- సాముహిక సెలవు గోడ పత్రిక ఆవిష్కరణ నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట : పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 'సీపీఎస్ అంతం' నినాదంతో సెప్టెంబర్1న సామూహిక సెలవులో ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ పాల్గొనాలని టీఎస్సీపీఎస్ఈఏ నాయకులు కోరారు. ఈ మేరకు మండల కేంద్రంలో సోమవారం కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర సాహిత్యబాధ్యులు చుక్క కిరణ్కుమార్ మాట్లాడారు. సమాజహితం, కుటుంబ భద్రత కోరే పాత పింఛన్ సాధన కోసం ప్రతి ఒక్క ఉద్యోగీ పోరాడాలని కోరారు. ఇందుకోసం సామూహిక సెలవులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రవి, అంజయ్య, ఎ. దేవరాజు, కె. సతీష్, ఎ. గంగాధర్, పి. రాజు, జి. రాజేష్, బి. రాజశేఖర్, బి. భగవన్, ఎ. ఆంజనేయులు, ఎ. తిరుపతి, యు. మధు, శ్రీకాంత్, రాజు, రాజేశం, రమేష్, లక్ష్మన్ పాల్గొన్నారు.