ఇంట్లో కూర్చోని డిస్కవరీలోనూ, ఎనిమల్ ప్లానెట్లోనూ దట్టమైన అడవుల్లో తిరిగి జంతుజాలాన్ని చూస్తూ.. భూగోళంపై ఉన్న ప్రాణుల జీవనవిధానం తెలుసుకుంటూ మైమరిచిపోతుంటారు. మనతో పాటుగా ఈ భూమిపై నివసిస్తున్న జంతు, వృక్ష జాలాన్ని చూసి ఆనందించని వారు బహుఅరుదు. మరి డిస్కవరీ, ఎనిమల్ ప్లానెల్లో కనిపించే అదురైన జంతు, వృక్ష జాతులు ఎన్నో మన చుట్టూనే ఉన్నాయని మీరు తెలుసా?! నిజం.. మన రాష్ట్రంలో రెండు పులుల సంరక్షణా కేంద్రాలు(అమ్రాబాద్, కవాల్) మూడు జాతీయ పార్క్లు, తొమ్మిది వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయి. వీటన్నింటినీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి.. పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తూ.. ఎకో టూరిజంగా మనకు అందుబాటులోకి తీసుకువస్తు..ప్రకృతి ఒడిలో వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు.. తెలంగాణ అటవీ శాఖ, పర్యాటక శాఖలు. మరి మన చుట్టూ ఉన్న వన్యప్రాణి అభయారణ్యాల గురించి తెలుసుకుందాం..
అమ్రాబాద్ పులుల సంరక్షణా కేంద్రం.
శ్రీశైలం వెళ్లే దారిలో ఉన్న అమ్రాబాద్ పులుల సంరక్షణా కేంద్రంలో అనేక అడవి జంతువులు ఉన్నాయి. రాత్రివేళ.. శ్రీశైలం వెళ్లే రహదారిపైకి ఇవి వస్తుంటాయి. రాత్రి తొమ్మిది తరువాత ఈ రోడ్లపై వాహనాల రాకపోకలు నిషేధించారు. శ్రీశైలం వెళ్లే వాహనాలను మన్నానూర్ వద్ద , శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలను దోమలపేట వద్ద నిలిపివేస్తారు. ఇక్కడ ప్రయాణీకులకు వసతిసదుపాయాలను కల్పిస్తున్నారు. అంతే కాకుండా అడవిలోపలికి ప్రయాణికులను తీసుకువెళ్లేందుకు ప్రత్యేకమైన జీవులు సిద్ధంగా ఉంటాయి. కమాండర్ జీపులో అడవిలో తిరగవచ్చు. (ఒక ట్రిప్లో ఏడు, ఎనిమిది మంది వెళ్ళవచ్చు. ట్రిప్కు ఎనిమిది వందలు చార్జీ చేస్తారు.)
ఇక్కడ పులులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు కనిపిస్తుంటాయి. కనుమరు గైపోతున్న పులుల సంరక్షణ కోసం దీనిని స్థాపించారు. అనేక అడవి జంతు వులకు సహజ ఆవాస ప్రాంతంగా ఉన్న ఈ ప్రదేేశంలో ఆయా జంతు వులు స్వేచ్చగా తిరిగేలా ఇక్కడ అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
తోవ : హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్లు,
సమీపంలోని మల్లెల తీర్ధం కూడా చూడవచ్చు.
వసతి : అటవీశాఖ వారి కాటేజ్లు, సత్రాలు, గెస్ట్హౌజ్ ఉన్నాయి.
కవాల్ పులుల సంరక్షణాకేంద్రం..
కవాల్ వన్యప్రాణుల అభయారణ్యం ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం ఉంది. ఇక్కడ 893 కిమీల మేరకు విస్తరించిన దట్టమైన అడవుల్లో పులులు, గౌర్, చీతల్, సాంబార్, జింక, ఎలుగుబంటి వంటి అనేక అడవిజంతువులతో పాటు వివిధ రకాల పక్షులు, అనేక జాతుల సరీసృపాలను కూడా ఈ అభయారణ్యంలో చూడవచ్చు.
కావాల్ వన్యప్రాణుల అభయారణ్యం కనుమరుగైపోతున్న కొన్న వన్యప్రాణుల సంర క్షణ కోసం స్థాపించబడింది. అనేక అడవి జంతువులకు సహజ ఆవాస ప్రాంతం. ఇక్కడ అడవిశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఇది వివిధ జంతువులు, పక్షులు సహజ నివాసంగా ఉంది పర్యాటక ప్రదేశం ఒకటిగా చెబుతారు. ఇది బార్కింగ్ డీర్, స్లోత్ బేర్, పులి, మనుబోతులు, సాంబార్, పాంథర్ వంటి అనేక జంతువులు ఉన్నాయి. అటువంటి స్టార్ తాబేలు, కోబ్రా, పైథాన్, మానిటర్ లిజార్డ్ మొసలి మరియు ఇతరులు అనేక సరీసృపాలు ఉంది. ఇక్కడ పక్షులు గుడ్ల గూబలు, నెమళ్ళు, గోరింకలు, ఈగల్స్ వంటివి అనేకం ఉన్నాయి.
పర్యావరణంపై, జంతువులపై, పక్షులపై పరిశోధనలు చేసేవారికి ఇది అత్యంత అనుకూలమైన ప్రదేశం.
తోవ : హైదరాబాద్ నుంచి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అభయారణ్యం మంచిర్యాల నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
వసతి: జన్నారం ఫారెస్ట్ రెస్ట్ హౌస్, మంచిర్యాలలోనూ వసతి సదుపాయాలు ఉన్నాయి.
అలీసాగర్ డీర్ పార్క్
అలీసాగర్ డీర్ పార్క్ నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఇది 1885 సంవత్సరంలో స్థాపించబడింది. రిజర్వాయర్ను 1931 లో నిర్మించారు. ఈ జింకల పార్క్ తెలంగాణ ప్రాంతాల్లో ప్రసిద్ధ పార్కులు ఒకటి. చాలా అందమైన, ఆకర్షణీయమైన ప్రాంతంలో జింక జాతులలో సంఖ్య ఎక్కువగా ఉంది. జలాశయం చుట్టూ అందమైన ప్రకృతి, ఆ చెట్లుమధ్య గెంతులు వేస్తూ.. జింకలను లైవ్ లో చూడవచ్చు.
తోవ : హైదరాబాద్ నుంచి 185 కిలోమీటర్లు, నిజామాబాద్ నుంచి 13 కిలీమీటర్ల దూరంలో ఉంది.
వసతి : నిజామాబాద్లో వసతి సదుపాయాలు ఉన్నాయి.
ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం
ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం వరంగల్ జిల్లాలో ఉంది. దీనిని 1952 సంవత్స రంలో ఆనాటి హైదరాబాద్ ప్రభుత్వం జీవవైవిధ్యాఅభ యారణ్యంగా ప్రకటిం చింది.
గోదావరి నది అభయారణ్యం గుండా ప్రవహిస్తుంటుంది. ఇక్కడ అనేక రకాల అడవి జంతువులు చూడవచ్చు. అరుదుగా కనిపించే సాంబార్, కృష్ణజింక ఇక్కడ కనిపిస్తాయి.
తోవ : హైదరాబాద్ నుం డి 200 , వరంగల్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
వసతి : వరంగల్లో వసతి సదుపాయాలున్నాయి.
ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం
ప్రాణహిత వన్యప్రాణుల అభయా రణ్యం ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 136 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ వన్యప్రాణి అభయారణ్యం దక్కన్ పీఠభూమి సుందరమైన ప్రకృతి దృశ్యాలకు తలమానికం. ఇక్కడి కొండలు, పచ్చిక బయళ్ళు ప్రకృతి రమణీయతకు ఆనవాళ్లు. ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యంలోని అందాలను ప్రాణహిత నది మరింత పెంచుతోంది. అందమైన అభయారణ్యంలో మెలికలు తిరుగుతూ.. ప్రాణహిత నది వన్యప్రాణులకు నీటి వనరుగా పనిచేస్తుంది. అభ యారణ్యంలో వివిధ శిలాజాలు ఉన్నాయి. ఇక్కడి 15 నుండి 40 డిగ్రీల వరకు ఉంటుంది.
తోవ : హైదారాబాద్ నుంచి 250 కిలోమీటర్లస్త్ర, మంచిర్యాల నుంచి 35 కిలోమీటర్లు.
వసతి : మంచిర్యాలలో వసతి సదుపాయాలు ఉన్నాయి.
శివారం వన్యప్రాణుల అభయారణ్యం
శివారం వన్యప్రాణుల అభయారణ్యం కరీంనగర్ జిల్లా మంథనికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. అనేక జంతువులు, సరీసృపాల సహజ నివాసం ఇది. టేకు, టేర్మినాలియా చెట్లతో అలుము కున్న దట్టమైన అడవి 37 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడ ప్రవహించే నది మొసళ్ళకు నిలయం. చిరుతపులులు, ఎలుగు బంట్లు, చిరుతలు, కొండ చిలువలకు ఈ అడవి ఆశ్రయమి స్తుంది. సహజ సిద్ధమైన కొండా కోనలు ఈ అభయారణ్యం అందం, ఆహ్లాదాన్ని రెట్టింపు చేస్తున్నాయి.
తోవ : హైదరాబాద్ నుంచి 135కిలీమీటర్లు, కరీం నగర్ నుంచి 80, మంథని నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
వసతి : కరీంనగర్, మంథని, మంచిర్యాలలో వసతి సదుపాయాలు ఉన్నాయి.
మరో పది పార్క్లు..
రమణీయమైన ప్రకృతిని నిలయంగా ఉన్న తెలంగాణలో మరిన్ని పార్క్లను అభివృద్ధి చేసి ఎకో టూరీజాన్ని పెంచాలన్న ఆలోచనలో ఉన్నాం. స్థానికంగా ఉన్న గిరిజనులను ఉపాధి కల్పిస్తూ.. జాతీయ రహదారుల వెంట మరో పది పార్క్లను అభివృద్ధి చేసే ఆలోచన ఉంది. అనేక వన్యప్రాణి అభయారణ్యాల్లో పర్యాటకులకు సఫారి అందుబాటులో ఉంది. సుశిక్షితులైన అటవీసిబ్బంది సహాయంలో ఓపెన్ టాప్ జీప్లో అడవిలోకి వెళ్లే సదుపాయం కల్పిస్తున్నాం. బోటింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచన ఉంది. వినోద, విజ్ఞాన యాత్రలకు ఉపకరించేలా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ.. అందుబాటులోకి తీసుకువస్తున్నాం.
-శశాంక్
- శంకరన్,
డిప్యూటీ సి.ఎఫ్ (రిటైర్డ్)
Authorization