వర్షాకాలం... ఎటు చూసినా నీరు, తేమ. దోమలు, ఈగలకు మన ఇళ్లు ఆవాసాలుగా మారతాయి. ఈ పరిస్థితుల్లో మనం ఆరోగ్యంగా ఉండాలంటే... తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
పండ్లు, ఆకుకూరలు, కాయగూరల్ని కాస్త వంట సోడా వేసిన గోరువెచ్చని నీళ్లలో కడగడం మంచిది. ఎలాంటి క్రిములు ఉన్నా నశిస్తాయి. పుట్టగొడుగులు, బీన్స్ వంటివి సరిగా ఉడక్కపోయినా అనారోగ్యం పాలవుతాం. అలాంటివాటిని బాగా ఉడికించండి. ఏ వంటకం అయినా ఈ కాలంలో వేడివేడిగా ఉన్నప్పుడే తినడం మంచిది. చికెన్, చేపలు వంటి మాంసాహారాన్ని శుభ్రంగా కడగాలి. చివర్లో ఉప్పు రాసి గోరువెచ్చని నీళ్లతో మరోసారి కడిగాకే వండుకోవడం మేలు. లేదంటే దానిలోని బ్యాక్టీరియా... అనారోగ్యానికి కారణం అవుతుంది. పూర్తిగా ఉడకబెట్టని గుడ్లను తినడం వల్ల వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఎక్కువ. చాలామంది ఒకేసారి గుడ్లు ఉడకబెట్టేసి ఫ్రిజ్లో ఉంచేస్తారు. అలా వద్దు. కాస్త శ్రమ అనుకున్నా... ఈ కాలంలో ఎప్పటికప్పుడు ఉడికించుకుని వాడుకోవడమే మంచిది. మొలకలు తినడం మంచిదే కానీ... అవి ఈ కాలంలో ఓ పట్టాన అరగవు. వీటిని నానబెట్టడం వల్ల తేమకి ఈ- కోలి బ్యాక్టీరియా వేగంగా వ ద్ధి చెందుతుంది. అజీర్తి సమస్యలున్నవారు మొలకల్ని ఏదో ఒక పదార్థం రూపంలో చేసుకుని తినడం మేలు. బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లాంటివి హౌటల్ నుంచి తెచ్చుకుంటున్నారా.. వీలైనంతవరకూ వద్దు. ఒకవేళ తెచ్చుకున్నా... ఆరోజుకు వాటిని పూర్తిచేయండి. అంతేకానీ.. ఫ్రిజ్లో భద్రపరిచి, మర్నాడు వేడిచేసుకుని తినే ప్రయత్నం వద్దు.
Authorization