ఈ మధ్య నేను నా భార్య ప్రమీలా రాణి దుబారు చూడటానికి వెళ్లాం. అక్కడ బుర్జ్ ఖలీఫాను చూడటానికి టికెట్ బుక్ చేసుకున్నాం. ఏ సమయంలో చూడడానికి రావాలో కూడా వాళ్లే చెప్పేస్తారు. బుర్జ్ ఖలీఫాను చూసినపుడు నాకు కలిగిన భావాలు మీతో పంచుకోవాలని ప్రయత్నం. బుర్జ్ ఖలీఫా చూడడానికి పోవడమంటేనే ఓ రకమైన ఉద్విగత. ఒకటి రెండు అంతస్తులు కాదు కదా 160 అంతస్తులు !! 2717 ఫీట్ల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం. దీన్ని 2010 జనవరిలో ఆవిష్కరించారు. సామ్సంగ్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మించిన ఇంత పెద్ద కట్టడం ఆరు సంవత్సరాలలోనే పూర్తి చేయడం మామూలు విషయం కాదు కదా!! ఇది కట్టడానికి 150 కోట్ల అమెరికా డాలర్ల ఖర్చు... అంటే మన రూపాయల్లో దాదాపు 9450 కోట్లు !
ఈ ఆకాశసౌధంలో మొత్తం 900 అపార్టుమెంట్లు, 30000 గహాలు, 7.4 ఎకరాల విస్తీర్ణం కలిగిన తొమ్మిది హౌటళ్లు, దుబారు మాల్, 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. బుర్జ్ ఖలీఫా చుట్టూ సరస్సు ఉండేలా కట్టడం విశేషం. దుబారు ప్రధాన వ్యాపార కేంద్రానికి సమీపంలో ఉండే షేక్ జాయేద్ రోడ్ వెంబడి 'మొదటి కూడలి' వద్ద డౌన్టౌన్ దుబారు పేరుతో పిలిచే కొత్త గా (490-ఎకరాల) ప్రధాన అభివద్ధి ప్రణాళికలో భాగంగా బుర్జ్ ఖలీఫా ను నిర్మించారు. దారిలో పోతుంటే ఏర్పాటు చేసిన ఫొటోల వల్ల తెలుస్తున్నది. దుబారు మాల్ అని ఎంతో పేరొందిన కొన్ని వందల షాపులను చూసుకుంటూ బుర్జ్ ఖలీఫాను చూడడానికి వెళ్లాం. టికెట్ తీసుకున్న తర్వాత చాలా దూరం నడవాలి. మేం పోయినపుడు సందర్శకులు తక్కువగానే ఉన్నారు. ఈ నిర్మాణానికి ముందు నాలుగు సహస్రాబ్దాలపాటు మధ్యప్రాచ్యంలోని గిజా పిరమిడ్ ఒక్కటే ప్రపంచంలో అత్యంత ఎత్తైన మానవ నిర్మిత కట్టడంగా గుర్తింపు పొందింది. కానీ ఆ తర్వాత 1311లో ఇంగ్లండ్లోని లింకన్ కేథడ్రల్ను, గిజా పిరమిడ్ కంటే ఎత్తైన మానవ నిర్మిత కట్టడంగా తీర్చిదిద్దారు. నేడు ఈ బుర్జ్ ఖలీఫా నిర్మాణ ఫలితంగా భూమిపై అత్యంత ఎత్తైన మానవనిర్మిత కట్టడం ఉన్న ప్రదేశం మధ్యప్రాచ్య ప్రాంతంలోకి వచ్చింది.
బుర్జ్ దుబాయి కాస్త...
''బుర్జ్ దుబాయి'' గా పిలిచే ఈ నిర్మాణాన్ని నేడు ''బుర్జ్ ఖలీఫా'' గా మారడం వెనుక గల కారణాలను అడిగినపుడు, అక్కడి నిర్వాహకులు ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన సమయం అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ఏర్పడటం రెండూ ఒకే సమయంలో జరిగింది, ఆర్థిక సంక్షోభంతోపాటు దేశంలో మితిమీరిన భవన నిర్మాణం ఫలితంగా అధిక స్థాయిలో భవనాలు ఖాళీ కావడం, జప్తులు జరిగాయి, ఈ నేపథ్యంలో తలకుమించిన లక్ష్యాల కారణంగా దుబారు అప్పుల ఊబిలో చిక్కుకుంది, దీంతో చమురు నిక్షేపాలతో సంపన్నమైన పొరుగు దేశం అబుదాబి నుంచి దుబారు ప్రభుత్వం అనేక బిలియన్ల డాలర్లను రుణం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరువాత ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో, కీలకమైన మద్దతు ఇచ్చిన అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయేద్ అల్ నాహ్యాన్ గౌరవార్థం ఈ టవర్కు ''బుర్జ్ ఖలీఫా'' అని పేరు మార్చినట్లు చెప్పారు.
ప్రపంచంలోనే ఎత్తైన వెలుపలి అబ్జర్వేషన్ డెక్ ఉంది . అంత ఎత్తులో ఉన్న అంతస్తులోకి లిఫ్టులో కేవలం 60 సెకన్లలో పోవడం మనకు నమ్మశక్యం కాదు. పోతున్నప్పుడు చెవులన్ని ఝుమ్మంటూ మూసుకొని పోయినట్లు ఇబ్బందులు పడ్డాం. 124 అంతస్తులోకి పోగానే అక్కడ చుట్టూ అద్దాలున్నాయి. అట్ ది టాప్ పేరుతో వెలుపలి భాగంలో నిర్మించిన అబ్జర్వేషన్ డెక్ను 2010 జనవరి ఐదున ప్రారంభించారు. ఈ అబ్జర్వేషన్ డెక్లో అభివద్ధి చేయబడిన ఆగుమెంటెడ్ రియాలిటీ పరికమైన బెహౌల్డ్ టెలిస్కోప్ ఒకటి అందుబాటులో ఉంది. దీని నుంచి బుర్జ్ ఖలీఫాకు చుట్టూ ఉండే భూభాగాన్ని వాస్తవ పరిస్థితుల్లో చూసేందుకు వీలుండడంతో పాటు, గతంలో వివిధ సమయాల్లో, వివిధ వాతావరణ పరిస్థితుల్లో తీయబడిన ఫోటోలను చూసేందుకు కూడా వీలవు తుందిక్కడ. వాటి నుండి దుబారు పట్టణాన్ని చూడవచ్చు. టూరిస్టులనందరిని 124 అంతస్తు వరకే అనుమతించినా, 125 అంతస్తులోకి నడుచుకుంటూ పోవచ్చు. ఆపై అనుమతించరు. పైనుండి ఒక్కసారి దుబాయి మొత్తం చూశాం. అక్కడే కొన్ని ఫోటోలు తీసుకున్నాం. ఆ రాత్రి లైట్లతో మెరిసి పోతున్న దుబారు పట్టణం చుక్కల పందిరి వేసుకున్నట్లనిపించింది. మారుతున్న ప్రపంచం అభివద్ధి నూతన బట్టలను తొడుక్కొని అందరికి చూయించడానికి ఫ్యాషన్ షో చేస్తున్నట్టుంది. చుట్టూ అద్దాలు లేకపోతే అన్న ఊహే భయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మనం ఉన్నది ఎన్నో ప్రపంచ రికార్డులను తిరగరాసిన బుర్జ్ ఖలీఫా పైన కదా !!
రికార్డుల సొంతం ...
ప్రపంచంలోనే ఎత్తైన చోట అంటే 158 అంతస్తులో నిర్మించిన మసీదు, ప్రపంచం లోనే ఎత్తైన చోట నివసించడానికి ఇల్లు, 76 వ అంతస్తులో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ , ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చోట (144 వ అంతస్తు) లో ఉన్న నైట్ క్లబ్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వెలుపలి అబ్జర్వేషన్ డెక్ (124వ అంతస్తు), (1,483), ప్రపంచంలోనే ఎక్కడా లేని 160వ అంతస్తు, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలివేటర్లంటి ప్రపంచ రికార్డులన్నీ తిరుగరాసినవే! అలాంటి విశేషాలున్న ఒక కట్టడంపైనుండి నిలబడ్డామన్నా ఊహా మనకు ఒకింత గర్వాన్ని కలగచేస్తుంది. ఇంత ఇంజనీరింగ్ అద్భుతాన్ని సష్టించిన ఇంజనీర్ల మేధస్సును తల్చుకుంటే బాలభారతం సినిమాలో ''మానవుడే మహనీయుడు'' పాట గుర్తుకొచ్చింది. ఒక్కసారి రాసిన ఆరుద్రకు మనసులోనే నమస్సులు తెలుపుకున్నాను. మనిషి కన్న కలలను వాస్తవ రూపం కోసం సాంకేతికం కలబోసిన శ్రమే కదా!!
బాగా గాలులు వస్తే ఇంత ఎత్తులో ఉన్న కట్టడం ఎలా తట్టుకుంటుందన్న సాంకేతిక మైన అనుమానం నాకు మొదటినుండి వెంటాడుతూనే ఉండేది. అక్కడి వారిని అడిగితె వీచే గాలుల నుంచి ఎదురయ్యే ఒత్తిడి నివారించడం కోసం నిర్మాణ అభివద్ధి జరుగుతున్న సమయంలోనే , ఇంజనీర్లు ఈ భవన నిర్మాణాన్ని దాని అసలు నమూనా కంటే 120 డిగ్రీలు తిప్పడం జరిగిందని, అందుకే దాని ఎత్తైన ప్రాంతం వద్ద ఈ భవనం 1.5 మీటర్లు (4.9) మేర తిరిగి ఉంటుందని చెప్పారు.
అద్దాలను తూడ్చాలంటే గాలిలో వేలాడాల్సిందే!!
ఒక్కసారి 160 వ అంతస్తుపైకి చూసినపుడు చుట్టూ అద్దాలే అవుపడ్డాయి. అక్కడున్నవారిని అద్దాలను లోపలనుండైతే శుభ్రపర్చవచ్చు కానీ బయటనుండి ఎలా శుభ్రపరుస్తున్నారని అడిగినపుడు వారు చెప్పిన సమాధానం నాకైతే ఒళ్ళు గగుర్పొడిచింది. భవనంలో మొత్తం 24348 కిటికీలు ఉన్నట్లు , వాటిని బయట నుండి మాత్రమే శుభ్రపరచడానికి 36 మంది పనివారు రోజు పనిచేస్తే దాదాపు 4 నెలలు పడుతుందని చెప్పారు. లోపల నుండి శుభ్రపరిచేవారు అదనం. పైనుండే శిఖరం అంచుల్లో శుభ్రపరచడానికి ప్రత్యేక క్రేన్లను వాడుతున్నట్లు చెప్పారు. బయటనుండి శుభ్రపరిచేటప్పుడు గాలులు తట్టుకుంటూ తాళ్ల ద్వారా ఊగుతూ శుభ్రపరుస్తారట!! ఆకాశంలో పయనించే ఉపగ్రహాల్లో, అవసరాలు ముంచుకొచ్చినప్పుడు గాలిలో ఊగుతూ స్పేస్ వాక్ చేసే ఆస్ట్రోనాట్ శ్రమ ఎంత కష్టమో అందరికి తెలిసిందే. ఏ మనిషీ లేనిచోట చుట్టూ నిశ్శబ్దం రాజ్యమేలు తుంటే, విజ్ఞాన ఫలాలను ప్రజలకు అందించే తపనలో శాస్త్రజ్ఞుల త్యాగం మామూలుది కాదు. ఒకవేళ చైన్ ఊడిపోతే ఆ శూన్యంలో తిరుగుతూ ఉండాల్సిందే, కానీ చేయగలిగింది ఏమీ లేదు. ఈ శాస్త్రజ్ఞుల త్యాగాన్ని, శ్రమను తెలియచేయడానికి కనీసం చరిత్రలో గుర్తులైనా ఉన్నాయి. కానీ గాలిలో వేలాడుతూ 160 అంతుస్తుల పైభాగం నుండి అద్దాలను తుడవడం ఎంత కష్టమో కదా?! అనిపించింది.
150 అపార్టుమెంట్లూ భారతీయులివే!
మనం భారతీయులుగా ఒకింత గర్వపడే విషయం మాత్రం ఈ బుర్జ్ ఖలీఫా. దుబాయిలో స్థిరపడ్డ కేరళ వాసి 'జార్జ్ వి నెరియపరంబిల్' అనే అతను దీంట్లో 22 అపార్ట్మెంట్లను సొంతం చేసుకోవడం. అతని జీవితం ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తూనే ఉంటుంది. కేరళలోని తిరుచూర్ దగ్గర ఓ పల్లెటూళ్లో పుట్టి వ థాగా పడేసే చింత గింజల్ని సేకరించి వాటిపైన పొట్టుని దాణాగా అమ్మినతను ఆటోమొబైల్ మెకానిక్గా షార్జాకు వెళ్లి ఏసీలూ, ఫ్రిజ్ల అమ్మకాలూ, రిపేర్ల వ్యాపారాన్ని ప్రారంభించి , నేడు గొప్ప వ్యాపారవేత్తగా 22 ఫ్లాట్లకు యజమానిగా మారడం ఆశ్చర్యమే !! బుర్జ్లో 900 అపార్ట్మెంట్లుంటే అందులో 150 వరకూ భారతీయులూ, ప్రవాస భారతీయులే కొనడం గమనార్హం.
లిఫ్ట్ వేగం ప్రపంచంలోనే ఎక్కువ ...
ఇస్లామిక్ వాస్తు పద్ధతిలో నిర్మించిన ఈ కట్టడం కింది నుండి 160 వ పై అంతస్తు లోకి చేరడానికి మొత్తం 2909 మెట్లు ఉన్నాయని ఇందులో 57 ఎలివేటర్లు, 8 ఎస్కలేటర్లున్నట్లు చెప్పారు. ఒక్కోలిఫ్టులో 12-14 మంది పడుతారని ఒక్కో సెకనుకు 59 అడుగులు ప్రయాణిస్తుందని తెలిపారు. భవనం అడుగు భాగంలో కనిపించే మూడు తమ్మెలను హైమనోకాలిస్ పుష్పం (ఈ పుష్పాలు అమెరికాలో పూస్తాయి) తీరుగా రూపొందినట్లు అక్కడి వారు చెప్పారు. తిరిగి వచ్చే టైంలోనే మనకు చెపుతారు. బుర్జ్ ఫౌంటెన్ కూడా చూసిపొమ్మని. అయితే దానికి టైమింగ్స్ ఉన్నాయి, దాని ప్రకారమే మనం పోవాలి. అప్పటికే అక్కడ గుంపులు గుంపులుగా జనం ఉన్నారు. రాత్రి సమయం గనుక బుర్జ్ ఖలీఫా మొత్తం తీరొక్క లైట్లతో డిజైన్లు వచ్చే లాగ వచ్చి పోతూ ఉంటాయి. ఆ అందాలను మనం ఎంత కష్టపడ్డా ఫొటోల్లో బంధించలేం. వీడియోల్లో కొంత దాచుకోవచ్చు. ఈలోపే ఫౌంటెన్ షో టైం కాగానే జనమంతా షో కాడికి వచ్చారు. మనం చాలాచోట్ల ఫౌంటెన్ షోలు చూసినా ఇంతపెద్దవి మేమైతే ఎక్కడా చూడలేదు. పాటపై డాన్స్ చేసినట్లు రంగు రంగుల విన్యాసాలు చేస్తూ నీళ్లు చిమ్ముతూ పైకి లేవడం చూసి తీరవలిసిందే!
ఈ శతాబ్ది అద్భుతం...
బుర్జ్ ఖలీఫా ప్రాథమికంగా దక్షిణాసియా నుంచి వలస వచ్చిన కార్మికుల ద్వారా నిర్మించబడ్డట్లు, నిర్మాణ ప్రదేశం వద్ద 7,500 మంది నైపుణ్యం కలిగిన పనివారు నిరంతరంగా పనిచేసినట్లు చెప్పారు. పరిశోధన, మానవ హక్కుల పరిశీలన నివేదిక ప్రకారం ఇక్కడ పనిచేసే కార్మికులు అత్యంత దైన్యంతో నిండిన పరిసరాల మధ్య జీవనం సాగించినట్లు, వారి వేతన చెల్లింపులు సైతం తరచూ ఆలస్యమయ్యేవని, దీనికి ప్రధాన కారణం వారి పాస్పోర్టులను వారి యజ మానులు తీసుకొని వారి వద్ద ఉంచుకోవడంగా చెబుతారు. ఈ కట్టడం ఈ శతాబ్ద అద్భుతమనడంలో ఏ అతిశయోక్తి లేదు. ఎడారిలో మానవ విజ్ఞాన విజ యానికి గర్వపడుతూ అవుపడ్డంతమేర చూస్తూ ... పెంచుకున్న ఆశలను ఆకాశంలోకి వదులుతూ. హౌటల్ కు తిరుగుముఖం పట్టాం. కారులో వస్తుంటే నాకు పాకిస్తాన్ నుండి బతకడానికొచ్చిన డ్రైవర్ కు మధ్య ఒక ఆసక్తికర సంభాషణ జరిగింది. ''సార్ బతకడానికొచ్చిన వారు దీన్ని కట్టారు... బతకడానికే వచ్చిన నేను మిమ్ములను తీసుకొచ్చాను. కట్టిన వాళ్ళు... తీసుకొచ్చిన వాళ్ళు... చూడడానికొచ్చిన మీరు.. ఎవ్వరం ఈ దేశం వాళ్ళంకాము. ఆశ్యర్యంగా అందరం ఇక్కడ కలుసుకొన్నాం. .అంతా డబ్బు మహిమ సార్'' అన్నాడు. నిజమే... దారిలో వస్తుంటే చెమట చుక్కలపై నడిచి వచ్చిన భావన. ఎంత మంది వలస జీవుల కన్నీటి స్వప్నమో కదా ఈ కట్టడం. దూరంగా మెరుస్తున్న బుర్జ్ ఖలీఫా ఇప్పుడు వలస జీవుల ఆకలి పాట పాడుతున్నట్టుంది!!!???
- స్ఫూర్తి
9490098694
Authorization