- గ్రామాల్లో కోలాహలం
- రంగంలోకి ఎమ్మెల్యేలు
- అస్మదీయులను గెలిపించుకునే యత్నం
నవతెలంగాణ- కరీంనగర్ ప్రతినిధి
జిల్లాలో పంచాయతీ ఎన్నికల జోరు పెరిగింది. మూడు విడతలుగా నిర్వహిస్తున్న ఎన్నికలకు సంబంధించిన ప్రాథమిక ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో గ్రామాల్లో కోలహలం పెరిగింది. మరో వైపు కొత్త ఎమ్మెల్యేలంతా రంగంలోకి దిగారు. తమ అనుయాయులనే గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. తద్వారా గ్రామాల్లో పట్టు సాధించుకునే యత్నం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ గ్రామ రాజకీయం మలుపు లు తిరుగుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జర గుతున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా కరీం నగర్ జిల్లాలోని 15 మండ లాల్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశ ఎన్నికలు ఈ నెల 21న నిర్వహించనున్న క్రమంలో ప్రచార పర్వం పూర్తయ్యింది. రెండో దశ ఈ నెల 25న నిర్వహిం చనుండగా ఆయా గ్రామాల్లో ప్రచారం ఊపం దుకుంది.
మూడో దశ ఎన్నికలు ఈనెల 30న జర గను న్నాయి. ఈ క్రమంలో వాటికి సంబంధించిన ప్రక్రి యలో భాగంగా శనివారం నాటికి నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. మొత్తంగా ఇక ఎన్నికలే తరువాయి అనే వాతావరణం ఏర్పడింది. మొదటి దశలో చొప్పదండి, గంగాధర, రామడుగు, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలున్నాయి. రెండో దశలో చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొడూర్, శంకరపట్నం మండలాల్లో ఎన్నికలు జరగను న్నాయి. మూడో దశలో ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, సైదాపూర్, వీణవంక మండలాలున్నాయి.
పార్టీలతో నిమిత్తం లేకుండా జరుగుతున్న ఎన్నికలే అయినప్పటికీ ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత నెలలోనే శాసన సభ ఎన్నికలు పూర్తయినప్పటికీ రానున్న పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని గ్రామస్థాయిలో పార్టీలు బలోపేతం చేసే దిశగా ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా తమ అనయాయులనే గెలిపించుకుని పట్టు చేజిక్కుంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం మంథనిలో మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. మిగిలిన అన్నింటిలోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అందువల్ల పట్టుకోసం స్థానికంగా ఉండి తమ వారిని గెలిపించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మూడు విడతలుగా సంబంధించిన ప్రక్రియ పూర్తయిన దశలో ఓటర్లను ప్రలోభ పెట్టే పనులు వేగం పుంజుకున్నాయి. అందులోనూ ఈ నెల 21న మొదటి దశ ఎన్నికలు జరగనున్న ఐదు మండలాల్లో మద్యం, డబ్బు పంపిణీ యథేచ్ఛగా సాగుతోంది. ఈ విషయంలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో రాబడితో నిమిత్తం లేకపోయినప్పటికీ రాజకీయ ప్రాబల్యం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. అందువల్ల బరిలో ఎవరున్నా బలంగానే ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ ఇతరులు గెలిచినా తమ పార్టీలోకి తీసుకునే ఆలోచనతో సాగుతున్నారు.
Authorization