హైదరాబాద్కు తూర్పున 273 కిలోమీటర్ల దూరంలో వున్న ఖమ్మం సందర్శించే వారికి ఓ పర్యాటక స్థలం. స్థానిక గాధల ప్రకారం స్థంభ శిఖరి లేదా స్తంభాద్రి అని పిలువబడిన నరసిమ్హాద్రి గుడి పేరిట ఈ ఊరి పేరు ఏర్పడింది. విష్ణు మూర్తి అవతారమైన నరసింహ స్వామి దేవాలయం ఇది. సుమారు 1.6 మిలియన్ ఏండ్లనాటి త్రేతా యుగం నుంచి ఈ నగరం ఉండేదని రుజువైంది. ఈ గుడి ఒక కొండ శిఖరం పై ఉండగా కొండ కింద నిలువుగా వున్న రాయి స్థంభం లాగా పని చేసేది. ఈ స్థంభం 'ఖంబా' అనే పదం నుంచి ఈ ఊరి పేరు పుట్టింది. ఖమ్మం చుట్టు పక్కల ప్రాంతాన్ని 'కంబం మెట్టు' అనేవారు, అదే క్రమేణా ఖమ్మం మెట్టు లేదా ఖమ్మంగా మారిపోయింది.
కృష్ణా నదికి ఉపనది అయిన మునేరు ఒడ్డున అందమైన ఖమ్మం నగరం వుంది. చరిత్రలో ఖమ్మం ఒక ప్రముఖ స్థానాన్ని కలిగి వుంది. ఇక్కడి సుప్రసిద్ధ ఖమ్మం కోట కేవలం ఈ జిల్లాకే గాక రాష్ట్రం మొత్తానికి ముఖ్యమైనది. ఒక కొండ పైన ఠీవిగా వుండే ఈ కోట అటు సాహసానికి, ఇటు అద్భుతమైన నిర్మాణ శైలుల మిశ్రమానికి ప్రతీక. ఈ ప్రాంతాన్ని వివిధ మతాలకు చెందిన వివిధ రాజవంశీకులు పరిపాలించినందు వల్ల ఈ మిశ్రమ శైలి ఏర్పడింది. ప్రాచీన కాలం నుంచి ముఖ్యంగా తాలూకాల హయాం నుంచీ ఖమ్మం వాణిజ్య, సామాజిక కార్యకలాపాల కేంద్రంగా వుండేది.
ఖమ్మంను పరిపాలించిన ఎంతో మంది రాజవంశీకులు ఈ నగర చరిత్ర, కళ, నిర్మాణ శైలుల మీద చెరగని ముద్ర వేశారు. ఖమ్మం మత సామరస్యానికి కూడా చక్కటి ఉదాహరణ. వివిధ మతాలకు చెందిన వారు తమ తమ మతాలను అవలంబిస్తూ వుండడం ఖమ్మంకు ప్రత్యేకత తీసుకు వచ్చింది. ఖమ్మం లోని ప్రధాన ఆకర్షణలు గుళ్ళూ, మసీదులే. అందులోనూ పక్క పక్కనే ఉండేవి ఎక్కువ. ఖమ్మంతో పాటు దీని చుట్టుపక్కల ఆస్వాదించదగ్గ అనేక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ఖమ్మం కోట, జమలాపురం ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలు. ఈ ప్రాంతంలో పలైర్ సరస్సుతో పాటు పాపి కొండలు, వాయర్ సరస్సు ప్రధాన సందర్శనీయ స్థలాలు.
ఆహ్లాదకర వాతావరణం ఉండే శీతాకాలంలో ఖమ్మం సందర్శించడం ఉత్తమం. ఈ ప్రాంతం ఏడాది పొడవునా ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఉత్తర భారతదేశంతో పోలిస్తే ఇక్కడ చలి తక్కువగా ఉంటుంది. అందుకే అటునుండి వచ్చే వారు శీతాకాలం ఇక్కడికి వస్తుంటేరు. అయితే, వేసవిలో అధిక వేడి వల్ల ఆ సమయంలో ఖమ్మం సందర్శించడం సరైనది కాదు.
Authorization