- రాష్ట్ర పశుగాణాభివృద్ధి సంస్థ చైర్మన్ రాజేశ్వర్రావు నవతెలంగాణ-చందుర్తి రైతులు పాల దిగుబడిని పెంచాలని రాష్ట్ర పశుగాణాభివృద్ధి సంస్థ చైర్మన్ రాజేశ్వర్రావు అన్నారు. మండలకేంద్రంలోని బల్క్ మిల్క్సెంటర్లో విద్యార్థులకు చెక్కులను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పాడిపరిశ్రమను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పాడిపరిశ్రమ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఉమ్మడిజిల్లాలో ఒకరైతుకు సహజ మరణం కింద రూ.50వేల చెక్కును అందజేశారు. అదేవిధంగా 81మంది ఉమ్మడిజిల్లాలో మరణించగా రూ.45లక్షల50వేలు, 3800మంది విద్యార్థులకు రూ.24లక్షల60వేల400లను అందజేసినట్లు తెలిపారు. కల్యాణలకీë కింద 103మందికి పుస్తెమట్టెలు అందజేశారు. మరో 13మంది రైతులు 60ఏండ్లు పైబడిన రైతులు మృతిచెందగా దహనసంస్కారాలకు రూ.3వేల చొప్పున చెక్కులను అందించినట్లు తెలిపారు. మొత్తంగా రూ.67లక్షల57వేలను అందించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ప్రభాకర్రావు, బల్క్మిల్క్ యూనిట్ సభ్యులు అన్ని గ్రామాల రైతులు పాల్గొన్నారు.