వీణవంక: మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు ఏకరూప దుస్తులను ఆ స్కూల్ ప్రధానోపా ధ్యాయుడు పులి అశోక్రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సౌకర్యా ర్థం అందిస్తున్న యూనిఫాంలను ప్రతి ఒక్క రూ సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశా లలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల రూపకల్పన కార్పొరేట్ పాఠశాలల కన్నా ధీటుగా ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఉచితంగా ఆరోగ్యకిట్స్, పాఠ్య పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.