గన్నేరువరం: గన్నేరువరం మండలంలోని కాసింపేట నుంచి మైలారం వెళ్లే దారిలో కల్వర్టు వద్ద మొక్కజొన్న లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ట్రాక్టర్ అప్రమత్తమై దూకగా తృటిలో ఏలాంటి ప్రమాదం జరుగలేదని రైతులు తెలిపారు. స్థానికులు, ట్రాక్టర్ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. మిడ్ మానేరు వరద కాల్వకు రోడ్డు మార్గం ఉన్నందున కల్వర్టు నిర్మాణాలు జరుగుతు న్నాయి. 6 నెలలు గడుస్తున్నా అధికారులు, కాంట్రాక్టర్లు శ్రద్ద చూపడం లేదని వాహనదారులు తెలుపుతున్నారు. కల్వర్టుకు రోడ్డు ప్రక్క దారిలో వాహనాలు వెళ్తున్నాయి.ఎత్తు, దిగుడు ఉన్నందున పలు వాహనాలు ప్రమాదాలకు గురైతున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. సంక్రాంతి పండుగ రోజు ఖాసింపేట గ్రామానికి చెందిన సందేవని నర్సయ్య కల్వర్టులో పడి చేయి విరిగినట్టు తెలిపారు. ఏలాంటి హెచ్చరిక బోర్డులు లేని కారణంగా పలు ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే అధికారులు, కాంట్రాక్టర్లు స్పందించి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.