ఎత్తుపల్లాల కొండలు.. గలగలా పారే నదులు.. ఇవి జయంతియా హిల్స్ సహజ అందాలు. వీటితో పాటు దాని గొప్ప చరిత్ర కూడా చెప్పుకోదగ్గది. జయంతియాపుర్ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది. అప్పట్లో ఆ రాజ్య రాజధానిలో నివశించిన జయంతియా రాజు నిర్మించిన నర్తియంగ్ ఈ కొండలలో వేసవి విడిదిగా ఉన్న ఒక చిన్న గ్రామం. రాజుకు వేసవి విడిదిగా ఉండటం వల్ల అక్కడకు వెళ్ళడానికి మంచి రహదారి ఏర్పడటమే కాకుండా సాంస్కృతిక మార్పులు కూడా విస్తారంగా జరిగాయి.
జయంతియా పదం పశ్చిమ జయంతియా, తూర్పు జయంతియా అనే రెండుజిల్లాలకు ఉపయోగించిన సామూహిక పదం. పశ్చిమ జయంతియా జిల్లా ప్రధాన కార్యాలయం జోవాయిలో ఉంటే, తూర్పు జయంతియా జిల్లా ప్రధాన కార్యాలయం ఖిలేరియత్లో ఉంది. జయంతియా హిల్స్ పర్యాటనకు వెళ్ళిన వారికి చూసేందుకు పరిమిత ప్రాంతాలే ఉన్నాయి. అయితే నర్తియంగ్ లో పెద్ద ఎత్తున జరిగిన ఏకశిలల సేకరణ మాత్రం అద్భుతంగా ఉంటుంది. చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. నర్తియంగ్లోని దుర్గా ఆలయం కూడా అక్కడి ప్రధాన ఆకర్షణ.
ఈ హిల్స్ చేరుకోవాలంటే జోవాయి, షిల్లోంగ్ నుండి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు పట్టణాలను చేరుకోవడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. జయంతియా హిల్స్కి రహదారి ప్రధాన మార్గం. పర్యాటకులు జయంతియా హిల్స్లోని వివిధ పర్యాటక ఆకర్షణలు సందర్శించడానికి జోవాయిని ప్రధాన కేంద్రంగా ఉపయోగించుకుంటారు.
జయంతియా హిల్స్లో వర్షాకాలంలో భారీ వర్షపాతం ఉంటుంది. ఇది వేసవిలో ఆహ్లాదకరమైన వేడిగా, శీతాకాలంలో ఎక్కువ చలిగా ఉంటుంది. పర్యాటకులు తక్కువ వర్షపాతం ఉండే వేసవి సమయంలో ఈ హిల్స్ సందర్శించడం ఉత్తమం
Authorization