మధ్య ప్రదేశ్లో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కామకేలి ప్రదర్శించే అరుదైన శిల్పాల ఖజురాహో, పచ్మారిలోని ప్రశాంతమైన పర్వతాలు, బాంధవ్ ఘర్ లోని వన్య ప్రాణులు వంటివి మధ్య ప్రదేశ్ రాష్ట్రలోని అరుదైన ఆకర్షణలు. ఇన్ని అద్భుతమైన ప్రదేశాలున్న మధ్యప్రదేశ్లో తప్పక చూడవలసిన వాటిలో పచ్ మరీ లేదా పచ్ మఢ. ఈ రాష్ట్రంలోని ఒకే ఒక హిల్ స్టేషన్ ఇది. దీనిని సత్పూరా కి రాణి లేదా క్వీన్ అఫ్ సాత్పూరా అని పిలుస్తారు. ఇది సాత్పూర పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి సుమారు 1110 మీటర్ల ఎత్తున ఉంది.
న పాచ్ మారి గోండ్ తెగ గిరిజన వంశస్తులకు రాజధాని. గోండ్ తెగ రాజు భావుట సింగ్. 1857లో బ్రిటిష్ వారు దీన్ని కనుగొన్నారు. పంచామారి లోని నేటి ఆధునికతలకు అతడే కారణం. ఇండియాలో ఇది అతి ఎత్తైన ప్రదేశం. అందుకే బ్రిటిష్ వారు దీనిని తమ సైనిక స్థావరంగా మార్చు కున్నారు. 2009 లో పంచమరీÛ ప్రాంతాన్ని యునెస్కో సంస్థ జీవ వైవిధ్య పరిరక్షణా ప్రాంతంగా ప్రకటించింది.
- దేశ నడిబొడ్డున సత్పూరా పర్వతాల నడుమ వెలసిన అద్భుత ప్రదేశం పచ్మఢ. ఇది హోషంగాబాద్ జిల్లాలో ఉంది. పచ్మఢకిీ ఈ పేరు 'పాంచ్' (ఐదు), 'మఢ' (గుహలు) అనే అర్థంలో వచ్చిందని చెబుతారు. 'పాంచ్మఢ' కాలక్రమంలో పచ్మఢగాీ మారిపోయింది.
న సాత్పూరా పర్వతశ్రేణుల్లోనే అత్యంత ఎత్తయిన శిఖరం 'ధూప్గఢ్' ఇక్కడే ఉంది. ఈ శిఖరం పైనుంచి చూస్తే పచ్మఢ పట్టణంతో పాటు చుట్టుపక్కల కొండలు, లోయలు కనువిందు చేస్తాయి.
- పచ్మఢ కొండల మీదుగా దూకే బీ, డచెస్, రజత్ ప్రపాత్, అప్సరా జలపాతాల అందాలను చూసి తీరాల్సిందే. వేసవిలో ఈ జలపాతాల వద్ద పర్యాటకులు జలకాలాడటానికి ఇష్ట పడతారు.
- ధూప్గఢ్ శిఖరానికి దిగువన చేరిన జలపాతాల నీటితో సహజసిద్ధంగా ఏర్పడిన మంచినీటి సరస్సు బోటింగ్కు అనువుగా ఉంటుంది. ఈ సరస్సులో పడవ ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను తిలకించడం మరువలేని అనుభూతినిస్తుంది.
- పచ్మఢ చుట్టూ విస్తరించుకున్న సాత్పూరా జాతీయ అభయా రణ్యంలో అరుదైన జాతులకు చెందిన వృక్షాలు, మొక్కలు, లతలు, వన్యప్రాణులు కనిపిస్తాయి. 'ఇండియన్ జెయింట్ స్క్విర్రల్'గా పిలుచుకునే భారీ ఉడుతలు, పులులు, చిరుతలు, జింకలు, దుప్పులు, కణుజులు, ఎలుగుబంట్లు, ఏనుగులు ఈ అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. ఈ అడవిలో పాములు కూడా విరివిగానే కనిపిస్తాయి. ఈ సాత్పూరా అభయారణ్యంలో సఫారీ థ్రిల్లింగ్గా ఉంటుంది.
- దీని పరిసరాల్లో అనేక చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా ఉన్నాయి. వీటిలో జటాశంకర్ గుహలో వెలసిన శైవక్షేత్రం భక్తులను ఆకట్టుకుంటుంది. అలాగే చౌరాగఢ్ శివాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇవే కాకుండా బాబా మహాదేవ్, గుప్త్ మహాదేవ్ వంటి పురాతన ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా సందర్శకులకు చక్కని అనుభూతినిస్తాయి.
- సమీపంలోని భీమ్బెట్కా, బాఫ్ు, ఉదయగిరి గుహలలో గుహాకుడ్యాలపై ప్రాచీన మానవులు చిత్రించిన అపురూప చిత్రాలు సందర్శకులను అబ్బురపరుస్తాయి. చరిత్ర పూర్వయుగానికి చెందినవిగా భావిస్తున్న ఈ చిత్రాలు కనీసం పదివేల ఏండ్ల నాటివని పరిశోధకులు తేల్చారు.
న పాచ్ మారి వాతావరణం సంవత్సరం పొడవునా అద్భుతంగా వుంటుంది. కనుక ఎపుడైనా సందర్శించవచ్చు. అయితే అక్టోబర్ నుండి జూన్ వరకూ అనుకూలమైన సమయం.
ఎలా చేరుకోవాలి
అక్కడకు వెళ్ళాలంటే భోపాల్కు ట్రైన్ లేదా ఫ్లైట్లో చేరి అక్కడ నుండి రోడ్డు మార్గంలో ప్రయాణించాలి. అలాగే పచ్మఢకిీ 47 కిలోమీటర్ల దూరంలోని పిపారియా వరకు దేశంలోని అన్ని మార్గాల నుంచి రైళ్లు అందుబాటులో ఉంటాయి. పిపారియా నుంచి బస్సు లేదా ట్యాక్సీలో పచ్మఢకిీ చేరుకోవచ్చు. మధ్యప్రదేశ్లోని అన్ని ప్రాంతాల నుంచి పచ్మఢకిీ విరివిగా బస్సులు అందుబాటులో ఉంటాయి.
Authorization