నవతెలంగాణ- మంకమ్మతోట
పేద కుటుంబాలకు తోచిన సహాయం చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాడు నగరానికి చెందిన కటుకోజ్వల రమేష్ చారి. పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నాడు. మిగితా యువకులకు ఆదర్శంగా నిలుస్తూ అందరి అభినందనలు పొందుతున్నారు. రమేష్ చారి పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలానికి చెందిన వ్యక్తి. ఈయన తన స్నేహితులతో కలిసి సోషల్మీడియాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వేములవాడ, జగిత్యాల సిరిసిల్ల అనాథ, ఆదరణ కోల్పోయిన వృద్ధులను వీరబ్రహేంద్ర అనాథ వృద్ధశ్రమంలో శ్రీపల్లి వీరమాధవ్ సహాయంతో ఆశ్రయం కల్పించారు. పలు ఆలయాల్లో జాతరలు జరిగినప్పుడు భక్తులకు అసౌకర్యం కలగకుండా సుమారు 200 మంది వాలంటీర్లతో మంచినీటి సరఫరా, తదితర కార్యక్రమాలు చేపడుతుంటారు. లాంటి కార్యక్రమాలు చేపడుతారు. నగరంలోని యాభై డివిజన్లకు వాలంటీరీ బృందంగా ఏర్పడి నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సామగ్రి ఫ్యాన్లు, కంపూటర్లు ఎలక్ట్రికల్స్ బోర్వెల్ సహాయం చేస్తున్నారు. పిరికేడు బియ్యంతో నిరుపేదలకు ఒక పూట కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. కటుకోజ్వల రమేష చారి రాష్ట్ర సలహాదారులు కేసీఆర్ సేవా దళం పేరుతో పలువురికి రక్తదానం చేపట్టారు. ఈయన పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు. పలువురిలో ఉత్సాహం నింపేలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.
Authorization