నవతెలంగాణ-గన్నేరువం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్ధులందరూ తప్పకుండా ఎన్నికల ఖర్చులను చూపాలని జిల్లా ఎన్నికల నోడల్ అధికారి అన్నారు. శనివారం మండలంలోని గుండ్లపల్లి శ్రీసాయి కళ్యాణమం డపంలో ఎన్నికల ఖర్చులపై పోటీలో ఉన్న అభ్యర్ధులం దరికీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ నుంచి వార్డు సభ్యులందరూ బ్యాంకు ఖాతాను తెరచి అందులోనుంచే ఎన్నికల ఖర్చుల కోసం నగదును తీసుకోవాలన్నారు. సర్పంచ్ అభ్యర్ధుల ప్రచార రథాలు, ప్రకటన వాహనాలకు పర్మిషన్ లేదన్నారు. ఈ నెల 30 వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. అభ్యర్ధులందరూ ప్రతి ఖర్చును లెక్క చూపాలన్నారు. 2013 లో జరిగిన ఎన్నికలలో కొంత మంది అభ్యర్ధులు లెక్కలు చూపనందున ఈ ఎన్నికలలో వారికి పోటీ చేసే అర్హతను కోల్పోయారని తెలిపారు. వచ్చే ఎన్నికలలో మళ్లీ అభ్యర్ధులుగా ఉండాలంటే లెక్కలు చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్పెండీచర్ పర్యవేక్షన అధికారి ఇ రాజేశ్వర్,నోడల్ ఎక్స్పెండీచర్ పర్యవేక్షకులు మహ్మద్ జలాలుద్దీన్ అక్బర్, ఈవోపిఆర్డీ ఆర్డి టి శ్రీనివాస్, ఎస్ఐ వంశీకృష్ణ, పోటీదారులు పాల్గొన్నారు.