నవతెలంగాణ-గంగాధర
ప్రమాదవశాత్తు కాలుజారి పొలంలో పడి రైతు మృతిచెందిన ఘటన మండలంలోని కాచిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథన ప్రకా రం.. కాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దోర్నాల సత్తిరెడి ్డ(36) అనే రైతు కాచిరెడ్డిపల్లి గ్రామశివారులో ఉన్న పొలంలో ఆదివారం పొద్దంతా పనిచేసుకొని సాయం త్రం ఇంటికి వచ్చిన ఆయన పొలంలోని ఒడ్డుపై నడు స్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి పొలంలో పడగా ముక్కు, నోరు పొలంలో కూరుకు పోయి శ్వాస ఆడక అపస్మారకస్థితిలో పడిపోయాడు. పక్కనే ఉన్న పొలాల రైతులు గమనించి పొలం లో పడివున్న సత్తిరెడ్డిని బయటకు తీయ గా కొనఊపిరితో ఉన్నాడు. గ్రామ స్తులు కరీంనగర్ ఆస్పత్రికి అంబులెన్స్లో తరలిం చారు. చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య అంజలి, కూతుర్లు స్రవంతి (13), కావ్య(2)లు ఉన్నా రు. భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్టు ఎస్సై స్వరూప్రాజ్ తెలి పారు. కాగా గ్రామంలోని యువ రైతు సత్తిరెడ్డి మృతిపట్ల గ్రామ స్తులు, రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సత్తిరెడ్డి మృతిచెందడంవల్ల ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
Authorization