నవతెలంగాణ-మంథని రిపబ్లిక్డేను పురస్కరించుకుని కరీంనగర్లో నిర్వహించిన ఆల్ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్లో మంథని విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. మూడు రోజులుగా జరుగుతున్న ఈ పోటీల్లో చివరిరోజు బంగారు పతకాలు సాధించారు. అండర్-14 విభాగంలో బాబీవర్మ, ఇంద్రాణి ఛాంపియన్షిప్లు సాధించారు. వీరిని ఛీప్ ఇన్స్ట్రక్టర్ నూకల బానయ్య, షాటోకాన్ కరాటే శిక్షకుడు కొండ్ర నాగరాజు అభినందించారు.