''పర్యాటక ప్రదేశాలకు రండి'' అంటూ విదేశీయుల్ని ఘనంగా ఆహ్వానిస్తుంటాం కానీ.. తీరా మనదేశంలోని టూరిస్టుప్లేసులకు వస్తే.. సౌకర్యాలలేమి వెక్కిరిస్తుంది. అదే విషయాన్ని ప్రపంచం టూరిస్టు రైటర్స్ తేల్చి చెప్పారు. మన దేశంలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలను తిలకించిన వారందరూ కొన్ని ఫిర్యాదులు, సలహాలు ఇచ్చారు. ''భారత్లోని పర్యాటక ప్రదేశాల్లో శుభ్రత తక్కువ. సుఖవంతమైన రవాణాసదుపాయలతో పాటు భద్రత కూడా కల్పించాలి'' అన్నారు. కెనడాకు చెందిన మెరిలియన్ వార్డ్ హెరిటేజ్ ఆర్క్లో భాగంగా.. పురాతన నగరం వారణాసిని సందర్శించారావిడ. ''కనీస మౌలిక సదుపాయాల కొరత ఇక్కడ ఎక్కువగా ఉంది'' అని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యకర్త నవీన జఫ మాట్లాడుతూ ''భారతీయ పర్యాటక ప్రదేశాల్లో అతి పెద్ద సమస్య ఏంటంటే - మరుగుదొడ్ల కొరత. ఎన్నో అవస్థలు పడి సందర్శన ప్రదేశాలకు వస్తారు. అక్కడ కనీసం ఆడవాళ్లకు మరుగుదొడ్లు లేకపోతే ఎంత ఇబ్బంది? ప్రభుత్వం వెంటనే స్పందించి టారులెట్స్ను కట్టించాలి'' అని సలహా ఇచ్చారామె. ''పర్యాటక ప్రదేశాలకు వెళ్లే వికలాంగులకు కూడా ప్రత్యేక సదుపాయాలేవీ లేవు. వారికి ఏ విధంగా భరోసా కల్పిస్తుంది ప్రభుత్వం. ఇక నుంచైనా ఆలోచించాలి?'' అన్నారు న్యూయార్క్కు చెందిన ఒక టూరిస్టు. ఇండియాలో మహిళా టూరిస్టుల భద్రతతోపాటు.. దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని పలువురు పేర్కొన్నారు.
Authorization