నవతెలంగాణ-రామడుగు ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్న సందర్భాల్లో తమ పంటలకు బీమా కల్పించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 వరకు మాత్రమే ఉందని రామడుగు మండల వ్యవసాయాధికారి యాస్మిన్ తెలిపారు, రైతులందరు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. బ్యాంకుల్లో అప్పులు తీసుకోని వారు మాత్రమే దరఖాస్తు ్త చేసుకోవాలని అన్నారు.ఎకరానికి 580 రూపాయలు ప్రీమియం కట్టాలనితెలిపారు. రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె పేర్కొన్నారు.