నవతెలంగాణ-సిరిసిల్ల నిరుపేద మృతిచెందడంతో అతని కుటుంబానికి బియ్యం వితరణ ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు కౌన్సిలర్ దంపతులు. సిరిసిల్ల పట్టణంలోని 28వ వార్డుకు చెందిన వెంగళ ఎల్లయ్య అనే నిరుపేద చేనేత కార్మికుడు అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం మృతిచెందాడు. వారి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న 28వ వార్డు కౌన్సిలర్ దంపతులు కల్లూరి రాజు రేణుకలు మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరుపున అందాల్సిన సహాయం కోసం తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు.