అంతర్జాతీయం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన
అగ్రరాజ్యం అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ జాన్ ట్రంప్ తొలిసారి భారత్లో పర్యటించారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్ కుష్నర్, ఇతర ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి భారత్లో రెండు రోజుల పాటు ఆయన పర్యటించారు. 2020 ఫిబ్రవరి 24, 25 తేదీలలో జరిగిన ఈ పర్యటనలో భాగంగా ట్రంప్ బందం పలు కార్యక్రమాల్లో పాల్గొంది. హౌడీ మోడీ కార్యక్రమం తరహాలోనే అహ్మదాబాద్లో నూతనంగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతెరాలో ఫిబ్రవరి 24న 'నమస్తే ట్రంప్' కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 1.25 లక్షల మంది హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి ట్రంప్, మోడీ ప్రసంగించారు. 'నమస్తే.. నమస్తే.. హలో ఇండియా' అంటూ తన ప్రసంగాన్ని ట్రంప్ ప్రారంభించారు. ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఫిబ్రవరి 25న ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో కీలక ద్వైపాక్షిక అంశాలపై సమగ్రంగా ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో మోడీ, ట్రంప్ కూడా పాల్గొన్నారు. చర్చల అనంతరం, ఇరు దేశాల మధ్య ముఖ్యమైన రక్షణ ఒప్పందంతో పాటు ఇంధన, ఆరోగ్య రంగాల్లో 3 ఒప్పందాలు కుదిరాయి. ట్రంప్ దంపతులు అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమాన్ని, ఢిల్లీలోని రాజ్ఘాట్లో జాతిపిత మహాత్మాగాంధీ స్మారక స్థలాన్ని, తాజ్మహల్ను సందర్శించారు. బ్లాక్ లిమోజిన్ 'ది బీస్ట్'లో ప్రయాణిస్తూ అహ్మదాబాద్ నిర్వహించిన రోడ్ షోలో ట్రంప్ పాల్గొన్నారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఫిబ్రవరి 25న ఢిల్లీలోని మోతీబాగ్లో సర్వోదయ బాలబాలికల ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. తరగతి గదిలో కూర్చొని హ్యాపీనెస్ క్లాసుల్ని విన్నారు.
మలేషియా ప్రధాని మహతీర్ రాజీనామా
మలేసియా ప్రధానమంత్రి మహ తీర్ మొహమాద్ 2020 ఫిబ్రవరి 24న తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మలేసియా ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రభుత్వాన్ని గద్దె దించాలని అధికా రంలో భాగస్వామ్య పార్టీలు ప్రయ త్నాలు చేస్తున్న నేపథ్యంలో 94 ఏళ్ల మహతిర్ తన పదవికి రాజీనామా చేశారు. 2018, మే 10న మలేసియా ప్రధానిగా మహతీర్ రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాగా జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ప్రధాని మహాతిర్ తీవ్ర విమర్శలు చేశారు.
ఫ్రాన్స్లో భారత రాయబారిగా జావెద్ అష్రాఫ్
ఫ్రాన్స్లో భారత రాయబారిగా దౌత్య వేత్త జావెద్ అష్రాఫ్ నియమితుల య్యారు. 1991 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీసు అధికారి అయిన జావెద్ ఇంత వరకు సింగపూర్ లో భారత హైకమిషనర్గా పనిచేశారు. ఫ్రాన్స్లో భారత రాయబారిగా ఉన్న వినరు మోహన్ క్వత్రా నేపాల్ రాయబారిగా నియమితులయ్యారు.
హజ్ యాత్రపై కోవిడ్ వైరస్ ప్రభావం
ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్-19 వైరస్ ప్రభావం హజ్ యాత్రపై పడింది. కోవిడ్ వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారిని 2020 ఏడాది జరగబోయే హజ్ యాత్రకు అనుమతించబోమని సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ దేశాల నుంచి మక్కాకు వచ్చే యాత్రికులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సౌదీ విదేశీ వ్యవహారాల శాఖ ఫిబ్రవరి 2020 27న తెలిపింది. వారిని మక్కాలోకి అనుమతించబోమని పేర్కొంది. కేవలం ఉమ్రా యాత్రికులనే కాకుండా మదీనాను సందర్శించే వారిని సైతం అనుమతించబోమని వివరించింది. కోవిడ్-19 వైరస్ ప్రభావిత ప్రాంతమైన చైనాలోని వుహాన్ ప్రాంతానికి భారత్ సుమారు 15 టన్నుల మందులను పంపింది. భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన విమానంలో 2020 ఫిబ్రవరి 26న ఈ మందులను తరలించారు.
జాతీయం
భారత్లో యూఎస్ఐడీఎఫ్సీ కార్యాలయం
భారత్తో వాణిజ్య సంబంధాల బలోపేతానికి యునెటైడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (యూఎస్ఐడీఎఫ్సీ) కార్యాల యాన్ని భారత్లో ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడి సీనియర్ సలహా దారు ఇవాంకా ట్రంప్ వెల్లడించారు. ఆర్థికపరమైన సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ఈ కార్యాల యం పని చేస్తుందన్నారు.
పీఎం కిసాన్ మొబైల్ యాప్ ప్రారంభం
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ యోజన) పథకం ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్భంగా పథ కానికి సంబంధించిన మొబైల్ యాప్ను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ 2020 ఫిబ్రవరి 24న ఢిల్లీలో ప్రారంభించారు. పథకం సేవలు మరింత విస్తతం చేసేందుకు ఈ యాప్ను ఆవిష్కరించినట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుల ఆదాయం 2022 కల్లా రెట్టింపు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఐదేళ్లలో 1.09 కోట్ల చెట్ల నరికివేతకు అనుమతి
2014-19 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ అభివద్ధి ప్రాజెక్టుల కోసం 1,09,75,000 చెట్ల నరికివేతకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతిచ్చింది. ఇటీవల లోక్సభ లో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయమంత్రి బాబుల్ సుప్రియో ఈ విషయాన్ని తెలియజేశారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే చెట్లను తొలగిస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 2016-19 మధ్య కాలంలో 12,12,753 లక్షల చెట్లను కొట్టేసేందుకు అనుమ తినిచ్చినట్లు పేర్కొన్నారు. దాదాపు 11 లక్షల చెట్లతో మహా రాష్ట్ర రెండో స్థానంలో, 10 లక్షల చెట్లతో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయన్నారు. గత మూడేళ్లలో 76,72,337 చెట్లను తొలగించగా, 7.87 కోట్ల కంటే ఎక్కువగా మొక్కలను కంపల్సరీ ఎఫారెస్టేషన్ కింద నాటినట్లు వెల్లడించారు.
ప్రధాని నరేంద్రమోడీ 62వ 'మన్ కీ బాత్'
ప్రధాని నరేంద్రమోడీ 2020 ఫిబ్రవరి 23న 62వ 'మన్ కీ బాత్' ప్రసంగం చేశారు. నూతన భారత్లోని మహిళలు సవాళ్లను ఎదుర్కొంటూ కొత్త సమాజ నిర్మాణానికి దోహద పడుతున్నారని ప్రధాని ప్రశంసించారు. పాత పద్ధతులను వారు అంగీకరించే స్థితిలో లేరని చెప్పారు. దేశవ్యాప్తంగా మహిళలు సాధించిన విజయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. బిహార్లోని పూర్ణియా ప్రాంతం మహిళలు గతంలో పట్టుగూళ్లను ఎంతోకొంత ధరకు విక్రయించేవారని తెలిపారు. ప్రస్తుతం వారు పట్టుదారం తీయడంతో పాటు, చీరలను నేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారని చెప్పారు. వారంతా సహకార సంఘంగా ఏర్పడి ఈ విజయాన్ని సాధించారని తెలిపారు. కేరళలోని కొల్లాంకు చెందిన 105 ఏళ్ల వద్ధురాలు భాగీరథి అమ్మ ఇటీవలే నాలుగో తరగతి పరీక్ష ఉత్తీర్ణురాలయి విద్యాభ్యాసానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారన్నారు. 12 ఏళ్ల కామ్య కార్తికేయన్ దక్షిణ అమెరికాలోని 7000 అడుగుల ఎత్తు ఉన్న మౌంట్ అకొంకాగువా పర్వతాన్ని అధిరోహించి దేశానికి గర్వ కారణంగా నిలిచిందని చెప్పారు.
అద్దె గర్భం నియంత్రణ బిల్లుకు కేబినెట్ ఆమోదం
మహిళలు తమ ఇష్టంతో గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అద్దె గర్భం నియంత్రణ బిల్లు-2020పై ఫిబ్రవరి 26న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోద ముద్ర వేసింది. వితంతువులు, విడాకులు పొందిన వారూ ఇతరులకు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చని బిల్లు స్పష్టం చేసింది.
నేషనల్ టెక్స్టైల్ మిషన్కు కేబినెట్ ఆమోదం
టెక్నికల్ టెక్స్టైల్స్ రంగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణా లను అందుకోవడానికి వీలుగా రూ.1,480 కోట్లతో 'నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్' ఏర్పాటు చేయా లని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రదాని నరేంద్ర మోడీ అధ్యక్షతన 2020 ఫిబ్రవరి 26న సమావేశమైన మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకుంది. టెక్స్టైల్ మిషన్ కాలపరిమితి 2020-21 నుంచి 2023-24 వరకు ఉంటుంది. వ్యవ సాయం, రహదా రులు, రైల్వేట్రాక్లు, సాఫ్ట్వేర్, వైద్య-ఆరోగ్యం, బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు, అగ్నినిరోధక జాకెట్లు, రోదసీ ప్రయోగాల్లో ఈ టెక్స్టైల్స్ను ఉపయోగిస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లోనూ ఇక మీదట టెక్నికల్ టెక్స్టైల్స్ కోర్సులు ప్రవేశపెడతారు.
మార్కెట్ ఇంటెలిజెన్స్ వెబ్సైట్ ఆవిష్కరణ
టమాటా, ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు ఉన్నట్టుండి పతనమైతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు రూపొందించిన 'మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఎంఐఈడబ్ల్యూఎస్)' వెబ్సైట్ను కేంద్ర ఆహార శుద్ధి శాఖ మంత్రి హర్సిమ్రత్కౌర్ బాదల్ ఆవిష్కరించారు. ఢిల్లీలో 2020 ఫిబ్రవరి 26న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రితం ఏడాది అదే కాలంతో పోలిస్తే ధరలు 50 శాతం పతనమైనా, మూడేళ్ల కనిష్ట స్థాయికి ఈ మూడు కూరగాయల ధరలు క్షీణించినా ఎంఐఈడబ్ల్యూఎస్ పోర్టల్ హెచ్చరికలు పంపుతుంది. దేశవ్యాప్తంగా 1,200 మార్కెట్లలో వీటి ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుంది.
సుప్రీంకోర్టులో బ్రిటన్ అత్యున్నత న్యాయమూర్తి
బ్రిటన్ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ లార్డ్ రాబర్ట్ జాన్ రీడ్ 2020 ఫిబ్రవరి 24న భారత సుప్రీం కోర్టులో విచారణ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. అంత ర్జాతీయ న్యాయ సదస్సులో పాలొనేందుకు వచ్చిన లార్డ్ జాన్ రీడ్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేతో పాటు 15 నిమిషాల పాటు ధర్మాసనంపై కూర్చొని కోర్టు వ్యవహారాలను పరిశీలించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆయన్ను కోర్టు హాల్లోకి ఆహ్వానించారు.
అత్యంత కాలుష్య నగరంగా ఘజియాబాద్
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ నిలిచింది. ఘజియాబాద్ తర్వాతి స్థానాల్లో వరుసగా హౌటన్(చైనా), గుజ్రాన్వాలా (పాకిస్తాన్), ఫైస్లాబాద్ (పాకిస్తాన్), ఢిల్లీ (భారత్) ఉన్నాయి. ఈ విషయాన్ని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్-2019 వెల్లడించింది. అత్యంత కాలుష్య పూరిత వాతావరణం ఉన్న రాజధానుల్లో న్యూఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ అగ్రస్థానంలో ఉండగా, పాకిస్తాన్, మంగోలియా, అఫ్ఘానిస్తాన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
హరూన్ గ్లోబల్రిచ్ లిస్ట్ 2020 విడుదల
2019 ఏడాదికి గాను రూపొందించిన 9వ ఎడిషన్ 'హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2020' విడుదలైంది. ఈ జాబితాలో 140 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో ఉన్నారు. రిలయన్స్ ఇండిస్టీస్ అధినేత ముకేశ్ అంబానీ 67 బిలియన్ డాలర్ల సంపదతో 9వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. అలాగే అత్యంత సంపన్న భారతీ యుడిగా ముకేశ్ నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్లు (రూ.7,000 కోట్లు), అంతకుమించిన నికర విలువ ఉన్న వారిని ఈ నివేదిక పరిగణనలోకి తీసుకుంది.
యూకే విద్యార్థి వీసాల్లో భారత్కు తొలిస్థానం
బ్రిటన్ విద్యార్థి వీసా పొందిన విదేశీయుల్లో భారతీయులు తొలిస్థానంలో నిలిచారు. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్) ఈ విషయాన్ని వెల్లడించింది. ఓఎన్ఎస్ వెలువరించిన గణాంకాల ప్రకారం 2019లో 37,500 మంది భారతీయ విద్యార్థులకు టయర్-4 (విద్యార్థి) వీసాలు దక్కార్ను. 8 ఏళ్లతో పోలిస్తే ఇదే అత్యధికం. వత్తి నిపుణులకిచ్చే టయర్-2 వీసాల్లో సగం భారతీయులకే దక్కాయి. ఈ విభాగంలో భారతీయులు 57వేల వీసాలతో టాప్లో నిలిచారు. 2019 ఏడాది 5.15 లక్షల మంది భారతీయులకు పర్యాటక వీసా ఇచ్చినట్లు తెలిపింది.
సదస్సులు-సమావేశాలు
బెంగళూరులో 'ది హడిల్' సదస్సు
ఆంగ్ల దినపత్రిక 'ది హిందూ' ఆధ్వర్యంలో 2020 ఫిబ్రవరి 22న బెంగళూరులో 'ది హడిల్' సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొని ప్రసంగించారు. వేగం, సంచలనాల కోసం సామాజిక మాధ్యమాలు దారి తప్పుతున్నాయని.. ఇలాంటి తరుణంలో ప్రజలకు వాస్తవాలు తెలిపే బాధ్యత సంప్రదాయ మాధ్యమాలదేనని రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు.
20వ ఆలిండియా పోలీస్ బ్యాండ్ కాంపిటీషన్ వేడుకలు
సికింద్రాబాద్లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్(ఆర్ఎస్సీ) గ్రౌండ్స్లో 2020 ఫిబ్రవరి 23న 20వ ఆలిండియా పోలీస్ బ్యాండ్ కాంపిటీషన్ ముగింపు వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. సంగీతం సాయుధ దళాలలో ధైర్యాన్ని, శౌర్యాన్ని రేకెత్తిస్తుందని వెంకయ్య పేర్కొన్నారు. వేడుకల్లో బ్రాస్ బ్యాండ్ క్యాటగిరీలో 20వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ ఛాంపియన్షిప్ విజేత ట్రోఫీని సీఆర్పీఎఫ్కు, పైప్ బ్యాండ్ ట్రోఫీని మహారాష్ట్ర పోలీసులకు అందజేశారు.
అంతర్జాతీయ న్యాయ సదస్సు
భారత సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో 2020 ఫిబ్రవరి 22, 23 తేదీల్లో న్యూఢిల్లీలో అంతర్జాతీయ న్యాయ సదస్సు నిర్వహించారు. ఫిబ్రవరి 23న జరిగిన సదస్సు ముగింపు కార్యక్రమంలో 'న్యాయవ్యవస్థ -మారుతున్న ప్రపంచం' అంశంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. లింగపరమైన న్యాయం అనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించేం దుకు భారత న్యాయవ్యవస్థ చేసిన కషి అమోఘమని పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ సానుకూల, ప్రగతిశీల దక్పథంతోనే పని చేసిందని కొనియాడారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 22న పాల్గొన్నారు. క్లిష్టమైన అంశాలపై ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రపంచవ్యాప్త చర్చకు కారణమయ్యాయని ఈ సందర్భంగా మోదీ అన్నారు.
ప్రాంతీయం
నటుడు కొండలరావుపై పోస్టల్ కవర్ విడుదల
ప్రముఖ సినీ నటుడు రావి కొండల రావుపై తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవర్ను రూపొందించింది. హైదరాబాద్ డాక్ సదన్లో 2020 ఫిబ్రవరి 25న జరిగిన కార్యక్రమంలో తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ కె.సంధ్యారాణి ఈ కవర్ను విడుదల చేశారు. రావి కొండలరావు సుమారు 600కుపైగా చిత్రాల్లో నటించారు. తాను తీసిన సీరియల్స్కు 12 నంది అవార్డులు, 50 కథలకు అవార్డులు అందుకున్నారు. ఆరు జాతీయ భాషల్లోకి ఆయన కథలు అనువాదమయ్యాయి. ఆకాశవాణి కోసం పదేళ్లలో వంద నాటికలు రాసిన ఏకై క రచయితగా పేరొందారు.
తెలంగాణ సమాచార కమిషనర్ల ప్రమాణస్వీకారం
తెలంగాణ సమాచారహక్కు చట్టం (ఆర్టీఐ) కమిషనర్లుగా సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్రెడ్డి, మైదా నారాయణరెడ్డి, గిరిజన విద్యార్థి నేత గుగులోతు శంకర్నాయక్, న్యాయ వాదులు సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్ హుస్సేన్ 2020 ఫిబ్రవరి 25న ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో వారితో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఎస్.రాజా సదారాం ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఐదుగురు కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వీరు మూడేళ్లపాటు లేదా 65 ఏళ్లు నిండే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.
తెలంగాణలో సీఐఐ స్టార్టప్స్ ఇన్నోవేషన్ సెంటర్
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్స్ కోసం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ (సీఐఐ) హైదరాబాద్లో ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో స్టార్టప్స్ వ్యవస్థ అభివద్ధి కోసం ఈ కేంద్రం పని చేస్తుందని, 2020, ఏప్రిల్ నుంచి ఈ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సీఐఐ 2020 ఫిబ్రవరి 25న తెలిపింది. వినూత్న ఆలోచనలు, స్టార్టప్స్కు మెంటారింగ్, అవకాశాలు, వ్యాపార భాగ స్వామ్యాలు, సాంకేతిక ప్రోత్సాహం అందించడమే ఈ సెంటర్ ప్రధాన లక్ష్యమని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసిన ఈ సెంటర్కు ఇన్ఫోసిస్ కో-ఫౌండర్, సీఐఐ నేషనల్ స్టార్టప్ కౌన్సిల్ చైర్మన్ ఎస్ గోపాలకష్ణన్కు చెందిన ప్రతీక్ష చారిటబుల్ ట్రస్ట్ సహకారం అందించనుంది.
వార్తల్లో వ్యక్తులు
మిస్ దివా యూనివర్స్ విజేతగా అడిలైన్
మహారాష్ట్ర రాజధాని ముంబైలో 2020 ఫిబ్ర వరి 22న జరిగిన 'లివా మిస్ దివా యూనివర్స్-2020' పోటీల్లో మంగ ళూరుకు చెందిన అడిలైన్ క్యాస్టిలినో విజేతగా నిలిచారు. మిస్ దివా సుప్రనేషనల్ కిరీటాన్ని జబల్పూర్కు చెందిన ఆవతి చౌదరి గెలుచు కున్నారు. పుణేకు చెందిన నేహా జైస్వాల్ మిస్ దివా రన్నరప్గా నిలిచారు. 2020 ఏడాది జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున క్యాస్టిలినో ప్రాతినిథ్యం వహించ నుండగా.. ఆవతి మిస్ సుప్రనేషనల్ పోటీలకు భారత పోటీదారుగా వ్యవహరిం చనున్నారు. మిస్ దివా పోటీల్లో మాజీ మిస్ యూనివర్స్ లారా దత్తా, ఆంటోనియా పోర్లిడ్, ఆశాభట్, డిజైనర్లు శివన్ భటియా, నరేశ్ కుక్రేజా, నిఖిల్ మెహ్రా, నటులు యామీ గౌతం, ఆదిత్యరారు కపూర్, అనిల్ కపూర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు ముబారక్ కన్నుమూత
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు, సుమారు 30 ఏళ్లపాటు మధ్య ప్రాచ్యంలో శాంతి, సుస్థిరతలకు ప్రతీకగా చెప్పుకునే నేత హౌస్నీ ముబారక్ (91) 2020 ఫిబ్రవరి 25న మరణించారు. ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా మరణిం చినట్లు ఈజిప్టు టెలివిజన్ ప్రకటించింది.1981 నుంచి 2011 వరకు ఈజిప్టు అధ్యక్షుడిగా ఉన్న ముబారక్ అమెరికాకు సన్నిహితుడిగా మెలిగారు. ముబారక్ నియంతత్వ ధోరణిని అనుసరిస్తు న్నారంటూ 2011లో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. 18 రోజుల పాటు జరిగిన ఈ ఆందోళనల కారణంగా దాదాపు 900 మంది మరణించారు. దీంతో 2011 ఫిబ్రవరి 11న సైన్యం ఆయన్ను పదవీచ్యుతుణ్ని చేసి అధికారాలను తన చేతుల్లోకి తీసుకుంది. 900 మంది ఆందోళనకారుల మరణాలను నిలువరించడంలో విఫలమ య్యారన్న ఆరోపణలపై న్యాయ స్థానాలు 2012 జూన్లో ముబారక్ను దోషిగా నిర్ధారించి యావజ్జీవ జైలుశిక్ష విధించాయి. అయితే ఈజిప్టు ఉన్నత న్యాయస్థానం 2014లో ఆ తీర్పును కొట్టివేసి ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది.
రాకెట్ ప్రమాదంలో ఖగోళ శాస్త్రవేత్త మైక్ కన్నుమూత
భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని చెప్పిన ఔత్సా హిక ఖగోళ శాస్త్రవేత్త మైఖేల్ మ్యాడ్ మైక్ హ్యూస్(64) 2020 ఫిబ్రవరి 22న ఓ రాకెట్ ప్రమాదంలో మరణిం చారు. తాను సొంతంగా తయారు చేసుకున్న రాకెట్ను పరీక్షించే ప్రయోగం విఫలం చెందడంతో మరణించారు. భూమి గుండ్రంగా లేదని నిరూపించేందుకు తన స్టీమ్ రాకెట్తో అంతరిక్షంలోకి వెళ్లారు. ప్రయోగించిన కొద్దిసేపటికే ఈ ప్రయోగం విఫలమైంది. ఆ రాకెట్ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం బార్స్టో సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పేలిపోయింది.
అవార్డులు
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానం
తెలుగు రాష్ట్రాలకు చెందిన రచయి తలు బండి నారాయణ స్వామి, పెన్నా మధు సూదన్ 2019 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. ఢిల్లీలో 2020 ఫిబ్రవరి 25న జరిగిన పుర స్కారాల ప్రధానోత్సవ కార్య క్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్ చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకు న్నారు. 23 భారతీయ భాషల్లో రచన లకు గాను ఏటా ప్రకటించే సాహిత్య అకాడమీ అవార్డులను 2019, డిసెంబర్ 18న ప్రకటించింది. ఏపీలోని అనంత పురం జిల్లాకు చెందిన బండి నారాయణస్వామి రాయలసీమ చరిత్ర ఆధారంగా తెలుగులో రాసిన శప్తభూమి నవలకు, తెలంగాణ జడ్చర్లకు చెందిన పెన్నా మధుసూదన్ సంస్కతంలో రాసిన ప్రజ్ఞాచాక్షుషం కావ్యానికి కేంద్ర సాహిత్య పురస్కారాలు లభించాయి. విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత్రి పి.సత్యవతికి 'ఒక హిజ్రా ఆత్మకథ' రచనకు గాను అనువాద విభాగంలో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది.
బాసర RGUKT బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు
వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ అవార్డు-2020లో బాసర RGUKT బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు దక్కింది. హైదరాబాద్ లో 2020 ఫిబ్రవరి 22న జరిగిన కార్యక్రమం లో అవార్డు ప్రదానం చేశారు. మెరుగైన విద్యా ప్రమాణాలు కలిగిన 95 కళాశాలలు పాల్గొనగా.. బాసర RGUKT ఈ పురస్కారాన్ని దక్కించుకొంది.
సైన్స్ & టెక్నాలజీ
మార్చి 5న జీఐ శాట్-1 ప్రయోగం
దేశ భద్రత, అవసరాలను దష్టి లో ఉంచుకుని రూపొం దించిన జియో ఇమేజింగ్ శాటిలైట్ (జీఐ శాట్-1) ను 2020, మార్చి 5వ తేదీన భారత అంతరిక్ష పరి శోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగిం చనుంది. శ్రీహరికోటలోని షార్లో ఉన్న రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్-10 (జీఎస్ఎల్వీ మార్క్-2) రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిస్తారు. 2,100 కిలోల బరువైన జీఐ శాట్-1ను భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్ (భూ స్థిర కక్ష్య)లోకి ప్రవేశపెడతారు.
క్రీడలు
భారత్లో కామన్వెల్త్ షూటింగ్, ఆర్చరీ క్రీడలు
2022 జనవరిలో జరిగే కామన్వెల్త్ షూటింగ్, ఆర్చరీ చాంపియన్షిప్ పోటీలకు భారత్ ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్(సీజీఎఫ్) 2020 ఫిబ్రవరి 24న ప్రకటన విడుదల చేసింది. ఈ పోటీల్లో సాధించే పథకాలను 2022 జులై 27 నుంచి బర్మింగ్ హామ్లో జరిగే కామన్వెల్త్ క్రీడల ర్యాంకింగ్సకు పరిగణన లోకి తీసుకోనునట్లు సీజీఎఫ్ పేర్కొంది. షూటింగ్, ఆర్చరీ ఈవెంట్లను 2022 జనవరిలో నిర్వహిస్తామని భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) తెలిపింది. 2022 కామన్వెల్త్ గేమ్స్కు బర్మింగ్హామ్ జూలై 27 నుంచి ఆగస్టు 7 వరకు ఆతిథ్యమివ్వనుంది. అయితే అతిథ్య దేశానికి ఉన్న సౌలభ్యం మేరకు ఇంగ్లండ్ రోస్టర్ విధానంలో భాగంగా షూటింగ్, ఆర్చరీ ఈవెంట్లను గేమ్స్ నుంచి తప్పించింది. దీనిపై గుర్రుగా ఉన్న ఐఓఏ గేమ్స్ను బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ గేమ్స్ కంటే ముందుగా ఆ రెండు క్రీడల్ని భారత్లో నిర్వహించాలని, అందులో సాధించిన పతకాల్ని ప్రధాన గేమ్స్ పట్టికలో ఓ వారం తర్వాత చేరుస్తామని సీజీఎఫ్ తెలిపింది.
హంగేరి ఓపెన్లో సత్యన్-శరత్ జంటకు రజతం
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య(ఐటీటీఎఫ్) హంగేరి ఓపెన్ వరల్డ్ టూర్ టోర్న మెంట్లో సత్యన్ జ్ఞాన శేఖరన్ - ఆచంట శరత్ కమల్ (భారత్) జంట రజత పతకం సాధించింది. హంగేరి రాజ ధాని బుడా పెస్ట్లో 2020 ఫిబ్రవరి 23న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సత్యన్-శరత్ కమల్ ద్వయం 5-11, 9-11, 11-8, 9-11తో డుడా బెనెడిక్ట్-ఫ్రాన్సిస్కా ప్యాట్రిక్ (జర్మనీ) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్లో మనిక బాత్రా(భారత్)తో కలిసి శరత్ కాంస్య పతకం సాధిం చాడు. స్వీడన్లో జరిగిన స్వీడిష్ జూనియర్, క్యాడెట్ ఓపెన్ టీటీ టోర్నీలో చెన్నైకి చెందిన పదేళ్ల అమ్మాయి ఎం.ఆర్. హన్సిని కాంస్యం సాధించింది. మినీ క్యాడెట్ బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో హన్సిని 12-10, 9-11, 5-11, 8-11తో లులియా పుగోవ్కినా (రష్యా) చేతిలో పరాజయం పాలైంది.
గుకేశ్కు కేన్స్ ఓపెన్ చెస్ టోర్నీ టైటిల్
కేన్స్ ఓపెన్ చెస్ టోర్నీలో 13 ఏళ్ల భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఫ్రాన్స్లో జరిగిన టోర్నీ చివరి రౌండ్లో గుకేశ్ స్థానిక ఆటగాడు హరుట్యున్పై గెలిచి మొత్తం 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. తెలంగాణ గ్రాండ్మాస్టర్ హర్షవర్ధన్ 5.5 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచాడు.
టెన్నిస్కు మారియా షరపోవా వీడ్కోలు
రష్యా టెన్నిస్ స్టార్, మాజీ వరల్డ్ నంబర్వన్ మారియా షరపోవా ఆట నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని ఆమె 2020 ఫిబ్రవరి 26న వెల్లడించింది. ఐదు సార్లు గ్రాండ్స్లామ్ విజేతగా నిలిచిన 32 ఏళ్ల షరపోవా.. మహిళల టెన్నిస్లో అత్యంత గుర్తింపు పొందిన క్రీడాకారిణి. నాలుగు వేర్వేరు గ్రాండ్స్లామ్లను నెగ్గిన అతి కొద్ది మంది ప్లేయర్లలో ఉంది. 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా డోపింగ్ టెస్ట్లో పట్టుబడి నిషేధం ఎదుర్కొంది. అనంతరం తిరిగి ఆటలో ప్రవేశించినప్పటికీ మునుపటి స్థాయి ప్రదర్శన కొనసాగించలేకపోయింది. ఈ క్రమంలో టెన్నిస్కు గుడ్బై ప్రకటించింది.