నవతెలంగాణ-గన్నేరువరం మండలంలో నేడు స్పెషల్ క్యాంపెయిన్ డేను నిర్వహిస్తున్నట్టు తహసీల్దార్ పురం యుగేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని 22 బూత్లలో బిఎల్వోలు ఆయా గ్రామాల ఓటర్ జాబితాలతో వుంటారని, ప్రజలందరూ తమ పేర్లను ఆయా జాబితాల్లో పరిశీలించుకోవాలన్నారు. ఓటర్ జాబితాలో ఓటు హక్కులేని వారు ఫారమ్ 6,7,8 ఫారమ్ 6ఎ ద్వారా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. తప్పుల సవరణలను సరిచేసుకోవచ్చని తెలిపారు.