రాజస్థాన్లోని జైపూర్కు ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. జైపూర్ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తూ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యూనెస్కో) ప్రకటన చేసింది. ఇదే విషయాన్ని యూనెస్కో తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేసింది.
భారతదేశ పర్యాటక అకర్షణ నగరాలలో జైపూర్ ప్రధానమైనది. అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకట్టుకునే నగరాల్లో జైపూర్ ఒకటి. అనేమ మంది ప్రజలు ఇక్కడి కోటలు, జ్ఞాపక చిహ్నాలను సందర్శించి భారతీయ పురాతన శిలకళా నిర్మాణకళా వైభవం చూసి మంద్ర ముగ్ధులు ఔతారు. జైపూర్ నగర ఆర్థిక వనరులలో పర్యాటరంగం ప్రధానమైనది. పర్యాటకుల సంఖ్యను పెంచడానికి ఆ ప్రభుత్వం అదనపు సౌకర్యాలు, అదనపు ఆకర్షణలు పెంచేందుకు చాలా కృషి చేస్తున్నది.
కళలకు కూడా ప్రసిద్ధి
రాజస్థానీ గత పాలకులు చక్కని కళాపోషకులు. వారు పలు కళలను కళాకారులను ఆదరించి ప్రోత్సహించారు. వారు దేశం నలుమూలల నుండి, అంతర్జాతీయంగా నైపుణ్యం కలిగిన కళాకారులను, చేతిపని వారిని అహ్వానించేవారు. వివిధ సమూహాలకు చెందిన ప్రజలు రాజస్థానుకు విచ్చేసి అక్కడే స్థిరపడ్డారు. జైపూర్లోని చేతి పనులైనా బంధాని, బ్లాక్ ప్రింటింగ్ (అచ్చుల సాయంతో అద్దకము), రాతి చెక్కడం, శిల్పాలు, టార్కషి (లోహపాత్రల అలంకరణ, కొయ్య సామాను అలంకరణ), జరీపని, గోటు పని, కినారి, జర్ధారీ పని, వెండి ఆభరణాలు, రత్నాలు, ఎనామిల్ పని, ఆభరణాలు, సూక్ష్మ వర్ణ చిత్రాలు, బ్లూ పాటరీ (మృత్తిక కళాఖండాలు), దంతపు పని, షెల్లాక్ పని (జిగురుతో చేసే పని), తోలు వస్తువుల తయారీ మొదలైనవి.
వస్తు కళా ప్రదర్శన శాల
జైపూర్ భారతీయ సంస్కృతికి ప్రధాన కేంద్రం. ముఖ్యంగా జవహర్ కళాకేంద్రా, రవీంద్రమంచ్ ఐక్య రాజస్థాన్ సంస్కృతిని ప్రజలకు చేరువ చేస్తున్నాయి. ఆబర్ట్ హాల్ల్ మ్యూజియమ్ (ప్రభుత్వ సెంట్రల్ మ్యూజియమ్)లో అనేక కళలను, పురాతన కళాఖండాలను చూడొచ్చు. హవా మహల్లో రాష్ట్రప్రభుత్వ వస్తుకళా ప్రదర్శనశాలలో విరాటనగర్లో కళాప్రదర్శనశాల ఉంది. టౌన్ హాల్ (పాత విధానసభ)ను వస్తుకళా ప్రద్శనశాలగా మార్చబడింది. నగరంలోని వివిధ ప్రదేశాలలో వివిధ రూపాలలో సంస్కృతి ప్రతిబింబిస్తూ ఉంటుంది. నగరంలోని ఫ్లైఓవర్లు కూడా అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా అలకంకరించబడి ఉంటాయి. జైపూర్ నగరం అందమైన పూలతోటలు, ఉద్యానవనాలతో నిండి ఉంటుంది. వాటిలో ప్రధానమైనవి రామ్ నివాస్ గెడెన్, సిసోలియా రాణి గార్డెన్, ప్యాలెస్, విద్యాదర్ గార్డెన్, కనక్ బృందావన్, సెంట్రల్ పార్క్, మాన్సరోవర్ సమీపంలో ఉన్న టెక్నాలజీ పార్క్, గోనర్ వద్ద ఉన్న విద్యాదర్ కా బాగ్ మొదలైనవి. ఇంకా చాంద్ బయోరి (మెట్ల బావి), ఛోకీదాని (గ్రామీణ విశ్రాంతి గృహం).
పింక్ సిటీగా...
జైపూర్ సిటీని పింక్ సిటీ అని కూడా పిలుస్తారు. నగరమంతా ఎర్రని కోటలతో నిండి ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఈ నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇందులో అంబర్ ప్యాలెస్, జంతర్ మంతర్, సిటీ ప్యాలెస్, హవా మహల్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ఈ విధంగా పర్యాటకులను ఆకర్షిస్తూ, చారిత్రక ప్రదేశాలు తన సొంతం చేసుకుంది కాబట్టే జైపూర్ సిటీని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇక యూనెస్కో గుర్తించిన ఇతర వారసత్వ సంపద నగరాల్లో బహ్రెయిన్లోని దిల్మన్ బరియల్ మౌండ్స్, ఆస్ట్రేలియాలోని బుడ్జ్బీమ్ కల్చరల్ ల్యాండ్స్కేప్, చైనాలోని ఆర్కియలాజికల్ రూయిన్స్ ఆఫ్ లియాంగ్జు సిటీ, ఇండోనేషియలోని ఓంబిలిన్ కోల్ మైనింగ్ హెరిటేజ్ ఆఫ్ సవ్హాలున్తో, కోఫన్ గ్రూప్కు చెందిన ఫురుచీ, జపాన్ నగరాలు ఉన్నాయి. ఏది ఏమైనా మన దేశానికి చెందిన జైపూర్ నగరం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం మనందరికీ గర్వకారణం.