- ప్రజావాణిలో కలెక్టర్కు వినతి
నవతెలంగాణ-సిరిసిల్ల
పునరావాసం కింద తమకు ఇచ్చి తిరిగి తీసుకున్న భూములను తిరిగి ఇప్పించాలని కోరుతూ మాజీ నక్సలైట్ కుటుంబ సభ్యుడు ప్రజావాణిలో కలెక్టర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ కుటుంబాలు సిరిసిల్లకు తరలివచ్చారు. ప్రజావాణిలో గతంలో తమకు పునరావాసం కింద ఇచ్చిన భూములను తిరిగి తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దర్శనాల నర్సవ్వ మాట్లాడుతూ సర్దాపూర్ గ్రామంలో తమకు పునరావాసం కింద ఇచ్చిన భూములను 2014లో బలవంతంగా నిర్భందించి తీసుకున్నారని అన్నారు. ప్రజల సమక్షంలో సర్వే నెం. 61లో భూమి ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పటివరకు ఇవ్వలేదని కనీసం మంత్రికి తమ గోడు చెప్పుకుందామన్నా వినే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కెకె మహేందర్రెడ్డి సంఘీ భావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితు లకు, మాజీ నక్సలైట్లకు పునరావాసం కోసం భూములు ఇస్తే టీఆర్ఎస్ హయాంలో తిరిగి తీసుకో వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్వరమే న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో దర్శనాల నర్సవ్వ, దేవేంద్ర, కిషన్ తదితరులు ఉన్నారు.
Authorization