- బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు కోదండరాములు నవతెలంగాణ-కరీంనగర్రూరల్ బీసీ కులస్తులకు క్రిమిలేయర్ పద్ధతి తొలగించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కోదండరాములు అన్నారు. సోమవారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఉపవర్గీకరణ పై గురించి చర్చించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్టు తెతిపారు. అయితే మిగిలిన ఏ కులాలకు లేని క్రిమిలేయర్ను తమ కులానికి తొలగించాలన్నారు. బీసీ వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన కులాలన్నారు. కుల వివక్షను తొలగించేందుకు ప్రత్యేక కమిషన్ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు సత్యం, ప్రధాన కార్యదర్శి అల్స భద్రయ్య, కోశాధికారి జగదీశ్వర చారి, నియోజకవర్గ అధ్యక్షుడు వేముల విష్ణుమూర్తి, ప్రధాన కార్యదర్శి రవీంద్రచారి, వేణు, జాతీయ కార్యదర్శి ఉప్పు రవీందర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్రాజు, తదితరులు పాల్గొన్నారు.