పుస్తకాలు సమాజ నిర్మాణాలు. కొత్త ప్రపంచానికి దారులు వేస్తాయి. పుస్తక ప్రపంచంలోని అడుగు పెట్టిన వారే కొత్త వ్యవస్థలను నిర్మించి ప్రపంచానికి అందించారు. ఎన్నో పుస్తకాలు ఎందర్నో మార్చాయి. మానవ జీవన పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి పుస్తకాలు ఎంతో దోహపడటమే కాకుండా సమాజగతినీ మార్చి వేస్తాయి. 'జ్ఞాన వంతుడు తాను తెలుసుకొన్న విషయాలను ఇతరులకు చెప్పకపోతే మూర్ఖుడవుతాడు'' అంటాడు సోక్రటీస్. తాము ప్రపంచం గురించి, వివిధ ప్రాంతాల గురించి తెల్సుకోవాలి, చూడాలి. జ్ఞానం, విజ్ఞానం, వినోదం, విషయ అవగాహన కోసం యాత్రలు కొనసాగిస్తారు. కొందరు వృద్దులు తీర్థయాత్రల పేరుతో జెరుసలేం, మక్కా, కాశీ, వారణాసి, నేపాల్, సారనాథ్, గురుద్వార్ లాంటి ప్రాంతాలు వెళ్ళాలను కొంటారు. అలాగే కొత్త విషయాలు, ప్రాంతాలు చూడాలనుకుంటారు.
అన్వేషణ
కొత్త విషయాలు ప్రాంతాలు కనుగొనాలి అనే దృష్టితో కొందరు యాత్రలు చేస్తారు. మరి కొందరు వైవాహిక తొలినాళ్ళు ఏకాంతంగా గడపాలనే ఆనందం కోసం (హనీమూన్ ట్రిప్) విహార యాత్రలు చేస్తారు. ఎంజారు కోసం కొందరు చేస్తారు. యాత్ర రచనలు మానవ సమాజానికి ఎంతో ఉపయోగం కలిగిస్తాయి. ప్రపంచ యాత్ర చేసాడు. మ్యాజిలాన్ - అలా ఆయన చేయడం వల్ల ''భూమి గుండ్రంగా ఉందని తెలిసింది. ఇది గొప్ప అన్వేషణ.
యాత్రా అనుభవాలు
కొలంబస్ యాత్రకు మార్క్పోలో యాత్రా చరిత్ర ఉపయోగపడింది. హెచ్.జి.వెల్స్, ''ప్రపంచ చరిత్ర'' రాసారు. ఇది ఎందరికో ఉపకరించింది. మన తెలుగునాట చిలుకూరి వీరభద్రరావు రాసిన గొప్ప యాత్రా చరిత్ర ''దక్షిణ భారత చరిత్ర. ఎంతో విలువైన గ్రంథం. అలాగే ఏనుగుల వీరాస్వామి ''కాశీయాత్ర'' కథనం ఇప్పటికీ ఉత్సాహ భరితంగా చదివిస్తుంది. రాహుల్ సాంకృత్యాయన్ ''లోక సంచారి'', వివేకానందుని ''ఐరోపా పర్యటన'', ఠాగూర్ ''ఐరోపా యాత్రా లేఖలు'', నాయని కృష్ణ కుమారి ''కాశ్మీరీ దీప కళిక'', దాశరధి ''యాత్రా స్మృతి, బి.వి రమణ ''ట్రెక్కింగ్ అనుభవాలు'', ఆదినారాయణగారి ''భ్రమణ కాంక్ష'', యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ''పాకీస్తాన్లో పది రోజులు'', ''లేమూరి రాజేష్ ''నా ఐరోపా యాత్ర'', దేవులపల్లి కృష్ణమూర్తి, ''మా యాత్ర'', లోకేశ్వర్ ''సిల్క్ రూట్లో సాహస యాత్ర'', నర్మదారెడ్డి ''మా ప్రయాణం ఆగదు'', కందేపి రాణీప్రసాద్ ''కనుచూపుమేర'', ఎన్.గోపి, జె.బాపురెడ్డిగారల యాత్రా చరితలు (వివిధ దేశాల పర్యటనలపై) ఎన్నో విశేషాలు చెపుతాయి.
సాహస యాత్రలు...
దీవుల్లో చేసే యాత్రలు మరింత ఆనందం, ఉత్సాహం, ఆహ్లాదం కలిగిస్తాయి. దీవుల్లో ప్రయాణించి యాత్ర రచన చేసిన వారిలో నిమ్మగడ్డ శేషగిరి రావు ప్రథములుగా చెపుతారు. ఎంతో సాహస వంతమైన యాత్ర అది. అలాగే ఆంగ్ల సాహిత్యంలో జార్జి గుల్ జీఫ్ రాసిన ''మీటింగ్ విత్ ది మార్క్ బుత్ మెన్'', కౌంట్ కీ సిర్లింగ్ ''ద ట్రావెల్ డైరీ ఆఫ్ ఫిలాసఫర్'' ఇటీవల కాలంలో ఎండ్లూరి సుధాకర్ ''ఆటాజని కాంచె'', కొండవీటి సత్యవతి ''తుపాకీ మెనపై వెన్నెల'', పరవస్తు లోకేశ్వర్ రాసిన ''నల్లమల ఎర్రమల దారులలో'' లాంటి యాత్ర రచనలు పాఠకుల్ని, యాత్రాభిమానుల్ని ఎంతో అలరించే మంచి గ్రంథాలు. రెహానా ''సరిహద్దుల్లో'' పుస్తకం, దాదాపు 150 దేశాలు పర్యటించి రాసిన నర్మాదారెడ్డి ద్వితియ పుస్తకం ''కొలంబస్ అడుగు జాడల్లో'' లాంటి గ్రంథాలతో పాటు మరెందరో తమ యాత్ర చరితలతో పాఠకులను ఉత్తేజపరిచారు. ఇవి అధ్యయనానికి, ప్రాథమిక అవగాహనకు ఎంతో ఉపకరించే ఉత్తమోత్తమ గ్రంథాలు.
- తంగిరాల చక్రవర్తి,
9393804472
Authorization