పర్యాటక ప్రియులకు ఆస్ట్రియా దేశ రాజధాని వియన్నా తెగ ఆకర్షిస్తోన్నది. భారతీయులను ఆకట్టుకున్న సుందర నగరంగా దీన్ని చెప్పవచ్చు. ఏడాదిగా వియన్నా సందర్శించిన పర్యాటకుల్లో లక్ష మందికిపైగా భారతీయులున్నారని ఓ సర్వే ద్వారా తెలిసింది. భారతీయులు ఇంత పెద్ద సంఖ్య లో వెళ్లడానికి వియన్నాలో అందమైన ప్రకృతి ఒక్కటే కారణం కాదు. వియన్నా విహారంతో విజ్ఞా నాన్ని కూడా పొందాలని భావిస్తున్నారట భారతీయ పర్యాటకులు. తమకున్న వ్యాపార దృక్పథాన్ని విస్తృతం చేసుకోవాలనే తపన కూడా ఈ యాత్రల వెనుక ఉందంటారు, వియన్నా టూరిస్ట్ బోర్డ్ డైరెక్టర్ నార్బర్ట్ కెట్నర్. భారతీయ పర్యాటకులు, హానీమూన్కు వెళ్లేవారు లేదా ఏదైనా సదస్సుకు హాజరయ్యే వాళ్లు.. పర్యటించే ప్రదేశాలే కాకుండా అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందట. మొత్తంగా చూస్తే సందర్శకుల సంఖ్య 39 శాతం పెరిగినట్లు చెప్పుకోవచ్చు. అయితే భారతీయులు సగటున 2.21 రోజుల పాటున వియ న్నాలో గడుపుతున్నట్లు ఆ దేశటూరిజం లెక్కలు కట్టింది. భారతీయుల తర్వాత వియన్నాను ఎక్కువ గా సందర్శిస్తున్న వారిలో జర్మనీ, అమెరికా, ఇటలీ, గ్రేట్ బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశస్తులు ఉన్నారు.
Authorization