- వెన్కెపల్లి సర్పంచ్ దొంత సుధాకర్ నవతెలంగాణ-సైదాపూర్ విద్యార్ధులు విద్యాతోపాటుగా క్రీడల్లో రాణించాలని, విద్యార్ధుల శారీరక ఎదుగుదలకు క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని వెన్కెపల్లి సర్పంచ్ దొంత సుధాకర్ అన్నారు. మండల కేంద్రంలోని వెన్కెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లాస్ధాయి క్రీడాకారులు ఎంపీక పోటీలను సర్పంచ్ పార్రంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులకు సూచించారు. ఒటమి గెలుపుకు నాందిగా ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో సైదాపూర్, వెన్కెపల్లి జంట గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అందె శారధ, మునిగంటి స్వామి, మండల విద్యాదికారి కేతిరి వెంకటనర్సింహరెడ్డి, క్రీడాకారులు, పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.