నవతెలంగాణ-తంగళ్లపల్లి మండలంలోని నర్సింహుల పల్లె గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానంతోపాటు 8 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అధికారులు శనివారం ప్రకటించారు. మూడో విడతలో శుక్రవారం చివరి రోజు కావడంతో ఆ గ్రామం నుంచి సరిదెన ఆనంద్రావు ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో నర్సింహులపల్లె సర్పంచ్గా సరిదెన ఆనంద్రావును అధికారులు ప్రకటించారు. అలాగే ఒకటో వార్డుమెంబర్గా సోమిరెడ్డి రజిత, రెండవ వార్డు ద్యాగ జ్యోతి, మూడవ వార్డు పాతూరి పద్మ, నాలుగవ వార్డు రెడ్డిమల్ల నర్సయ్య, 5వ వార్డు గొడిసెల పోచవ్వ, ఆరవ వార్డు గ్యాదనవేని శేఖర్, 7వ వార్డు ద్యాగ ఎల్లయ్య, 8వ వార్డు కావటి కృష్ణయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు శనివారం అధికారికంగా ప్రకటించారు.