- ప్రభుత్వ నిబంధనల మేరకు బిల్లును చెల్లించాం
- గద్దపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు
నవతెలంగాణ-శంకరపట్నం
గద్దపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి తాను చేస్తున్న పనులను చూసి ఓర్వలేకే కొందరు తనపై తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస రావు అన్నారు. సంఘం పరిధిలోని రాజాపూర్ బ్యాంకు పరిది శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గద్దపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా పదవి చేపట్టి అహర్నిశలు కృషి చేసి సీ గ్రేడ్లో ఉన్న సంఘాన్ని ఏ గ్రేడ్లోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. అంతేకాకుండా రూ.కోటి ఇరవై లక్షలు నిల్వకు తీసుకురావడంతో పాటు సంఘం పరిధిలోని గద్దపాక, కాచాపూర్ గ్రామాల్లో ధాన్యం నిల్వ కోసం రెండు గోదాంలు నిర్మాణం చేపట్టామని, త్వరలో పెట్రోల్, డిజీల్ పంప్లను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తనపై అక్కసుతో కేవలం ఇద్దరు డైరెక్టర్లు మాత్రమే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. గోదాం నిర్మాణాలకు నిబంధనల మేరకే బిల్లును చెల్లించామని అన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిజమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని లేకుంటే తప్పుడు ఫిర్యాదు చేసిన డైరెక్టర్లు రాజకీయ సన్యాసం తీసుకోవాలని సవాల్ విసిరారు.
Authorization