కేరళలో కొడుంగల్లూర్ అనే ఊరు ఉంది. ఇక్కడ భాగ్యవతి దేవాలయం ఉంది. దీన్నే కొడుంగల్లూర్ భరణీ అని సాధారణ ప్రజలు పిలుచుకుంటారు. ఇక్కడ మూడు రోజుల పండుగ ప్రతి ఏడాది జరుగుతుంది. ఇది కేరళలో అత్యంత ప్రాచీనమైన పండుగల్లో ఒకటిగా భావిస్తారు. ఇక్కడ పూజలందుకునే దేవత భద్రకాళి. తమిళ ప్రాచీన గ్రంథం 'శిలప్పాధికారం'లో పేర్కొన్న కన్నగి జ్ఞాపకార్థం చేరరాజు ఈ గుడిని నిర్మించినట్లు కొందరు భావిస్తారు. ఈ దేవాలయంలో జరిగే ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. పురుషులు (గే)లు స్త్రీ భక్తులు (వెలిచిపాడ్లు) భక్తి గీతాలు ఆలపిస్తారు. పూనకంతో ఊగిపోయే ఈ భక్తులు గుడిచుట్టూ తిరుగుతారు. ముఖం నిండా పసుపు, కుంకుమ, రక్తం రాసుకుంటారు. జుట్టు వదిలివేయడంతో ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిలా కనిపిస్తారు. ఈ ఉత్సవం అయిన వెంటనే వారం రోజులపాటు గుడిని మూసివేసి సుభ్రంచేస్తారు. ఆ తరువాతే భక్తుల దర్శనార్థం తిరిగి తెరుస్తారు. ఇక్కడికి వచ్చే వెలిచిపాడ్లలో ఎక్కువమంది కాయకష్టం చేసుకునే స్త్రీలే ఉంటారు. వ్యవసాయపనుల తరువాత వచ్చే ఈ ఉత్సవానికి వారు ఎంతో భక్తితో హాజరవుతారు. వారు చేసే నృత్యాలను సాధారణ భక్తులు ఎగబడి వీక్షిస్తారు.
- మౌక్తిక్
Authorization