా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. సుస్థిర ఆహారానికి తగిన పరిష్కారం చెప్పేవారికి ఒకటి, ఆహార రంగాన్ని సమూలంగా మార్చేసే నవ్యావిష్కరణలకు ఒకటి చొప్పున 2020 నుంచే పురస్కారాలను 'కర్ట్ బెర్జ్ఫోర్స్ ఫౌండేషన్' అందిస్తుంది.
ఎన్ఎండీసీ సీఎండీకి 'బిజినెస్ లీడర్షిప్' అవార్డు
ఎన్ఎండీసీ సీఎండీ ఎన్.బైజేంద్ర కుమార్కు 'బిజినెస్ లీడర్షిప్ అవార్డు 2020' లభించింది. ఢిల్లీలో జరిగిన 7వ పీఎస్యూ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రభుత్వరంగ సంస్థలకు సరైన మార్గదర్శ కత్వాన్ని అందించి వాటి సంస్ధాగత విలువను పెంపొందిం చడంతో పాటు వాటావార్లకు లాభాలు తెచ్చిపెట్టేందుకు కషి చేసిన వారికి ఏటా ఈ అవార్డులు ఇస్తున్నారు.
'ఈటీవీ భారత్'కు దక్షిణాసియా ఉత్తమ డిజిటల్ న్యూస్ స్టార్టప్ అవార్డు
మీడియా రంగంలో దూసుకెళుతున్న 'ఈటీవీ భారత్' దక్షి ణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ అవార్డును గెలుచు కుంది. డిజిటల్ మీడియా రంగంలో ఉత్తమ ఆవిష్కరణలకు గాను వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పబ్లిషర్స్ సంస్థ 'వాన్-ఇఫ్రా' ఈ పురస్కారాన్ని అందించింది. 2020 ఫిబ్రవరి 18, 19 తేదీల్లో ఢిల్లీలో జరిగిన దక్షిణాసియా డిజిటల్ మీడియా-2020 సదస్సులో ద క్వింట్ వ్యవస్థాపక డైరెక్టర్ రీతూ కపూర్ చేతుల మీదుగా 'ఈటీవీ భారత్' డైరెక్టర్ బహతి చెరుకూరి ఈ అవార్డును స్వీకరించారు.
ఆర్థిక అంశాలు
2020లో భారత్ వద్ధి 5.4 శాతమే: మూడీస్
భారత్ వద్ధి రేటు అంచనాల్ని మూడీస్ రేటింగ్ సంస్థ 5.4 శాతానికి తగ్గించింది. ఆర్థిక వ్యవస్థలో రికవరీ నెమ్మదిం చడంతో గతంలో అంచనా వేసిన 6.6 శాతం వద్ధి రేటు అంచనాల్లో భారీగా కోత విధించింది. 'ప్రస్తుత త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ దిశగా అడుగులు వేసింది. అయితే మేము గతంలో అంచనా వేసిన దాని కంటే నెమ్మదించింది. దీంతో 2020లో 5.4 శాతం, 2021లో 5.8 శాతం వద్ధి రేటు నమోదు కావొచ్చని తాజాగా సవరించాం. గత నవంబరులో వద్ధి రేటును వరుసగా 6.6 శాతం, 6.7 శాతంగా అంచనా వేశామ'ని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తెలిపింది.
ప్రపంచ వద్ధి 1% తగ్గొచ్చు: డన్ & బ్రాడ్స్ట్రీట్
కరోనా ప్రభావం జూన్ తరవాతా కొనసాగితే ప్రపంచ వద్ధి రేటు 1% క్షీణించే అవకాశం ఉందని డన్ & బ్రాడ్స్ట్రీట్ నివేదిక వెల్లడించింది. లూనార్ సెలవులతో మామూలుగానే జనవరిలో చైనాలో వ్యాపార కార్యకలాపాలు స్తబ్దుగా ఉంటాయి. ఈ విషయాన్ని దష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ వ్యాపార సంస్థలు చైనా నుంచి సరఫరాలను అధికంగా నిల్వ చేసుకుంటాయి. అందుకే ఇప్పటివరకు తయారీ సంస్థలపై కరోనా ప్రభావం పరిమితంగానే ఉంద'ని పేర్కొంది. మున్ముందు వైరస్ ఎంత త్వరగా అదుపులోకి వస్తుందనే విషయంపైనే ప్రపంచ వ్యాపారాలపై పడే ప్రభావం ఆధారపడి ఉంటుందని తెలిపింది.
సైన్స్ & టెక్నాలజీ
భారత్లో తొలి గేమింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
గేమింగ్, వీఎఫ్ఎక్స్, కంప్యూటర్ విజన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల కోసం భారత్లో తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్లో ఏర్పాటైంది. 'ఇమేజ్' పేరుతో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) దీనిని నెలకొల్పింది. ఈ రంగాల్లో మేధో సంపత్తిపై దష్టిసారించిన కంపెనీలకు ఇది తొలి ఇంక్యు బేషన్ సెంటర్. ఎస్టీపీఐ ఫెసి లిటీలో 10,000 చదరపు అడుగుల్లో దీనిని ఏర్పాటు చేశారు.
ర్యాపిడ్జెన్ పేరుతో ఇక్రిశాట్లో సరికొత్త వ్యవస్థ
హైదరాబాద్లోని అంత ర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్)లో 'ర్యాపిడ్జెన్' పేరుతో సరికొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ర్యాపిడ్జెన్ వ్యవస్థతో ఇప్పటి వరకూ పది పన్నెండేళ్ల సమయం పట్టే కొత్త వంగడాల సష్టిని అతితక్కువ సమయంలో సాధించవచ్చునని, ప్రభుత్వరంగ సంస్థల్లో ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు ఇదే తొలిసారని ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ పీటర్ కార్బెరీ 2020 ఫిబ్రవరి 14న వెల్లడించారు.
తక్కువ ఇంధనంతో పనిచేసే సరికొత్త రాకెట్ ఇంజిన్
అత్యంత తక్కువ ఇంధన వినియోగం.. తక్కువ బరువు.. సులభతర నిర్మాణం వంటి ప్రత్యేకతలుండే రాకెట్ల తయారీకి అనువైన సరికొత్త ఇంజిన్ నమూనాను వాషింగ్టన్ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటిని రొటేటింగ్ డిటోనేషన్ ఇంజిన్లుగా పిలుస్తారు. వీటితో రాకెట్ తయారు చేయడంపై ఇప్పటివరకూ ఎన్నో సంశయాలు న్నాయి. అయితే కంప్యూటర్ మోడల్ను రూపొందించడం ద్వారా ఈ అనుమానాలను శాస్త్రవేత్తలు పటాపంచలు చేశారు.
పాకిస్తాన్ రాద్-2 క్షిపణి పరీక్ష విజయవంతం
పాకిస్తాన్ 2020 ఫిబ్రవరి 18న నిర్వహించిన రాద్-2(Raad-II) క్రూయిజ్ క్షిపణి' పరీక్ష విజయవంతమైంది. అణుసామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణి రాద్-2ను 600 కిలోమీటర్ల పరిధిలో ప్రయోగించారు. ఈ క్షిపణి భూమిపై, సముద్రంలో పాక్ సైనిక 'నియంత్రణ సామర్థ్యం'ను పెంచింది. లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించేందుకు రాద్-2 ఆయుధ వ్యవస్థకు అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థను అనుసంధానించారని పాక్ మిలటరీ తెలిపింది.
కామెర్ల చికిత్సకు 'ఎన్లైట్'
కామెర్లు సోకిన నవజాత శిశువులకు అంతరాయం లేని, మెరుగైన చికిత్స అందించేందుకు సరికొత్త పరికరం ఆవిష్కతమైంది. ఐఐటీ హైదరాబాద్లో ప్రారంభమైన స్టార్టప్ కంపెనీ 'హీమాక్' ప్రతినిధులు అకిత కొల్లోజు, ప్రసాద్ ముద్దం 'ఎన్లైట్-360' పేరుతో దీన్ని అభివద్ధి చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన 'బయో ఆసియా' సదస్సులో 75 ఆవిష్కరణలతో పోటీపడి ఇది టాప్-5లో నిలిచింది.
క్రీడలు
సచిన్ టెండూల్కర్కు లారియస్ పురస్కారం
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు 'లారియస్ బెస్ట్ స్పోర్టింగ్ మూమెంట్' అవార్డు లభించింది. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం అనంతరం సచిన్ను భారత జట్టు సభ్యులందరూ తమ భుజాలపై మోసి మైదానంలో(క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎ నేషన్) కలియతిరిగారు. ఇప్పుడు ఆ సందర్భమే గత 20 ఏళ్లలో 'అత్యుత్తమ లారియస్ స్పోర్టింగ్ మూమెంట్'గా ఎంపికైంది. జర్మనీ రాజధాని బెర్లిన్లో 2020 ఫిబ్రవరి 18న(భారత కాలమానం ప్రకారం) జరిగిన కార్యక్రమంలో సచిన్కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా, మాజీ టెన్నిస్ స్టార్ బోరిస్ బెకర్ ఈ అవార్డును ప్రదానం చేశారు. రెండు దశాబ్దాల 'లారియస్ క్రీడా పురస్కారాల చరిత్ర'లో భారత్ లేదా భారత క్రీడాకారుడు ఒక అవార్డును గెలుచుకోవడం ఇదే తొలిసారి.
బెంగళూరు ఓపెన్ టోర్నీ విజేతగా రామనాథన్ జోడి
బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో రామ్కుమార్ రామనాథన్-పురవ్ రాజా(భారత్) జోడీ విజేతగా నిలిచింది. బెంగళూరులో 2020 ఫిబ్రవరి 15న జరిగిన ఫైనల్లో రామనాథన్-రాజా ద్వయం 6-0, 6-3తో లియాండర్ పేస్(భారత్)-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంటపై విజయం సాధించింది. విజేత రామ్-పురవ్లకు 9,300 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 6 లక్షల 65 వేలు)తోపాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
కెయిన్స్ కప్ అంతర్జాతీయ టోర్నీ విజేతగా హంపి
కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి విజేతగా నిలిచింది. అమెరి కాలోని సెయింట్ లూయిస్లో 2020 ఫిబ్రవరి 17న ముగిసిన ఈ టోర్నీలో హంపి ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని అలంకరించింది. 5.5 పాయింట్లతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జూ వెన్జున్(చైనా) రన్నరప్గా నిలువగా... 5 పాయింట్లతో మాజీ ప్రపంచ చాంపియన్ మరియా ముజిచుక్(ఉక్రెయిన్) మూడో స్థానాన్ని సంపాదించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి హారిక 4.5 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచింది.
పీవీ సింధు పేరుతో అకాడమీ
ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు పేరుతో తమిళనాడులో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు కానుంది. చెన్నైలోని కోలపాక్కంలో ఒమెగా ఇంటర్నేషనల్ స్కూల్లో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అకాడమీతో పాటు స్టేడియానికి ఆమె పేరు పెట్టారు. 2020 ఫిబ్రవరి 19న పునాది రాయి వేసిన సింధు ఈ నిర్మాణాన్ని ప్రారంభించింది. రెండేళ్లలో పూర్తి కానున్న ఈ అకాడమీలో ఎనిమిది కోర్టులు ఏర్పాటు చేయనున్నారు.
భారత్లో 2022 ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీ
భారత్ మరో ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నమెంట్కు వేదిక కానుంది. 2020 ఏడాది అండర్-17 మహిళల ప్రపంచకప్కు ఆతిథ్యమివ్వనున్న భారత్... 2022లో మహిళల ఆసియా కప్ ఈవెంట్కు వేదికగా నిలువనుంది. ఈ మేరకు భారత్కు ఆతిథ్య హక్కులు కట్టబెడుతూ ఆసియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) 2020 ఫిబ్రవరి 19న ప్రకటన జారీ చేసింది. 2022 ఆసియా కప్లో ఎనిమిది జట్లకు బదులుగా 12 జట్లు పాల్గొంటాయని ఏఎఫ్సీ మహిళల కమిటీ చైర్పర్సన్ మెహఫూజా అక్తర్ తెలిపారు.
పీవీ సింధుకి ఈఎస్పీఎన్ ఉత్తమ క్రీడాకారిణి అవార్డు
ప్రపంచ చాంపియన్, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకి ఈఎస్పీఎన్ ఉత్తమ క్రీడాకారిణి-2019 అవార్డు లభించింది. మొత్తం 10 విభాగాల్లో ప్రకటించిన ఈ అవార్డులను ప్రకటించగా... పురుషుల విభాగంలో యువ షూటర్ సౌరభ్ చౌదరికి ఉత్తమ క్రీడాకారుడు పురస్కారం దక్కింది. అలాగే స్పింటర్ ద్యుతి చంద్కు ధీశాలి అవార్డు రాగా.. ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి ఉత్తమ పునరాగమనం అవార్డును కైవసం చేసుకుంది. జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ను 'ఉత్తమ కోచ్' అవార్డు వరించింది. పీవీ సింధుకి ఈఎస్పీఎన్ పురస్కారం లభించడం ఇది వరుసగా మూడోసారి.