నవతెలంగాణ-సిరిసిల్లటౌన్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదవ్వాలని తెలంగాణ సాంస్కృతిక సారథి టీం లీడర్గడ్డం శ్రీనివాస్ అన్నారు. శనివారం పట్టణంలోని అంబేద్కర్నగర్ కూడలి వద్ద కళాకారుల బృందం ఓటు హక్కు నమోదు, వినియోగంపై కళా ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 25 వరకు నూతనంగా ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారు వినియోగించుకోవాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే అందుబాటులో ఉన్న బీఎల్వోలను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. ఓటర్కార్డుల్లో మార్పులు, చేర్పులు వంటి సమస్యలు ఉంటే సరైన దరఖాస్తు ఫారాలు నింపి అందజేస్తే సరిపోతుందని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎడమల శ్రీధర్రెడ్డి, ఆకునూరి దేవయ్య, గడ్డం దేవయ్య, కాయతోజు ప్రవీణ్, పొత్తూరి రాజు, కొడుమోజు లక్ష్మీనారాయణ, శిరీష, ప్రజలు పాల్గొన్నారు.