- లస్మన్నపల్లి గ్రామస్తుల భారీ ఎత్తున ర్యాలీ
- బురదరోడ్లపై నాటువేసి నిరసన
నవతెలంగాణ-సైదాపూర్
పేరుకు మండలానికే పెద్ద గ్రామ పంచాయతీ...కానీ ఆ గ్రామంలోని అనుబంధ గ్రామాలకు రోడ్ల సౌకర్యం, డ్రైనేజీలు లేక రోడ్లన్ని బురదమయమై గ్రామస్తులకు ఇబ్బందులు తప్పవు... ఇది సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని లస్మన్నపల్లి గ్రామ రోడ్లు, డ్రైనేజీల పరిస్ధితి. తగ నాలుగైదు రోజులుగా కరుస్తున్న వర్షాలకు గ్రామంలోని రోడ్లన్ని బురదమయమై పాదచారులకు, వాహనదారులకు, విద్యార్ధులకు ఇబ్బందుల తప్పటంలేదు. దింతో అగ్రహించిన గ్రామస్తులు సోమవారం లస్మన్నపల్లి గ్రామం నుంచి వెన్నంపల్లి గ్రామ పంచాయతీ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి బురద రోడ్లపై వరినాటు వేసి నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహప్రభో...మహప్రభో మా ఊరిని బాగుచేయండి మహప్రభో ఎక్కడ... ఎక్కడ... దత్తత గ్రామమెక్కడ, ఎక్కడ...ఎక్కడ ప్రజాప్రతినిధులెక్కడ అంటూ గ్రామస్ధులు, మహిళలు, యువకులు, విద్యార్ధులు భారీ ర్యాలీతో పాటుగా నినాదాలు చేశారు. అనంతరం గ్రామ దేవతైన భూలక్ష్మిదేవికి, అబేంత్కర్ విహ్రనికి వినతిపత్రం సమర్పించి నిరసనను తెలిపారు. కార్యక్రమంలో కొట్టె వెంకట్రెడ్డి, మ్యాల రాజిరెడ్డి, తిప్పబత్తిని శ్రీనివాస్, కుట్ల శ్రీకాంత్, పెసరు కుమారస్వామి, దాసరి మల్లయ్య, గుర్రాల మహేందర్రెడ్డి, దాసరి ప్రశాంత్, మ్యాల మల్లారెడ్డి, రేగుల హరీష్, పరుష మల్లేష్, కుమారస్వామి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Authorization