నవతెలంగాణ-కరీంనగర్ రూరల్ ఇండియన్ నేవీలో తేజస్ విద్యార్థులు సత్తా చాటి 4 ఉద్యోగాలను కైవసం చేసుకున్నట్టు తేజస్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సీహెచ్ సతీష్రావు తెలిపారు. సోమవారం కొత్తపల్లి మండల కేంద్రంలోని అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సతీష్రావు మాట్లాడుతూ.. మార్చి నెలలో విశాఖపట్నంలో జరిగిన నియామక ప్రక్రియలొ పాల్గొని అన్ని టెస్టుల్లో అర్హత సాధించి ఈ నెల 25న ప్రకటించిన తుది పలితాల్లో జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చి ఎమ్మార్, ఎన్ఎంఆర్ నేవీ ఉద్యోగాలు సాదించినట్టు పేర్కోన్నారు. ఈ నెల 23, 24న టెక్నికల్ విభాగంలో ట్రైనింగ్కు వెళ్లినట్టు తెలిపారు. నవంబర్ నెలలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జరిగే ఇండియన్ నేవీ నియమాకల్లో ఎక్కువ మంది విద్యార్థులకు ఉద్యోగాలు సాధించే విధంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 15 నుంచి అన్లైన్లో రిజిస్టార్ చేసుకోవాలని సూచించారు. సంస్థ స్థాపించినప్పటి నుంచి 480 ఉద్యోగాలను కైవసం చేసుకున్నట్టు తెలిపారు.