ఆదిలాబాద్ జిల్లా అంటేనే....దట్టమైన అడవులు, గలగలా పారే సెలయేళ్ళు, అడవితల్లి బిడ్డలు... సహ్యాద్రి పర్వతాలను ఆనుకుని పరవళ్ళెత్తే జలపాతం... సహ్యాద్రి పర్వతాలకు దిగువన ఉండే కెరమెరి పర్వత పంక్తులను చూడవలసిందే..
రోజువారీ పట్టణ జీవితం నుండి ప్రకృతి ఒడిలో సేద తీరితే కలిగే ఆనందమే వేరు.. పచ్చని ప్రకృతిని చూసినప్పుడు.. మనసుకు కలిగే ఆనందమే వేరు. ఆ అందమైన ప్రకృతి ప్రసాదించిన ప్రశాంతతో హుషారుగా పనిలో మునిగిపోవచ్చు.
పొచ్చెర జలపాతం కూడా ప్రసిద్ధి చెందింది. ఈ జలపాతం పక్కనే పార్కు కూడా ఉంది. కొండకోనల మధ్య నుండి నీళ్లు వయ్యారంగా వంపులు తిరుగుతూ, పైనుండి కిందకు పడుతున్న నీటిని చూస్తుంటే ఆహ్లదకరంగా ఉంటుంది. చిన్న చిన్న కొండవాగు రాళ్ల నుంచి ఎగసిపడే ఈ జలపాతం చాలా అందంగా ఉంటుంది. ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు సెలవు దినాలలో, వారాంతాలలో ఎక్కువగా వస్తుంటారు.
అటవీ శాఖలోని సామాజిక వన విభాగం దీనిని మరింత అందంగా రూపొందించేందుకు జలపాతం వద్ద ప్రహరీ గోడ నిర్మించారు. దీనితో పాటు వివిధ రకాలైన మొక్కలను కూడా పెంచుతున్నారు. అలాగే వనదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ జలపాతం వద్దకు రోడ్డు వేయడంతో పాటు విద్యుత్ సౌకర్యంన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇంత అందమైన ప్రకృతి సినిమా షూటింగులు కూడా జరుగుతాయి.
ఇలా వెళ్ళాలి:
ఆదిలాబాదు పట్టణం నుండి 47 కి.మీ దూరంలో బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో, జాతీయ రహదారికి 6 కి.మీ దూరంలో పొచ్చెర గ్రామ సమీపంలో ఈ జలపాతం ఉంది. ఇది నిర్మల్ పట్టణానికి కు 37 కి.మీ దూరంలో ఉంటుంది.
Authorization