ఆఫ్రికా ఖండతీర ప్రాంతంలో హిందూ మహాసముద్రంలో ఉండే ఓ ద్వీప దేశమే 'మారిషన్'!. లక్షల ఏండ్ల కిందట భూగర్భంలోని అగ్నిపర్వతాల విస్పోటనాల వల్ల ఈ ద్వీపం ఏర్పడింది. మొదటిసారిగా ఇక్కడ అడుగుపెట్టింది పోర్చుగీసులు. ఈ దేశంలో మారిషస్ క్రియోల్, ఫ్రెంచ్, భోజ్పురీ, ఆంగ్లం, హిందీలతో పాటు మన తెలుగు కూడా మాట్లాడతారు. ఇక్కడ భారత్, ఆఫ్రికా,చైనా దేశాల సంతతివారు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం అంతరించి పోయిన డోడో అనే పక్షులు ప్రపంచం మొత్తంలో ఇక్కడ మాత్రమే ఉండేవి.
1968లో బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందింది. ఈ ద్వీప దేశాన్ని చూడ్డానికి దేశదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ప్రముఖ రచయిత మార్క్ ట్వైన్ ఈ దేశం గురించి ఏమన్నారంటే ? 'ముందు మారిషస్ ఏర్పడింది ఆ తర్వాతే స్వర్గం తయారైంది. మారిషస్ను చూసే స్వర్గాన్ని తీర్చిదిద్దారు'. ఎంత అందమైన దేశమో కదా. ఇక్కడ ముఖ్యమైన పర్యాటక ప్రాంతం ఛామరెల్లోని 'ఏడు రంగుల నేల'. తక్కువ ప్రదేశంలోని ఇక్కడి ఇసుక వేరువేరు రంగుల్లో భలేగా కనిపిస్తుంది. ఇది అగ్నిపర్వతాల ప్రభావంతోనే ఏర్పడింది. ఈ ఐలాండ్లో క్రూరమృగాలు ఉండవు. ఇక్కడ కనిపించే పాములు కూడా విషపూరితమైనవి కావు. ఈ ద్వీపం చుట్టూ ఉండే కోరల్ రీఫ్స్ ఉష్ణోగ్రతల నుంచి, షార్కు, జెల్లీఫిష్ వంటి జలచరాల నుంచి సందర్శకుల్ని కాపాడుతుంటాయి. దేశం మొత్తం జనాభాలో రాజధాని పోర్ట్ లూయిస్లోనే 40 శాతం మంది నివసిస్తారు. మారిషస్ అనే పేరు ఒకప్పటి రాజకుమారుడు మారిస్ డె నాసో పేరు మీదుగా వచ్చింది. ఇక్కడి మొత్తం వ్యవసాయ భూమిలో 90 శాతం చెరకునే పండిస్తారు. రెండు చేతులతో బహుమతి తీసుకోవడం గౌరవంగా భావిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. కుడి చేతితో మాత్రమే బహుమతి తీసుకోవాలి.
Authorization